![పొలంలో బంగారు నాణాల కుండ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51441714090_625x300.jpg.webp?itok=SbmqyZOj)
పొలంలో బంగారు నాణాల కుండ
బయ్యారం (ఖమ్మం) : ఓ రైతు పొలం దున్నుతుండగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సౌమ్యతండాలో మంగళవారం చోటుచేసుకుంది.
సౌమ్యతండాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో అరక దున్నుతుండగా 40 బంగారు నాణాలు ఉన్న కుండ దొరికింది. ఈ విషయం తెలుసుకున్న పొలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు.