బయ్యారం: పేకాట కేంద్రాలపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై అనిల్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,