ఏయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు
Published Tue, Oct 4 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
ఏలూరు సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యకేంద్రం ద్వారా బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు చేస్తోన్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తులు ఈనెల5, 6, 7 తేదీల్లో స్వీకరిస్తామని సీఆర్ఆర్ అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ ఎన్.వీర్రాజు చౌదరి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎల్.నాగేశ్వరరావు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. నిరే్ధశించిన రోజుల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సీఆర్ఆర్ క్యాంపస్లోని ఏయూ దూరవిద్య స్టడీసెంటర్లో అభ్యర్థులు తమ పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాలని కోరారు. వివరాలకు 08812–251645లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement