degree
-
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ల సమ్మేళనంగా ఉండే బీటెక్లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
సబ్జెక్ట్తో పనిలేకుండా డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులో అయినా చేరొచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది. డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు. ‘‘ లెవల్ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు. డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్ నుంచి 50 శాతం క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్ చెప్పారు. -
మూడేళ్లకు ముందుగానే ‘డిగ్రీ’
సాక్షి, అమరావతి: ఇక నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలు ఉంటే రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించి నాలుగేళ్లలో ముగించవచ్చు. ఈ మేరకు సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సామర్థ్యం కలిగిన విద్యార్థులు వేగంగా చదువును పూర్తి చేసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక విద్యార్థి కోర్సు వ్యవధిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మూడేళ్ల డిగ్రీని రెండు లేదా రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేయవచ్చు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ డిగ్రీ విద్యలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.సమయం.. ఆర్థిక వనరులు ఆదా!నూతన జాతీయ విద్యావిధానం–2020తో దేశ ఉన్నత విద్యలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సామర్థ్యం కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్స్ను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ యాక్సిలరేటెడ్, స్లో–పేస్డ్ డిగ్రీలపై సిఫార్సులు చేసింది. దీనికి యూజీసీ సైతం ఆమోదం తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందుగానే విద్యార్థి తన డిగ్రీ చదువును ముగించడం ద్వారా త్వరగా వర్క్ ఫోర్స్లోకి, ఉన్నత విద్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సమయంతోపాటు ఆర్థిక వనరులను ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో సమతుల్యం చేసుకోవడానికి కూడా ఈ విధానం సహాయపడుతుందని యూజీసీ భావిస్తోంది.విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తల ఆందోళన యూజీసీ ఇప్పటికే డిగ్రీ విద్యలో నిష్క్రమణ ఎంపికలను ప్రవేశపెట్టింది. ఈసారి విద్యాపరమైన సవాళ్ల ఆధారంగా విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించాలనుకునే వారికి అవకాశం ఇస్తోంది. ఇది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ జీవిత బాధ్యతలను సమతుల్యం చేసుకోవాడానికి అనువుగా ఉంటుందని భావిస్తోంది. అయితే డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఇప్పటికే కోర్ కంటెంట్ తగ్గిపోతుందని, ఇలాంటి చర్యలతో విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీసిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్న క్రమంలో కోర్సు కాల వ్యవధిని తగ్గించడం అంటే విద్య నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్..
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఎం, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ) అమల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా వాటి పేర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై ఆయా కోర్సులను అమెరికాలో పిలుస్తున్న తరహాలో బీఎస్, ఎంఎస్గా పిలవనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. దేశంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకే ఇలా పేర్లు మార్చనున్నారు. విస్తృత కసరత్తు అనంతరం.. సంప్రదాయ కోర్సుల పేర్ల వల్ల కలిగే ఇబ్బందులపై జాతీయ నూతన విద్యా విధానం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. క్రెడిట్ విధానం అమలు చేయాలని సూచించిన ఈ విధానం.. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానం భారత్లోనూ ఉండాలని కేంద్రానికి సూచించింది. ఈ సూచనల మేరకు గతేడాది యూజీసీ నిపుణులతో ఓ కమిటీని నియమించింది.అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు అక్కడ గుర్తించే డిగ్రీలకన్నా భిన్నంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లు మార్చాలని ప్రతిపాదించింది. స్పెషలైజేషన్ చేసే విద్యార్థులకు దీనివల్ల అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. యూజీసీ సూచనలు ఇలా.. » దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీల కొత్త విధానంపై యూజీసీ లేఖ రాసింది. ఇప్పటివరకు దేశంలో మూడేళ్ల కాలపరిమితి డిగ్రీ కోర్సులున్నాయి. వాటి స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వాటి కాలపరిమితి నాలుగేళ్లు. సంబంధిత సబ్జెక్టులో లోతుగా అధ్యయనం చేసేలా కోర్సును నిర్వహించడం ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. » ఉదాహరణకు బీకాం ఆనర్స్ అనే కోర్సులో సాధారణ కోర్సుతోపాటు నిపుణులు, వివిధ వర్గాల అనుభవజ్ఞులతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలా కోర్సును రూపొందిస్తారు. మన రాష్ట్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో బీఏ, బీకాం ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. » ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని కోర్సులూ అమల్లోకి వచ్చాయి. ఇష్టమైన సబ్జెక్టును ఆన్లైన్ ద్వారా ఏ దేశంలోని వర్సిటీ నుంచైనా చేసే వీలు కల్పి0చారు. ఇలా ప్రపంచ స్థాయిలో విద్యావిధానం ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో బీఏ, బీకాంలను బీఎస్, ఎంఎస్లుగా మార్చాలని యూజీసీ భావిస్తోంది. » రాష్ట్రంలోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని కోర్సుల్లో మార్పులు చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను ఎంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణణకు ఒక విద్యార్థి చరిత్ర, భౌతిక శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే విధానం తీసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ డిగ్రీని స్పెషలేషన్ సబ్జెక్టులుగా పేర్కొనాల్సి వస్తోంది. కాబట్టి బీఎస్, ఎంఎస్ వంటి పేర్లు మార్చడం వల్ల అన్ని దేశాల్లో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. -
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.ఎయిర్ కండీషనర్లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?ఏసీ రిమోట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూనివర్సిటీల (ఉస్మానియా, మహాత్మాగాం«దీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన)తోపాటు మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ, డీఫార్మసీ కోర్సుల్లో ఫస్టియర్ ప్రవేశాలను దోస్త్ ద్వారా నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్ కన్వినర్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. అడ్మిషన్లకు సంబ ధించిన వివరాలు వెల్లడించారు. ఇంటర్లో విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఎస్కే మహమూద్ అలీ, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ తేదీలు ఇలా... మొదటి విడత ఈ నెల 6 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈ నెల 25 వరకు దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 మధ్య కాలేజీల ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తొలివిడత సీటు అలాట్మెంట్ జూన్ 3న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. రెండో విడత.. జూన్ 4 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే జూన్ 4 నుంచి 14 వరకు కాలేజీల వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్ 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. రెండో విడత సీటు అలాట్మెంట్ జూన్ 18న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ పూర్తి చేయాలి. మూడో విడత.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి మొదలవుతుంది. రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు చాన్స్ ఇస్తారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్ 25న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మూడో విడత సీటు అలాట్మెంట్ జూన్ 29న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 29 నుంచి జూలై 3లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ పూర్తి చేయాలి. ∗ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 29 నుంచి జూలై 5లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ∗ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూలై 1 నుంచి 6 వరకు ఓరియెంటేషన్ తరగతులుంటాయి. ∗ ఫస్టియర్ సెమిస్టర్ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
‘డిగ్రీ’లో క్రీడా రిజర్వేషన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిగ్రీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధన కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏటా 9 వేల మంది క్రీడాకారులు నష్టపోతున్నారని క్రీడారంగ నిపుణులు చెపుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.68 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఉన్నత విద్యామండలి అమలు చేస్తున్న ‘దోస్త్’ప్రవేశాల విధానంలో మాత్రం క్రీడాకారులకు కనీసం ఒక్క సీటూ కేటాయించలేదు. అసలు ఆ కాలమే ఎత్తివేయడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యమేనా..? దోస్త్లో దివ్యాంగులు, ఎన్సీసీ నేపథ్యం ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలూ నిర్వహిస్తున్నారు. అయితే క్రీడాకారుల విషయానికొచ్చే సరికి మాత్రం ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడం వల్లే దోస్త్లో స్పోర్ట్స్ కోటా పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, క్రీడారంగ విద్యార్థులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల అసోసియేషన్లు కూడా ఉన్నత విద్యామండలికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాయని, అయినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. అన్నివిభాగాలతో పాటు క్రీడాకారులకూ 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా జీవో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని చెబుతున్నారు. న్యాయం జరిగేనా..? డిగ్రీ కోర్సుల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏటా తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి సీఎం కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. డిగ్రీలో క్రీడాకారుల కోటా అమలుకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారుల వాదన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. త్వరలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
‘ప్రభుత్వ డిగ్రీ’తో ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ‘ప్లేస్మెంట్ల’లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్–ప్రొఫెషనల్ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. మార్కెట్ ఓరియెంటెడ్ నైపుణ్యం దేశంలోనే నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యారి్థనిని ‘జాబ్ రెడీనెస్’ ఓరియెంటేషన్తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రొసెసింగ్, ఎల్రక్టానిక్స్, టూరిజం–హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్íÙప్, గ్రీన్జాబ్స్, రిటైల్ సెక్టార్ వంటి రంగాల్లో మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్ను, యాప్ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రిసోర్స్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్ సెల్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్ ట్యూటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో.. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్గ్రూప్, రిటైల్ విభాగంలో ఫ్లిప్కార్ట్, డీమార్ట్, ఈ–కామ్ ఎక్స్ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, స్టార్టెక్ హెల్త్తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్ప్లస్, బ్యాంకింగ్లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బియం, హెచ్1హెచ్ఆర్తో పాటు ట్రాన్స్పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్స్ట్రీట్ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటే ఉద్యోగం.. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎనలిటికల్ థింకింగ్ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. – పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య -
అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్ఘాట్కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
పీజీ ఇంకా ఈజీ
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏడాదిలోనే పూర్తి ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్ విధానం అమలు చేయబోతున్నారు. ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్ వరకు ఒక గ్రేడ్, ప్లస్ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్కు ఇంకో గ్రేడ్ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్ స్కిల్ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లోనూ అవకాశం ఏడాది పీజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్షిప్ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్క్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి. -
25 ఏళ్లుగా ఎంట్రన్స్లో ఫెయిల్.. 55వ ఏట ఎంఎస్స్సీ పట్టా!
‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన రాజ్కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్కరణ్ ఎట్టకేలకు ఎంఎస్సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రాజ్కరణ్ తన సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్కరణ్కు గణితంలో ఎంఎస్సీ చేయాలనే ఆలోచన వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్పూర్)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. ఎట్టకేలకు 2020లో ఎంఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్సీ ఫైనల్ను పూర్తి చేశాడు. రాజ్కరణ్ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ కరణ్ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్కరణ్కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్ కరణ్ తెలిపాడు. ఫెయిల్యూర్తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్ కరణ్ సలహా ఇస్తుంటాడు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
ఇక ‘సింగిల్ స్పెషల్ డిగ్రీ’
అనంతపురం: విద్యా ప్రమాణాల పెంపునకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజాగా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో సింగిల్ సబ్జెక్టు మేజర్గా నూతన విద్యా ప్రణాళిక(కర్రిక్యులమ్)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ యూజీలో మూడు సబ్జెక్టుల ప్రధాన కాంబినేషన్తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై మేజర్ సబ్జెక్టు ఒక్కటే ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. 2023–24 విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ మొదటి సంవత్సరం 1, 2 సెమిస్టర్లలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో బీఎస్సీ ఎంపీసీలో మూడు సబ్జెక్టుల కాంబినేషన్ ఉండగా, వాటి స్థానంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టును మేజర్గా ఎంపిక చేసుకుని డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చు. రెండో సెమిస్టర్లో దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒక దానితో పీజీ విద్యను పూర్తి చేసేలా సమూల మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన విద్యా ప్రణాళికను మార్పు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు నూతన సిలబస్కు రూపకల్పన చేశారు. డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్టులో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా ఈ విద్యాప్రణాళిక ఉండడం గమనార్హం. త్వరలో ఈ నూతన సిలబస్ను అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేయనున్నారు. బీఎస్సీ, బీఏ, బీకామ్లో అమలు: డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలనే నిబంధన పెట్టారు. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటా సైన్స్ , మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే తొలి దఫా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కొత్త విధానంపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించి అడ్మిషన్ కల్పించారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి: ఇప్పటి వరకూ మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయ్యేది. నూతన జాతీయ విద్యావిధానం–2020 అమలులో భాగంగా దేశంలో తొలిసారిగా విద్యా సంస్కరణలను ఏపీలోనే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని అందుబాటులోకి తీసుకువచ్చారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం డిగ్రీని రెండు విధాలుగా విభజించారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించిన వారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా నేరుగా పీహెచ్డీకి అర్హత సాధిస్తారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సుగా పరిగణిస్తారు. ఇది పూర్తి చేసిన వారు పీజీలో రెండో ఏడాదిలో చేరవచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆనర్స్ కోర్సుల అమలుకు గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తున్నారు. సింగిల్ సబ్జెక్టుపై ప్రధాన దృష్టి రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే సింగిల్ సబ్జెక్టు స్పెషల్ డిగ్రీ విధానం అమల్లోకి వచ్చింది. ఒక సబ్జెక్టుపై పూర్తి స్థాయి పట్టు సాధించడంతో పాటు, ఇతర సబ్జెక్టుల్లోనూ అవగాహన పెంపొందేలా నూతన విద్యా ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నూతన విద్యా ప్రణాళికను ఉన్నత విద్యా మండలి పూర్తి చేసింది. ఈ అంశాలను బోర్డ్ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశంలో ఆమోదించారు. త్వరలో అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత కొత్త సిలబస్ అమల్లోకి వస్తుంది. – ప్రొఫెసర్ కె.రాంగోపాల్,సీడీసీ డీన్, ఎస్కేయూ -
నాలుగేళ్లలోనే డిగ్రీ+బీఈడీ
సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు.. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
ప్రధాని మోదీ డిగ్రీ పట్టా వివాదం.. జర్నలిస్టు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ పట్టాపై రాజకీయ వివాదం గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. మోదీ ఎడ్యూకేషన్ వివరాలపై కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు తెరదించుతూ ప్రముఖ జర్నలిస్టు శీలా భట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోదీని 1981లో కలుకున్నట్లు శీలా భట్ చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా చదువులపై దృష్టి కేంద్రీకరించిన, క్రమశిక్షణ కలిగిన శిష్యుడిగా ఉండేవాడని తెలిపారు. అప్పుడు మోదీ ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఎన్ఐకి చెందిన ఎడిటర్ స్మితా ప్రకాశ్ నిర్వహించిన ఓ ఇంటర్వూలో ఆమె తెలిపారు. ప్రధాని మోదీకి మెంటర్గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రవీణ్ సేత్.. తనకూ కూడా మెంటర్గా పనిచేశారని జర్నలిస్టు శీలా భట్ తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చదువుకున్న ఓ అభ్యర్థి తనకు ఇంకా గుర్తున్నట్లు శీలా భట్ తెలిపారు. ప్రధానితో పాటు చదువుకున్న ఆయన క్లాస్మెట్.. లాయర్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నిరక్షరాస్యుడని అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ.. నిజానిజాలను తెలపాలని ఆ లాయర్ను కోరినట్లు శీలా భట్ చెప్పారు. కానీ ఆ లాయర్ స్పందించలేదని తెలిపారు. “I met Modi in 1981 when he was doing his MA,” Veteran Journo Sheela Bhatt recalls PM’s student days#Modi #ANIPodcastWithSmitaPrakash #SheelaBhatt Watch the full episode here: https://t.co/IMz0tvhuNX pic.twitter.com/6icGf2O6yz — ANI (@ANI) July 13, 2023 ప్రధాని ఎడ్యూకేషన్ వివరాలపై గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వివరాలను రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేశారు. 2016లో ప్రధాని ఎంఏ డిగ్రీ వివరాలు సమర్పించాలని గుజరాత్ యూనివర్శిటీని ప్రధాన సమాచార కమిషనర్ కోరారు. ఈ అంశంలో గుజరాత్ హైకోర్టు.. కమిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ప్రజలకు చాలా ప్రశ్నలను మిగిల్చిందని అన్నారు. నవీన భారతంలో పారదర్శకతకు కూడా పరిమితులు ఉన్నాయని.. ఇదే పొలిటికల్ సైన్స్ బోధిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రధాని డిగ్రీ సమాచారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని గత నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ప్రధాని డిగ్రీ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్శిటీ పేర్కొంది. అలాంటిదేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
AP: నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా..
సాక్షి, అమరావతి: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా : ఇంటర్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచి్ఛక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. - ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023 - డేటా కరెక్షన్కు చివరి తేదీ 20.7.2023 - పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు - హాల్ టికెట్ల డౌన్లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు - దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: www.nta.ac.in, https://neet. samarth.ac.in/ ఇది కూడా చదవండి: గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్ -
లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి. ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్స్ విధానం ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. బోధనలోనూ మార్పులు.. ళీయూజీ ఆనర్స్ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు. లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆనర్స్ వైపే అందరిచూపు.. విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. – ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి -
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
నేను ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న
-
డిగ్రీకి డిమాండ్ పెరిగేనా?
విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు. మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్తో సమానమైన కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది. ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ను ఆనర్స్ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. - సాక్షి , హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు. కారణాలేంటి? ♦ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ♦ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. ♦ డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అకౌంటింగ్తోపాటు, కంప్యూటర్ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్ను ఎంచుకున్నారు. ♦ లైఫ్ సైన్స్కూ ఓ మోస్తరు డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ సెక్టార్లో ఉపాధికి అవకాశాలున్నాయని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శాతం మంది లైఫ్ సైన్స్ను ఎంచుకుంటున్నారు. తర్వాత స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులున్నాయి. డిమాండ్ పెరగొచ్చు ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక
-
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్
సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్గా కొత్త కరిక్యులమ్ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కరిక్యులమ్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్ను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ, బీఏ, బీకామ్లో అమలు డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్లో కొత్త కరిక్యులమ్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం ఆనర్స్ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్ కోర్సులను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్షిప్ నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. 2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు. ఆర్–సెట్ను తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆక్షేపించారు. -
ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!
భారత్లోని విద్యా విధానం, డిగ్రీలు గురించి అమెరికాలోని బ్లూమ్బెర్గ్ చెందిన ఓ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ సర్వే చేసింది. తన అధ్యయనం ప్రకారం భారత్లో దాదాపు రూ.900 కోట్లు విద్యారంగంపై ఖర్చుపెడుతోందని, వేగంగా కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. అయినప్పటికీ యువత ఎలాంటి నెపుణ్యాలు లేని గ్యాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలిపింది. ఇదే భారత ప్రధాన ఆర్ధిక వ్యవస్థను కుంటిపరుస్తోందని చెప్పింది. ఉద్యోగం వస్తుదనే ఆశతో రెండు, మూడు డిగ్రీలు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు కుప్పలు తెప్పలుగు పుట్టుకొస్తున్న ప్లేస్మెంట్లు ఇచ్చే ఇన్స్టిట్యూట్ల వైపు ఆకర్షితులై వేలకు వేలు డబ్బు వెచ్చించి..చివరి ఉద్యోగాలు లేక నానాపాట్లు పడుతున్నారని పేర్కొంది. అల్ఫాబేట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి వారికి భారత్లోని అత్యున్నత విద్యా సంస్థల్లో చోటు దక్కకపోవడం అత్యంత విచిత్రం అని కూడా పేర్కొంది. ఇక్కడ టాప్ సంస్థల తోపాటుగా చిన్నప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింది. వాటిల్లో తక్కువ శిక్షణ కూడిన ఉపాధ్యాయులను నియమించుకుని, ఔట్ డేటెడ్ పాఠ్యాంశాలను చెబుతున్నట్లు వెల్లడించింది. అందువల్ల అలాంటి సంస్థల్లో డిగ్రీలు చేసిన ఎలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండకపోవడంతో నిరుద్యోగులు మిగిలిపోతున్నట్లు వీబాక్స్ వెల్లడించింది. కానీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశమని, ఎక్కువ మంది యువకుల ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి ఆర్భాటంగా చెబుతుందని పేర్కొంది. వృద్ధి పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకువెళ్తున్నప్పటకీ ..నిరుద్యోగం 7% కంటే ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. ఇదే దాని ప్రధాన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని కూడా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందని వెల్లడించింది. భారత్లోని విద్యా వ్యవస్థలో పలు లోపాలను ప్రస్తావిస్తూ..విద్యార్థులకు క్లాస్రూమ్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టీకల్ నాలెడ్జ్ లేకుండా చేయడంతో ఉద్యోగాలు రాక పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది. కొన్ని పేరున్న మెడికల్ కాలేజీలు ఆస్పత్రులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చి వారిని ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించింది. అయినప్పటికీ విద్యార్థులు అలాంటి కాలేజీల్లోనే ఏదో రకంగా జాయిన్ అయిపోతున్నారని, డిగ్రీ సంపాదిస్తే చాలు అన్నట్లు ఉంటున్నారని చెప్పుకొచ్చింది. కాగా, ఇలాంటి డిగ్రీలు విలువలేనివని, దీంతో ఏటా మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ డీన్, ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆప్ ఎడ్యకేషన్ మాజీ సభ్యుడు అనిల్ సద్గోపాల్ అన్నారు. అలాగే మానవ వనరుల సంస్థ ఎస్హెచ్ఎల్ చేసిన ఒక అధ్యయనంలో కేవలం 3.8% ఇంజనీర్లు మాత్రమే స్టార్టప్లలో సాఫ్ట్వేర్ సంబంధిత ఉద్యోగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని గుర్తించింది. అంతేగాదు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్దాస్ పాయ్ మాట్లాడుతూ..ఐటి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే గ్రాడ్యుయేట్లకు ముందు శిక్షణ అవసరం. చాలామంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారందరికీ ఉద్యోగం చేసే నేపుణ్యాలు లేవన్నారు. అందువల్లే ఏటా నిరుద్యోగుల ఎక్కువ అవుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమైని అన్నారు. ఉద్యోగాలు లేక నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు ఇండియా బ్రాండ్ ఈక్వీటీ ఫౌండేషన్ ప్రకారం భారత్లో విద్యా పరిశ్రమ అధ్యయనం ప్రయకారం భారత్లో 2025 నాటికి విద్యారంగం కోసం దాదాపు రూ. 1800 కోట్లు కేటాయిస్తుందని అంచనా. ఇది యూఎస్లోని విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువే. భారత్లో విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 2.9% వద్దే నిలిచిపోయిందని, ఇది ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువే అని ఈక్వీటి ఫౌండేషన్ వెల్లడించింది. (చదవండి: వేరొకరి ఇంటి డోర్బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..) -
Telangana: అఫిలియేషన్లు లేకున్నా... అడ్మిషన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు పూర్తవ్వడంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను ముమ్మరం చేశాయి. నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉన్నా, దీన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏకంగా బ్రిడ్జ్, క్రాష్ కోర్సులంటూ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి మాత్రమే అన్ని కాలేజీలూ ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చింది. ఈలోపు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మండువేసవిలో తరగతులు నిర్వహిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు కాలేజీలు ఈసారి ఫీజులు భారీగా పెంచాయి. ఐఐటీ, నీట్, ఇంటెన్సివ్ కోర్సులంటూ విభాగాల వారీగా ధరలు నిర్ణయించాయి. ఓ కార్పొరేట్ కాలేజీ గత ఏడాది సంవత్సరానికి రూ.1.25 లక్షలు తీసుకోగా, ఈసారి రూ.1.75 లక్షలు డిమాండ్ చేస్తోంది. జేఈఈ కోచింగ్తో కలిపితే రూ. 2.25 లక్షలు చెబుతోంది. సాధారణ కాలేజీలు కూడా ఏడాదికి రూ.75 వేల నుంచి రూ. 1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా 20 శాతం పెంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ కోసం ఏటా రూ.1.25 లక్షలు అడుగుతున్నారు. మొత్తం మీద ఇంటర్ పూర్తయ్యే వరకూ రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గుర్తింపు ఇవ్వకుండానే...? రాష్ట్రవ్యాప్తంగా 3,111 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలు తీసివేస్తే దాదాపు 1,516 ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీలు అన్నీ పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇస్తారు. గత ఏడాది 416 కాలేజీలకు పరీక్ష ఫీజు గడువు ప్రకటించే వరకూ గుర్తింపు ఇవ్వలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయని, అగ్రిప్రమాదాలను నివారించే వ్యవస్థ లేదనే అభ్యంతరాలున్నాయి. దీంతో లక్ష మంది విద్యార్థులు ఫీజు కట్టేందుకు ఆఖరి క్షణం వరకూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది మూడేళ్ల కాలపరిమితితో అఫ్లియేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలు ఇంకా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. టెన్త్ ఫలితాలొచ్చేలోగా గుర్తింపు పూర్తి: నవీన్ మిత్తల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాతే బోర్డ్ నిర్దేశించిన మేరకు ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టినా, క్లాసులు నిర్వహించినా చర్యలుంటాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆ తర్వాత అఫ్లియేషన్ ఇవ్వం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యార్థులను కాలేజీల్లో చేర్చాలని కోరుతున్నాం. ఉల్లంఘనులపై చర్యలుండాలి: మాచర్ల రామకృష్ణగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్) గుర్తింపు రాకుండా ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అధికారులు ఇలాంటి కాలేజీలపై దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టెన్త్ ఫలితాలు రాకుండా ఇంటర్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. -
డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అందులోనూ సైన్స్ కోర్సులపట్ల యువతులు మక్కువ చూపుతున్నారు. 2022–23 విద్యా ఏడాదికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అబ్బాయిలతో పోల్చినప్పుడు అమ్మాయిల సంఖ్య 8,710 ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2022–23లో 4.60 లక్షల సీట్లు ఉండగా అందులో ‘దోస్త్’ ద్వారా 2,10,970 సీట్లు భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్లలో 1,01,130 మంది (47.94%) అబ్బాయిలు వివిధ కోర్సుల్లో చేరితే 1,09,840 మంది (52.06%) అమ్మాయిలు పలు డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు పొందారు. ఈ వివరాలను ఉన్నత విద్యామండలి సోమవారం వెల్లడించింది. ఉపాధి వైపు అబ్బాయిలు.. : కొన్నాళ్లుగా విద్యారంగంలో ట్రెండ్ పూర్తిగా మారిందని విద్యావేత్తలు చెబుతున్నారు. కరోనా తర్వాత బాలురు ఎక్కువగా డిగ్రీ తర్వాత ఉపాధి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇంజనీరింగ్లో 80 వేలకుపైగా సీట్లు భర్తీ అవగా అందులో 50%పైగా అబ్బాయిలే ఉంటున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ తక్షణ ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులనే అబ్బాయిలు ఎంచుకుంటున్నారు. బీఏలో 18 వేల మంది అబ్బాయిలు చేరగా, బీకాంలో వారిసంఖ్య 48 వేలకుపైగా ఉంది. కరోనా తర్వాత కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడం, డిగ్రీ తర్వాత కుటుంబ బాధ్యతల్లో బాలుర పాత్ర పెరగడమే దీనికి కారణ మని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ అధ్యయనంలోనూ వెల్లడైంది. సైన్స్ వైపు బాలికలు ‘దోస్త్’ ప్రవేశాల గణాంకాల ప్రకారం బాలికలు ఎక్కువగా సైన్స్ కోర్సులనే ఎంచుకున్నారు. బీకాంలో బాలురతో పోటీపడ్డారు. బీఎస్సీ లైఫ్ సైన్స్లో బాలుర ప్రవేశాల సంఖ్య 10 వేలకుపైగా ఉంటే బాలికల ప్రవేశాలు 33 వేలకుపైగా ఉన్నాయి. బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో బాలురు 14 వేలకుపైగా ఉంటే బాలికలు 17 వేలకుపైగా ఉన్నా యి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలికల్లో 70% మంది ఉపాధి వైపు వెళ్తున్నా రని సర్వేలు పేర్కొంటున్నా యి. డిగ్రీలో చేరే బాలికలు మాత్రం ఉన్నతవిద్య వైపు వెళ్తున్నారు. ఉన్నత చదువుల వైపే బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని, ఇది మంచి పరిణామమేనని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యపై అవగాహన పెరిగింది.. ప్రతి కుటుంబంలోనూ అమ్మాయిలను ఉన్నత విద్యవైపు నడిపించాలనే అవగాహన పెరగడం వల్లే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాల, ఇంటర్ స్థాయి నుంచే బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు అందుబాటులో ఉండటం కూడా వారిని ఉన్నత విద్యవైపు మళ్లేలా చేస్తున్నాయి. – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా?
నరేంద్ర మోదీ విద్యార్హతల విషయం పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మంత్రుల పట్టాల గురించి ప్రశ్నించడం సరికాదన్నారు. ఒక నాయకుడు తన హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టిసారించాలని గానీ ఇలాంటివి కావని మండిపడ్డారు. ఈ మేరకు పవార్ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత గురించి మాట్లాడుతూ..2014లో ప్రజలు ప్రధాని మోదీ డిగ్రీ చూసే ఓట్లు వేశారా అని నిలదీశారు. అందుకు ఆయన సృష్టించిన చరిష్మానే దోహదపడింది. అదే ఆయన్ను ఎన్నకల్లో గెలిచేలే చేసింది. తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి డిగ్రీ గురించి అడగడం అంత సరైంది కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై అతనని ప్రశ్నించాలి గానీ మంత్రి డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు. ఒకవేళ ఆయన డిగ్రీపై క్లారిటీ వస్తే గనుక ద్రవ్యోల్బణం తగ్గుతుందా? లేక అతన డిగ్రీ పరిస్థితులను చూసి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. అయినా ఈ విషయం కోర్టు వరకు వెళ్లడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని పవార్ అన్నారు. కాగా, గత వారమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మోదీ డిగ్రీ గురించి ప్రజలకు తెలియాలంటూ కేంద్ర సమాచార కమిషన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందిదే. అయితే గుజరాత్ హైకోర్టు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను అందించాల్సిన అవసరం లేదని తీర్పు ఇస్తూ..అరవింద్ కేజ్రీవాలాకు జరిమానా విధించింది. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
ప్రధాని ఎంత చదువుకున్నారో ప్రజలు తెలుసుకోవద్దా? కేజ్రీవాల్ కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలిజేయాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంటూ.. కేజ్రీవాల్కు రూ. 25,000 జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో.. తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి (ప్రజలకు) లేదా అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. డిగ్రీ చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి..? అసలేం జరుగుతోంది. నిరక్షరాస్యుడు, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్కు జరిమానా क्या देश को ये जानने का भी अधिकार नहीं है कि उनके PM कितना पढ़े हैं? कोर्ट में इन्होंने डिग्री दिखाए जाने का ज़बरदस्त विरोध किया। क्यों? और उनकी डिग्री देखने की माँग करने वालों पर जुर्माना लगा दिया जायेगा? ये क्या हो रहा है? अनपढ़ या कम पढ़े लिखे PM देश के लिए बेहद ख़तरनाक हैं https://t.co/FtSru6rddI — Arvind Kejriwal (@ArvindKejriwal) March 31, 2023 -
మహాత్మాగాంధీ డిగ్రీ కూడా చేయలేదు! గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకుడు మహాత్మాగాందీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిన్హా గాల్వియర్లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..డిగ్రీ పోందడం విద్య కాదని చెబుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదని, ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని చెప్పారు. గాంధీజీ చదువుకోలేదని ఎవరూ అనరు. అలా చెప్పరు కూడా. కానీ ఆయన కేవలం హైస్పూల్ డిప్లొమాలో మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. అయితే చాలామంది ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాడనుకుంటారు కానీ ఆయన లా చేసేందుకు అర్హత సాధించాడే తప్ప డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంత చదువుకున్నాడంటే దేశానికి జాతిపిత అయ్యేంతగా జ్ఞానాన్ని సముపార్జించాడు. డిగ్రీలు చేశామనే దర్పంలో మునిగిపోకండి. డిగ్రీ పొందడం చదువు కాదు. అలాగే మార్క్ట్వైన్ అనే కలం గురించి వినే ఉంటారు. ఆ కలంతో పుస్తకాలు రచించిన శామ్యూల్ లాంఘోర్న్ క్లెమెన్స్కు కూడా పెద్దగా చదుదుకోలేదు. కానీ అతను 12 ఏళ్ల వయసులోనే పాఠశాలను విడిచిపెట్టి పబ్లిక్ లైబ్రరీలలో చదువుకున్నాడన్నారు. కేవలం డిగ్రీలు చేస్తే అది విద్య కాదని తన ఎదుగదలకు, దేశ భవితవ్యానికి ఉపయోగపడేదే నిజమైన విద్య అని చ్పెపారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP — Ashok Swain (@ashoswai) March 24, 2023 (చదవండి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత) -
ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈసారి మేలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా దాని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆదేశాలు జారీ అయి రెండు నెలలైనా ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభం కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జాప్యాన్ని నివారించాలనుకుంటున్నా.. ఏటా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ విద్యాసంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ జరుగుతుండటంతో గుర్తింపు రాకుండానే చాలా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనలు పాటించనందుకు ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నప్పటికీ అప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది విద్యాశాఖకు తలనొప్పిగా మారుతోంది. దీన్ని నివారించేందుకే ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసేలోగా గుర్తింపు పక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలు.. రాష్ట్రంలోని 1,856 ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో దాదాపు 400 కాలేజీలు ఇరుకైన ప్రదేశాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకున్నా ఆయా బోధన సాగిస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస మౌలిక వసతుల్లేవు. దీనిపై ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా నోటీసులిస్తున్నా యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే ఆయా యాజమాన్యాలు తాము నడిపే కాలేజీల ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే గుర్తింపు ప్రక్రియ సాధ్యం కానుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్, మే నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ముందే అనుబంధ గుర్తింపు ఎలా ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుర్తింపు అనుకున్నట్టు పూర్తవ్వడం కష్టమేనని బోర్డు వర్గాలు అంటున్నాయి. డిగ్రీ సీట్లపై స్పష్టత ఏది? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4.6 లక్షల సీట్లున్నాయి. వాటిల్లో ఏటా భర్తీ అవుతున్నవి సుమారు 2.25 లక్షల సీట్లే. సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని కోర్సుల్లో జీరో ప్రవేశాలుంటున్నాయి. వాటిని రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ఏటా చెప్పడమే తప్ప కార్యాచరణకు దిగడం లేదు. ఈ ఏడాది దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేయగా వచ్చే ఏడాది ఇలాంటి సమస్య రాకుండా కాలేజీలే అవసరం లేని సీట్లను వదులుకోవాలనే అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా విభిన్న కోర్సుల సమ్మేళనంతో డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్ట్స్ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుచేసే అవకాశం ఇస్తామంటున్నారు. ఇది జరగాలంటే ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవాలి. వచ్చే మే నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. కానీ ప్రైవేటు కాలేజీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు కోర్సులను మార్చుకోవడం, అందుకు తగ్గ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నాయి. వర్సిటీలను అప్రమత్తం చేశాం మార్పులను స్వాగతించేలా ప్రైవేటు కాలేజీలకు నచ్చజెప్పి వారి భాగస్వామ్యాన్ని పెంచుతాం. ఈ దిశగా అన్ని వర్సిటీలను అప్రమత్తం చే స్తాం. విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులనే తీసుకోవడం కాలేజీలకు మంచిది. డిమాండ్ లేకుండా అనుమతులివ్వడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘బకెట్’విధానాన్ని తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో గురువారం మండలి కార్యాలయంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్సహా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశ వివరాలను లింబాద్రి మీడియాకు వివరించారు. నచ్చిన కోర్సు... ♦ ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులు మూస విధానంలో ఉండేవి. బీఏ హెచ్పీపీ తీసుకుంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చదవాలి. అయితే కొత్త విధానంలో ఏ, బీ, సీ, డీ బకెట్లుగా సబ్జెక్టులను విడగొడతారు. వీటిల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఎ గ్రూపులో అరబిక్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, లిటరేచర్ ఇలా కొన్ని సబ్జెక్టులుంటాయి. బి గ్రూప్లో ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, సాహిత్యం, ట్రావెల్ టూరిజం వంటి కొన్ని కోర్సులుంటాయి. ఇలా సి, డీ గ్రూపుల్లోనూ కొన్ని కోర్సులుంటాయి. విద్యార్థులు ఏవేని మూడు బకెట్స్ నుంచి ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ♦ డిగ్రీలో క్రెడిట్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ప్రతీ దాన్ని క్రెడిట్ విధానంలో కొలుస్తారు. బకెట్ విధానం వల్ల బీఏ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు, సాహిత్యం, మరే ఇతర కోర్సు అయినా చేయవచ్చు. ♦ ఈ విధానం క్షేత్రస్థాయిలో అన్ని కాలేజీల్లో ఎలా అమలు చేయాలనే దానిపై మండలి ఓ కమిటీని నియమించి, దాని సూచనల మేరకు మార్పులు చేస్తుంది. విభిన్న సబ్జెక్టులతో డిగ్రీ చేసిన విద్యార్థికి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వచ్చే వీలుంది. మరికొన్ని మార్పులు ♦ విద్యార్థి కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా దేశ, విదేశాల్లో ఎక్కడైనా ఒక కోర్సు చేసే వీలుంది. దానికి సంబంధిత సంస్థలే పరీక్షలు నిర్వహిస్తాయి. క్రెడిట్స్ను ఆయా సంస్థలకు బదలాయిస్తాయి. ♦ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోపాటు మరికొన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులను సబ్జెక్టులుగా తీసుకురానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోర్సుల బోధనకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కాలేజీ మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూలై నుంచే డిగ్రీ క్లాసులు మొదలవ్వాలని తీర్మానించారు. ♦ కోవిడ్ మూలంగా చాలామంది విద్యార్థుల్లో అభ్యసన నష్టాలు కన్పిస్తున్నాయి. వీటిని పూడ్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి పక్కా ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నారు. -
ఐదు దశాబ్దాల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న సీఎం.. కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు పట్టాను అందుకుంటారు. ఇది మూమూలు విషయమే కానీ అదే పట్టాను డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్ల తర్వాత అందుకుని వార్తల్లో నిలిచారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన డిగ్రీ పట్టాను అందుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందంటున్నారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన తన గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్శిటిలో ఐదు దశాబ్దాల క్రితమే (1972) పూర్తి చేశారు. అయితే ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నారు ఖట్టర్. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "నేను మఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, రోహ్తక్లో ఉన్న కాలేజీకి వేళ్లాను. కానీ ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లడం మాత్రం కుదరలేదు. అందుకే ఇన్నేళ్లుగా పట్టాను తీసుకోలేకపోయాను. ఈ యూనివర్శిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఇక్కడి నుంచే దేశానికి సేవ చేయాలని స్ఫూర్తి పొందాను" అని సీఎం వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సందేశం ఇస్తూ.. బాల్యంలోనే విద్యార్థులు సరైన దిశను ఎంచుకోవాలని.. భవిష్యత్లో ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని సూచించారు. యువత లక్ష్యాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా ఉండాలని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఆయుధాలను ఎలా తయారు చేయాలో సైన్స్ నేర్పుతుందని, అయితే వాటిని తెలివిగా ఉపయోగించకపోతే వినాశనానికి కారణమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కల్చరల్ కౌన్సిల్ చైర్పర్సన్, పీఆర్ఓ అనూప్ లాథర్ రచించిన “కాల్ ఔర్ తాల్” పుస్తకాన్ని సీఎంకు అందజేశారు. ఈ పుస్తకంలో హర్యాన్వి జానపద సంస్కృతికి సంబంధించిన 150 పాటలు ఉన్నాయి. చదవండి: ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
సేద్య కళ
చదువుకుంటూ పార్ట్టైమ్ జాబ్స్ చేసే యువత గురించి మనకు తెలుసు. అలాగే, చదువుకుంటూనే తమ అభిరుచులకు పదును పెట్టుకునేవారినీ మనం చూస్తుంటాం. అయితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, పెన్న బద్వేల్వాసి అయిన చాట్ల అఖిల మాత్రం హాస్టల్లో ఉండి బయోటెక్నాలజీలో డిగ్రీ చేస్తూనే, ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తనకున్న ఇష్టం వల్ల సేద్యంలో రకరకాల ప్రయోగాలు సొంతంగా చేయగలుగుతున్నాను అని చెబుతున్న అఖిల తన కలనే కాదు కళను కూడా పండిస్తోంది. ‘‘మాది వ్యవసాయ కుటుంబం అవడంతో చిన్నప్పటి నుంచి ఇంటి పనులతో పా టు పొలం పనులు కూడా తెలుసు. అమ్మ పద్మ, నాన్న గురువయ్య. అమ్మానాన్నలకు అన్న, నేను సంతానం. డిగ్రీ మూడవ సంవత్సరం నెల్లూరు టౌన్లోనే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు నేనుగా స్థిరపడాలంటే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించాను. కరోనా కాలంలో రెండేళ్లు ఇంటి వద్దే ఉన్నప్పుడు ఎక్కువ సమయం పొలంలోనే గడిపేదాన్ని. అలా వ్యవసాయంలోని కష్టం, ఇష్టం రెండూ అలవాటయ్యాయి. అయితే, ఊళ్లో వ్యవసాయం చేస్తూ, కాలేజీకి వెళ్లి చదువుకోలేను. ఇంటి వద్దే ఉండి నాకు నచ్చిన రీతిలో వ్యవసాయం చేయాలంటే అందుకు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమనుకున్నాను. ‘చదువుకుంటున్నావు కదా ఎందుకింత కష్టం’ అంటారు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండానే ఎక్కడైనా కొంత భూమి కౌలుకు తీసుకోవాలని వ్యవసాయం చేయాలని, కరోనా టైమ్లోనే తెలిసివారి ద్వారా చాలా వెతికాను. సాగులో లేని భూమి.. నేనున్న హాస్టల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపా డులో ఒక ఎన్ఆర్ఐ భూమి ఉందని తెలిసింది. వారి వివరాలు కనుక్కొని, ఫోన్లో సంప్రదించి, రెండెకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. అది ఏ మాత్రం సాగులో లేని భూమి. అందుకు చాలా కష్టపడాలి. మొదట కష్టమవుతుందేమో అనుకున్నాను. కానీ, ఇష్టమైన పని కావడంతో సాగు చేయాలనే నిశ్చయించుకున్నాను. మట్టితో పిచికారి భూమిని చదును చేయించాను. ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. సాగులో వచ్చే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెదుక్కుంటూ నా ఎఫర్ట్ను పెడుతున్నాను. ఓ వయసుపైబడిన వ్యక్తి ఉంటే, అతనికి అవసరాలకు డబ్బు ఇచ్చి పొలానికి కాపలాకు పెట్టాను. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు ఈ పనికి ఎంచుకున్నాను. ఉదయం ఫార్మ్ దగ్గరకు వెళతాను. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. మొక్కల ఏపుగా పెరగడానికి మట్టి ద్రావకంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. పెన్నానది పక్కన ఉండటంతో అక్కణ్ణుంచి మోటార్ ద్వారా నీటి సదుపా యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. తక్కువ పెట్టుబడితో.. ఇప్పుడు పా లకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, స్వీట్కార్న్, వంగ, దోస, సొరకాయ వంటివి సాగుచేస్తున్నాను. ఆకుకూరలు 15 రోజులకొకసారి కోతకు వస్తాయి. వీటన్నింటిని వాతావరణం బట్టి నా పనిలో మార్పులు చేసుకుంటాను. తెలిసినవాళ్లే వాటిని స్వయంగా వచ్చి తీసుకెళుతుంటారు. భూమిని చదును చేయించడానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టాను. అన్ని ఖర్చులు పోను రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. అయితే, ఈ మొత్తాన్ని కూడా భూమిలో సేంద్రీయ పద్ధతులను అమలు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి సరదాగా వర్క్ చేస్తుంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్నానని ఎవరికైనా చెబితే ‘చదువుకుంటున్నావు కదా, ఆడపిల్లవు కదా! ఎందుకంత కష్టం, ఇంకేం పని దొరకలేదా’ అని నవ్వుతున్నారు. అందుకే ఎవరికీ చెప్పడం లేదు. ఇంకొంత భూమి తీసుకుని సాగు చేయాలనేది తర్వాతి ప్లాన్. ‘మా భూమిలో కూడా ఇలా మట్టిని కాపా డుతూ సేద్యం చేయండి..’ అని అడిగేవాళ్లున్నారు. ఏషియన్, మిల్లెట్ ఫార్మింగ్ను పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది’’ అని వివరించింది అఖిల. – నిర్మలారెడ్డి -
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
కొలువులొచ్చేలా ‘పరీక్షలు’.. డిగ్రీ పరీక్షల విధానంపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్షల విధానంపై క్షేత్రస్థాయి అధ్యయనానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సారథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పరిశీలనకు ఉపక్రమించింది. ఐఎస్బీ ప్రతినిధి బృందం సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రితో సమావేశమై అధ్యయన విధివిధానాలపై చర్చించింది. త్వరలోనే అన్ని వర్సిటీల ఉప కులపతులు, అధికారులతో చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు. డిగ్రీలో పరీక్ష విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఐఎస్బీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత వాస్తవ పరి స్థితి, డిగ్రీ పరీక్షల్లో తేవాల్సిన మార్పులపై ఐఎస్బీ నివేదిక సమర్పించనుంది. ఈ పరిశీలన 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. తేడా ఎక్కడ?: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లుండగా అందులో ఏటా సగటున 2 లక్షల మంది చదువుతున్నారు. అయితే డిగ్రీ ఉత్తీర్ణుల్లో కనీసం 10 శాతం మంది కూడా నైపుణ్య ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మొత్తంమీద 40 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యం ఉండటం లేదని, పారిశ్రామిక అవసరాలు, వృత్తి నిపుణులకు మధ్య అంతరం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డిగ్రీ పరీక్ష విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్బీ ఉన్నత విద్యలో పరీక్ష విధానాన్ని పరిశీలించనుంది. అధ్యయనం సాగేది ఇలా... ► తొలి దశలో ఐఎస్బీ సర్వే బృందాలు ఆరు డిగ్రీ కాలేజీలపై అధ్యయనం చేస్తాయి. ► ఇందులో రెండు అటానమస్, రెండు ఎయిడెడ్, ఇంకో రెండు ప్రైవేటు కాలేజీలుంటాయి. ► ప్రతి విభాగంలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలను ఎంచుకుంటాయి. ► ఆ తర్వాత 100 కాలేజీలకు 500 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాలు పంపుతాయి. ► డిగ్రీ తర్వాత ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? విద్యా ర్థులు ఏ తరహా పరీక్ష విధానం ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పరీక్షల తీరును ఎలా అభివృద్ధి చేయాలి? వంటి ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానాలు కోరుతాయి. ► పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాల గురించి కూడా సర్వే బృందాలు తెలుసుకోనున్నాయి. ► ఈ ప్రక్రియ ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తాయి. ఇదో కొత్త ప్రయోగం.. డిగ్రీలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న పరీక్ష విధానం నేటి అవస రాలకు సరిపోవట్లేదు. డిగ్రీ పూర్తి చేసే విద్యార్థిలో సామాజిక నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యలను అధిగమించే శక్తిని గుర్తించాల్సి ఉంది. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు ఉపాధి కల్పించేలా ఉండాలనే ప్రభుత్వ సరికొత్త ప్రయోగానికి అనుగుణంగానే అధ్యయనం మొదలు పెడుతున్నాం. – చంద్రశేఖర్ శ్రీపాద, ఐఎస్బీ ప్రొఫెసర్–మానవ వనరులు నాణ్యత పెరుగుతుంది.. ఇంతకాలం విద్యార్థి జ్ఞాపకశక్తినే మన పరీక్షల విధా నం శోధి స్తోంది. నైపుణ్యం, ఇతర లక్షణాలు వెలికి తీసే పరీక్ష విధానం ఉండాలి. ఇలా పరీక్షించినప్పుడు విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు సాధ్యమవుతాయి. దీంతో ఉన్నత విద్యలో నాణ్యత పెరుగుతుంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా
రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారు చూపించిన తెగువ, ప్రదర్శించిన శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. అచ్చం అలానే ఒక్కడోక బామ్మ నాటి సమయంలోని ఒక ఉక్కు పరిశ్రమను కాపాడి అందరిచే ప్రశంసలు అందుకుంది. పైగా ఆమె నిస్వార్థ కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది యూకే ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే....యూకేకి చెందిన వందేళ్ల వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్కు పరిశ్రమను కూలిపోకుండా కాపాడింది. ఆమె యుక్త వయసులో ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేసినప్పుడూ..పురుషుల కంటే తక్కువ వేతనంతో ఇతర మహిళలతో కలిసి పనిచేసింది. ఆమె 72 గంటల వారాలు విధులు నిర్వర్తించేది. ఆ వృద్ధురాలి పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తనతోపాటు పనిచేసిన వారిలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి ఆ బామ్మ. సంక్షోభం, ఆర్థిక పతనం వంటి విపత్కర సమయాల్లో తన దేశం కోసం అంకితభావంతో పనిచేసింది. కాథ్లీన్ బృందం గనులు, ప్లాంట్లలోని భారీ యంత్రాలు, క్రేన్లను నిర్వహించేవారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్న పట్టించుకోకుండా నిరాటంకంగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎప్పుడూ ఎటు నుంచి వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో హెల్మట్లు ధరించి మరీ విధులు కొనసాగించేవారు. కొన్నాళ్ల తర్వాత విధుల నుంచి తొలగింపబడ్డారు. ఐతే కాథ్లీన్ మౌనంగా ఊరుకోలేదు. ఉక్కుమహిళల వారసత్వాన్ని కాపాడేందుకు ఏడేళ్లు ప్రచారం చేసింది. చివరికి 70 ఏళ్ల తర్వాత ఆమె రచనలు షెఫిల్డ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. క్యాథిలిన్ని ఉక్కు కార్మికురాలిగా, ప్రచారకురాలిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించడంతో ఆమె గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ని అందుకుంది. ఈ మేరకు కాథ్లీన్ మాట్లాడుతూ...తనకు ఈ గౌవర డిగ్రీ ఇవ్వనున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. యుద్ధ ప్రయత్నానికి సహకరించిన ఉక్కుమహిళలందరి తరుఫున ఈ గౌరవ డాక్టరేట్ని తీసుకోవడం సంతోషంగా ఉంది. చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేశారు. "మీరు ప్రతీది పుస్తకం నుంచి నేర్చుకోలేరు. కేవలం అనుభవంతోనే కొన్నింటిని తెలుసుకోగలరు అని అన్నారు. అలాగే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి" అని సూచించారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ
జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం. విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్ చదువులకు నిలయంగా మారింది. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆనర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తోపాటు 10 నెలల ఇంటెర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్ సబ్జెక్టు బీటెక్ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని ఆనర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. 1,075 మందికి ప్లేస్మెంట్ కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్ చేయిస్తారు. నైపుణ్యం సాధించేలా బోధన అమెజాన్ సుపోర్టు ఇంజినీరింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్ బాగుంది. – పి.సాహితి జ్యోత్స్న, సీఎస్ఈ విద్యార్థిని, జేఎన్టీయూ విజయనగరం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా... ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. – ప్రొఫెసర్ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం చక్కని శిక్షణ టీసీఎప్ డిజిటల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను. – ఎం.జాహ్నవి, సీఎస్ఈ, జేఎన్టీయూ, విజయనగరం -
ఆనర్స్ డిగ్రీతో నేరుగా పీహెచ్డీ.. వివరాలు ఇదిగో..
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రోగ్రాముల్లో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై నేరుగా పీహెచ్డీ చేయొచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పిస్తోంది. ఆనర్స్ కోర్సులో నిర్ణీత స్కోరు పాయింట్లు సాధించి ఉంటే నేరుగా పీహెచ్డీ చేయవచ్చు. జాతీయ నూతన విద్యా విధానంలో పీహెచ్డీ ప్రవేశాలకు కొన్ని నూతన అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. వీటిని అనుసరించి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీహెచ్డీలో ప్రవేశానికి విధివిధానాలను యూజీసీ ఖరారు చేసింది. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులో 10 స్కోరు పాయింట్లలో 7.5 పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 0.5 స్కోరు పాయింట్ల మినహాయింపునిచ్చింది. ఆనర్స్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పరిశోధన అంశాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో 7.5 స్కోరు పాయింట్లుకన్నా తక్కువ వచ్చిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన తరువాతే పీహెచ్డీ చేసేందుకు అర్హత ఉంటుంది. సీట్ల భర్తీలోనూ మార్పులు యూనివర్సిటీల్లోని పీహెచ్డీ కోర్సుల సీట్లను భర్తీ చేసే విధానంలోనూ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయా యూనివర్సిటీలే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజా విధానాన్ని అనుసరించి ఇకపై జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా వర్సిటీల్లోని సీట్లను భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయా వర్సిటీలు, రాష్ట్రాలు సొంతంగా భర్తీ చేసుకోవాలంటే 60:40 నిష్పత్తిలో ప్రవేశాలు కల్పించారు. యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు లేదా రాష్ట్రాల కామన్ ప్రవేశ పరీక్షల ద్వారా 40 శాతం సీట్లను భర్తీ చేస్తే మిగతా 60 శాతం సీట్లను జాతీయస్థాయి పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, ఆనర్స్ డిగ్రీలో నిర్ణీత స్కోరు సాధించిన వారు కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే పీహెచ్డీకి ఎంపిక కావాలి. -
East Godavari: డిగ్రీ చదివారా.. అయితే ఇది మీ కోసమే..
రాజమహేంద్రవరం రూరల్(తూర్పుగోదావరి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో 25న జాబ్మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం హుకుంపేటలోని మహిళా మండల సమాఖ్య భవనంలో జరుగుతుందని డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి అన్నారు. రాజమహేంద్రవరంలో ఎంసీవీ మోటో క్రోఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్, బ్రాంచ్, ఏరియా మేనేజర్లుగా పనిచేయడానికి ఎంబీఏ లేదా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. జూనియర్ అక్కౌంటెంట్, ఆడిట్ అక్కౌంటెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన స్త్రీ, పురుషులు కావాలన్నారు. చదవండి: టీచర్ కాదు కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించి.. సీనియర్ అక్కౌంటెంట్ ఇన్ టాక్సేషన్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు, స్త్రీలు అర్హులన్నారు. వివిధ బ్రాంచ్ల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పేర్ ఎగ్జిక్యూటివ్లు, బిల్లింగ్ చేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులకు అవకాశం ఉందన్నారు. రాజానగరం, కడియం, రంపచోడవరం, కోరుకొండలలో రిస్పెప్షనిస్ట్గా పనిచేయడానికి పురుషులు, స్త్రీలు కావాలని ఆమె అన్నారు. ఫ్లోర్ సూపర్వైజర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్లు, టెక్నీషియన్లు, వర్క్ ఇన్చార్జ్, సీనియర్ అడ్వయిజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. రాజమహేంద్రవరం నవత రోడ్ ట్రాన్స్పోర్ట్లో పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు కావాలన్నారు. తడ శ్రీసిటీలో భరత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్లో మొబైల్ అసెంబ్లర్కు పదో తరగతి ఆపై, ఏదైనా బీటెక్ చదివిన స్త్రీలు కావాలన్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, రేషన్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ నకళ్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు 90309 24569, 8919868419 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
డిగ్రీలు లేకుండానే సైంటిస్ట్ కావచ్చు..!
సాక్షి, అమరావతి: అపారమైన ప్రతిభ, అత్యున్నతౖచదువు, విస్తృత పరిశోధనలు చేసిన వారికే వివిధ రంగాల్లో సైంటిస్టులుగా గుర్తింపు ఉండేది. అవేమీ లేకుండా కేవలం ఆసక్తి ఉంటే సైంటిస్టులు కావచ్చని ‘సిటిజన్ సైన్స్’ నిరూపిస్తోంది. పౌరులు ఎవరైనా తమకు ఆసక్తి ఉన్న అంశాల్లో అన్వేషణ, అధ్యయనం, పరిశోధనలు చేయడమే సిటిజన్ సైన్స్. ఎంతోమంది పలు అంశాలపై పరిశోధనలు చేస్తూ సిటిజన్ సైంటిస్టులుగా ఆయా రంగాలకు విస్తృత సమాచారం అందిస్తున్నారు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అంతరిక్షం, పర్యావరణం ఒకటి కాదు ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సిటిజన్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ శాస్త్ర రంగాల్లో కొన్ని వేల సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. నాసా అంతరిక్ష కార్యక్రమంలో ప్రస్తుతం 25 సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులు భాగమయ్యాయి. మేఘాలు, చెట్లు, నీటి వనరుల ఫొటోలు తీయడం, సముద్రం అడుగు భాగంలో ఫొటోలను సేకరించడం, కొత్త గ్రహాల కోసం శోధించడం వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సైన్స్ ప్రాజెక్టులు నిర్వహిస్తోన్న తిరుపతి ఐఐఎస్ఈఆర్ భారత్లో బర్డ్ వాచర్స్ తమ పరిశీలనలను ఈ–బర్డ్ వెబ్సైట్కి 12 ఏళ్లుగా పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా పక్షుల స్థితిని అంచనా వేయడానికి ఈ డేటా ఉపయోగపడుతోంది. కేంద్ర ప్రభుత్వం, అటవీ శాఖ, అనేక ప్రభుత్వ సంస్థలు ఈ డేటాను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సీజన్ వాచ్ ప్రాజెక్టు కొత్తగా ప్రారంభమైంది. అనేకమంది తమ చుట్టూ ఉన్న చెట్లు, పండ్లు, పుష్పాల వివరాలను సీజన్ల వారీగా ఈ ప్రాజెక్టు పోర్టల్కు పంపుతున్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది తమ ఇంటి చుట్టూ ఉన్న జీవవైవిధ్యం, చెట్లు, పక్షుల గురించి సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో ఎంతోమంది టీచర్లు, విద్యార్థులు, ఇతర పౌరులు ఎంతోమంది సిటిజన్ సైంటిస్టులుగా మారారు. తిరుపతి ఐఐఎస్ఈఆర్ జీవ వైవిధ్యానికి సంబంధించిన పలు సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. గతేడాది విజయవాడలో స్వచ్ఛందంగా కొందరు పౌరులు నగర పరిసరాల్లో 170 పక్షి జాతులను రికార్డు చేశారు. ఈ ఏడాది మళ్లీ శీతాకాలపు పక్షుల గణన నిర్వహిస్తోంది. తిరుపతిలో శీతాకాలపు నీటి పక్షుల గణనను ప్రతి ఏటా చేపడుతోంది. ఈ నెలలో ఏపీలోని పాఠశాలలు, కళాశాలల కోసం యంగ్ నేచురలిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే మరో సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. చురుగ్గా పాల్గొనాలి తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనిపై లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. సిటిజన్ సైన్స్ ప్రాజెక్టుల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం, సామర్థ్యం రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. – సుహెల్ ఖాదర్, సైంటిస్ట్, బర్డ్ కౌంట్ ఇండియా, సీజన్ వాచ్ నిర్వహకుడు పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు సిటిజన్ సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. నక్షత్రాలను వీక్షించడం, ప్లానెట్ హంట్, బర్డ్ వాచింగ్ వంటివి మానసిక ఆరోగ్యాన్ని పెంచే హాబీలు. పిల్లలకు క్లాస్రూముల్లో దొరకని విజ్ఞానం ఈ పరిశోధనల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైంటిస్ట్, తిరుపతి ఐఐఎస్ఈఆర్ -
29 నుంచి వన్టైం చాన్స్ డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ పూర్వవిద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ వన్టైం చాన్స్ నాన్సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29నుంచి ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కాలేజీల్లో 1995 నుంచి నేటి వరకు బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే ఈ వన్టైం చాన్స్ పరీక్షలకు నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్ నుంచి లేదా ఓయూక్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి హాల్టికెట్లను పొందవచ్చన్నారు. -
నచ్చిన కాలేజీలోనూ క్లాసులు వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ డిగ్రీలో సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. కొఠారీ కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు క్లస్టర్ విధానానికి ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసింది. ఏదైనా ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థి మరో కాలేజీలో వేరే సబ్జెక్టు క్లాసులకు హాజరయ్యే వెసులు బాటును ఇది కల్పిస్తుంది. దీనిపై కోఠి ఉమెన్స్ కాలేజీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. ఆధునిక విద్యావిధానం కోరు కునే విద్యార్థులకు క్లస్టర్ విధానం చక్కటి అవకాశమని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష (ఆన్లైన్) చదువుకూ వీలుంటుంద న్నారు. తొలి దశలో తొమ్మిది కాలేజీల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజ్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స్, లయోలా, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలో మార్గదర్శకాలు కళాశాలల్లోని ఫ్యాకల్టీ, లేబొరేటరీ, లైబ్రరీ, రీసెర్చ్ తదితర అంశాల్లో ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎక్కడైనా విద్యార్థులు ఒక సబ్జెక్టును చదవచ్చు. దానికి సంబంధించిన పరీక్ష అదే కాలేజీలో నిర్వహించి, మార్కులు మాతృ కాలేజీకి పంపుతారు. తొమ్మిది కాలేజీల్లో ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానం, అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ ఉమ్మడి ఎజెండాకు అనుగుణంగా తొమ్మిది కాలేజీలు అవగాహన ఒప్పందానికి వస్తాయని, పరస్పర సమన్వయంతో ముందుకెళ్తాయని వివరించారు. దీనిపై త్వరలో మరోసారి సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలు అందుబాటులోకి తెస్తామని లింబాద్రి చెప్పారు. -
డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది. పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, డా.భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం
వైరా రూరల్: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్తో వివాహం కుదిరింది. ఇక్బాల్ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేయగా ఇక్బాల్ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు తెలిసింది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి రెండో సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లో ఫలితాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు నిర్వహించనున్నట్లు వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు. గౌరవ ఆచార్యుల నియామకం ఏయూలో పదవీ విరమణ చేసిన నలుగురు ప్రొఫెసర్లను గౌరవ ఆచార్యులుగా నియమిస్తూ ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.సత్యనారాయణ, ప్రొ.మధుసూదనరావు, ప్రొ.సుదర్శనరావు.. మేథమేటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.కేకేఎం శర్మ హానరీ ప్రొఫెసర్లుగా నియమించారు. -
మంత్రి సబితా ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
-
రేపటి వరకు డిగ్రీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి తేదీని ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పొడిగించినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 28వ తేదీలోగా దోస్త్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్) సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీట్లు రద్దు అవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సెలవుల కారణంగా ఈ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. అలాగే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును కూడా ఈనెల 28వ తేదీ వరకు పొడిగించామని వివరించారు. కాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును ఈనెల 31వ తేదీన ప్రకటిస్తామని, విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలాగే అన్ని దశల కౌన్సెలింగ్లో సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆయా కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని వెల్లడించారు. చదవండి: మెదక్లో అరుదైన జీవజాతి.. మూషిక జింకలు -
ఒకటి నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (చదవండి: ఓపెన్ విద్యార్థులందరూ పాస్) (చదవండి: ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
బీఎస్సీ డేటా సైన్స్.. బీకాం అనలిటిక్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసేందుకు అధికారులు, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల ను పెంపునకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చా రు. వచ్చే వారం రోజుల్లో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అమల్లోకి తేనున్నారు. డిగ్రీలో ఇకపై మ్యాథ్స్, స్టాటిస్టిక్స్తోపాటు డేటా సైన్స్ను చదువుకోవచ్చు. బీకాంలో బిజినెస్ అనలిటిక్స్ను చదువుకునే వీలు కల్పించనుంది. వీటిల్లోనే ఆనర్స్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రెగ్యులర్ డిగ్రీల కంటే ఆనర్స్ డిగ్రీల్లో 20 నుంచి 30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలని యోచిస్తోంది. ఇవి కాకుండా కాలేజీలు ముందుకొస్తే బీఎస్సీ మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కోర్సులను ముందుగా సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అటానమస్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకిచ్చే శిక్షణలో పారి శ్రామిక వర్గాలను భాగస్వాములను చేయనుంది. భేటీలో కమిటీ సభ్యులు, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీ, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. యాజమాన్యాల నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే అదనపు సీట్లు, సెక్షన్లు కూడా మంజూరు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అలాగే పీజీ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సుల విత్డ్రా, మీడియం మార్పు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అయితే గత విద్యా సంవత్సరంలో 60 శాతం ప్రవేశాలున్న కాలేజీల్లోనే కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే సీట్లను పెంచనున్నట్లు మండలి వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది 50 నుంచి 60 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 110 వరకు ఉండగా, 60 నుంచి 70 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 90 వరకు ఉన్నాయి. 70 నుంచి 80 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 67 ఉండగా, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిన కాలేజీలు 50 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కాలేజీలో సగటున 100 సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని, దాంతో డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 20 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే కోర్సులను ఉపసంహరించుకునేవి పరిగణనలోకి తీసుకుంటే 5 వేల వరకు సీట్లు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. మరోవైపు మండల పరిధిలో డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసుకునేందుకు 40 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
ప్రహసనంగా డిగ్రీ ప్రవేశాలు
ఉస్మానియా యూనివర్సిటీ: డిగ్రీ వరకు చదివి ఉపాధి చూసుకోవాలని నేటి యువత భావిస్తోంది. అయితే ప్రతి ఏటా డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రవేశాలు మొదలు ఫీజులు, పరీక్షలు, ఫలితాలు, ప్రాక్టికల్స్, అటెండెన్స్, డిటెన్షన్ తదితరల కారణంగా వందలాది మంది విద్యార్థులు డిగ్రీ చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. వీటికి తోడు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా చేపట్టిన డిగ్రీ ప్రవేశాలు ప్రహసనంగా మారాయి. జూన్ నుంచి దోస్తు ద్వారా ఆన్లైన్ ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ స్పాట్ ఈనెల 22న ముగియనుంది. మూడు నెలలుగా జరుగుతున్న ప్రవేశాలలో అనుకున్న కాలేజీల్లో సీటు లభించక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఒక పక్క తరగతులు కొనసాగతుండగా మరోవైపు స్పాట్ అడ్మిషన్ల కోసం గడువు ఈ నెల 22 æ వరకు పొడిగించారు. ప్రవేశాలు ప్రణాళిక బద్ధంగా జరగకపోవడంతో పరీక్షలు, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం ప్రవేశ పెట్టినాటి నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి సెమిస్టర్కు 90 రోజులు తరగతులు జరగాలి. కాని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతంది. దోస్త్లో ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించడంతో మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు అనుకున్న కాలేజీల్లో సీటు లభించక పోవడంతో అటుతిరిగి...ఇటు తిరిగి చదవు మానేస్తున్నారు. సీట్ల కేటాయింపులో మార్పులు అవసరం దోస్త్ అడ్మిషన్లను విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారు. కానీ సీట్ల కేటాయింపు విషయంలో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకొని మండల, జిల్లాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థి నివాసం నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు గల కాలేజీల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుందన్నారు. ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం డిగ్రీలో చేరే వారి సంఖ్య ప్రతి ఏటా తగ్గుతున్నా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ కాలేజీలను నియంత్రిస్తున్నాం అనే ఆనందంలో ఉన్నారు. కానీ నిరు పేద విద్యార్థులకు సైతం డిగ్రీ కోర్సులు చదివేలా ఇంటింటికీ తిరిగి డిగ్రీ సీట్లు ఇచ్చి చదువుకునే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర పేద విద్యార్థులకు ఉచితంగా కూడా సీట్లు ఇచ్చే వారు. కొన్ని ప్రభుత్వ కాలేజీలు అధ్వానంగా ఉన్న కొనసాగిస్తున్నారు. కొందరురాష్ట్ర ఉన్నత విద్య మండలి అధికారులు డిగ్రీ కాలేజీల సంఖ్యను తగ్గిస్తు ప్రభుత్వానికి మేలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో ఉన్నత విద్య తగ్గుదలకు దారి తీస్తున్నారు.కాలేజీలో సకాలంలో సీటు ఇచ్చి స్వేచ్చగా చదివే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు బుధవారం నుంచి 21 వరకు దోస్త్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. అలాగే బుధవారం (నేటి) నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 26వ తేదీన ప్రత్యేక విడత సీట్లు కేటాయిస్తామని.. 26 నుంచి 29 తేదీల్లో కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుందని చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారితో పాటు గతంలో ఇచ్చినా సీటు దక్కని వాళ్లు కూడా ఈ ప్రత్యేక విడతలో మరోసారి ప్రయత్నం చేయొచ్చని ఆయన వెల్లడించారు. సీటు వచ్చిన కాలేజీల్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు మళ్లీ రూ.400 చెల్లించి తాజాగా దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీటు వచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు మెరుగైన సీటు కోసం ప్రయత్నిస్తే మూడో విడత వెబ్ ఆప్షన్లనే మళ్లీ సమర్పించాల్సి ఉంటుందని లింబాద్రి వివరించారు. -
డిగ్రీ ఫీజు చెల్లింపులు ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఆన్లైన్ కౌన్సెలింగ్లో సీటు లభించినా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేసి ఫీజు చెల్లి స్తేనే ఆ విద్యార్థికి సీటు కన్ఫార్మ్ చేసే విధానికి ఇక చెక్ పడనుంది. విద్యార్థులు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి తమ సీటు కన్ఫర్మ్ చేసుకునే విధానం రాబోతోం ది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు ఆన్లైన్లోనే ఫీజు చెల్లిం చేలా చర్యలు చేపట్టేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2019–20 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల సన్నాహక సమావేశం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలను మరింత సులభతరం చేయాలని నిర్ణయిం చారు. ఈసారి ప్రవేశాల ప్రక్రియను పూర్తి పేపర్లెస్ గా నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. విద్యార్థు ల రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ నుంచి మొదలుకొని కాలేజీలో చేరే వరకు అంతా ఆన్లైన్లోనే సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను కూడా ఆన్లైన్లోనే సేకరించి వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హెల్ప్లైన్ల ద్వారా సమస్యల పరిష్కారం.. విద్యార్థుల సమస్యలన్నింటినీ హెల్ప్లైన్ కేంద్రంలోనే పరిష్కరించేలా అధికారం కల్పిస్తామని లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు అందరికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు వారు వెబ్సైట్లో ఫలితాలను డౌన్లోడ్ చేసుకునేప్పుడే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు వివరాలు కూడా డౌన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇస్తామని, అందులో విద్యార్థులు ఎలా డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలో ఉంటుందని స్పష్టం చేశారు. -
ఫీజు రీయింబర్స్మెంటుకు ప్రత్యేక బడ్జెట్: పల్లా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కోర్సుల్లో ఫీజు రీయింబర్స్మెంటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు కృషిచేస్తానని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ ఫీజు ప్రతి ఏటా 10 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, డిగ్రీలో కామన్ ఫీజుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర–ప్రభుత్వ తోడ్పాటు ఆవశ్యకత అనే అంశంపై సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సంఘం పేరుతో ఓ రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టడం సమంజసం కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ సంఘం అసత్య ఆరోపణలు చేసిందని, ఫీజు రీయింబర్స్మెంటుపై దుష్ప్రచారం చేసిందని చెప్పారు. 2013–14కు సంబంధించిన రూ.2,200 కోట్ల బకాయిల విడుదలలో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి మొత్తం ఫీజులొచ్చాయని, కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ఫైర్ ఎన్ఓసీ నుంచి మినహాయింపు ఇచ్చే ఫైలుపై సీఎం సంతకం చేశారని చెప్పారు. -
మూడేళ్ల డిగ్రీగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్నాళ్లు అధికారిక గుర్తింపు లేకుండా కొనసాగిన గేమింగ్, యానిమేషన్ వంటి కోర్సులు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులుగా కొనసాగించేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి. దీంతో వాటికి ప్రభు త్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జవహర్లాల్నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఒప్పం దం చేసుకొని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే 17 విద్యా సంస్థలు వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే వాటిపై అనేక ఫిర్యాదులు రావడం, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించని కోర్సులను డిగ్రీలుగా ఎలా కొనసాగిస్తున్నారని, వాటి నిర్వహణకు జేఎన్ఏఎఫ్ఏయూ ఎలా ఒప్పందం చేసుకుంటోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజీసీ గుర్తించిన కోర్సులను వాటిల్లో నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో వాటి గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సెలవుపై వెళ్లిన సదరు అధికారి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయొద్దని లేఖ రాశారు. దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. నాలు గేళ్లు కాకుండా మూడేళ్ల కోర్సులుగానే నిర్వహిస్తామని, వాటికి గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. -
‘జూనియర్, డిగ్రీ’ బదిలీలకు షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూలును ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. జూనియర్ లెక్చరర్లు ఆదివారం లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 13కల్లా ప్రింట్ కాపీ, సర్టిఫికెట్లను జిల్లా ఇంటర్ విద్యాధికారికి అందజేయాలని సూచించింది. ఖాళీలను 13న ప్రకటిస్తామని తెలిపింది. వాటిపై 14న అభ్యంతరాలను స్వీకరిస్తామని, సవరించిన జాబితాలను 15న ప్రకటిస్తామని చెప్పింది. బదిలీలకు అర్హులైన వారి జాబితాను 17న ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని, 21న బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను ప్రకటిస్తామని వివరించింది. ఉద్యోగులు ఈనెల 22 నుంచి 24వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న బదిలీ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే డిగ్రీ కాలేజీల్లో ఈనెల 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఖాళీలను 9న ప్రకటించి 10, 11 తేదీల్లో వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. 12న ఫైనల్ ఖాళీల జాబితాను ప్రకటించి, 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను 18న ప్రకటించి, 20న బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
‘ఐసీడీఎస్లో సూపర్వైజర్ అర్హత డిగ్రీనే’
సాక్షి, హైదరాబాద్: సమ గ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టులను పూర్తిస్థాయిలో పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో అంగన్వాడీ టీచర్ల అర్హతల నిబంధనల్లో కాస్త ఊరట కలగనుంది. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హత కలిగిన వారినే సూపర్వైజర్లు (గ్రేడ్–2)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..వారి విద్యార్హత కనీసం డిగ్రీ ఉండాల్సిందిగా పేర్కొంది. క్షేత్రస్థాయిలో డిగ్రీ చదివిన వారు అతి తక్కువ మంది ఉండటంతో ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. డిగ్రీ అర్హత కాకుండా పదోతరగతిని ప్రామాణికంగా తీసుకోవాలని మెజార్టీ టీచర్లు కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోతరగతి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని కానీ, ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
డిగ్రీలో 1.21 లక్షల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సోమవారం తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) సీట్లను కేటాయించింది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాల కోసం 1,37,874 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1,29,790 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా వారిలో మొదటి దశలో 1,21,307 మంది సీట్లు లభించినట్లు వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన వారిలో 8,483 మందికి మొదటి దశలో సీట్లు లభించలేదు. ఇక విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారు ఇచ్చుకున్న మొదటి ప్రాధాన్యం (ఆప్షన్) ప్రకారమే 84,870 మందికి సీట్లు లభించాయి. మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు వచ్చాయి కనుక వారు రెండో దశ కౌన్సెలింగ్కు వెళ్లే అవకా«శం ఉండదని, వారంతా నేరుగా వెంటనే కాలేజీల్లో చేరాలని కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇక ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 8న ఉన్నందున ఇంజనీరింగ్లో సీట్లు వచ్చిన వారికి డిగ్రీలో సీటు వచ్చి ఉంటే వారి అభిప్రాయాన్ని తెలుసుకొని డిగ్రీ సీటు వద్దని అనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని, దాంతో వారి డిగ్రీ సీటు ఆటోమెటిక్గా రద్దు అవుతుందని వివరించారు. ఇక డిగ్రీలో చేరేందుకు బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు పొందిన 1,21,307 మందిలో బాలికలు 72,859 మంది ఉంటే బాలురు 48,448 మంది ఉన్నారు. నేటి నుంచి రెండో దశ కోసం రిజిస్ట్రేషన్లు.. రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ నెల 5 నుంచే చర్యలు చేపడుతున్నట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి దశలో సీట్లు రాని వారితోపాటు త్వరలోనే విడుదల కానున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యే వారికి రెండో దశ కౌన్సెలింగ్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ అయ్యేవారు, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఇపుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. వారు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. మొదటి ఆప్షన్ల ప్రకారం సీట్లు పొందిన వారు మినహా మిగతా వారు ఇంప్రూవ్మెంట్ రౌండ్ కింద ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, 14 వరకు ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వారికి 19న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్లో పాల్గొనే వారు జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్సీ, బీసీలు రూ.500 చెల్లించాలని, ఆ మొత్తం తరువాత ఫీజులో సర్దుబాటు చేస్తామని, కాలేజీల్లో చేరని వారికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్నారు. మరోవైపు మూడో దశ కౌన్సెలింగ్ను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. జూలై 5 నుంచి 7 వరకు కాలేజీ పరి«ధిలోనే ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం కల్పిస్తామని వాటి కేటాయింపును జూలై 10న ప్రకటిస్తామని వివరించారు. -
అమ్మ ఆశలు ఆవిరి !
చందంపేట(దేవరకొండ) : పుట్టుకతో వికలాంగుడైన కుమారుడిని ఉన్నత స్థితిలో చూడాలనుకుంది. ఐదేళ్ల క్రితమే భర్త చనిపోయినా ఇద్దరు పిల్లలను ఏ లోటు లేకుండా చదివిస్తూ వచ్చింది. అమ్మ పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నానంటూ మనస్తాపంతో కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చందంపేట మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలోని గన్నెర్లపల్లిలో జరిగింది. గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, బాలయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలయ్య ఐదేళ్ల క్రితమే చనిపోగా.. లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తోంది. పుట్టుకతోనే వికలాంగుడైన కుమారుడు కొండ్రపల్లి శ్రీకాంత్(22)కు ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చింది. కుమారుడు చదివి ప్రయోజకుడై కుటుంబ పోషణ బాధ్యతలు తీసుకుంటాడని గంపెడు ఆశలు పెట్టుకుంది. దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. చదువుతున్న శ్రీకాంత్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో డిగ్రీ ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. తల్లికి, కుటుంబానికి ఏ విధంగా తోడ్పాటు అందించలేకపోతున్నానని దిగులుతో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న ఆ తల్లి గుండెలలిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఎదిగొచ్చిన కుమారుడు మృతి ఆ తల్లిని మరింత కుంగదీసింది. -
మన డిగ్రీకి మస్త్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు ఇతర రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి 932 మంది దరఖాస్తు చేసుకోగా, మరో 25 రాష్ట్రాలకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారుండగా, విదేశాల్లో చదువుకొని, రాష్ట్రంలో డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 35 మంది ఉన్నారు. ఇక డిగ్రీ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా మొత్తంగా 1,43,657 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,36,788 మంది ఫీజు చెల్లించగా, 1,31,415 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ వచ్చే నెల 4న సీట్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. వారంతా 5 నుంచి 12 లోగా కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. ఇక సీట్లు రాని వారు వచ్చే నెల 5 నుంచి 14 వరకు ఆప్షన్లను మార్చుకొనేలా, కొత్త ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. వారికి 19న సీట్లను కేటాయించనుంది. వారంతా 20 నుంచి 27 లోగా కాలేజీల్లో చేరాలి. తరగతులను జూలై 2 నుంచి ప్రారంభించనుంది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల కోసం మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించేలా దోస్త్ చర్యలు చేపట్టింది. వారంతా జూన్ 20 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూలు ప్రకటించింది. వారితోపాటు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. వారంతా ఇచ్చే వెబ్ ఆప్షన్లను బట్టి జూన్ 30న సీట్లను కేటాయించనుంది. విద్యార్థులు జూలై 2 నుంచి 4వ తేదీ లోగా కాలేజీల్లో చేరాలి. ఆ తరువాత కాలేజీ పరిధిలోనే గ్రూపులను మార్చుకునేందుకు ఈసారి మరో అవకాశం కల్పిస్తోంది. గ్రూపు మార్పు చేసుకోవాలనుకునే వారు జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్లను ఇచ్చుకుంటే ఖాళీలను బట్టి దోస్త్ సీట్లను కేటాయిస్తుంది. -
ఆన్లైన్ అడ్మిషన్స్
గతంలో డిగ్రీలో చేరాలంటే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలకు వెళ్లి సీట్లు ఉన్నా యో లేదో తెలుసుకుని దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఏ సమయంలోనైనా డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకునే వెసులబాటును కల్పించింది. నెల్లూరు(టౌన్): జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ, తొమ్మిది ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీఏలో 1,192, బీకాంలో 1,660, బీఎస్సీలో 2,644 కలిపి మొత్తం 5,496 సీట్లు ఉన్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ తరహాలో పారదర్శకంగా ఉండేలా కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకడమిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏపీఎస్ఏఎంఎస్)గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్లో మొట్ట మొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని ఈనెల 5వ తేదీనుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించారు. 29వ తేదీ ఎంపికైన వారి తొలి జాబితాను ప్రచురించనున్నారు. ఈ నెల 31వ తేదీలోపు సీటు పొందిన కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చేనెల 3న ఎంపికైన వారి రెండో జాబితాను ప్రచురిస్తారు. 5వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు జూన్ మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించి ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ 10వ తేదీకల్లా పూర్తి చేస్తారు. జిల్లాలో 18 ప్రభుత్వ,ఎయిడెడ్ కళాశాలలు జిల్లా వ్యాప్తంగా 18 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(గూడూరు), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), శ్రీ వీఎస్ఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సూళ్లూరుపేట), విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (వెంకటగిరి), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (రాపూరు), వైకేఆర్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కోవూరు), పీఆర్ఆర్వీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విడవలూరు), ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఉదయగిరి) ఉన్నాయి. అదేవిధంగా ఎయిడెడ్కు సంబంధించి వీఆర్ డే కళాశాల (నెల్లూరు), వీఆర్ ఈవినింగ్ కళాశాల (నెల్లూరు), ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల (నెల్లూరు), శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎన్బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల (విద్యానగర్), డాక్టర్ ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల (ఆత్మకూరు), వేద సంస్కృత ఓరియంటల్ కళాశాల (నెల్లూరు), జవహర్ భారతి డిగ్రీ కళాశాల (కావలి), డీఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాల (గూడూరు) ఉన్నాయి. దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ap.gov.in/admissions వెబ్సైట్ను రూపొందించింది. వైబ్సైట్లోకి Ðð వెళ్లి తొలుత రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తరువాత లాగిన్ అయితే డిగ్రీ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాం కనిపిస్తుంది. దానిలో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రయార్టీ ప్రకారం వరుసగా ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రయార్టీ ప్రకారం వచ్చే దరఖాస్తు పత్రంలో విద్యార్థి ఆధార్ సంఖ్య, హాల్ టికెట్ నంబరు, జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉంటే వాటి పత్రాలు, దివ్యాంగులైతే వాటి పత్రం, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తరువాత చలానా జనరేట్ అవుతుంది. చలానా తీసుకుని మీసేవ, ఈసేవా కేంద్రాల్లో రూ.50లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత సీటు కేటాయింపు వివరాలు సెల్ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తారు. విద్యార్థుల కోసం క్యాంపెయిన్ విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకునేందుకు ఆయా కళాశాలల్లో అధ్యాపకులు క్యాంపెయిన్ బాట పట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 266 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో 35మంది నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 231 మందికి ఆయా కళాశాలల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులు ఇంటర్ పాసైన విద్యార్థుల వివరాలను సేకరించి వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈనెలాఖరు వరకు సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ చేర్చేందుకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు పలువురు అధ్యాపకులు తెలిపారు. ఎక్కడినుంచైనాదరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో డిగ్రీ చేరేందుకు రాష్ట్రంలో ఎక్కడునుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా సులువుగా ప్రవేశం పొందవచ్చు. ప్రయార్టీ ప్రకారం ఒక్కో విద్యార్థి ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే వెసులబాటును కల్పించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆయా కళాశాలల్లో సీట్లు మిగిలి ఉంటే ఈ నెల 25వ తేదీ తరువాత దరఖాస్తు చేసుకోవచ్చు. –మస్తానయ్య, ప్రిన్సిపల్డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల -
డిగ్రీ, ఇంజినీరింగ్ అనుసంధానం..!
శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఎంసెట్, దోస్త్ ప్రవేశాలకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు డిగ్రీలో కూడా చేరేందుకు సిద్ధపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే చాలామంది విద్యార్థులకు రెండింటిలో సీట్లు రావడంతో ఇంజినీరింగ్తోపాటు ఇతర కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలనురద్దు చేసుకునే అవకాశం లేకపోవడంతో డిగ్రీ కళాశాలల్లో సీట్ల మిగులుకు కారణమవుతోంది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల గందరగోళానికి తెరతీస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు వృథాగా పోకుండా ఉండడానికి ఎంసెట్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయాలని ప్రవేశాలకు సంబంధించిన అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఈ విషయమై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం సమావేశమైనట్లు సమాచారం. డిగ్రీ కోర్సుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాల గురించి సంబంధిత అధికార వర్గాలు చర్యలు చేపడుతున్నారు. ఇదే జరిగితే కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా పలు కళాశాలల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇంజినీరింగ్లో వస్తే డిగ్రీలో ఖాళీ.. శాతవాహనలో గతేడాది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్కు వెళ్లడంతో దాదాపు 2 వేల వరకు సీట్లు డిగ్రీలో వృథాగా మిగిలిపోయాయని సమాచారం. విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరాక కూడా డిగ్రీ కోర్సుల్లో వారి ప్రవేశాలు రద్దుచేసుకోకపోవడంతో సీట్ల విషయంలో గందరగోళం తలెత్తేది. కానీ ప్రభుత్వం అనుసంధానం నిర్ణయం వల్ల టాప్ కళాశాలల్లో సీట్ల వృథాను అరికట్టవచ్చని వివిధ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరాలనే ఆసక్తితో ఉంటే ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయడం ద్వారా వారు ఇంజినీరింగ్లో చేరగానే డిగ్రీలో అతడికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో టాప్ కళాశాలల్లో సీట్లు మిగలకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇదేకాకుండా డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థులు వారి సీట్లను కన్ఫార్మ్ చేసుకునేటప్పుడు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే నిబంధన విధించనున్నారు. ఇది ఓసీలకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500 ఉండనున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని విద్యార్థి కళాశాలలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఇచ్చేలా నిబంధన విధించనున్నట్లు తెలిసింది. గతేడాది శాతవాహన వ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా విద్యార్థులు బీటెక్ వైపునకు వెళ్లడంతో డిగ్రీలో మిగిలిపోయాయి. 22,986 సీట్ల మిగులు... 2017–18 విద్యాసంవత్సరం శాతవాహన యూనివర్సిటీ ప్రవేశాలను పరిశీలిస్తే యూనివర్సిటీ వ్యాప్తంగా 46,310 సీట్లకు 22,986 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో బీఏలో 3,950 సీట్లకు 2,489 సీట్లు, బీబీఏలో 660 సీట్లకు 444, బీసీఏలో 60కి 60, బీకాంలో 20,280కి 9,244, బీఎస్సీలో 21,360 సీట్లకు10749 సీట్లు మిగిలిపోయాయి. 49.64 శాతం సీట్లు మిగులు శాతం నమోదైంది. దీనిలో దాదాపు రెండు వేలకు పైగా సీట్లు విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ రెండింటికీ దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్ వైపు వెళ్లిపోవడంతో డిగ్రీల్లో ప్రముఖ కళాశాలల్లో సీట్ల మిగులుకు దారితీసింది. ఈ సారి అనుసంధాన ప్రక్రియ అందుబాటులోకి వస్తే ఇలాంటి పరిస్థితులుండవని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుసంధానం మంచిదే... ప్రభుత్వం చేయనున్న ప్రవేశాల అనుసంధాన ప్రక్రియ వల్ల డిగ్రీచేసేవాళ్ళకు లాభం చేకూరుతొంది. గతంలో ఇంజినీరింగ్, డిగ్రీ రెండు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండింటిలో సీటు వస్తే ఆసక్తి గల అభ్యర్థులు ఇంజినీరింగ్లో చేరినా డిగ్రీలో సీటు రద్దయ్యేదికాదు. దీనితో సీట్లు వృథా అయిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితిఉండదు. విద్యార్థులకు, యాజమాన్యాలకు అందరికీ మంచిదే. – పి.వేణు, తెలంగాణ ప్రవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు -
డిగ్రీ–ఇంజనీరింగ్ ప్రవేశాల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ–ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆన్లైన్లో అనుసంధానం చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వారిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులకు డిగ్రీతోపాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో సీట్లు లభిస్తున్నాయి. దీంతో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో చేరుతున్న ఆయా విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ విత్డ్రా చేసుకోవడం లేదు. దీంతో టాప్ డిగ్రీ కాలేజీల్లోని వేల సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఎంసెట్–డిగ్రీ ప్రవేశాలను లింక్ చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం ఈ అంశంపై సమావేశమై చర్చించారు. రెండింటినీ ఆన్లైన్లో లింక్ చేయడం ద్వారా ఒక విద్యార్థి ఇంజనీరింగ్లో చేరితే డిగ్రీలో అతనికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా సీట్లు మిగిలిపోకుండా చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. మరోవైపు డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థి తన సీటును కన్ఫర్మ్ చేసుకునేప్పుడు నిర్ణీత మొత్తాన్ని(ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500) చెల్లించే నిబంధనను విధించాలని నిర్ణయించారు. విద్యార్థి కాలేజీలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా నిబంధనను విధించనున్నారు. ఆధార్ ఉంటే మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ మరోవైపు డిగ్రీ ప్రవేశాల్లో ఆధార్ను అనుసంధానం చేయడంతోపాటు మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుసేందుకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరే దాదాపు 2.25 లక్షల మంది విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం, ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. విద్యార్థులే నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి ఆధార్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికీ ఆధార్ లేని వారు పోస్టు ఆఫీసుల్లో ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దోస్త్ కమిటీ సూచించింది. మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, మే 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించే నాటికి కూడా ఆధార్ లేని వారు హెల్ప్లైన్ కేంద్రాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ చేపట్టాలని నిర్ణయించాం. ప్రవేశాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రతి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్, సీనియర్ అధ్యాపకులతో కూడిన కమిటీని సంప్రదించవచ్చు. ఆ కమిటీ పరిధిలో సమస్య పరిష్కారం కాకపోతే ఇంటిగ్రేటెడ్ కాలేజీల ప్రిన్సిపాల్ నేతృత్వంలోని జిల్లా కోఆర్డినేషన్ కమిటీని సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తుంది. అక్కడా సమస్యకు పరిష్కారం లభించకపోతే యూనివర్సిటీలోని కోఆర్డినేషన్ సెంటర్లో సంప్రదించవచ్చు. అయినా సమస్య అలాగే ఉంటే చివరగా కళాశాల విద్యా కమిషనరేట్, దోస్త్ కార్యాలయాల్లో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆయా కమిటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇంటర్ ఉత్తీర్ణులయ్యే ప్రతి విద్యార్థికి(మెమో డౌన్లోడ్ చేసుకునేప్పుడే) ఇన్ఫర్మేషన్ బులెటిన్ రూపంలో అందించేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈసారి ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఎప్పటికప్పుడు వివరాలను విద్యార్థికి పంపిస్తాం. – ప్రొఫెసర్ లింబాద్రి, దోస్త్ కన్వీనర్ -
విద్యార్థి చెంతకే ఉద్యోగం
కామారెడ్డి టౌన్ : ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది యువతను చూస్తున్నాం. ఉద్యోగం కోసం వివిధ రాష్ట్రాలలో ఇంటర్వూ్యలకు వెళ్లిన జాబ్లు రానివారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రాంగణ నియామకాలతో డిగ్రీ చేస్తుండగానే చాలా మంది యువత ఉద్యోగం సాధిస్తున్నారు. కళాశాలలకే ప్రముఖ కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలను డిగ్రీ విద్యార్థులకు కల్పిస్తున్నారు. కళాశాలకు చెంతకే వచ్చి ఇంటర్వూ్యలు నిర్వహించి జాబ్లకు ఎంపికచేసుకుంటున్నారు. కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాలలో మూడేళ్లుగా 220 మంది వరకు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించారు. డిగ్రీ చేస్తుండగానే జాబ్ డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే చాలా మంది యువత జాబ్లను కొట్టేస్తున్నారు. ఇన్ఫోసిస్, హిందూజా గ్రూప్, ఎలికో హెల్త్కేర్, జెన్ప్యాక్ట్, స్మార్ట్నెట్ ఐటీ సొల్యూషన్స్, ఐకేఎస్, హెల్త్కేర్, ఈ–ప్రాంటస్, టెక్ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీల డైరెక్టర్లు, ప్రతినిధులు నేరుగా కళాశాలలకు వచ్చి ఇంటర్వూ్యలను నిర్వహించారు. ఇప్పటివరకు డి గ్రీ ఫైనలియర్ చేస్తున్న 2 వేలకు పైగా డిగ్రీ విద్యార్థులకు సాందీపని కళాశాలలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిలో 220 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. భాషా నైపుణ్యం, స్కిల్స్, కం ప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వందల మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు హాజరవు తూ ఉద్యోగాలను సాధించుకుంటున్నారు. చిన్న వయస్సుల్లోనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల చుట్టూ తిరగకుండానే ఉద్యోగం డిగ్రీ ఫైన్లియర్ చేస్తున్నాను. డిగ్రీ పూర్తికాగానే ఉద్యో గం వస్తుందో రా దోనని భయపడేదాన్ని. కానీ కళాశాల ప్రాంగణ నియామకాలతో చదువుతుండగానే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – దివ్య, బీఎస్సీ బీజెడ్సీ, లింగన్నపేట, సిరిసిల్ల జిల్లా సద్వినియోగం చేసుకోవాలి ప్రాంగణ నియామకాలతో డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఆ యా రాష్ట్రాల నుంచి ప్రముఖ కంపెనీ లు వచ్చి ఇంటర్వూ్యలు చేసి ఉద్యోగా లు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – బాలాజీరావు, సాందీపని కళాశాల డైరెక్టర్, కామారెడ్డి చాలా సంతోషంగా ఉంది నాకు టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ టెక్సీషియన్గా ఉద్యోగం వచ్చింది. కంపెనీవారు కళాశాలకే వచ్చి ఇంటర్వూ్యలో ప్రతిభను గుర్తించి ఉద్యోగాలిస్తున్నారు. డిగ్రీలోనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. –పి.సింధు, ఎంఎస్టీసీఎస్, కామారెడ్డి డిగ్రీలోనే ఉద్యోగం సాందీపనిలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఫైనలియర్ ఉండగానే ప్రాంగణ నియామకాల్లో టెక్ మహేంద్రలో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. డిగ్రీలోనే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – జాకీర్, బీకాం సీఏ, రామాయంపేట -
మొబైల్ ద్వారా డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ను మొబైల్ ద్వారా చేసుకునేలా సులభతర విధానాన్ని డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ, తెలంగాణ (దోస్త్) అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆధార్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించాలని యోచిస్తోంది. అలాగే ఆన్లైన్లో లేదా చలానా రూపంలో విద్యార్థులు ఫీజులు చెల్లించే అవకాశం కల్పించాలని భావిస్తోంది. మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించిన ప్రవేశాల కమిటీ.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రవేశాల కౌన్సెలింగ్ సందర్భంగా గతంలో తలెత్తిన లోపాలను ఈసారి రాకుండా చర్యలు తీసుకుంటోంది. మొదటి దశ ప్రవేశాల్లో సీట్లు లభించిన విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు చెల్లిస్తే రెండో దశ కౌన్సెలింగ్లో మరో కాలేజీలో సీటొచ్చినపుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీల్లో కాకుండా దోస్త్ పేరిటే చలానా రూపంలో లేదా ఆన్లైన్లో ఫీజు చెల్లించే ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. తద్వారా ఏ దశ కౌన్సెలింగ్లో సీటొచ్చినా విద్యార్థులకు ఇబ్బంది ఉండదని ఆలోచిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెసులుబాటు కాలేజీలకు జియో ట్యాగింగ్ విధానం అమలు చేయాలని దోస్త్ నిర్ణయించింది. తద్వారా కాలేజీ ఎక్కడుంది..? అందులో ఫీజు ఎంత? సదుపాయాలు ఏమున్నాయి? తదితర వివరాలు ఆన్లైన్లో పొందే వీలుంటుంది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి డిగ్రీలో చేరేటప్పుడు సబ్జెక్టులు అన్ని సరిపోలితే తన ఇష్ట ప్రకారం డిగ్రీ ప్రథమ సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరంలో చేరే వీలు కల్పించాలని దోస్త్ నిర్ణయించింది. ఇంటర్ ఫలితాలు విడుదల చేసినప్పుడు విద్యార్థి మెమో డౌన్లోడ్ చేసుకునేప్పుడే విద్యార్థికి డిగ్రీ ప్రవేశాల సమగ్ర వివరాలొచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: 2018–19 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల (దోస్త్) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు నోటిఫికేషన్ను మే 8న జారీ చేయాలని దోస్త్ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమ వారం దోస్త్ సమావేశం జరిగింది. ఇందులో ప్రవేశాలనిబంధనలు, షెడ్యూల్ను ఖరారు చేసింది. ఇంటర్మీడియెట్ వొకేషనల్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. అన్ని వర్సిటీల్లో కామన్ షెడ్యూల్ అమలు చేయనుంది. ఇంటర్లో కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా చదివిన విద్యార్థులకు బీకాంలో 60 శాతం సీట్లు, హెచ్ఈసీ చదివిన వారికి బీఏలో 50 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. కాలేజీలు, సీట్ల వివరాలను ఏప్రిల్ నెలాఖరులోగా ఆన్లైన్లో (దోస్త్కు) అప్లోడ్ చేయాలని వర్సిటీలను ఆదేశించింది. ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో తమ మెమోను డౌన్లోడ్ చేసుకునేటప్పుడే డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు డౌన్లోడ్ అవుతాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్సిటీల వారీగా కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలను త్వరలో దోస్త్ వెబ్సైట్లో ఉంచుతామని వివరించారు. గతంలో దోస్త్ పరిధిలోని అటానమస్ కాలేజీలు కూడా ఈసారి ఆన్లైన్ ప్రవేశాల పరిధిలోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈసారి మూడో కౌన్సెలింగ్ కూడా ఉంటుందన్నారు. గతంలో జీరో, 25 శాతంలోపు ప్రవేశాలు ఉన్న కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో విలీనం చేయా లని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు పాల్గొన్నారు. డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్.. 8–5–2018: ప్రవేశాల నోటిఫికేషన్ జారీ 10–5–2018 నుంచి 26–5–2018 వరకు: రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు 27–5–2018 నుంచి 29–5–2018 వరకు: 400 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ 4–6–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు 5–6–2018 నుంచి 12–6–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు 13–6–2018, 14–6–2018: రెండో దశ వెబ్ ఆప్షన్లు 19–6–2018: రెండో దశ సీట్లు కేటాయింపు 20–6–2018 నుంచి 25–6–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు 26, 27–6–2018: మూడో దశ వెబ్ ఆప్షన్లు 30–6–2018: మూడో దశ సీట్లు కేటాయింపు 2–7–2018 నుంచి 4–7–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు 2–7–2018 నుంచి: మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం. -
తప్పులతడక..
ఎవరైనా సున్నా శాతం మార్కులతో డిగ్రీ పాస్ అవుతారా..? అంటే కాదని ఎవరైనా సమాధానం చెబుతారు. అయితే, రాష్ట్ర ఉపాధి, శిక్షణశాఖ అధికారుల పనితీరు మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఆ శాఖ జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డులో ఈ తరహా ఘోర తప్పిదాలు దొర్లుతున్నాయి. ఇదొక్కటే కాదు.. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయాలు సైతం మారిపోతున్నాయి. ఒక జిల్లా నుంచి ఎంప్లాయిమెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. మరొక జిల్లా కార్యాలయం పేరుతో కార్డులు జారీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తప్పిదాలు నిరుద్యోగులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆన్లైన్ ద్వారా జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్ కార్డులో ఇబ్బడిముబ్బడిగా దొర్లుతున్న తప్పులు.. రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖను అభాసుపాలు చేస్తున్నాయి. కార్డులో తప్పుడు సమాచారం ముద్రితం కావడంతో నిరుద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటే సమయం వృథా అయ్యేది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉపాధి, శిక్షణ శాఖలో సంస్కరణలు చేపట్టింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్ కార్డు పొందేలా ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొత్తగా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్, అదనపు విద్యార్హతల నమోదు తదితర సేవలను పూర్తిగా ఆన్లైన్ ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ సేవలు ‘తెలంగాణ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ పోర్టల్’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందడం సులభతరం కావడంతో నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి, సాంకేతిక సమస్యల కారణంగా తప్పుల తడక వివరాలతో కార్డులు జారీ అవుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన తప్పిదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చాక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఈనెల 20న తన ఎంప్లాయిమెంట్ కార్డుని వెబ్పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఇతను.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో పొందిన ఉత్తీర్ణత శాతం, ఏ సంవత్సరంలో పాసయ్యాడో స్పష్టంగా పేర్కొన్నాడు. పైగా వాటిని ధ్రువీకరించే విద్యార్హత పత్రాలను సైతం అప్లోడ్ చేశాడు. అయితే, డిగ్రీ ఉత్తీర్ణత శాతం తప్పుగా నమోదైంది. సున్నా శాతంతో ఉత్తీర్ణుడైనట్లు అధికారులు కార్డులో పేర్కొన్నారు. అంతేగాక, అతడు 2007లోనే డిగ్రీ పాస్ అవగా.. 2010లో ఉత్తీర్ణుడైనట్లు కార్డులో నమోదు చేశారు. అదేవిధంగా, చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ జిల్లాగా పేర్కొన్నారు. నిరుద్యోగులు అందజేసిన అన్ని రకాల ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలించాకే జిల్లా ఉపాధి అధికారి సంతకంతో కూడిన కార్డు జారీ చేస్తారు. కానీ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతున్న తీరును చూస్తే ఎటువంటి పరిశీలన లేకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి తనకు ఎదురైన అనుభవాన్ని జిల్లా ఉపాధి అధికారిణి నంద పద్మ దృష్టికి తీసుకెళ్లగా.. హెల్ప్లైనుకు కాల్ చేయండి లేదా మీ–సేవ కేంద్రానికి వెళ్లి సరిచేసుకోండని ఉచిత సలహా ఇచ్చినట్లు సదరు నిరుద్యోగి ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాలు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూ నివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూన రామ్జీ తెలిపారు. వర్సిటీ సెమినార్ హా ల్లో మంగళవారం జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో కలిపి సుమారు 56 వేల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారని, ఆయితే విద్యాప్రమాణాలు మాత్రం సంతృప్తిగా లేవని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా మండలి కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతోందన్నారు. దీనిలో భాగంగా ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టనున్నామన్నారు. ఇందుకు సెట్ నిర్వహించా లా.. ఇంటర్ మార్కుల ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలా.. అన్న అంశంపై కసరత్తులు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే చర్యల్లో భాగంగా క్లాస్వర్కు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తప్పనిసరిగా విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తామని స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల్లో స్టాఫ్ రేటిఫికేషన్ ఉంటుందని, అర్హులైన అధ్యాపకులే బోధించాలన్నారు. రిజిస్ట్రార్ తులసీరావు మాట్లాడుతూ రాష్ట్రం యూనిట్గా అకడమిక్ క్యాలెండర్, సిలబస్, పరీక్షలు నిర్వహణ అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ తమ్మనేని కామరాజు, ఎం.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు, పి.జయరాం, ఆమదాలవలస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీస్ తదితరులు పాల్గొన్నారు. 28న సైన్స్ ఎగ్జిబిషన్ వర్సిటీలో ఈ నెల 28న నిర్వహించనున్న సైన్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వీసీ రామ్జీ కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(న్యూఢిల్లీ, హైదరాబాద్)కు చెందిన పల్సస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నూతన ఆవిష్కరణల నేపథ్యంలో ప్రయోగాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. సర్వేల వల్ల ప్రయోజనం లేదు డిగ్రీ విద్యార్థులను ఓడీఎఫ్ ప్రచారం కోసం గ్రామాల్లో ర్యాలీలు, సర్వేలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు సూచించగా, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్వేలు వల్ల ప్రయోజనం ఉండటం లేదన్నారు. వీరి జాబితాలకు సైతం అధికారులు స్పందించడం లేదని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు సైతం గ్రామాల్లో తమ సర్వేలు సరిపోతాయని, విద్యార్థులు ఎందుకు వస్తున్నారని అంటున్నారని గుర్తు చేశారు. మరుగుదొడ్లు లేనివారికి నిధులు అందజేసే అవకాశం విద్యార్థులకు లేనపుడు ఇంటింటా సర్వేలు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వర్సిటీ అధికారులు స్పందిస్తూ విద్యార్థులు సర్వేలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. -
డిగ్రీ చదివితేనే సీనియర్ అసిస్టెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న వారికి పదోన్నతులలో విద్యార్హత కీలకం కానుంది. వీఆర్వోలకు గతంలో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే ప్రక్రియ ఉండగా, ఇప్పుడు వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వర్తిస్తుందని గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిగ్రీ నిబంధనలో కొంత మినహాయింపునిచ్చారు. 2014 మే 12 నాటికి వీఆర్వోలుగా నియమితులై ఉంటే వారి కి ఇంటర్ ఉత్తీర్ణతతోనే సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని, ఆ తర్వాత నియామకమైన వారికి డిగ్రీ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. -
డిగ్రీ చదివారా.. అయితే జాబ్ గ్యారంటీ!
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీలు చదివితే వెంటనే ఉపాధి లభించదు.. దీని కన్నా సాంకేతిక విద్య అభ్యసిస్తే తొందరగా జాబ్ వస్తుంది.. ఇలాంటి వాటికి ఇక ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సంప్రదాయ డిగ్రీలు కొత్త రూపం దాల్చాయి. బీఏ, బీఎస్సీతో పాటు కంప్యూటర్స్ చదువుకోవచ్చు.. టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ చదవొచ్చు.. ఎన్జీవోస్ ఎడ్యుకేషన్ చదవొచ్చు.. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు.. ఇలా ఒక్కటేమిటి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న 72 రకాల కోర్సులను సంప్రదాయ డిగ్రీ, పీజీలో చదువుకునే అవకాశం వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) కోర్ సిలబస్తో పాటు ఉపాధి అవకాశాలు ఉండే సబ్జెక్టులను చదువుకునే వీలు ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్ని యూనివర్సిటీలు సంప్రదాయ డిగ్రీలను రీడిజైన్ చేశాయి. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని సైన్స్ గ్రూపుల్లో ప్రవేశ పెట్టగా, మిగతా అన్ని యూనివర్సిటీలు, అన్ని గ్రూపుల్లో 3, 4 సెమిస్టర్లలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో అమలు.. సంప్రదాయ డిగ్రీలు, పీజీలు చదివే వారు తమ రెగ్యులర్ డిగ్రీలతో పాటు నచ్చిన సబ్జెక్టును చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం సీబీసీఎస్ను గతేడాది అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఉన్నత విద్యా మండలి సీబీసీఎస్ అమలుకు చర్యలు చేపట్టింది. సెమిస్టర్ విధానంతో పాటు కోర్సులను రీడిజైన్ చేసింది. తాజాగా పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు యూనివర్సిటీలు చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో మార్పులు చేసింది. కంప్యూటర్ అప్లికేషన్స్, రైటింగ్ స్కిల్స్, హిస్టరీ అండ్ టూరిజం, లా అండ్ ఎథిక్స్ వంటి సబ్జెక్టులు అందుబాటులోకి తెచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. పోటీ పరీక్షలే అక్కర లేదు.. ఇప్పటివరకు ఆర్ట్స్ గ్రూప్లు చదివిన విద్యార్థులు ఎక్కువ మంది బీఎడ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేయడంతో పాటు గ్రూప్–1, గ్రూప్–2, సివిల్స్ తదితర పోటీ పరీక్షలకే ఎక్కువగా సిద్ధమయ్యేవారు. లక్షల మందిలో కొద్దిమందికే ఉద్యోగ అవకాశాలు లభించేవి. మిగతా వారంతా నిరుద్యోగులుగానే ఉండిపోయే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో కోర్సుల రీడిజైన్ వారికి వరంగా మారనుంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. స్వయం ఉపాధి పొందే వీలు కూడా ఉండనుంది. 2.2 లక్షల మందికి ప్రయోజనం.. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,184 డిగ్రీ కాలేజీల్లో 2.2 లక్షల మంది ఏటా చేరుతున్నారు. వారంతా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ తదితర కోర్సులను చదువుతున్నారు. అందులోని 57 రకాల రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు ఇకపై ఉపాధి అవకాశాలు కల్పించే 72 సబ్జెక్టులు అందుబాటులోకి వస్తాయి. సీబీసీఎస్లో భాగంగా వాటిని విద్యార్థులు ఎలెక్టివ్ సబ్జెక్టులుగా తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని ప్రతిపాదిత కొత్త సబ్జెక్టులు.. కంప్యూటర్ అప్లికేషన్స్, హిస్టరీ అండ్ టూరిజం, మీడియా స్టడీస్, లా అండ్ ఎథిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, అప్పరల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, ఫుడ్ టెక్నాలజీ, ఎన్జీవోస్ ఎడ్యుకేషన్, ఫిల్మ్ మేకింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, పబ్లిక్ ఒపీనియన్ అండ్ సర్వే మెథడ్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, రీసెర్చ్ మెథడాలజీ, నర్సరీ అండ్ గార్డెనింగ్, హెర్బల్ టెక్నాలజీ. ముందువరుసలో ఉస్మానియా కోర్సుల రీడిజైన్ విష యంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు వరుసలో ఉంది. వైస్ చాన్స్లర్ ప్రొఫెస ర్ ఎస్.రామచంద్రం నేతృత్వంలో అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం బీఎస్సీ మూడో సెమిస్టర్లో 15 రకాల కోర్సుల్లో ఉపాధి కల్పించే సబ్జెక్టులను (స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు– ఎస్ఈసీ) ప్రవేశ పెట్టారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆర్ట్స్, కామర్స్లో నూ అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెం బర్లో జరిగే అకడమిక్ సెనేట్లో వీటికి ఆమోదం తెలిపే అవకాశముంది. -
డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్
కోవెలకుంట్ల: కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్ 24వ తేదీ నుంచి డి గ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్అండ్ సాఫ్ట్స్కిల్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. అబ్జర్వర్ నాగేంద్ర గమనించి పరీక్ష రాస్తున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్ష కేంద్ర పరిసరాల్లో ప్రశ్నలకు సంబంధించిన జవాబుల పత్రం సైతం లభ్యమైంది. దీంతో సీఎస్ఎస్ పేపర్ లీకైనట్లు భావించి రాయలసీమ యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. పట్టుబడిన విద్యార్థుల నుంచి రాతపూర్వక స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ విద్యార్థుల చేతిలో సీఎస్ఎస్ పరీక్షకు సంబంధించి జవాబులు ఉండటంతో ఆ విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాలను యూనివర్సిటీ అధికారులకు చేరవేశామన్నారు. ప్రశ్నాపత్రం ఎక్కడ లీకైందన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. -
డిగ్రీలో లక్ష సీట్లకు కోత!
► భారీగా మిగిలిపోతుండటంతో ఉన్నత విద్యా మండలి నిర్ణయం ► వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమల్లోకి..! ► 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలకు అనుమతి రద్దు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఏటేటా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండటంతో సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఏకంగా లక్ష వరకు సీట్లను రద్దు చేయాలని... వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 1,092 డిగ్రీ కాలేజీల్లో 4.10 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా అందులో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఈసారి సగం సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో దశ కౌన్సెలింగ్ ముగిసేనాటికి 1,93,198 సీట్లు భర్తీ కాగా.. నాలుగో దశ కౌన్సెలింగ్లో మరో 8,789 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వారందరూ కాలేజీల్లో చేరినా భర్తీ అయ్యే సీట్లు 2.01 లక్షలకు మించని పరిస్థితి నెలకొంది. 25 శాతం సీట్లు నిండకుంటే.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండడంతో.. ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కొత్త కాలేజీలకు అనుమతులను నిలిపివేసింది. తాజాగా సీట్ల కోతపై దృష్టి సారించింది. కనీసం 25 శాతమైనా సీట్లు భర్తీ కాని కాలేజీలను కొనసాగించడం కష్టమని, అందువల్ల అలాంటి కాలేజీలను మూసివేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. వాటిల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని యూనివర్సిటీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలా 50కి పైగా కాలేజీల్లో ప్రవేశాలు రద్దు కానున్నాయి. ఇవేగాకుండా వచ్చే ఏడాది ప్రవేశాల సమయం నాటికి మరిన్ని సీట్లను రద్దు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ కాలేజీల్లోనూ నాణ్యతా ప్రమాణాలు, ఫ్యాకల్టీ, ఇతర సదుపాయాలకు సంబంధించిన అంశాలపై తనిఖీలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా లోపాలున్న కాలేజీలను మూసివేయాలని.. మొత్తంగా వచ్చే ఏడాది నాటికి లక్ష సీట్లకు కోత పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారీగా తగ్గిపోతున్న ప్రవేశాలు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు ఏటేటా తగ్గిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా అయితే ఏకంగా 20 వేల చొప్పున విద్యార్థులు తగ్గిపోయారు. 2014–15లో 2.65 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2.01 లక్షలకు పడిపోయింది. మరోవైపు ఏటా డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014–15లో 3.65 లక్షల సీట్లు ఉండగా.. ప్రస్తుతం 4.10 లక్షలకు పెరిగాయి. కానీ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవడం, ఇతర కోర్సుల సీట్లను కన్వర్షన్ చేసుకోవడం వంటివి చేస్తున్నా.. సీట్ల భర్తీ తక్కువే ఉంటోంది. -
సెంటర్ ఫర్ ‘గుడ్డి’ గవర్నెన్స్
- డిగ్రీ మూడో దశ ఆన్లైన్ ప్రవేశాల్లో గందరగోళం - మారిపోయిన 3 వేల మంది సీట్లు.. 92 మంది సీట్ల గల్లంతు - సీజీజీ తప్పిదంతో విద్యార్థుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అధికారుల తప్పిదం వేల మంది డిగ్రీ విద్యార్థులకు శాపంగా మారింది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల సీట్ మ్యాట్రిక్స్ సరిగ్గా చేయలేకపోవడంతో సీట్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడింది. మెరిట్ ఉన్న విద్యార్థులకు సాధారణ కాలేజీల్లో, మెరిట్ లేని విద్యార్థులకు టాప్ కాలేజీల్లో సీట్లు లభించాయి. వెంటనే ఆ తప్పిదాన్ని సీజీజీ గుర్తించినా ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకుపోలేదు. ఈ విషయాన్ని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు తెలియజేయలేదు. మరోవైపు అనేక మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందారు. ఇవన్నీ పూర్తయ్యే సమయంలో గురువారం చావు కబురు చల్లగా చెప్పింది. ‘మీకు సీటు ఆ కాలేజీలో కాదు.. మరో కాలేజీలో కేటాయించాం... అందులో చేరండి..’అంటూ సమాచారం పంపడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఇలా దాదాపు 2,900 మంది విద్యార్థులు సీట్లు మారిపోయాయని, 92 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం వందల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 17న మళ్లీ సీట్ల కేటాయింపు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కమిటీ ఆధ్వర్యంలో జూన్, జూలై నెలల్లో ఒకటి, రెండో దశల కౌన్సెలింగ్ను సీజీజీ నిర్వహించింది. ఇందులో దాదాపు 2 లక్షల మందికి సీట్లను కేటాయించగా, 1.51 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇక మూడో దశ కౌన్సెలింగ్ను గత నెల 21వ తేదీ నుంచి నిర్వహించింది. గత నెల 31వ తేదీ వరకు 78 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 4వ తేదీన సీట్లను కేటాయించాల్సి ఉండగా ప్రాసెస్ పూర్తి కాలేదని 9వ తేదీకి వాయిదా వేసింది. 9వ తేదీ రాత్రి 72 వేల మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. ఆ కేటాయింపులకు చేసిన సీట్ మ్యాట్రిక్స్లో తప్పులు దొర్లినట్లు ఈ నెల 11న గుర్తించింది. కొన్ని ఉర్దూ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరగకపోవడంతో ఆ అంశంపై దృష్టి సారించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఈ నెల 17న తాజాగా మళ్లీ సీట్లను కేటాయించింది. దీంతో దాదాపు 2,900 మంది సీట్లు మారిపోయాయి. 92 మంది సీట్లు గల్లంతయ్యాయి. సీట్లు మారాయని, తాజాగా సీటు వచ్చిన కాలేజీలో చేరండని మెసేజ్లు రావడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. అప్పటికే అనేక మంది కాలేజీల్లో చేరిపోయారు. ఇప్పుడేం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ప్రవేశాలు చేసుకునే 28 కాలేజీల్లోనూ సీజీజీ సీట్లను కేటాయించింది. తీరా విద్యార్థులు అక్కడికి వెళితే వారిని చేర్చుకోవడం లేదు. ఒకటీ రెండురోజుల్లో కమిటీ సమావేశం నిర్వహించి విద్యార్థులెవరికీ అన్యాయం జరక్కుండా తగిన నిర్ణయం తీసుకుంటామని మండలి ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. -
డిగ్రీ తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
♦ ఈనెల 22 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ♦ ఆగస్టు 4న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ నిర్వహణకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. ఈనెల 20వ తేదీ నుంచే తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించాలని భావించినా, ఏర్పాట్లకు సమయం సరిపోదన్న ఆలోచనతో ఈనెల 22కు వాయిదా వేసింది. ఆ మేరకు ఈనెల 22 నుంచి 31 వరకు తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్ను నిర్వహించాలని కమిటీ బుధవారం నిర్ణయించింది. దీని కోసం మీసేవా కేంద్రాల్లో అథెంటికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీన సీట్లను కేటాయించనుంది. సీట్లు పొందిన విద్యార్థులంతా ఆగస్టు 4వ తేదీ నుంచి 11లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కమిటీ పేర్కొంది. మొదటి, రెండు దశల్లో సీట్లు పొందిన వారిలో 1,51,588 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, తుది దశ కౌన్సెలింగ్లో 2,57,479 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
డిగ్రీలో 1.4 లక్షల సీట్లు భర్తీ
సీట్ల కేటాయింపు ప్రకటించిన ఉన్నత విద్యామండలి 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా 1,40,033 మంది విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి సీట్లను కేటాయిం చింది. ఆరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గత నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. వాటి సీట్ల కేటాయింపును గురువారం ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్లు, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కన్వీనర్ (దోస్త్), కోకన్వీనర్ వెంకటాచలం, మల్లేష్ ప్రకటించారు. వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్న 1,52,900 మందిలో 1,40,033 మందికి సీట్లను కేటాయించినట్లు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన 14 కాలేజీలు ఆన్లైన్ పరిధిలో లేవని, 28 కాలేజీలు ఉన్నా కోర్టు కేసు ఉన్నందునా వాటిల్లో ఆప్షన్లు ఇచ్చిన 7,500 మందికి సీట్ల కేటాయింపు చేయలేదని వెల్లడించారు. కోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామన్నారు. విద్యార్థులు ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని, ఈ నెల 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. నచ్చకపోతే మరో కాలేజీకి వెళ్లొచ్చు... సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీటు కన్ఫర్మేషన్ కోసం కాలేజీలకు వెళ్లే విద్యార్థులను తమ కాలేజీల్లోనే చేరాలంటూ ఒత్తిడి చేస్తే, ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని వెంకటాచలం, మల్లేష్ చెప్పారు. అయితే ప్రతి విద్యార్థి ముందుగా సీటు వచ్చిన కాలేజీకి వెళ్లి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు. ఒకవేళ ఆ కాలేజీలో చేరడం ఇష్టం లేకపోతే ముందుగా కన్ఫర్మ్ చేసుకున్నాకే రెండో దశ కౌన్సెలింగ్లో స్లైడింగ్కు వెళ్లాలన్నారు.విద్యార్థులు ముం దుగానే కాలేజీల్లో ఫీజులు చెల్లించవద్దని, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వవదన్నారు. 17 నుంచి అథెంటికేషన్... ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇప్పటివరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోని వారు శనివారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఈసేవా/హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. ఆ తరువాత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ నెల 21 నుంచి 24 లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇప్పటికే సీట్లు పొందిన వారు స్లైడింగ్కు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఈనెల 28న వారికి సీట్లను కేటాయిస్తామన్నారు. రెండో దశ, చివరి దశ కౌన్సెలింగ్ వివరాలు... జూన్ 17 నుంచి 20 వరకు: హెల్ప్లైన్/ఈసేవా కేంద్రాల్లో కొత్త విద్యార్థుల ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్; రిజిస్ట్రేషన్. జూన్ 21–24: ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం జూన్ 28: సీట్లు కేటాయింపు జూన్ 29– జూలై 3: సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్ జూలై 4–8: చివరి దశ వెబ్ ఆప్షన్లు జూలై 13: చివరి దశ సీట్లు కేటాయింపు జూలై 14–18: సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్ -
డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫైనలియర్ (రెగ్యులర్/ సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాలను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజగోపాల్ సోమవారం విడుదల చేశారు. బీఏ 68.59 శాతం, బీఎస్సీ 48.01, బీకాం 35.54, బీబీఎంలో 72.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. స్కూసెట్లో ర్యాంకులు సాధించే విద్యార్థులు పీజీ ప్రవేశాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే డిగ్రీ ఫలితాలను ముందే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎంఏ ఆనంద్, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ ఏప్రిల్–2017 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రివాల్యుయేషన్కు మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ నెల 5వ తేదీలోపల www.ruexms.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రివాల్యుయేషన్ ఫీజు రూ.300ను విద్యార్థులు ఆయా కళాశాలల్లోనే చెల్లించాలన్నారు. ఒక్క సబ్జెక్టు మాత్రమే ఫెయిలైన మూడో సంవత్సరం విద్యార్థులు మాత్రం ఇన్స్టంట్ పరీక్షకు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇన్స్టంట్ పరీక్ష జూన్ 20వ తేదీన జరుగుతుందన్నారు. కళాశాలల యాజమాన్యాలు..విద్యార్థుల జాబితా, ఆన్లైన్ చలానాలను జూన్ 7వ తేదీలోపల వర్సిటీకి చేర్చాలని పేర్కొన్నారు. -
డిగ్రీ ఫలితాలు విడుదల
-జబ్లింగ్ విధానం అమలుతో తగ్గిన ఉత్తీర్ణత శాతం కర్నూలు(ఆర్యూ): డిగ్రీ పరీక్ష ఫలితాలను రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వై.నరసింహులు శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మయిలు సత్తా చాటారు. మొత్తం మీద ఉత్తీర్ణత 42 శాతానికి మించలేదు. రెండో సెమిస్టర్కు 16,138 మంది హాజరవ్వగా 4,995 మంది (30.95 శాతం) ఉత్తీర్ణులయ్యారు. నాలుగో సెమిస్టర్కు 14,075 మందికి గాను 5,815 మంది(41.31 శాతం), మూడో సంవత్సరం విద్యార్థుల్లో 13,948 మంది హాజరవ్వగా, 5,810 మంది(41.65 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోల్చగా ఈ సంవత్సరం ఫలితాల శాతం దారుణంగా తగ్గింది. దీనికి జంబ్లింగ్ విధానంలో పరీక్షల నిర్వహణే కారణంగా తెలుస్తోంది. మొత్తం బాలికలు 5,954 మంది పరీక్ష రాయగా 3,079 మంది(51.71 శాతం) పాసయ్యారు. బాలురు 10,184 మంది హాజరవ్వగా 1,916(18.81 శాతం) మాత్రమే పాసయ్యారు. బాలురు బీబీఏలో అత్యధికంగా 50.27 శాతం మంది, బాలికలు బీసీఏలో 92.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థులు వారి సమాధాన పత్రాల మీద కళాశాల కోడ్ పొందుపర్చకపోవడంతో వారి ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు. విద్యార్థులు ఫలితాలను www.ruk.ac.in, ruexams.in అనే వెబ్సైట్లో శనివారం నుంచి చూసుకోవచ్చు. ఏప్రిల్ 2017 పరీక్షల్లో మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షలు రాసి ఒక్క సబ్జెక్టు ఫెయిలై ఉంటే ఇన్స్టంట్ పరీక్ష నిర్వహిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
-53.59 శాతం ఉత్తీర్ణత రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఎం. \ముత్యాలునాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కళాశాలల నుంచి 20,397 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, వారిలో 10,930 మంది ఉత్తీర్ణులయ్యారు. 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది సాధించిన 48.64 శాతం ఉత్తీర్ణత కంటే అధికంగా ఫలితాలను సాధించడానికి కారకులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వీసీ అభినందించారు. సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందించడమే లక్ష్యంగా తమ యూనివర్సిటీ ముందంజ వేస్తుందన్నారు. మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు : సబ్జెక్టుల వారీగా మొదటి మూడు స్థానాలను అందుకున్న విద్యార్థుల వివరాలను కూడా వీసీ ప్రకటించారు. బీఏ : నీలపు లీలాభవాని, బొచ్చ జానకి, యర్రా మంజుల. బీ ఏ (ఫిలాసఫీ) : పొలిశెట్టి బాలసంతోషి, మద్దాల రవి, సి.పౌలు, బీఎస్సీ : నంబూరి సాయినాగలక్ష్మిప్రసన్న, సూతపల్లి సాయిసుధ, ముత్యాల జయశ్రీ, బీఎస్సీ (హోమ్ సైన్స్) : చల్లా దుర్గాభవాని, అంకంరెడ్డి చంద్రిక, ఉండ్రాజవరపు ప్రియాంక. బీఎస్సీ (ఫుడ్టెక్నాలజీ): యు.పావని, కేఎస్ఎస్ హారిక, పరమట దుర్గాతేజస్వి బీకాం : నున్నా రత్నం శిరీషా, రాయి వాసవి, బలభద్రుని ప్రత్యూష. బీకాం (ఒకేషనల్) : సోమిశెట్టి నిఖిల, తణుకు కల్యాణì పద్మనాగరాణి, విద్యాల కృష్ణకుమారి. బీఏఏ : అడుసుమిల్లి మహేశ్వరి, ఏలిశెట్టి అఖిల, తమ్మన అజయ్కుమార్. బీవీఎం : మేడపాటి మౌనిక, రుషాలి జైన్, పుల్లేపు సౌజన్యకుమారి. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు మే 5న నోటిఫికేషన్!
8 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేయాలని ఆన్లైన్ ప్రవేశాల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించింది. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమైన కమిటీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. తాత్కాలిక షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేసి, 8 నుంచి 22 వరకు దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొదటి దశ సీట్ల కేటాయింపును వచ్చే నెల 28న ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక షెడ్యూలులో కొంత మార్పు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడంతో పాటు ఆధార్ నంబర్ కూడా కచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించింది. గతేడాది ఆన్లైన్ ప్రవేశాల పరిధిలోకి రాని 45 కాలేజీలను కూడా ఈసారి ఆన్లైన్ ప్రవేశాలల్లోకి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. డిగ్రీ కాలేజీల్లోనూ కామన్ ఫీజు విధానం తీసుకురావాలని నిర్ణయించింది. -
నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో రెండు, నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ రెడ్డివెంకటరాజు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్మార్క్ విధానం అమలు చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన సమయం కంటే గంట ముందు పరీక్ష కేంద్రం వద్దకు రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిచ్చేదిలేదన్నారు. ఏప్రిల్ 28న పాలిసెట్ పరీక్ష ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు. -
15 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
–36 వేల మంది పరీక్షలకు దరఖాస్తు –తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రాలకు వాటర్మార్క్ విధానం అమలు ఎస్కేయూ : వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 36 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో (సంవత్సరానికి ఒక్క సారి జరిపే) అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నాపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్న నేపథ్యంలో వివాదస్పదమైంది. దీంతో సెమిస్టర్ పరీక్షలు పకడ్భందీగా జరిపేందుకు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టంగా అమలు చేయగలిగితే : తొలిసారిగా ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్ విధానం ద్వారా పంపే పద్ధతికి శ్రీకారం చుట్టారు. గతంలో నేరుగా ప్రశ్నాపత్రాన్ని పరీక్ష కేంద్రాలకు చేరవేసే విధానంలో వర్సిటీ అబ్జర్వర్ సమక్షంలో ప్రశ్నాపత్రాలు తీసేవారు. కానీ తాజాగా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ను వర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారులు నేరుగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ అధికార మెయిల్కు, సెల్ఫోన్ నెంబర్కు మెసేజ్ పంపుతారు. ఈ పాస్వర్డ్ ద్వారా గంట ముందు ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది. జంబ్లింగ్ విధానం అయినప్పటికీ , విద్యార్థులను పరీక్షలకు అరగంట ముందు వరకు కళాశాల వద్ద ఉంచుకొని ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అన్నీ విద్యార్థులకు తెలియపరిచి .. కేవలం 15 నిమిషాల ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో డిగ్రీ కళాశాలలు దగ్గరగా ఉండడంతో ఈ విధానం సులువుగా అమలుచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే విద్యార్థులకు ప్రశ్నలు తెలియపరచడం, జంబ్లింగ్ పడ్డ కేంద్రానికి విద్యార్థులను నేరుగా కళాశాల బస్సుల్లోనే తరలిస్తూ.. విద్యార్థులకు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు చేరవేయడంతో గత వారం బీకాం ఫైనలియర్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్మార్క్ విధానంను సెమిస్టర్ పరీక్షలకు అమలు చేస్తున్నారు. దీంతో వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందో ..పసిగట్టే అవకాశం ఉంది . ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కళాశాలలకు ఇవ్వకముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పరీక్షల విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
12 మంది డిగ్రీ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, పత్తికొండ రాఘవేంద్ర కళాశాలకు చెందిన ఇద్దరు, ఆలూరు రాఘవేంద్ర కళాశాలకు చెందిన నలుగురు, ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి, బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
23 మంది విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): శనివారం జరిగిన రెండో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్కు పాల్పడిన 23 విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. నందికొట్కూరు వైష్ణవి కళాశాలలో ఇద్దరు, కర్నూలు డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోవెలకుంట్ల ఎస్.వి డిగ్రీ కళాశాల సెంటర్లో ముగ్గురు, ఎమ్మిగనూరు రావూస్ కళాశాల సెంటర్లో ఇద్దరు, వైష్ణవి డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోడుమూరు సాయిరాం సెంటర్లో 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు రోజులుగా మొత్తం 31 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యార్థుల పరీక్ష పేపర్లను తనిఖీ చేసి ప్రత్యేక కమిటీ నిర్ణయం ద్వారా ఒకటి లేదా రెండుసార్లు పరీక్షలకు అనుమతించకుండా చేసే అవకాశాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. -
ఏయూ డిగ్రీ పేపర్ లీక్
⇒ వాట్సాప్లో ప్రత్యక్షమైన గణిత ప్రశ్నపత్రం ⇒ పరీక్షను రద్దు చేసిన అధికారులు విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (ఏయూ) జరుగుతున్న డిగ్రీ మూడో సంవత్సర గణిత ప్రశ్నపత్రం లీకైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన గణితం పేపర్ 3 లీనియర్ ఆల్జీబ్రా ప్రశ్నపత్రం ముందుగానే బయటకు పొక్కింది. ఇది వాట్సాప్లో విద్యార్థుల మధ్య పంపిణీ జరిగినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. ప్రశ్నపత్రం లీకైందనే సమాచారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సంస్థలకు అందింది. దీన్ని సరిచూసుకోవడానికి ఆ ప్రశ్నపత్రాన్ని ఏయూ అధికారులకు పంపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేతృత్వంలో అధికారులు వాట్సాప్లో వచ్చిన ప్రశ్నపత్రాన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న అసలు ప్రశ్నపత్రంతో సరిచూశారు. ప్రశ్నలు, ప్రశ్నపత్రం కోడ్ సరిపోవడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పరీక్షను వెంటనే రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. పరీక్షల విభాగం అధికారులు ఈ సమాచారాన్ని ఇతర కళాశాలలకు అందించినప్పటికీ దాదాపు అన్ని కళాశాలల్లో అప్పటికే బండిల్స్ తెరిచారు. ఇక చేసేది లేక ప్రశ్నపత్రాలను తిరిగి తమకు పంపాలని ఆదేశించారు. ప్రత్యేక పరిశీలకులను పరీక్షలు జరుగుతున్న కేంద్రాలకు పంపారు. కేవలం గణిత ప్రశ్నపత్రం ఒక్కటే బయటకువచ్చిందా, మరికొన్ని కూడా వచ్చాయా అనే దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరాతీస్తున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం నుంచి బయటకు వచ్చిందా, అనుబంధ కళాశాలల నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. ‘గణితం ప్రశ్నపత్రం రద్దు చేశాం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తాం. ప్రశ్నపత్రం లీక్పై పూర్తి స్థాయి విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్ వి. ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఎట్టకేలకు జుకర్ బర్గ్ చేతికి డిగ్రీ పట్టా!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అధినేతగా, హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్గా అందరికీ సుపరిచితమైన మార్క్ జుకర్ బర్గ్ ఎట్లకేలకు డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. మే నెలలో జరుగబోతున్న హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. ప్రారంభోత్సవ ప్రసంగానికి వస్తున్న మార్క్ జుకర్ బర్గ్ కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఫేస్ బుక్ ను స్థాపించిన మార్క్ జుకర్ బర్గ్, డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న సమయంలోనే అంటే 2004లోనే హార్వర్డ్ స్కూల్ నుంచి బయటికి వచ్చేశారు. తన పూర్తికాల సమయాన్ని ఫేస్ బుక్ పైనే వెచ్చించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎక్కువగా ఫేమస్ అయిన ఫేస్ బుక్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ యూజర్లున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్న అతిపిన్న వయస్కుడిగా మార్క్ జుకర్ వర్క్ గుర్తింపులోకి రానున్నారని హార్వర్డ్ డైలీ స్టూడెంట్ న్యూస్ పేపర్ ది హార్వర్డ్ క్రిమ్సన్ నోట్స్ లో తెలిపింది. రెండు విధాలుగా హార్వర్డ్ డిగ్రీని సంపాదించుకునే అవకాశం ఆ స్కూల్ కల్పిస్తోంది. ఒకటి రెగ్యులర్ గా క్లాసెస్ కు వెళ్లి డిగ్రీ సంపాదించడం లేదా ప్రపంచ రూపురేఖలనే మార్చే కంపెనీని ఏర్పాటు చేయడం. -
డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
ఎస్కేయూ : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం (అటానమస్) డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను ఎస్కేయూ వీసీ ఆచార్య రాజగోపాల్ తన ఛాంబర్లో సోమవారం విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో 1,780 మంది విద్యార్థులు హాజరుకాగా 770 మంది ఉత్తీర్ణులయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్లో 321 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 240 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలి తాలను ఠీఠీఠీ.జఛీఛ్చ్టిp.ౌటజ ద్వారా తెలుసుకోవచ్చు. కార్యక్రమం లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ¯ŒS.రంగస్వామి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ జానకిరామ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ శ్రీ,అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
గడువులోగా చదువు పూర్తిచేయాల్సిందే
న్యూఢిల్లీ: డిగ్రీని గడువులోగా పూర్తిచేయలేని అభ్యర్థులకు వరంలా ఉన్న ‘ప్రత్యేక నిబంధన’ను రద్దు చేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం, వివాహం ఇతర కారణాలతో హాజరు కాలేని విద్యార్థులకు ప్రత్యేకంగా సమయం ఇస్తున్నట్లు వర్సిటీ పాలక మండలి(ఈసీ) సభ్యులు తెలిపారు. విశ్వవిద్యాలయం నియమనిబంధనల ప్రకారం కళాశాలలో చేరిన నాటి నుంచి డిగ్రీ విద్యార్థులు ఆరేళ్ల్లలో, పీజీ విద్యార్థులు నాలుగేళ్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక వేళ పూర్తి చేయలేకపోతే విశ్వవిద్యాలయం ఆ పట్టాలను పరిగణనలోకి తీసుకోదు. ప్రత్యేక నిబంధన ప్రకారం గైర్హాజరుకు సరైన కారణం చూపితే చదువు పూర్తిచేయడానికి ఎటువంటి కాల పరిమితి లేదు. -
50 శాతం చాలు
గురుకుల’ నియామకాల అర్హతలను సవరించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరిం చింది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులు ఉంటే చాలని స్పష్టం చేసింది. పీజీటీ అభ్యర్థులకు మూడేళ్ల బోధన అనుభవం లేకున్నా అవకాశమివ్వాలని నిర్ణ యించింది. మొత్తంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టు లకు డిగ్రీలో 60 శాతం మార్కులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులతోపాటు మూడేళ్ల బోధన అనుభవం ఉండాలంటూ సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులుంటే చాలన్న ఎన్సీటీఈ నిబంధనలను ఉటంకిస్తూ ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ఎక్కువమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు వెంటనే కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలను, గతంలో అనుసరించిన విధా నాలు, న్యాయస్థానాల తీర్పులను పాటించా లని సూచించారు. గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడంతో పాటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడమే లక్ష్యంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం చాలని, 60 శాతం మార్కులుండాలనే నిబం ధన తొలగించాలని ఆదేశించారు. మూడేళ్ల బోధన అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సూచించారు. డిగ్రీ, బీఎడ్, టెట్ అర్హత ఉన్న వారందరికీ ఎలాంటి బోధన అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలన్నారు. ఇక తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తినీ సీఎం పరిగణన లోకి తీసుకున్నారు. ఇందుకోసం ఎన్సీటీఈ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. అయితే ఏ మీడియం విద్యార్థులకు, ఏ మీడియంలో బోధించేందుకు నియామకాలు జరుగు తున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహిం చాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గురుకుల నియామకాలకు తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున.. అభ్యర్థులు ఇంగిష్ మీడియం లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. -
తప్పుల తడకగా డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
గుత్తి : గత గురువారం ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ సంప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయి. బాగా రాసిన విద్యార్థులకు కూడా 0,1,2,3 చొప్పున మార్కులు వేశారు. అంతేకాకుండా నూరు మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్కు 70 మార్కులు, 70 మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్కు వంద మార్కులు చూపించారు. సబ్జెక్ట్ పేర్లు కూడా తప్పుగా వచ్చాయి. దీంతో విద్యార్థు«లు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థులు మార్కుల జాబితా తప్పుల తడకపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఫస్టియర్, సెకెండియర్ విద్యార్థులు ఎస్.సాయి యశ్వంత్, రోషన్, మల్లికార్జున, నవీన్, నరేష్, జిలాన్, మధుమతి, రేణుక తదితరులు మాట్లాడుతూ బాగా రాసిన సబ్జెక్టుల్లో కూడా 0, 1, 2 ,3 మార్కుల చొప్పున వేయడం దారుణమన్నారు. సెకెండియర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్కు మాగ్జిమమ్ 70 మార్కులయితే మార్కుల జాబితాలో 100 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మాగ్జిమమ్ మార్కులు 100 ఉండాలని, 70 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా ప్రోగ్రామింగ్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్టుకు మాగ్జిమమ్ మార్కులు 70 ఉండాల్సి ఉండగా 100 మార్కులుగా చూపించారన్నారు. ఇలా ప్రతి పాయింట్ తప్పుగా మార్కుల జాబితా రూపొందించారన్నారు. ఽఅదేవిధంగా ఇంప్రూవ్ మెంట్ రాసిన విద్యార్థులకు కూడా వంద మార్కులకు గాను 0, 1, 2, 12,13, 14 మార్కుల చొప్పున వేశారన్నారు. ఈ విషయంపై శ్రీసాయి డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ శివారెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ ఫస్టియర్, సెకెకండియర్ ఫరీక్షా ఫలితాలు పూర్తి తప్పుల తడకగా ఉన్నాయన్నారు. -
‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’
-
‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’
న్యూఢిల్లీ: 1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ప్రధాని మోదీ 1978లో డిగ్రీ పాసయ్యారని డీయూ గతంలో పేర్కొనడం తెలిసిందే. 1978లో డీయూలో బీఏ పరీక్షలు ఎంతమంది రాశారు, ఎంత మంది పాసయ్యారు తెలపాల్సిందిగా నీరజ్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. ఆ వివరాలన్నీ వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయంటూ విశ్వవిద్యాలయ కేంద్ర ప్రజా సమాచార అధికారి మీనాక్షి సహాయ్ వాటిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ వివరాలను తనిఖీ చేసుకోడానికి అనుమతించడంతోపాటు ఒక కాపీని ఉచితంగా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు తాజాగా మీనాక్షి సహాయ్ని ఆదేశించారు. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన న్యాయవాది మహమ్మద్ ఇర్సద్ వేసిన పిటిషన్ను విచారిస్తూ మీనాక్షికి రూ.25,000 జరిమానాను కూడా మాడభూషి విధించారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిల హావా
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. గతేడాది నవంబరులో నిర్వహించిన మొదటి, మూడవ సెమిస్టర్, సíప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆర్యూ వీసీ వై.నరసింహులు, రిజిస్ట్రార్ అమర్నాథ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 16,944 మంది విద్యార్థులకుగాను 9743 మంది, మూడవ సెమిస్టర్ పరీక్షల్లో 14,410 మందికిగాను 8088 మంది ఉత్తీర్ణులయ్యారు. సఫ్లిమెంటరీ పరీక్షల్లో 14,692 మంది విద్యార్థులు హాజరైతే 8139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఠీఠీఠీ.టuజు.్చఛి.జీn, ట్ఛటu ్టట.టuజు.్చఛి.జీn, ఆయా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఆర్యూ సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు - బీఏలో అబ్బాయిలు 1838లో 992 మంది, అమ్మాయిలు 573కుగాను 425 మంది ఉత్తీర్ణులయ్యారు. బీబీఏలో అబ్బాయిలు 193కుగాను 105, అమ్మాయిలు 135కు 115 మంది, బీసీఏలో అబ్బాయిలు 128కిగాను 50, అమ్మాయిలు 39లో 30 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకామ్లో అబ్బాయిలు 4443లో 2042, అమ్మాయిలు 1626లో 1195, బీఎస్సీలో అబ్బాయిలు 4231లో 2032, అమ్మాయిలు 3766లో 2747 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో సెమిస్టర్.. - బీఏలో అబ్బాయిలు 1588లో 739 మంది, అమ్మాయిలు 659లో 428, బీబీఏలో అబ్బాయిలు 160లో 126 మంది, అమ్మాయిలు 118లో 115 మంది పాసయ్యారు. బీసీఏలో అబ్బాయిలు 34లో 16, అమ్మాయిలు 15లో 09 మంది, బీకామ్లో అబ్బాయిలు 3864లో 1311, అమ్మాయిలు 1642 మందిలో 1064, బీఎస్సీలో అబ్బాయిలు 3340లో 1806, అమ్మాయిలు 2975లో 2408 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. -
కల్లు తాగి యువకుడు మృతి
- నేత్ర దానానికి కుటుంబ సభ్యులు అంగీకారం కల్లూరు: కల్లుకు బానిసైన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మంగళవారం కల్లూరు అర్బన్లోని శరీన్నగర్లో నివాసం ఉంటున్న సత్యబాబు, వెంకటలక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎం. విశ్వనాథం డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మంగళవారం శరీన్నగర్లోని కల్లు పెంట వద్దే మత్తులో పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విశ్వనాథం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు నేత్రాలను సేకరించారు. -
డిగ్రీ ముల్యాంకనంలో ముసలం!
