Bayyaram
-
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
Mahabubabad: ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం?
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి. దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. (చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... ) -
విఫల ప్రేమకు ఏటా కల్యాణం.. 18 ఏళ్లుగా ఇదే తంతు!
సాక్షి, బయ్యారం: బలవన్మరణం పొందిన బిడ్డ జ్ఞాపకంగా గుడి కట్టి ఏటా శ్రీరామనవమి రోజు కుమారుడి విగ్రహానికి కల్యాణం చేయిస్తున్నారు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పోడు తండాకు చెందిన భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా కొడుకు రాంకోటి ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 2003లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొడుకు రాంకోటి కలలోకి వచ్చి తనకు గుడి కట్టించి, వివాహం జరిపించాలని కోరినట్టు తల్లి సుక్కమ్మ కథనం. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలోనే గుడి కట్టించి.. అందులో కొడుకు విగ్రహంతోపాటు పెళ్లి కుమార్తె విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఆ విగ్రహాలకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు వివాహం జరిపించారు. 18 ఏళ్లుగా వారీ విధంగా చేస్తుండటం విశేషం. -
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్ముల్ని ఎవరు చూస్తారు అంటూ చిన్నారులు శ్యామల, బిందు విలపించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. కరెంట్ రూపంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కుండ చేత పట్టి అంతిమయాత్ర ముగిసే వరకు అమ్మనాన్నలను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగారు. అన్నీ తామై తల్లిదండ్రులకు తలకొరివి పెట్టారు. తమకు దిక్కెవరు అని గుండెలు బాదుకుంటుండగా బంధువులు, గ్రామస్తులు వారిని ఓదార్చుతూనే కన్నీటి పర్యంతమయ్యారు’. సాక్షి, బయ్యారం: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వచ్చిన కొడుకుతో పాటు కోడలును కరెంట్ కబలించింది. మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధి సింగారం కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్ తన భార్య తిరుపతమ్మతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్యామల, బిందు ఉన్నారు. ఇటీవల ఉపేందర్ తండ్రి వెంకులు కాలు విరిగింది. అతడిని చూసేందుకు వచ్చిన ఉపేందర్ దంపతులను కరెంట్ ప్రవహిస్తున్న దండెం బలి తీసుకుంది. కాగా వారి అంతిమ యాత్రలో కుమార్తెలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!) నాడు ప్రేమలో.. నేడు చావులో.. కాలనీకి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ ప్రేమతో పెళ్లికి సిద్ధపడగా ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నాడు ప్రేమలో ఒకటైన వారు నేడు ఒకటిగా మృతి చెందారని అంటూ స్థానికులు కంటతడి పెట్టారు. తల కొరివిపెట్టిన చిన్నారులు.. విద్యుదాఘాతంతో మృతి చెందిన తల్లికి చిన్నకుమార్తె బిందు, తండ్రికి పెద్దకుమార్తె శ్యామల తలకొరివి పెట్టారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు పెద్ద బాధ్యతను మోయడం చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..) ప్రభుత్వపరంగా ఆదుకుంటాం.. విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎంపీ కవిత, అదనపు కలెక్టర్ కొమరయ్య అన్నారు. అదనపు కలెక్టర్ సింగారం కాలనీకి వెళ్లి పిల్లలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో తహసీల్దార్ నాగభవాని పాల్గొన్నారు. -
చదువు కోసం సమాధిపైకి.. అక్కడైతేనే ఆన్లైన్కు ఓకే
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో సెల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా రావు. ఊరిబయట పంట చేల వద్ద ఉన్న సమాధుల వద్ద మాత్రం నెట్వర్క్ బాగుంటుంది. దీంతో విద్యార్థులు సమాధుల వద్ద కూర్చుని ఆన్లైన్ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు గురువారం సమాధిపై కూర్చొని ఆన్లైన్ పాఠాలు వింటున్న దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – బయ్యారం ఈ ఏడాది పాతవే! సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభం రోజునే అందజేసే ఉచిత రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ఈ ఏడాది విద్యార్థులకు ఇంకా ఇవ్వలేదు. నిరుపేదల విద్యార్థులు ఈ బట్టలనే వేసుకొని సంతోషంగా ఉండేవారు. అయితే గత ఏడాది కరోనా భయంతో పాఠశాలలు మూసి వేసినా యూనిఫామ్స్ మాత్రం ఇవ్వడం ఆపలేదు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బట్టలను ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా క్లాత్ కూడా కొనుగోలు చేయలేదని, ఈ ఏడాది బట్టలు రావడం ఇబ్బందే అని అధికారులు చెబుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో కుటుంబాలు పోషించుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో పిల్లలకు బట్టలు కొనలేని దుస్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో పేద పిల్లలు పాత బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత ఏడాది ముందుగానే.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత ఏడాది కూడా పిల్లలకు కొత్త బట్టలు కుట్టించారు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోక పోవడంతో, ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించారు. అయినా యూనిఫామ్స్ మాత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ పంపిణీ చేశారు. గత ఏడాది జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు, మోడల్ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో మొత్తంగా 50,474 మంది విద్యార్థులు, విద్యార్థినులు చదివారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 600 విలువ చేసే క్లాత్, మగవారికి షర్ట్, ప్యాయింట్, నెక్కర్, ఆడ పిల్లలకు చిన్న వారికి షర్ట్, పర్కిన్ క్లాత్, పెద్దవారికి పంజాబీ డ్రస్ క్లాత్ చున్నీల క్లాత్ ఇచ్చారు. అదే విధంగా జతకు రూ. 50 చొప్పున రెండు జతలకు రూ. 100 ఖర్చుతో యూనిఫామ్స్ కొనుగోలు చేసి అందజేశారు. ఇలా సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి రూ. 354.683 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన క్లాత్ జిల్లా విద్యాశాఖ అధికారికి, అక్కడి నుంచి ఎమ్మార్సీకి అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఈ ప్రక్రియ అంతా గత ఏడాది ఏప్రిల్ నెల చివరలోనే పూర్తి చేయగా జూన్ మొదటి వారంలో కుట్టించి విద్యార్థుల ఇంటికి వెళ్లి బట్టలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఊసే లేదు... గత ఏడాది మాదిరిగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విద్యాశాఖ పిల్లలకు అందజేసే యూనిఫామ్ మాత్రం ఇవ్వడం లేదు. వేసవి కాలంలోనే పాఠశాలలకు రావాల్సిన క్లాత్ రాలేదు. అసలు ఈ ఏడాది యూనిఫామ్స్కు బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం. కరోనాతో ప్రైవేట్ పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్న విద్యార్థులకు ఉచిత బట్టలు ఇవ్వడం లేదని తెలియడంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫామ్స్తో పిల్లలకు బట్టలు కుట్టించే భారం తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కష్టకాలంలో అప్పులు చేసి బట్టలు కుట్టించాల్సి వస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. పాతబట్టలే వేసుకుంటున్నా.. ప్రతీ సంవత్సరం బడి తెరవగానే రెండు జతల కొత్త బట్టలు ఇచ్చేవారు. ఈ బట్టలు వేసుకొని బడికి పోయేదాన్ని.. బతుకమ్మ పండుగకు అమ్మానాన్నలు కొత్త బట్టలు కుట్టిస్తారు.. ఇప్పుడు సార్లు బట్టలు ఇవ్వలేదు. ఇటు అమ్మానాన్న కొత్త బట్టలు కుట్టివ్వలేదు. దీంతో పాత బట్టలే వేసుకుంటున్నా.. నేనే కాదు.. అందరూ ఇలాగే చేస్తున్నారు. చినిగినవి కుట్టుకుంటూ వేసుకుంటున్నాం. – గద్దల పూజిత, పదో తరగతి విద్యార్థిని,జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర కష్టకాలంలో బట్టలు ఇవ్వలేదు ఒక వైపు కరోనా కష్టకాలంలో బతకటమే ఇబ్బందికరంగా మారింది. అంతకముందు ప్రతీ సంవత్సరం పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది యూనిఫామ్ ఇవ్వటం మరిచిపోయింది. పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్తో పాఠశాల ప్రారంభం అయిన సమయంలోనే పుస్తకాలతో పాటు యూనిఫామ్ ఇచ్చారు. ఈ సంవత్సరం యూనిఫామ్ ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. – మేర్గు సంధ్య(బయ్యారం) ఈ ఏడాది బడ్జెట్ రాలేదు.. ఈ ఏడాది బడ్జెట్లో యూనిఫామ్కు డబ్బులు కేటాయించలేదు. దీంతో ప్రతీ ఏడాది మాదిరిగా జిల్లాకు క్లాత్ రాలేదు. దీంతో పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ప్రతీ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే యూనిఫామ్ కుట్టించి ఇస్తాం. – సోమశేఖర శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి -
నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. మా బతుకెట్ల బిడ్డో..
బయ్యారం: ‘బిడ్డా నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. నీవు ఇట్లా ఎళ్లిపోతే మేము బతికేదెట్టా..’అంటూ రైతు దంపతులు విద్యుదాఘాతంతో మరణించిన తమ కాడెద్దు వద్ద విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇసుకమేది గ్రామానికి చెందిన సోలం నర్సింహారావు, కృష్ణవేణి దంపతులకు రెండెకరాల భూమి ఉంది. ఈ భూమిని తమ రెండు కాడెడ్లతో సాగు చేస్తారు. అయితే, ఆ రెండు కాడెడ్లలో ఒకటి సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా, ఇదేచోట మరో నలుగురు రైతులకు చెందిన ఎద్దులు కూడా మృతి చెందాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజు లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్ వరకు ఉపరితల ఆవర్త నం వ్యాపించి ఉందని, ఎత్తుకెళ్లే కొద్దీ అల్పపీడ నం నైరుతిదిశగా తెలంగాణ వైపునకు ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అంచనా వేసింది. చదవండి: పోస్ట్ కోవిడ్లో కొత్తరకం సమస్య.. ‘వైరల్ ఆర్థ్రాల్జియా’ -
పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న వీరిద్దరు మహిళలు. కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. బుచ్చమ్మ సోమవారం కరోనాతో ఇంట్లోనే చనిపోయింది. ఇది తెలిసి ఆమె రెండో కుమారుడు భయంతో పారిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నా.. కరోనాతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితి.. దీంతో సునీత.. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగావత్ శిరీషతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అత్త మృతదేహాన్ని జేసీబీతో గ్రామ శివారుకు తరలించి.. అంత్యక్రియలు పూర్తిచేసింది. – బయ్యారం -
నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి
సాక్షి, బయ్యారం: ‘ప్రేమించిన పాపానికి నాపై లైంగిక దాడికి యత్నించారు. కిడ్నాప్ కూడా చేయబోయారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపారు. నాతో పాటు నా కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి సారూ. అమ్మా.. నాన్నా మీరు క్షేమంగా ఉండటం కోసం నేను వెళ్లిపోతున్నా’.. అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పత్యాతండాలో చోటుచేసుకుంది. సూసైడ్నోట్లో మృతురాలు పేర్కొన్న వివరాలు ప్రకారం... పత్యాతండాకు చెందిన ధర్మసోత్ సునీత (20), అదే తండాకు చెందిన మాళోత్ శివ ప్రేమించుకున్నారు. ఈ విషయం శివ తల్లిదండ్రులకు తెలియడంతో వారు సునీత బంధువులతో అసభ్యకరంగా మాట్లాడారు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో శివ సైతం సునీతపై లైంగిక దాడికి యత్నించాడు. కుదరకపోవడంతో సునీతను కిడ్నాప్ చేయడానికి చూశాడు. విషయం సునీత తన తండ్రి బిచ్చకి, సర్పంచ్ కి తెలిపింది. దీంతో సునీత తండ్రి .. శివతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గత నెల 24న పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. అయితే పథకం ప్రకారం శివ అతని బంధువులు సునీత తండ్రిని అడ్డుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి బిచ్చనే జైలుకు పంపించారు. ఆధారాలు లేవన్న కారణంతో శివకు సంబంధించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. బిచ్చ జైలుకు వెళ్లడంతో సునీత కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన సునీత ‘శివతో పాటు అతని బంధువులు తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుతోనైనా వారిని జైలుకు పంపాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. చదవండి: (భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..) న్యాయం చేయాలని ఆందోళన.. కాగా, సునీత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె బంధువులు బయ్యారం పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ యోగేష్ గౌతమ్ మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8 మందిపై కేసు నమోదు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాళోత్ శివతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతురాలు సూసైడ్ నోట్లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని ఆరోపించటంపై ఎస్సైను వివరణ కోరగా, తమకు వచ్చిన ఫిర్యాదుపై తండాలో విచారణ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. -
ఈ గ్రామంలో మందు ముట్టరు.. స్టేషన్ మెట్లెక్కరు!
పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కింది లేదు. చిన్నా చితకా తగాదాలొచ్చినా.. కూర్చుని మాట్లాడుకుంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ.. సాక్షి, బయ్యారం: పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవçహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్స్టేషన్కు వెళ్లింది లేదు. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు. గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అందరికీ మరుగుదొడ్లు మైదాన ప్రాంతంలోనే పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం జరగని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఒకచోట కూర్చొని సమస్యలను చర్చించుకుంటున్న గ్రామస్తులు పోటీలేదు.. ఇతర పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి డబ్బు ఖర్చుపెట్టి పదవులు కొనుక్కొంటున్న పరిస్థితి.. అందుకు భిన్నంగా నాపై నమ్మకంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నా. – బిజ్జ స్వరూప, సర్పంచ్ గ్రామస్తులు కలసికట్టుగా ఉంటారు కొత్తగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన నాకు మొట్లతిమ్మాపురంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. వివాదాల జోలికి వెళ్లరు. సమస్య వస్తే ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరిలో మద్యం అమ్మకాల్లేవు. – బానోత్ నరేష్, పంచాయతీ కార్యదర్శి, మొట్ల తిమ్మాపురం రాజకీయాలతో సంబంధం లేదు మా ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు మా మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నాం. అందుకే మా ఊరి వాసులు పోలీస్స్టేషన్కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు. – బూర్క పాపయ్య, గ్రామ వాసి చెప్పినట్లు వింటారు చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటాం. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా ఉంది. – బిజ్జ విశ్వనాథం, గ్రామ వాసి -
శవాన్ని బూటుకాళ్లతో తొక్కిన పోలీస్
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు. -
ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి!
సాక్షి బయ్యారం : ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్కు చెందిన గుగులోత్ సత్తమ్మ బయ్యారం జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేస్తూ బయ్యారంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఉంటోంది. లాక్డౌన్కు ముందు హైదరాబాద్లో భార్యతో కలసి నివాసం ఉండే కుమారుడు ప్రశాంత్(30) తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. చదవండి: ఫీజు చెల్లించలేక తనువు చాలించింది అయితే వీరికి మహబూబాబాద్లో ఓ ఇల్లు ఉండగా దానిని అమ్మేసి హైదరాబాద్కు వెళ్లిపోదామని ఇటీవల ప్రశాంత్ తన తల్లితో వాదన పెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించకపోవటంతో ప్రశాంత్ సోమవారం..తల్లి లేని సమయం చూసి భార్యను వేరే గదిలో ఉంచి గడియపెట్టాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఫ్యానుకు ఉరివేసుకుంటున్న దృశ్యాలను బంధువులకు పంపించి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ భార్య ఆరునెలల గర్భవతి కాగా.. కుటుంబసభ్యులు మంగళవారం శ్రీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలా జరగడం అందరిలోనూ విషాదం నింపింది. -
మహబూబాబాద్: కళ్లముందే నీట మునిగిన కూతురు
-
కళ్లముందే నీటిలో కొట్టుకుపోయిన కూతురు
సాక్షి, మహబూబాబాద్: జలపాతాన్ని చూసి ఉల్లాసంగా గడుపుదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లముందే నీట మునిగింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిధ్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫోటోలు దిగి సరదాగా గడిపారు. (చదవండి: శ్రీనివాస్ చనిపోయాడు.. ) తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శివానీ ఆచూకీ లభించకపోవడం రెండు జేసీబీల సహాయంతో ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. దాంతో విగత జీవిగా మారిన శివానీ కనిపించింది. ఆమె యానిమల్ హజ్బెండరీలో డిప్లమా చేస్తున్నట్టు తెలిసింది. కళ్లముందే తమ బిడ్డ జల సమాధి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ సమయంలో వాటిని సందర్శించడం మంచిది కాదని పోలీసులు ప్రజలకు సూచించారు. (చదవండి: ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ... ) -
సీతమ్మ శీతకన్ను..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు జరగకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా పచ్చజెండా ఊగలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్ ఏర్పాటు అంశానికైతే బడ్జెట్లో స్థానమే లభించలేదు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి మోక్షం కలగలేదు. ఈ మేరకు పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కథనం. దక్కని జాతీయ హోదా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకంతో ఉన్నా నిరాశే ఎదురైంది. ఇక గిరిజన కుంభమేళాగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలిపోతోంది. కొన్నేళ్లుగా జాతరకు జాతీయ హోదా కోసం కోరుతున్నా మోక్షం కలగడం లేదు. గిరిజన యూనివర్సిటీ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతయేడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక యూనివర్సిటీకి అవసరమైన 500 ఎకరాల్లో 497 ఎకరాలకు పైగా గుర్తించారు. కానీ ఈసారి బడ్జెట్లో ని«ధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగేలాల లేవు. బయ్యారం ఊసేది? ఇనుపరాయి గనులు విస్తారంగా ఉన్న బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మానుకోట జిల్లావాసులకు ఈ బడ్జెట్లో కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం బయ్యారం పరిశ్రమపై ఏదైనా ప్రకటన చేస్తుందనుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో సర్వే ద్వారా గుర్తించారు. పరిశ్రమకు బయ్యారం చెరువు ద్వారా నీటి సదుపాయం, రైల్వే రవాణ సౌకర్యాలు ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి ఇబ్బందులు తప్పేవి. టెక్స్టైల్ పార్కు పరిస్థితీ అంతే... వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ – సంగెం మండల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం 22 అక్టోబర్ 2017లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణం కోసం 1200 ఎకరాల భూమి సేకరించారు. పార్కులో అంతర్గత రోడ్ల నిర్మానం ఇప్పటికే జరుగుతుండగా.. పలు కంపెనీలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశముంది. టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్.. హైదారాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండ్రస్టీయల్ కారిడార్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కో రింది. కానీ ఈసారి బడ్జెట్లో స్థానం దక్కలేదు. రైల్వే డివిజన్, వ్యాగన్ షెడ్ దశాబ్దకాలానికి పైగా పెండింగ్లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటుపై బడ్జెట్లో ప్రకటన వస్తుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. అదేవిధంగా రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీరియాడిక్ల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) షెడ్కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు. అంతేకాకుండా బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్లైన్ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి కేటాయింపులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన ఆర్థిక మంత్రి చేయలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది. తెలంగాణపై కేంద్రం వివక్ష తెలంగాణపై ఈ బడ్జెట్లోనూ కేంద్రప్రభుత్వం వివక్ష చూపింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సైతం అన్యాయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఇతర కేటాయింపుల్లోను ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాలి్సన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. రైల్వే పరంగా మొండిచేయి చూపారు. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ -
అరరే ! ప్లాన్ బెడిసి కొట్టిందే..
బయ్యారం : హాస్టల్ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్ చేశారు. అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్ సెంటర్కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ బస్టాండ్ సెంటర్లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్లో బాలికకు ఎస్సై మురళీధర్ కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. -
ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు
సాక్షి, మహబూబాబాద్: నేను బతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కుమారుడు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి ఆస్తిని కబ్జా చేశాడు. న్యాయం చేయాలంటూ ఓ తల్లి సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యకు వినతిపత్రం అందజేసింది. బాధితురాలు బయ్యారం మండల కేంద్రానికి చెందిన కొండ్రెడ్డి భద్రమ్మ సోమవారం అధికారులు, విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. వివరాలు ఆమె మాటాల్లోనే.. నాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. అందరికి వివాహం చేసి ఆస్తి సమానంగా పంచి ఇచ్చాను. కొన్నేళ్ల క్రితం నా భర్త చేదరయ్య, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు మాత్రమే ఉన్నాడు. నా పేరున ఉన్న 2.06 ఎకరాల భూమిని కౌలు ఇచ్చి దాని ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం గడుపుతున్నాను. ‘రైతుబంధు’డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా ఆభూమి పెద్ద కొడుకు సోమిరెడ్డి పేరున ఉందని తెలిసింది. నేను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి దాంతో నా భూమిని తన పేరున పట్టా చేయించుకున్నాడని భద్రమ్మ వాపోయింది. నేను బతికే ఉన్నా.. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేయకుండానే కొడుకు పేరున పట్టాచేయడం ఎంతవరకు సమంజమని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి నా భూమి నాకు ఇప్పించాలని, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని భద్రమ్మ అధికారులను కోరింది. -
ఈ తండాకు ఏమైంది?
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తీత్రీ తండావాసులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లుగా పెళ్లయిన దంపతులకు సంతానం కలగడంలేదు. దీంతో వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తండా నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి వెంటనే సంతానం కలుగుతోంది. దీంతో తండాకు ఏమైందని స్థానికులు అయోమయం చెందుతున్నారు. తండాకు చెందిన ఆడపడుచులు వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, వారికి ఏడాది తిరిగే సరికి సంతానం కలుగుతుండగా.. పురుషులకు మాత్రం కావడం లేదు. సుమారు 70 ఏళ్ల క్రితం భర్మావత్ తీత్రీ అనే మహిళ బయ్యారం పెద్దగుట్ట పక్కన తండాను ఏర్పాటు చేయగా ఈ తండాలో ప్రస్తుతం 42 కుటుంబాలు నివసిస్తుండగా, 170 మంది జనాభా ఉంది. ఆరేళ్లుగా.. తండాకు చెందిన బోడ చిరంజీవి, గుగులోత్ సురేష్, గుగులోత్ సుమన్, బానోత్ రమేష్, భర్మావత్ చందకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం వీరు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్మావత్ చంద తమ బంధువుల అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటుండగా, మిగతా వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. వలస వెళ్లిన వ్యక్తికి సంతానం ఇదే తండాకు చెందిన బానోత్ సురేష్కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇతను బతుకుదెరువు కోసం భార్య జ్యోతితో కలసి హైదరాబాద్కు వలస వెళ్లగా అక్కడ వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం సురేష్ దంపతులు తండాలో నివసిస్తుండగా తండాలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో సురేష్కు చెందిన ముగ్గురు పిల్లలు మాత్రమే ప్రీస్కూల్ విద్యార్థులుగా నమోదయ్యారు. పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. తండాలో ఆరేళ్లుగా పిల్లలు పుట్టకపోవటంతో కొత్త పిల్లల నమోదు నిలిచిపోయింది. ఎన్ని ఆస్పత్రుల్లో తిరిగినా.. నా పెద్ద కొడుక్కి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశా. ఇప్పటి వరకు సంతా నం కలగలే. మహబూ బాబా ద్, ఖమ్మంలోని పలు ఆస్పత్రులకు వె ళ్లాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. – బోడ సరోజ, చిరంజీవి తల్లి ఇలా ఎప్పుడూ జరగలే.. తండా ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. తండాకు చెందిన వారికి కొన్నేళ్లుగా ఎందుకు సంతానం కలగటం లేదో అర్థం కావటం లేదు. – వాంకుడోత్ రాంచంద్, తండావాసి కారణాలు అనేకం ఉంటాయి దంపతులకు పిల్లలకు కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో పలు సమస్యలు ఉంటాయి. సంతానం లేని వారు ఒక్కసారే ట్రీట్మెంట్ చేసుకొని ఆ తర్వాత వైద్యుల సలహాలను పాటించకపోవటం, పరీక్షించిన వైద్యులు ఇతర వైద్యులకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్లకపోవటం వల్ల సంతానం కలగకపోయే అవకాశాలున్నాయి. – డాక్టర్ బి.వీరన్న, డీజీఓ, మానుకోట ఏరియా ఆస్పత్రి ఇద్దరం ఉన్నప్పటికీ పిల్లలు లేరు పాఠశాలలో ఇద్దరం ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ మా బడిలో తగిన సంఖ్యలో పిల్లలు లేరు. ఆరేళ్లుగా తండాకు చెందిన పలువురికి సంతానం కలగకపోవటంతో చిన్నక్లాసులో అడ్మిషన్లు జరగటం లేదు. – మోహన్, పాఠశాల హెచ్ఎం -
అందరూ వాగులో నాణేలు వేస్తుంటే..ఆమె బిడ్డని విసిరేసింది
బయ్యారం(ఇల్లందు): ఓ దేవుడా ఎంత పనిచేశావయ్యా.. కొడుకుకు ఇద్దరు బిడ్డలే పుట్టారు.. మగబిడ్డ కోసం ఆపరేషన్ చేయించలే.. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టాడనే తృప్తి లేకుండా చేశావు.. మేమేం చేశాం.. ఈ శిక్ష మాకెందుకు అంటూ తల్లి చేతిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి నానమ్మ లచ్చమ్మ విలపించిన తీరు పలువురి హృదయాలను కలిచివేశాయి. మతిస్థిమితం లేని తల్లి రెండు నెలల కుమారుడిని వాగులో విసిరేసి.. ఆ చిన్నారి మృతికి కారణమైంది. దీంతో మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు బంజారకు చెందిన గంగరబోయిన సురేష్కు మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన సరితతో వివాహమైంది. వీరికి హర్షిత, ప్రవళిక సంతానం ఉన్నారు. మరో కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సరిత మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటు ంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. సరిత మతిస్థిమితం లేకుండా వ్యవహరించింది. వైద్యం చేయించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.ఏం జరిగింది..? మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్న సరితను బాగు చేయాలని ఆమె అత్త లచ్చమ్మ, తల్లి పద్మ, ఆడపడుచు పద్మ ఆటోలో సరితతోపాటు ఆమె పిల్లలను తీసుకుని మండలంలోని కట్టుగూడెం లోని దేవుని శివసత్తి (దేవుని పూనకం వచ్చే మహిళ) వద్దకు గురువారం తీసుకొచ్చారు. శివసత్తి వద్ద పూజలు చేసిన తర్వాత తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో బయ్యారంలోని పాకాలేటి బ్రిడ్జి వద్ద రూపాయి నాణెంతోపాటు నిమ్మకాయను ఏటిలో వేసేందుకు ఆటోను నిలిపారు. సరిత ఆటో దిగి కుమారుడిని వాగులో విసిరేసింది. ఆ తర్వాత ఆమె సైతం దూకేందుకు ప్రయత్నించగా తల్లి, అత్త, ఆడపడుచు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా అభం శుభం తెలియని చిన్నారి కానరాని లోకాలకు వెళ్లాడు. ఓ వైపు మనవడు..మరో వైపు కన్నబిడ్డ.. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సరిత తల్లి పద్మ నోటివెంట మాటరాని పరిస్థితి. ఓ వైపు మతిస్థిమితం లేని బిడ్డ తన కొడుకును చే తులారా ఏటిలో పడేయడం, ఆ తర్వాత త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కన్నబిడ్డ షాక్కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆమె రోదించింది. -
స్టీల్ప్లాంట్ల నిర్మాణం పరిశీలనలో ఉంది : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫడవిట్ దాఖలు చేయడంపై ఉభయ తెలుగురాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్టీల్ ప్లాంట్ల నిర్మాణంపై 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులను టాస్క్ ఫోర్స్గా నియమించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పలుమార్లు సమావేశం అయింది. ఈ నెల 12 తేదీన కూడా మరోసారి సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై మెకాన్తో కలిసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఫిజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని కోరినట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక సమస్యలను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. -
‘సెల్ఫీ’ కోసం వెళ్లి..
బయ్యారం(ఇల్లెందు): దీపావళి పండుగ సెలవుల్లో సరదాగా చెరువు అందాలు చూసేందుకు వచ్చారు... అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోగా.. అతడిని కాపాడేందుకు మరొకరు నీటిలో దూకారు. అయితే, ఇద్దరూ నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు వద్ద బుధవారం జరిగింది. మహబూబాబాద్కు చెందిన ఏరుపుకొండ జయరాజు(18) తన సోదరి శ్రావణి.. నాగెళ్ల ప్రేమ్భరత్(17) తన సోదరి భావనతో పాటు వారి స్నేహితులు జయంత్, సందీప్లు పెద్ద చెరువు అందాలను చూసేందుకు బుధవారం వచ్చారు. వారంతా మొదటి అలుగు వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్భరత్ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడ్డాడు. అతడిని రక్షించేందుకు జయరాజు తనవద్ద ఉన్న సెల్ఫోన్ను మరో స్నేహితుడు జయంత్కు ఇచ్చి వెంటనే నీళ్లలో దూకాడు. ఈ సమయంలో ప్రేమ్భరత్ జయరాజును గట్టిగా పట్టుకోవడంతో ఇరువురు నీళ్లలో గల్లంతయ్యారు. తమ్ముళ్లు నీటిలో మునిగిపోవడం చూసిన పైన ఉన్న వారు కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయారు. -
మద్యం కాటన్లు స్వాధీనం
బయ్యారం:అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను స్వాధీనం చేసున్నారు. ఇందుకు బాద్యులైన ఇద్దరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. -
బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఛత్తీస్గఢ్ తరహాలో పీపీపీ విధానంలో ప్లాంటు ఏర్పాటు చేయవచ్చన్నారు. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం (ముడి సరుకు)లో నాణ్యత లేనందున విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్తో ఈ అంశంపై దత్తాత్రేయ సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. జాతీయ రూర్బన్ మిషన్ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్ జిల్లాలోని రాయికల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపిక చేశారని దత్తాత్రేయ వివరించారు. -
బయ్యారంలో మారిన సరిహద్దులు
బయ్యారం : నూతన జిల్లాల ఏర్పాటులో బయ్యారం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు బయ్యారం మండలానికి దక్షిణం వైపున వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, కొత్తగూడ మండలాలు సరిహద్దుగా ఉండేవి. ప్రస్తుతం బయ్యారం మండలం దక్షిణాన ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కలువగా తూర్పున ఉన్న ఇల్లెందు మండలం భద్రాద్రి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ప్రాంతాలు వేర్వురు జిల్లాల్లోకి వెళ్లాయి. మండలంలోని నామాలపాడు సమీపంతో పాటు పాఖాలకొత్తగూడ సరిహద్దులో ఉన్న మిర్యాలపెంట గ్రామం భద్రాద్రి జిల్లాకు హద్దుగా మారింది. గతంలో ఉప్పలపాడు పంచాయతీలోని లకీ‡్ష్మనర్సింహపురం గ్రామంలో రహదారికి తూర్పు వైపున ఉన్న ఇళ్లు ఖమ్మం జిల్లాలో ఉండగా దక్షిణం వైపున ఉన్న ఇళ్లు వరంగల్ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఆ గ్రామానికి జిల్లా సరిహద్దులు మారగా మండల హద్దులు మాత్రం అలానే ఉన్నాయి. బయ్యారం మండలం నూతన జిల్లాలోకి మారినప్పటికీ పాత సంప్రదాయం ప్రకారం ఇతర జిల్లాకు హద్దుగా మారడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు -
ఊరిస్తున్న ‘ఉక్కు’!
పట్టాలెక్కని పరిశ్రమ అధ్యయనానికి మరో కమిటీ తొలుత రెండు బృందాల సర్వే రూ.30వేల కోట్ల ప్రాజెక్టుకు ముహూర్తమెప్పుడో..? సాక్షిప్రతినిధి, ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. పరిశ్రమ నిర్మాణం మాత్రం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెరుుల్) బృందం రెండున్నరేళ్ల క్రితం కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి ప్రభుత్వాలకు నివేదిక అందజేసింది. దీనిపై స్పందించని కేంద్రం.. తాజాగా మళ్లీ అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎప్పుడు పునాదులు పడతాయోనని ఆ ప్రాంతవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆధారమైన ముడి ఇనుప ఖనిజం జిల్లాలో పుష్కలంగా ఉంది. నిక్షేపాలు నిక్షిప్తమైన ఉన్న ప్రాంతంలోనే కర్మాగారం ఏర్పాటు చేయాలని జిల్లావాసులతోపాటు రాజకీయ పక్షాలు కొన్నేళ్లుగా నినదిస్తున్నారుు. అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో 2014, మే 21, 22 తేదీల్లో ఎనిమిది మంది సభ్యులతో కూడిన సెరుుల్ బృందం గార్ల, బయ్యారంలో పర్యటించి.. ఇనుప ఖనిజాలున్న భూములను పరిశీలించింది. బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో ముడి ఇనుప ఖనిజంతోపాటు సంబంధిత ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెరుుల్ బృందం నివేదిక అందజేసింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వాలకు నివేదికను పంపింది. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. నల్లగొండ జిల్లాలో సున్నపురారుు(లైమ్స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలు మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. స్టీల్ ప్లాంట్లో ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు ప్రధానంగా నీరు అవసరం. అరుుతే బయ్యారం మండలానికి సమీపంలో ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో అధికారులు నివేదించారు. హైదరాబాద్లోని హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదికలో ప్రతిరోజు ప్లాంట్కు 5,000 క్యూబిక్ మీటర్ల(49 క్యూసెక్కులు) నీటి అవసరం ఉంటుందని, దీని ప్రకారం కొన్ని నీటి వనరులను జిల్లా అధికారులు ప్రతిపాదించారు. పామర్ కంపెనీ పరిశీలన ఏడాదిన్నర క్రితం గార్ల, బయ్యారంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పామర్ కంపెనీ ప్రతినిధుల బృందం ఇనుప ఖనిజం నిల్వలున్న భూములు, అధికారులు స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను పరిశీలించింది. గార్ల మండలం శేరిపురం, బయ్యారం మండలం ధర్మాపురంలో బృందం పర్యటించింది. ప్రభుత్వం పరిశ్రమ నిర్మాణం కోసం తమకు భూములు కేటారుుస్తే ఉక్కు కర్మాగారంతోపాటు థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని కంపెనీ బృందం ప్రకటించింది. దీంతో అసలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ సెరుుల్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తుందా..? అనేది అప్పట్లో చర్చ జరిగింది. కేంద్రం.. రాష్ట్రానికి చేయూతనివ్వకపోతే భారీ ఎత్తున నిధుల సమీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పునాది పడేదెప్పుడు..? ఏళ్లతరబడి ఊరిస్తున్న బయ్యారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అరుుతే ఇటు సెరుుల్ అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి అందజేసినా.. కేంద్రం మాత్రం చూస్తాం.. చేస్తాం అంటూ కాలయాపన చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై చురుకుగా ముందుకెళ్లకపోవడంతో.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నారుు. మంగళవారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇంకెన్నాళ్లు సర్వేలు, అధ్యయనాలతో కాలయాపన చేస్తారని ఇక్కడి ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
బయ్యారం ఉక్కు.. ఖమ్మం హక్కు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు గార్ల: బయ్యారం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అయినందున గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే ఇల్లెందు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ మూడు ముక్కలు చేశారని విమర్శించారు. ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలోగల సత్తుపల్లిని, దగ్గరలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కలపకుండా ఖమ్మం జిల్లాలో కలపడం వెనుక మంత్రి తుమ్మల స్వార్థం ఉందన్నారు. ఖమ్మానికి కేవలం 29 కిలోమీటర్ల దూరంలోగల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇనుపరాయి, బైరైటీస్ ఖనిజాలు గల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపితే అక్కడి సంపదను ఖమ్మం జిల్లా కోల్పోయినట్టవుతుందని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు 60వేల ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. అందుకే, ఆ రెండు మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, నాయకులు ధరావత్ సక్రు, గుగులోత్ హరి, బి.ఈర్య, టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
చీర సింగారం..నారు సురక్షితం
బయ్యారం : చుట్టూ చీరలు..తడిక మాదిరి చుట్టేశారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప గింజలు కొని..పోసిన నారును ఇలా..చీరల కాంపౌడ్ లోపల పోసేసుకున్నారు. పశువులు తొక్కకుండా కాపాడుకునేందుకు బయ్యారంలో రైతులు ఈ ఉపాయం చేశారు. అప్పుడే వస్తున్న మొలకలను అస్తమానం కాపలా కాయలేక, వదిలేస్తే వచ్చే నష్టం భరించలేక..ఇదిగో ఇలా చీరలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. వారెవ్వా..భలే ఐడియా వేశారే..అని కొందరు రైతులు ఆశ్చర్యపోతున్నారు. -
‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత
- సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముడి ఇనుప ఖనిజం లభ్యతపై స్పష్టత వస్తేనే కర్మాగారం నిర్మిస్తామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) స్పష్టం చేసింది. దీనిపై సర్వే చేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక సమర్పణకు గడువు కోరుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తుది నివేదికను సమర్పిస్తామని చెబుతోంది. 20 కోట్ల టన్నులు ఉంటేనే... రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు సుముఖత వ్యక్తం అయింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని సెయిల్ తెలిపింది. మరోవైపు ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్ఫోర్స్ కమిటీ బయ్యారంలో 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని నివేదికలో పేర్కొంది. అయితే ఈ సమాచారం అసంపూర్తిగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మైనింగ్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదని, ముడి ఖనిజం లభ్యతపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నత్తనడకన జీఎస్ఐ సర్వే రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం లభ్యతపై జీఎస్ఐ ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా సంయుక్త సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. నిర్దేశిత విస్తీర్ణంలో కోర్టుల్లో వివాదంలో ఉన్న భూములు, ఇనుప ఖనిజం వెలికితీతకు ఇప్పటికే అనుమతులు పొందిన సంస్థలకు సంబంధించిన భూములను సర్వే నుంచి మినహాయించాలని సూచించింది. మొత్తం 13 బ్లాకులుగా ముడి ఇనుప ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్ఐ క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్ఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమే అందుకు కారణం. ఈ ఏడాది మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా తుది నివేదిక వచ్చే ఏడాది 2017 మార్చి నెలాఖరుకు అందే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. -
'బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి'
ఖమ్మం: బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి రేపటి నుండి రెండు రోజుల పాటు ఖమ్మంలో దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని గతంలో పార్లమెంట్లో ప్రస్థావించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఖమ్మంలో 600 మంది దళితులకు కెటాయించిన ఇళ్ల స్థలాలను వారికి అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని పొంగులేటి డిమాండ్ చేశారు. -
‘బయ్యారం’ ఖనిజాన్వేషణ ప్రైవేటుకు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఖనిజ నిల్వలను గతంలోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు అప్పగించా రు. ఈ నేపథ్యంలో ఖనిజాన్వేషణకు ప్రైవేటు ఏజెన్సీలను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యతను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సెయిల్ ప్రతినిధులు ఖమ్మంలో పర్యటించి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కనీసం 200 మిలియన్ టన్నుల ముడి సరుకు అవసరమని తేల్చారు. రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక శాస్త్రీయంగా లేనందున 200 మిలియన్ టన్నుల ముడి ఇనుముపై పూర్తి నివేదిక ఇవ్వాలని సెయిల్ సూచించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్ఐతో సమన్వయం చేసుకుంటూ ముడి ఇనుము లభ్యతపై నివేదిక సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం గత ఫిబ్రవరిలో టీఎస్ఎండీసీకి అప్పగించింది. కొలిక్కిరాని ఖనిజాన్వేషణ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని బయ్యారంలో 100 చదరపు కి.మీ. పరిధిలో జీఎస్ఐ, గనులు, భూగర్భ వనరుల శాఖ సంయుక్త సర్వే నిర్వహించింది. లభ్యత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న 60 చ.కి.మీ. పరిధిలో 14 చోట్ల డ్రిల్లింగ్ చేసి ఖనిజం లభ్యతపై అంచనాకు రావాలి. డ్రిల్లింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మూడుచోట్ల ఖనిజాన్వేషణ బాధ్యతను సింగరేణికి అప్పగించారు. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల డ్రిల్లింగ్ చేయాలని జీఎస్ఐ తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే బయ్యారంలో జీఎస్ఐ, సింగరేణి డ్రిల్లింగ్ను సకాలంలో పూర్తి చేయలేనందున కొత్తగా ప్రతిపాదించిన 12 పాయింట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇనుము లభ్యతపై స్పష్టత వస్తుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. -
ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు
బయ్యారం (ఖమ్మం జిల్లా) : సెల్ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో నాటు బాంబు పేలి చెయ్యి తెగి పడిపోయింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువు వద్ద చోటుచేసుకుంది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శివ (32) చేపలు పడదామని సోమవారం నాటుబాంబుతో బయ్యారం పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు. నాటుబాంబును చెరువులో విసిరి చేపలు పడదామని అనుకుని బాంబుకు నిప్పంటించాడు. అదే సమయంలో ఫోన్ మోగడంతో బాంబు విషయం మర్చిపోయి, ఫోన్ మాట్లాడుతున్నాడు. బాంబు ఒక్కసారిగా పేలడంతో చెయ్యి తెగిపడింది. క్షతగాత్రుడిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బయ్యారంలో చైన్స్నాచర్ అరెస్ట్
బయ్యారం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో గత కొంత కాలంగా వరుస చైన్ స్నాచింగులకు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, 57 తులాల వెండి, మరో బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్ట్ తీద్దాం..!
* చెడు వ్యసనాల బానిసలను సన్మార్గంలో పెడదాం * గ్రామ సభ నిర్వహించండి... నేనూ వస్తా * బయ్యారంలో ఎస్పీ సుమతి గజ్వేల్: ‘గ్రామంలో బెల్టు షాపుల జాబితా తయారు చేయండి, పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతున్న వారి వివరాలను సైతం సేకరించండి. త్వరలోనే గ్రామ సభ నిర్వహించండి. నేనూ వస్తా.. ఊరిని బాగుచేసుకుందాం.. ’ అంటూ ఎస్పీ సుమతి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బయ్యారంలో అత్యాచార ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన ఎస్పీ గ్రామాస్తులను ఉద్దేశించి మాట్లాడారు. బెల్ట్ షాపులను విచ్చలవిడిగా నిర్వహించడం వల్ల యువత మద్యానికి బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. మరో వైపు ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా ఉన్నవారు సైతం చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ దుస్థితిని మార్చాలంటే బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు చెడు వ్యసనాలకు గురైనవారిని సన్మార్గాంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. -
పొలంలో బంగారు నాణాల కుండ
బయ్యారం (ఖమ్మం) : ఓ రైతు పొలం దున్నుతుండగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సౌమ్యతండాలో మంగళవారం చోటుచేసుకుంది. సౌమ్యతండాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో అరక దున్నుతుండగా 40 బంగారు నాణాలు ఉన్న కుండ దొరికింది. ఈ విషయం తెలుసుకున్న పొలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘బయ్యారం’ ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. పరిశ్రమ నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్ఫోర్స్ కమిటీ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో ముడి ఇనుము నిక్షేపాలున్నట్లు నివేదికలో పేర్కొంది. బయ్యారంలో లభిస్తున్న ముడి ఇనుములో 65 శాతం నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కూడా దృష్టి సారించింది. 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలుంటేనే ఉక్కు కర్మాగారం పెట్టడం సాధ్యమవుతుందని సెయిల్ చెబుతోంది. ఒకేచోట 200 మిలియన్ టన్నుల ముడిఇనుము లభించడం అసాధ్యమని టాస్క్ఫోర్స్ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. మరోవైపు సెయిల్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఇవ్వాల్సిన రాయితీలను కూడా నివేదికలో పొందుపరిచారు. ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్, కస్టమ్స్, సేవా పన్నుల మినహాయింపు, సెయిల్ తీసుకునే రుణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలను పేర్కొన్నారు. ప్రాథమిక నివేదిక అసమగ్రం నివేదికపై టాస్క్ఫోర్స్ సభ్యులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 3 పర్యాయాలు సమావేశమయ్యాయి. నివేదికలోని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయని, ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించాయి. కేవలం ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బయ్యారంలో నిక్షేపాల లభ్యత, నాణ్యత కర్మాగారం ఏర్పాటుకు అవసరమైనంత మేర ఉండకపోవచ్చని మైనింగ్ విభాగం అనుమానం వ్యక్తంచేస్తోంది. ఎక్కువ నమూనాలు విశ్లేషించి తుది నివేదిక సమర్పించేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే కర్మాగారం నిర్మాణానికి కనీసం ఐదేళ్లు పడుతుందని సెయిల్ వర్గాలు ఇదివరకే చెప్పాయి. ఈ నేపథ్యంలో బయ్యారంలో సెయిల్ ఉక్కు కర్మాగారం ప్రతిపాదన ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. బయ్యారం నేపథ్యం ఇదీ... బయ్యారంలో 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గతంలో సెయిల్ సుముఖత వ్యక్తం చేసింది. తొలి దశలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెనిఫికేషన్, పెల్లెట్ ప్లాంటు, రెండో దశలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక తరహాలో పర్యావరణానికి హాని కలగని రీతిలో పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఉక్కు కర్మాగారం ఏర్పాటులో టాస్క్ఫోర్స్ తుది నివేదిక కీలకం కానుంది. మంత్రి హరీశ్ సమీక్ష బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై టాస్క్ఫోర్స్ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నీటిపారుదల, మైనింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో కీలకంగా వ్యవహరిస్తున్న మైనింగ్, సింగరేణి, భూ భౌతిక పరిశోధన సంస్థ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నమూనాల సేకరణకు అవసరమైన డ్రిల్లింగ్లో సింగరేణి సహకారం తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుతెన్నులు, టాస్క్ఫోర్స్ ప్రాథమిక నివేదికపై చర్చించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ శ్రీధర్, టీఎస్ఎండీసీ ఎండీ లోకేశ్ కుమార్, డెరైక్టర్ మంగీరాం తదితరులు పాల్గొన్నారు. -
‘బయ్యారం’పై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కీలకమైన టాస్క్ఫోర్స్ నివేదికను సమగ్రంగా రూపొందించాలని నీటిపారుదల, భూగర్భ వనరుల శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశించారు. భూగర్భ వనరుల శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై ప్రస్తుతం భూగర్భ వనరుల శాఖ అధ్యయనం చేస్తోంది. అయితే బయ్యారంలో ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నమూనాలు సేకరించడం ద్వారా ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావాల్సిందిగా ఇటీవల కేంద్రం సూచించింది. దీంతో సమగ్ర అధ్యయనానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. -
పేకాట కేంద్రాలపై దాడి: ఏడుగురి అరెస్టు
బయ్యారం: పేకాట కేంద్రాలపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై అనిల్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, -
బయ్యారంలో దొంగల హల్చల్
ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో దోపిడి దొంగలు ఆదివారం అర్థరాత్రి రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసుకున్న దొంగలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.1.50 లక్షల నగదు, 8 తులాల బంగారం, 17 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్బంక్లో వాగ్వివాదం
బయ్యారం(ఖమ్మం): తగ్గిన ధరల అనుసారంగా పెట్రోల్ పోయకుండా పాతరేటునే కొనసాగిస్తున్న పెట్రోల్బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారంలోని అంబాభవాని పెట్రోల్బంక్లో శనివారం ఉదయం జరిగింది. బయ్యారంలో ఒక్కటే పెట్రోల్బంక్లో ఉండటంతో.. ఇతర మార్గంలేక తెల్లవారుజాము నుంచి వినియోగదారులు పాత రేటుకే పెట్రోల్ కొట్టించుకున్నారు. ఉదయం కొంతమంది వాహనదారులు ఈ విషయం పై గొడవకు దిగారు. దీంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన సిబ్బంది తాజా రేట్లకు పెట్రోల్ విక్రయిస్తున్నారు. -
బయ్యారం స్టీల్ప్లాంటుపై టాస్క్ఫోర్సు
కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ సాక్షి, హైదరాబాద్: బయ్యారం స్టీల్ప్లాంటు అంశాలపై టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశామని, మూడు నెలల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కు, ఖనిజ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. సోమవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో తోమర్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యానని వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన మైనింగ్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఇద్దరు సీఎంలను కోరినట్టు చెప్పారు. నూతన మైనింగ్ పాలసీ వల్ల కేంద్రానికి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా అక్రమ మైనింగ్కు అవకాశం లేకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ ఉక్కు ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తోమర్ తెలిపారు. మజ్లిస్ మెప్పుకోసమే యోగాకు దూరం.. మజ్లిస్ పార్టీ మెప్పుకోసమే అద్భుతమైన ప్రక్రియ యోగాకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులు దూరంగా ఉన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. యోగాలోని విశిష్టతను అర్థం చేసుకుని గవర్నరు సహా చాలామంది ముఖ్యులు వారి కుటుంబాలతో సహా యోగాలో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొందరు మంత్రులను మొక్కుబడిగా పంపిందన్నారు. టీఆర్ఎస్ ముఖ్యులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పెద్దలు మాత్రం యోగాలో పాల్గొనకుండా రాజకీయ విన్యాసాలు చేశారని డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భేటీ అయ్యారు. తెంలగాణలో గనులు, ఖనిజ సంపద వెలికితీత అంశంపై వారిద్దరి మధ్య ఈ సందర్భంగా చర్చ జరిగింది. బయ్యారం గనుల్లో ఐరన్ ఓర్ నిల్వలపై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తోమర్కు విజ్ఞప్తి చేశారు. జియాలజీ, మినరల్ సోర్స్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తోమర్ ఆవిష్కరించారు. -
'బయ్యారం'పై టాస్క్ ఫోర్స్
