
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్లో బారీ దోపిడీ జరిగింది. బ్యాంక్లో రూ. 3.5 కోట్లు విలువచేసే తాకట్టు బంగారం మాయం అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే బ్యాంక్ సెక్యూరిటీ, అకౌంటెంట్, క్యాషియర్, అకౌంటెంట్, మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి సంబంధించి మేనేజర్ సుబ్రహ్మణ్యం పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.