స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కమిటీ కేంద్ర మంత్రి తోమర్తో సీఎం కేసీఆర్ భేటీలో నిర్ణయం ప్రాజెక్టు ఏర్పాటుపై సంయుక్త అధికారులతో పరిశీలన 60 రోజుల్లో నివేదిక, అనంతరం తుది నిర్ణయం లాభదాయకం కాదన్న గత నివేదికను ప్రస్తావించిన తోమర్ రాష్ర్టం చాలా ఆశలు పెట్టుకుందని ముఖ్యమంత్రి వివరణ దామరచర్ల విద్యుత్ ప్లాంటుకు పర్యావరణ అనుమతులు మంత్రి జవదేకర్ పచ్చజెండా, ప్రాణహితకూ సానుకూలం ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మతోనూ భేటీ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ వైద్య కళాశాలల ఏర్పాటుపై మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తులు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులతో ఏర్పడే ఈ కమిటీ.. స్థానిక పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై 60 రోజుల్లో నివేదిక ఇస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కె.చంద్రశేఖర్రావు శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి ఉద్యోగ్భవన్లో తోమర్తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో గతంలో అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అక్కడి ముడి ఖనిజంలో నాణ్యత లేదని, ప్లాంటు ఏర్పాటు లాభదాయకం కాదని ఆ కమిటీ తేల్చినట్లు చెప్పారు. నివేదికలోని ఇతర అంశాలను కూలంకషంగా వివరించారు. అయితే ప్లాంట్ ఏర్పాటు సాధ్యంకాదనడం సరికాదని, ఒక్క లాభదాయకతే చూడడం భావ్యం కాదని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, ఇతర మౌలిక వసతులన్నీ రాష్ట్రం కల్పిస్తుందని, ప్లాంటు తప్పనిసరిగా ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం గట్టిగా కోరారు. దీంతో మరోసారి పరిశీలన కోసం టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. బయ్యారం ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణ రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు మంచి చేసేందుకు, అవసరమైన సహకారం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో చాలా అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి, 60 రోజుల్లోనే తుది నివేదిక వచ్చేలా చూడాలని మేం నిర్ణయించాం. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టును చేపడతారా లేదా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం త రఫున కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అవన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 60 రోజుల్లో తేల్చుతామని చెప్పారు’ అని సీఎం తెలిపారు. టాస్క్ఫోర్స్ నివేదిక వచ్చిన వెంటనే బయ్యారం ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు మొదలవుతాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. వెనుకబడిన ప్రాంతమైన బయ్యారం ప్రజలకు మేలు చేసేందుకు తన వంతు కృషి చే స్తానన్నారు. అయితే వీలైనంత త్వరగా వేలం వేసేందుకు గనులను గుర్తించాలని కేసీఆర్ను తోమర్ కోరారు. గనుల వేలానికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు రూపొందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్, దత్తాత్రేయతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, బి.వినోద్కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జవదేకర్తోనూ భేటీ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులను వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ను ముఖ్యమంత్రి కోరారు. పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రి జగదీశ్వర్రెడ్డితో సహా పలువురు ముఖ్య అధికారులతో కలిసి కేంద్ర మంత్రిని కేసీఆర్ కలిశారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటు చేయనున్న 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టునకు పర్యావరణ అనుమతులు కోరారు. ఈ ప్లాంటుకు రిజర్వ్ ఫారెస్టులో ఉన్న కొంత భూమి అవసరమవుతోందని, దానికి ప్రత్యామ్నాయంగా 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమని కేసీఆర్ చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన జవదేకర్.. దామరచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తున్నట్టు మౌఖికంగా చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా ప్రస్తావించగా.. 40 హెక్టార్ల భూమి వరకు అవసరమైన పర్యావరణ అనుమతులు రాష్ట్రస్థాయిలోనే వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనిపై ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన్ని అనుమతులు వీలైనంత తర్వగా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేకంగా వచ్చి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై గంటకుపైగా చర్చించారు. అనంతరం నిర్మాణ్భ వన్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. దత్తాత్రేయతోపాటు రాష్ర్ట ఆరోగ్య మంత్రి లక్ష్మయ్య కూడా సీఎం వెంట ఉన్నారు. బీబీనగర్ ఎయిమ్స్కు నిధులివ్వండి హైదరాబాద్ శివారులోని బీబీనగర్లో స్థాపించే ఎయిమ్స్ ఏర్పాటుపై జేపీ నడ్డాతో కేసీఆర్ చర్చించారు. ఇదివరకే నిర్మించిన భవనాలు, దాదాపు 200 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు. ఇక్కడే మరో 100 ఎకరాల్లో నర్సింగ్, డెంటల్ తదితర కళాశాలలను ఏర్పాటు చేస్తూ హెల్త్సిటీగా మార్చనున్నట్టు వివరించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాకు తెలిపారు. స్వైన్ఫ్లూపై అడిగిన వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కేంద్రానికి సహకరించిన కేసీఆర్ను నడ్డా అభినందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూ. వెయ్యి కోట్లతో స్థాపించబోయే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు వంద ఎకరాల స్థలం ఇస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే త్వరలో తెలంగాణను 26 జిల్లాలుగా చేస్తున్నందున జిల్లాకో ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలను నీతిఆయోగ్ సమావేశంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని నడ్డా హామీ ఇచ్చారు. -
మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం... అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం. దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి. విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి. విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు. ఎరువులు మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి. కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది. తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది. సస్యరక్షణ చర్యలు మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి. మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
బయ్యారం : నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బయ్యారం యోధలది. తమకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న బయ్యారానికి చెందిన 30 మందిని నైజాం ప్రభువులు బలదీసుకున్నారు. అయినా వెనుకడుగు వేయక తెలంగాణ బానిస సంకెళ్లను తెంచేంతవరకు అలుపెరుగని పోరాటం చేసిన ఘనత ఈ ప్రాంత వాసులది. కంచర బుచ్చిమల్లు, దామినేని కోటేశ్వరరావులు ప్రాణాలను పణంగా పెట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. 1948లో బండ్లకుంట సమీపంలో నైజాం పాలకులు తమ సైనికులతో వీరిద్దర్నీ కాల్చి చంపించారు. వీరి శవాలను బయ్యారం, గార్ల మండలాల్లో ఊరేగించి తమను వ్యతిరేకించిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టు నాయకులను కాల్చి చంపిన రెండు రోజల తరువాత అదే ప్రాంతంలో నిజాం సైనికులు మండలంలోని బండ్లకుంట, జాప్రాబాద్, జగ్నాతండా, బయ్యారం, చోక్లాతండా గ్రామాలకు చెందిన బీరవెల్లి లక్ష్మీనర్సయ్య, కంబాల చంద్రయ్య, అయిలబోయిన యర్రయ్య, సింగనబోయిన గంగయ్య, లింగయ్య, కారం మల్లయ్య, పాశం లచ్చయ్య, మాడె పాపయ్య, మాడె బుచ్చయ్య, తాటి బాలయ్య, భూక్య సక్రాం, వేములపల్లి శ్రీ కృష్ణ, తాటి మల్లయ్య, తాటి లక్ష్మయ్య, పెడుగు లక్ష్మీనర్సయ్య, కుంజ ముత్తిలింగయ్య, కారం గాదెయ్య, మోరె బాలయ్య, కుంజా జోగయ్య, మోకాళ్ళ యద్రయ్యలతో పాటు మరో పదిమందిని కాల్చి చంపి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. తమ కళ్ల ముందే అనేక మంది ఉద్యమకారులను కాల్చిచంపినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా పోరాటంలో ముందుకు సాగారు మండలవాసులు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన యోధుల అమరత్వానికి సాక్షిగా 1969లో బయ్యారం మండలకేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. నాటి పోరాటస్ఫూర్తి గురించి అమరుడు బీరవెల్లి లక్ష్మీనర్సయ్య భార్య బీరవెల్లి వెంకటమ్మ ఏమంటున్నారో... పిల్లలు తండ్రిని చూడలేదు: బీరవెల్లి వెంకటమ్మ, స్వాతంత్ర సమరయోధురాలు, బయ్యారం తెలంగాణ పోరాటం ప్రారంభమైనప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పటికే నాకు నలుగురు సంతానం. రజాకార్లకు వ్యతిరేకంగా ఉన్నాడని మా పెద్దాయన్ను యూనియన్ పోలీసులు కాల్చి చంపిండ్రు. శవాన్ని కడసారి చూసుకోనివ్వలేదు. పది శవాలకు ఒకే చోట నిప్పుబెట్టిండ్రు. మరో వైపు అదే రోజు బయ్యారం ఊరికి రజాకార్లు నిప్పుబెట్టడంతో ఇళ్లు కాలి నిల్వనీడ లేకుండా పోయింది. అప్పుడు మాపెద్దోడు వెంకటరెడ్డికి ఎనిమిదేళ్లు. చిన్నోడు రంగారెడ్డికి ఐదేళ్లు. పెద్దబిడ్డ భాగ్యమ్మకు మూడేళ్లు. చిన్నబిడ్డ అరుణ పుట్టి ఏడాది. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలకు తెలియని వయసులో ఆయన్ను కాల్చిచంపిండ్రు. అప్పటినుంచి మాకు కష్టాలు మొద లయినై. ఆ తర్వాత పిల్లలతో కలిసి వరంగల్ జిల్లా కాంపెల్లిని మా తల్లిగారింటికి పోయిన. అక్కడే పిల్లలు పెద్దోళ్లయ్యేదాక ఉంచి విముక్తి పోరాటంలో పాల్గొన్న. -
బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి
ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో వేలాదిమంది గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ లేదా ఇన్ఫాట్ నిగమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని పొంగులేటి సోమవారం పార్లమెంట్లో ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 1.41 లక్షల ఎకరాల్లో ఇనుపరాయి నిక్షేపాలు దాగి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గార్ల, బయ్యారం, నేలకొండపల్లి మండలాలతో పాటు సమీప వరంగల్ జిల్లాలో కూడా ఫ్యాక్టరీకి కావల్సిన నిక్షేపాలు అపారంగా ఉన్నాయన్నారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. -
''బయ్యారం భూముల్ని గిరిజనులకివ్వాలి''
-
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
బయ్యారం, న్యూస్లైన్: పిడుగు ముగ్గురిని బలితీసుకుంది. బయ్యారం మండలంలోని తులారం ప్రాజెక్టు అలుగుల వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని గౌరారం పంచాయతీ వినోభానగర్కు చెందిన జవ్వాది వెంకటమ్మ(50), ఆమె కుమార్తె శ్రీలత(21)తో పాటు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగలివారిపేటకు చెందిన బబ్లు(12)(వెంకటమ్మ మరో కుమార్తె కొడుకు) బట్టలు ఉతికేందుకు తులారం ప్రాజెక్టు వద్దకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో పిడుగులతో భారీ వర్షం కురిసింది. చీకటి పడుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా బబ్లు తులారం ప్రాజెక్టు వద్ద నీటిలో తేలుతూ కనిపించాడు. ఉతికేందుకు తీసుకెళ్లిన దుస్తులు చిందరవందగా పడిపోయి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన వారు నీటిలో చూడగా వెంకటమ్మ, ఆమె కుమార్తె శ్రీలత మృతదేహాలు లభించాయి. వారు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన సమయంలో అక్కడ పిడుగు పడిందని, పిడుగు పాటుకే వారు మృతి చెందారని స్థానికులు అంటున్నారు. -
ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే స్థాపించాలి
ఖమ్మంసిటీ, న్యూస్లైన్ : బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపించాలని సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆందోళన నేపథ్యంలో బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మేరకే ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. బయ్యారంలో లక్ష ఎకరాలకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు, దీనికి కావాల్సిన మరో ముడి ఇంధనం డోలమైట్ 20 కిలోమీటర్ల దూరంలో మాదారంలో ఉందని తెలిపారు. బయ్యారం చెరువు, మున్నేరు ద్వారా కావాల్సిన నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బయ్యారానికి ప్రధాన రైల్వేమార్గం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు 20, 30 కిలోమీటర్ల దూరంలోనే లభిస్తుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సెయిల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో రాజకీయ వత్తిడిల మాటున బయ్యారం ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే ఆలోచన సమంజసం కాదన్నారు. పాల్వంచలో గతంలో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి తప్ప బయ్యారంలో ప్రతిపాదించిన ఫ్యాక్టరీని అక్కడకు తరలించడం సరి కాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కెచ్చెల రంగయ్య, అరుణోదయ నాగన్న, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తరలిస్తే సహించం : టీఆర్ఎస్ ఇల్లెందు : బయ్యారంలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమను జిల్లాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నియోజకవర్గ కన్వీనర్ ఊకె అబ్బయ్య అన్నారు. ఇల్లెందులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లుగా నిర్వహించిన పోరాటం ఫలితంగాా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, పలు కారణాలు సాకుగా చూపి ఈ పరిశ్రమను కొత్తగూడెం మండలానికి తరలించే యత్నం చేయడం సరికాదని అన్నారు. ఇదే జరిగితే ఇక్కడి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కొత్తగూడెం మండలం రేగళ్ల ప్రాంతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, పాల్వంచలో రేణుకా చౌద రి భూములు ఉన్నాయని తెలిపారు. పీవీ కుటుంబంతోపాటు రేణుకా చౌదరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమను అక్కడ స్థాపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టే నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ అంశాన్ని పరిశీలించి ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి మండలాల సరిహద్దులో స్టీల్ పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పులిగండ్ల మాదవరావు, లాకావత్ దేవీలాల్ నాయక్, కౌన్సిలర్ జానీపాషా, కంభంపాటి కోటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలోనే ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కోరం బయ్యారం : ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే స్థాపించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇనుపరాయి గనులున్న బయ్యారం మండలంలో అన్ని వనరులున్నప్పటికీ కొందరు ఇతర ప్రాంతంలో పరిశ్రమను నిర్మించే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. విలేకరుల సమావేశంలో మూల మదుకర్రెడ్డి, ఎనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సెయిల్’ సార్లొస్తున్నారు..
* బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధ్యయన కమిటీ రాక *నేడు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ రేపు క్షేత్ర సందర్శన * రూ. 30 వేల కోట్ల వ్యయం * 2,500 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన * సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్న కమిటీ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం నేడు జిల్లాకు రానుంది. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ను పరిశీలించేందుకు వస్తున్న ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉంటుంది. సెయిల్ నిపుణుడు అశోక్కుమార్ ఝా నేతృత్వంలోని ఈ బృందం తొలిరోజు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చించనుంది. రెండో రోజున జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో బయ్యారం వెళ్లి క్షేత్ర సందర్శన చేస్తుంది. అనంతరం ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో స్టీలు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు ఆరునెలల్లోపు కమిటీ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతి నిధులు రాష్ట్రానికి వచ్చారు. మంగళవారం వీరంతా పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్లను కలిసి ఫ్యాక్టరీ ప్రతిపాదనలను తెలుసుకున్నారు. మొత్తం రూ.30 వేల కోట్ల వ్యయంతో, 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల అధికారులు తెలియజేశారు. అయితే, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను అవసరమైన భూసేకరణ, నీటి వసతి, రవాణా(రోడ్డు, రైలు మార్గాలు), విద్యుత్ తదితర సౌకర్యాలపై ఈ కమిటీ జిల్లా ఉన్నతాధికారులతో బుధవారం చర్చించనుంది. కాగా, పరిశ్రమ కు అవసరమయ్యే ముడి ఖనిజాలైన డోల మైట్, ఇనుము, బొగ్గు జిల్లాలోనే అందుబాటులోనే ఉన్నాయి. వీటితో పాటు అవసరమ య్యే సున్నపురాయి (లైమ్స్టోన్) నిక్షేపాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ నేపథ్యం లో పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పరిసరాల నుంచి లైమ్స్టోన్ను తెచ్చుకోవాలని జిల్లా అధికారులు యోచిస్తున్నా రు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై చర్చించి పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సెయి ల్ ప్రతినిధి బృందం కేంద్రానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. -
రూ.5వేల కోట్లతో బయ్యారంలో మైనింగ్: బలరాంనాయక్
ఇల్లెందు, న్యూస్లైన్: ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ. 5వేల కోట్లతో బయ్యారం మండలంలో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి బలరాంనాయక్ అన్నా రు. శనివారం ఇల్లెందు ఏరియాలోని జేకే -5 ఓసీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బయ్యారంలో మైనింగ్ ఏర్పాటు గురించి గతం లో అనేకసార్లు ముఖ్యమంత్రితో చర్చించామని, రెండు నెలల్లో మైనింగ్ మంత్రులను బయ్యారం మండలానికి తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పరి శీలించనున్నామని అన్నారు. ఇల్లెందులో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్కు ప్రయత్నిస్తున్నామని, సింగరేణి పుట్టిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు యోచిస్తున్నామని అన్నారు. సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఇల్లెందు అభివృద్ధికి షేప్ నిధులు మం జూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్, జేసీలకు సూచించారు. అనంతరం మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓసీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నా రు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సకాలంలో పరిహారం అందించడం పట్ల ఆయన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపా రు. ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ సింగరేణి జేకే -5ఓసీలో యాజమాన్యం జీఓ 97ను ఉల్లంఘిస్తోందని, నిర్వాసిత ప్రాంతంలోని నిరుద్యోగుల్లో 100 శాతం ఉపాధి కల్పించడం లేదని అన్నారు. నిర్వాసితులకు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉపాధి కల్పించలేదని అన్నారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడు తూ నిర్వాసితులకు పంపిణీ చేసిన స్థలాల్లో తక్షణం ఇళ్ల నిర్మాణం చేపట్టి మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని సింగరేణి యాజమాన్యానికి సూ చించారు. గుండాలలో బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరుగుతోందని, జిల్లాలో మొదటిసారిగా మోడల్కాలనీగా ఇల్లెందును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ఒకే చోట ఇవ్వాలి... నిర్వాసిత ప్రాంతంలోని కుటుంబ సభ్యులకు అందరికీ ఒకేచోట ఇళ్ల స్థలాలలు ఇవ్వాలని, లాట రీ పద్ధతిలో వేర్వేరు చోట్ల కేటాయించవద్దని నిర్వాసిత కమిటీ బాధ్యులు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన జేసీ నిర్వాసితుల అభిప్రాయం మేరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, ప్రస్తుతం ఒకరిద్దరికి లాటరీ పద్ధతిలో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. అందుకు నిర్వాసితులు ఒప్పుకున్నారు. అలాగే టేకులపల్లిలోని రాయపాడు గ్రామానికి చెందిన 82 మంది భూ నిర్వాసితులకు కూడా పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు యంత్ర పరికరాల పంపిణీ... అంతకు ముందు యంత్రలక్ష్మి పథకం కింద స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిలు రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. వ్యవసా య శాఖ ద్వారా 707 మంది రైతులకు రూ. 84 లక్షల విలువైన యంత్ర పరికరాలను, రూ. 50లక్షల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సదుపాయాలు కల్పిస్తోందని వీటి ని సకాలంలో రైతులకు అందేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో జిల్లాలో రెండు భారీ నీటి పారుదల ప్రాజెక్టులు దుమ్ముగూడెం, పోలవరం చేపట్టారని ఈ రెండు పూర్తయితే జిల్లాలో రైతులకు సాగునీటికి కొరత ఉండదని అన్నారు. అనంతరం ఇందిరానగర్లో రూ. 5లక్షలతో మంచినీటి బోర్, మోటార్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్, ఐటీడీఏ పీఓ వీరపాండియన్, జేసీ సురేం ద్రమోహన్, జేడీఏ భాస్కర్రావు, ఏడీఏ లక్ష్మీకుమారి, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య,కాం గ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు మడత వెంకట గౌడ్, దాస్యం ప్రమోద్కుమార్, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.