- చీఫ్ల నియామకంలో వివాదం - ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు - ముల్యాంకనాన్ని బహిష్కరించిన ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు - రెండు రోజులుగా నత్తనడకన గణితం, కెమిస్ట్రి సబ్జెక్టుల ముల్యాంకనం కర్నూలు సిటీ: రాయల సీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీ సెమిస్టర్ పరీక్షల ముల్యాంకనంలో ముసలం పుట్టింది. బి క్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనం పర్యవేక్షణ కోసం చేపట్టిన చీఫ్ల నియమాకాలకు సంబంధించి ప్రభుత్వం, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీల అధ్యాపకుల మధ్య వివాదం చేలరేగింది. దీంతో ఎయిడెడ్, ఆన్ఎయిడెడ్ కాలేజీలకు చెందిన గణితం, రసాయన శాస్త్రాల అధ్యాపకులు విధులను బహిష్కరించడం చర్చనియాంశంగా మారింది. ఈ నెల 10 తేదీ నుంచి మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల మూడవ దశ కింద జువాలజి, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన ముల్యాంకనం జరుగుతోంది. స్పాట్ ఎవాల్యుయేషన్ జరుగుతున్న కేంద్రమైన పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతున్ క్యాంపు ఆఫీసర్గా ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా ఉన్న వారిలో ఒక్కరు స్ట్రాంగ్ రూంకు, మరొకరు ఎవాల్యుయేషన్ జరిగే కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. ప్రతి సబ్జెక్టు ఎవాల్యుయేషన్కు హాజరయ్యే అసిస్టెంట్ ముల్యాంకన అధికారుల సంఖ్యను బట్టీ ప్రతి ఐదుగురిలో ఒకరిని చీఫ్ ఎవ్యాలుయేషన్గా నియమించాలి. కానీ అసిస్టెంట్ క్యాంపు అధికారి యూనివర్సిటీ నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తక్కువ సర్వీస్ ఉన్న వారిని నియమించారనే విమర్శలున్నాయి. ఈ కారణంతోనే ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు స్పాట్ విధులను బహిష్కరించినట్లు వారు చెబుతున్నారు. రాయల సీమ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ డీగ్రీ కాలేజీలు 14, ఎయిడెడ్ కాలేజీలు 10, ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ కాలేజీలు 71, లా కాలేజీ 1 ప్రకారం మొత్తం 96 కాలేజీలున్నాయి. ఇవీ నిబంధనలు... - ఏ యూనివర్శిటీ పరిధిలోనైనా పరీక్షల ముల్యాంకనానికి వెళ్లేందుకు బోధనలో ఒకే కాలేజీలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. - వీరిని అసిస్టెంట్ ఎవాల్యుయేషన్గా పరిగణించాలి. - ప్రభుత్వ, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి బోధనలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని చీఫ్ ఎవాల్యుయేషనర్(సీఈ)గా నియమించాలి. ప్రస్తుతం ఈ అనుభవాన్ని పదేళ్లకే కుదించారు. ప్రస్తుతం ఇలా పాటిస్తున్నారు...! -చీఫ్ ఎవాల్యుయేషనర్లుగా 40 శాతం ప్రభుత్వం కాలేజీల వారు, 60 శాతం ఎయిడెడ్ అధ్యాపకులు ఉండాలనే నిబంధన తెచ్చారు. - 10 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వారిని కాదని, మూడేళ్ల అనుభవం ఉన్న ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులను సీఈలుగా నియమించారు. సీఈలుగా అనుభవం లేని వారిని నియమించారు - పి.వి భాస్కర్రెడ్డి, గణితం శాస్త్ర అధ్యాపకులు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనంలో నిర్దిష్ట అనుభవం లేని వారిని సీఈలుగా నియమిస్తున్నారు. సీఈలుగా 40 శాతం ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులే ఉండాలని అసిస్టెంట్ క్యాంపు అధికారి చెబుతున్నారు. నిబంధనలు విరుద్దంగా చేయడం వల్లే ముల్యాంకనాన్ని బహిష్కరించాం. సబ్జెక్టు బోర్డు చైర్మన్లను సంప్రదించకుండానే.... -ఎం.వి.ఎన్.వి ప్రసాద్ గుప్తా, రసాయన శాస్త్ర అధ్యాపకులుl సబ్జెక్టు బోర్డులోని సీనియర్స్తో సంప్రదించకుండానే సీఈ, ఏఈ టీంలను తయారు చేస్తున్నారు. అసిస్టెంట్ క్యాంపు అధికారుల తీరు మార్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల విబాగం కంట్రోలర్లు స్పందించాలి. ఆన్ ఎయిడెడ్ వారి కోసమే.. - డా. యన్ రంగారెడ్డి, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే నియమించాం. ఆన్ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను కూడా సీఈలుగా నియమించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా చేయలేమని చెప్పడంతోనే గణితం, రసాయన శాస్త్రం ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు వెళ్ళిపోయారు. ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను సీఈలుగా నిబంధనలకు విరుద్దంగా చేయడం కుదరదనే చెప్పాం. -
డిగ్రీ పరీక్షలు బాయ్కాట్..
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను బాయ్కాట్ చేస్తున్నాన్నట్లు ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు తమకు అందలేదని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం వెల్లడించింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఉపాధి కోర్సులు
కర్నూలు సిటీ: డిగ్రీలో వచ్చే ఏడాది నుంచి ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వైస్ చైర్మన్ నరసింహారావు, ఆర్యూ వీసీ నరసింహులు తెలిపారు. ఇందులో భాగంగా సీబీసీఎస్ సిలబస్లో చేయనున్న మార్పులపై శనివారం రాయలసీమ యూనివర్సిటీలో ఆయా యూనివర్సిటీలకు చెందిన వీసీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో రీజినల్ వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కోర్సుల్లో సెమిష్టర్ల వారీగా ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ఆదేశించిందన్నారు. ఈ మేరకు సీబీసీఎస్ సిలబస్తో పాటు ఫౌండేషన్ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. ఇందుకు రాష్ట్రంలో 100 డిగ్రీ కాలేజీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఇందుకు జేకేసీ సహకారం, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. అనంతరం కొత్త కోర్సులపై వీసీలు, డీన్లు, ప్రభుత్వ డిగీ కాలజీల ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. çసమాశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సుబ్బారావు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సభ్యులు వరుణ్, ఎస్వీ వీసీ దామోదరం పాల్గొన్నారు. -
28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. 92 డిగ్రీ కళాశాలల్లో 14,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా వాయిదాపడిన మొదటి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తేదీల ఖరారుపై శనివారం అధికారులు కసరత్తు చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ సోమవారం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఓర్వకల్లు: కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై రాగమయూరి–నన్నూరు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, కేశవరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద కుమారుడు మోహన్రెడ్డి(20) ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సమీపంలోని వైష్ణవి కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్పై కర్నూలు నుంచి పూడిచెర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోహన్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక సాయంత్రం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ద్వితీయ భాషను కొనసాగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : డిగ్రీ 4వ సెమిస్టర్లో ద్వితీయ భాషను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భాషా పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుకు విజ్ఞప్తి చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సంఘ కార్యదర్శి పి.దేవేంద్ర గుప్తా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన సీబీసీఎస్ సెమిస్టర్ విధానంలోని పాఠ్య ప్రణాళికలో ద్వితీయ భాషలైన తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ 4వ సెమిస్టర్లోని పాఠ్యాంశాల నుంచి తొలగించబడ్డాయని పేర్కొన్నారు. భాషా సాహిత్యం అధ్యయనం చేయకుంటే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లోపిస్తుందన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కేఎస్ లక్ష్మణరావును కలిసిన వారిలో డాక్టర్ సీహెచ్ ప్రవీణ్, సుభాష్ చౌహాన్, డాక్టర్ ఏ అంజనీకుమార్, డాక్టర్ పి.కిషోర్, జేవీ సుధీర్ కుమార్, జి.బలరామకృష్ణ, శ్రీరంగనాయకి, ఆర్జే శైలజ, వెంకటరత్నం తదితరులున్నారు. -
ఏయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యకేంద్రం ద్వారా బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు చేస్తోన్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తులు ఈనెల5, 6, 7 తేదీల్లో స్వీకరిస్తామని సీఆర్ఆర్ అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ ఎన్.వీర్రాజు చౌదరి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎల్.నాగేశ్వరరావు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. నిరే్ధశించిన రోజుల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సీఆర్ఆర్ క్యాంపస్లోని ఏయూ దూరవిద్య స్టడీసెంటర్లో అభ్యర్థులు తమ పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాలని కోరారు. వివరాలకు 08812–251645లో సంప్రదించాలని కోరారు. -
నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఉంచామన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి.మురళీధర్, సూపరింటెండెంట్ జి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పొడిగింపు
విద్యారణ్యపురి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపె¯ŒS యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్లకు రూ. 200 అపరాధ రుసుముతో అక్టోబర్ 6 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకట నలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారికి ప్రవేశ పరీక్ష లేకుండానే పీజీ కోర్సుల్లో అడ్మిష న్లు కల్పిస్తామన్నారు. ఎమ్మెస్సీ సై¯Œ్స విభాగాల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంట్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. బీ ఎస్సీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు ఎం ఏలో ఏదైనా కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. బీఆర్ఏఓయూ ఆ¯ŒSలై¯ŒS.ఇ¯ŒS పీజీ ఫస్టియర్ వెబ్సైట్లో రిజిసే్ట్రష¯ŒS దరఖాస్తులను డౌన్Sలోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కు 0870–2511862లో, హన్మకొండయూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సై¯Œ్స కాలేజీలోని ఓపె¯ŒSవర్సిటీ రీజినల్ సెంటర్లో సంప్రదించవచ్చన్నారు. ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో... ఓపె¯ŒS స్కూల్ టె¯ŒS్త, ఇంటర్లో ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ రాజీవ్, ఓపె¯ŒS స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ శంకర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తర గతిలో అడ్మిషన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఫీజు రూ. 700 ఉండగా.. రూ 100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు రూ. 800 అడ్మిష¯ŒS ఫీజు ఉండగా.. రూ.100 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఇంటర్లో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ లకు అడ్మిష¯ŒS ఫీజు రూ.1000, అపరాధ రుసు ము రూ. 200, ఓసీ అభ్యర్థులకు రూ. 1300, అపరాధ రుసుము రూ. 200 చెల్లించిప్రవేశాలు పొందాలని సూచించారు. ఏపీ ఆ¯ŒSలై¯ŒS, టీఎస్ ఆ¯ŒSలై¯ŒS, మీ సేవ ద్వా రా అడ్మిషన్లు పొందవచ్చని వారు చెప్పారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత స్టడీ సెంటర్లను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఆదిలాబాద్లో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య
-
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
మృతదేహంతో బంధువుల ఆందోళన పరకాల : అనుమానాస్పద స్థితిలో ఓ డిగ్రీ విద్యార్థిని మృతిచెందిన సంఘటన రేగొండ మండలంలోని చిన్నకొడెపాక శివారు విజ్జయ్యపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. రేగొండ మండలంలోని చిన్నకోడెపాక శివారు విజ్జయ్యపల్లికి చెందిన బైకాని పోషాలు కుమార్తె సంధ్య(20) పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలో సెకండియర్ చదువుతోంది. కళాశాలకు చెందిన బస్సులోనే రోజు అప్ అండ్ డౌన్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజూలాగే కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన సంధ్య పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందింది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేక పోవడంతో కళాశాలలోనే ఏమో జరిగి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఎస్వీ కళాశాల ఎదుట సంధ్య మృతదేహాన్ని వేసి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ నర్సింహులు, ఎస్సై సుధాకర్ కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. సంధ్య మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తొలగించేది లేదని స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. రాత్రి వరకు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
అపరాధ రుసుంతో ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుంతో ఈ¯ð lల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం ఇన్చార్జ్ కోఆర్డినేటర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సు ఫీజులు చెల్లించాలని కోరారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. -
మూడు రోజులు కాలేజీలు బంద్
ఫీజు బకాయిలు, డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళానికి నిరసనగా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలను గురువారం నుంచి శనివారం వరకు (మూడు రోజులు) బంద్ చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఆదివారం కలుపుకొని నాలుగు రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయనందుకు నిరసనగా, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా 20 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందలేని పరిస్థితి కల్పించిన అధికారుల వైఖరిని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, విజయభాస్కర్రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినా బకాయిలు విడుదల కాకపోవడం దారుణమన్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఈ-పాస్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో ఆన్లైన్ విధానంపై అవగాహన లేక వేల మంది విద్యార్థులు కాలేజీల్లో సీట్లు రాక నష్టపోయారని, వారికి మళ్లీ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
3 రోజుల పాటు డిగ్రీ కళాశాల బంద్
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయి స్కాలర్షిప్లను రిలీజ్ చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్æ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2016–17 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందని విద్యార్థులకు స్కాలర్షిప్తో కూడిన స్పాట్ అడ్మిషన్కు అవకాశం కల్పించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఫీజులను సమంజసంగా ఉండే విధంగా పెంచాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు కళాశాలల బంద్ను పాటించాలని కోరారు. -
కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 17 నుంచి జరగాల్సిండగా కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం సోమవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా పరీక్షలు వాయిదా వేయటంపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే పరీక్షల కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసిన అధికారులు ఇటీవలే టైంటేబుల్ ప్రకటించారు. తీరా పరీక్షల సమయం సమీపించాక పుష్కరాలపేరుతో వాయిదా వేయటం సరికాదని అంటున్నారు. కృష్ణా పుష్కరాల తేదీలను ప్రభుత్వం ముందే ప్రకటించినా పరీక్షల నిర్వాహకులు ఎగ్జామ్స్ టైంటేబుల్ ఎలా ప్రకటిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలను సాకుగా చూపిస్తున్నప్పటికీ అబ్జర్వర్లకు డ్యూటీల వేసే విషయంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అబ్జర్వర్ల డ్యూటీల కోసం పార్ట్టైం, కాంట్రాక్టు లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు పోటీ æపడుతున్నారు. అంతర్గతంగా అనేకరకాలు ఉన్న ఒత్తిళ్ల కారణంగానే పరీక్షల నిర్వహణలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. పరీక్షలు సమీపించాక కూడా హాల్టికెట్లు వెబ్సైట్లో పెట్టకపోవటం సమస్యగానే మారినట్లు సమాచారం. -
అడవిలో ఒక రోజు
పట్టుకోండి చూద్దాం ‘‘నువ్వు ఎన్నయినా చెప్పు... రణగొణ ధ్వనుల ఈ పట్టణ జీవితమంటే విరక్తి పుడుతుంది నాకు. ఈ కాంక్రిట్ జంగల్ని విడిచి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లి వద్దాం. ఏమంటావు?’’ అన్నాడు విజయ్. ‘‘ఇల్లే ప్రపంచం అనుకునే నువ్వే ఇలా అంటున్నావంటే మనం కచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాల్సిందే’’ అన్నాడు రాజ్. ‘‘ఎక్కడికి వెళదాం?’’ అడిగాడు విజయ్. ‘‘ ఈ కాంక్రిట్ జంగల్ని వదిలి నిజమైన జంగల్కే వెళదాం. కేరళ ఫారెస్ట్కు వెళదాం’’ అన్నాడు రాజ్. ‘‘ఏరా... నీ అభిప్రాయం ఏమిటి’’ అని శక్తి కుమార్ని అడిగారు ఇద్దరు. ఎప్పటిలాగే శక్తి శూన్యంలోకి చూశాడు. ‘‘వీడికి శక్తి అని పేరు పెట్టినోడ్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. వీడికి బాగా సరిపొయ్యే పేరు... లేజీ కుమార్ లేదా శక్తిహీన్’’ అని తాను నవ్వుతూ విజయ్ని నవ్వించాడు రాజ్. ‘‘ఏమిటిరా మీ గోల?’’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు శక్తి. విషయం చెప్పారు. ‘‘ ఓకే’’ చెప్పాడు శక్తి. రెండు రోజుల తరువాత... ముగ్గురు హైదరాబాద్ దాటారు. కేరళలో ఒక అడవి. ‘‘ఇక్కడ ఒక నెల ఉంటే చాలు పదకొండు నెలలు పచ్చగా,ఆరోగ్యంగా బతకవచ్చు’’ అనుకున్నారు ముగ్గురు. ఇప్పుడు మనం ఈ ముగ్గురు మిత్రుల గురించి ఒకసారి చెప్పుకోవాలి. విజయ్, రాజ్, శక్తి బాల్య మిత్రులు. డిగ్రీ తరువాత కొంత కాలం రాత్రీ పగలు నిరుద్యోగం చేశారు. ఇంట్లో వాళ్లు తిట్టడంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకొని, అనుకున్నంత పని చేశారు. అయితే నెల తిరక్కుండానే ముగ్గురూ...తాము చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు. ఆరోజు సాయంత్రం ముగ్గురు ఎప్పటిలాగే ట్యాంక్బండ్ మీద ఉన్న బెంచి మీద కూర్చున్నారు. ‘‘మనకు ఉద్యోగం చేయడం రాదు. వచ్చినా అది అట్టే కాలం నిలవదు. చూశారు కదా... ఒక్క నెల కూడా ఉద్యోగం చేయలేకపోయాం. నేను అనేది ఏమిటంటే, మనం ముగ్గురం ఏదైనా వ్యాపారం మొదలు పెడితే మంచిదని’’ అన్నాడు విజయ్. ‘‘గుడ్ ఐడియా’’ అని విజయ్ని ప్రశంసించాడు రాజ్. ‘‘నువ్వేమంటావు?’’ ఎప్పటిలాగే శక్తిని ప్రశ్నించారు ఇద్దరు.‘‘ఓకే’’ ఎప్పటిలాగే సమాధానం ఇచ్చాడు శక్తి. స్నేహితుల దగ్గర అప్పులు చేసి వ్యాపారం ప్రారంభించారు. పెద్దగా పోటీ లేకపోవడంతో అదృష్టవశాత్తు అయిదు సంవత్సరాలు తిరక్కుండానే ముగ్గురు లక్షాధికారులయ్యారు. వ్యాపారం వృద్ధి అవుతున్న కొద్దీ వారి స్నేహం పలచబారడం మొదలైంది. వ్యాపారం మీద ఆధిపత్యం కోసం చాప కింద నీరులా ముగ్గురు ఎవరి ప్రయత్నాలు వారు చేయడం మొదలైంది. ‘‘ఈ ఇద్దరినీ చంపితే... వ్యాపారమంతా నాదైపోతుంది...నేను కోటీశ్వరుడిని కావచ్చు’’ అని ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ఆలోచించడం మొదలైంది. తమ ఆలోచన ఆచరణలోకి రావడానికి వారికి అవకాశం వచ్చింది. ‘‘ఇంతకు మించి మంచి అవకాశం ఎప్పుడూ రాదు’’ అనుకున్నారు ముగ్గురు. ‘రాజ్, విజయ్లను ఎలా చంపాలి?’ అనే దాని గురించి శక్తి, ‘శక్తి, విజయ్లను ఎలా చంపాలి?’ అనేదాని గురించి రాజ్, ‘రాజ్, శక్తిలను ఎలా చంపాలి?’ అనేదాని గురించి విజయ్ మంచి పథకం రూపొందించుకున్నారు. అడవిలో ఒక చిన్న క్యాబిన్లో ముగ్గురు బస చేశారు. ఆరాత్రి ముగ్గరు బాగా తాగి, తిని నిద్రపోయారు. వాళ్లు గాఢంగ నిద్రలో ఉన్న సమయంలో అడవి అంటుకొంది. అదృష్టవశాత్తు ఆ క్యాబిన్ మంటల్లో చిక్కుకోలేదు. మరుసటి రోజు.... ఆ ముగ్గురు క్యాబిన్లో శవాలై కనిపించారు. వారు చనిపోవడానికి మంటలు కారణం కాదు. అలా జరిగి ఉంటే బూడిదైపోయేవారు. ఒకరిని ఒకరు పొడుచుకొని చనిపోయారు అని చెప్పడానికి ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. వాళ్లు తాగిన మందు, ఆహారపదార్థాల్లో విషపదార్థాల జాడేది లేదు. ఆ అడవిలో క్రూరమృగాలు కూడా లేవు. విషసర్పాలేవీ కుట్టలేదు. మరి ఆ ముగ్గురు ఎలా చనిపోయినట్లు?! కారణం: స్మోక్ ఇన్హేలేషన్.. పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు. -
బ్యాంకు ఉద్యోగాలకు బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ వెనుకబడితన తరగతుల సంక్షేమశాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో పేరొందిన బ్యాంకు కోచింగ్ సెంటర్ల నుంచి ఎన్టీఆర్ ఉన్నత విద్య ఆదరణ పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో పీఓ ఉద్యోగాలకు సంబంధించి 700 మందికి, క్లర్క్ ఉద్యోగాలకు 1250 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కాలం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుందన్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల్లోపు ఉండాలన్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ఈ ఆగస్టు 1వ తేది నాటికి 31 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. డిగ్రీ అర్హత కలిగి వైఎస్సార్జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీసీ విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా తమ దరఖాస్తులను డబ్లు్యడబ్లు్యడబ్లు్య.బీసీ వెల్ఫేర్.జీఓవీ.ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా పంపాలన్నారు. ఇతర వివరాలకు 08562–242526, 94910 54116, 970318 5382 నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
డిగ్రీలో మార్కులకు బదులుగా గ్రేడ్పాయింట్స్
ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్రెడ్డి జడ్చర్ల టౌన్ : మార్కులకు బదులుగా గ్రేడ్పాయింట్స్ ఇచ్చేలా యూజీసీ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చేపట్టిందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం బూర్గుల రామకృష్ణారావు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన సీబీసీఎస్ (చాయిల్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) వర్క్షాప్లో ఆయన పాల్గొని ప్రొజెక్టర్ ప్రదర్శన ద్వారా జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. డిగ్రీ విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయని, సంప్రదాయ విధానం కాకుండా విద్యార్థికి వెసులుబాటు కల్పించే విధంగా తనకు నచ్చి విషయాన్ని ఐచ్చికంగా ఎన్నుకోవచ్చన్నారు. సైన్స్ విద్యార్థి ఆర్ట్స్లో ఒక సబ్జెక్ట్ను ఐచ్చికంగా తీసుకొవచ్చన్నారు. పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాషల్లో ఒకదానిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వర్క్షాప్ను పాలమూరు యూనివర్సిటి రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి పర్యవేక్షించగా పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ భక్తవత్సల్రెడ్డి, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి, కళాశాల అధ్యాపకులు కృష్ణకుమార్, తమ్మిరెడ్డి, సురేష్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్ష వాయిదా
డిగ్రీ పరీక్ష వాయిదా Degree exams postponed degree, exams, postponed, au campus డిగ్రీ, పరీక్ష, వాయిదా, ఏయూ క్యాంపస్ ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన డిగ్రీ ద్వితీయ, తతీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్(పరీక్షలు) ఎస్.వి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చిన నేప«థ్యంలో పరీక్షలు వాయిదా వేశామనితెలిపారు. మంగళవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు జరగాల్సిన మూడో సంవత్సరం బీఏ, బీఎస్సీ పరీక్షలను ఈ నెల 8వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, అలాగే మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగాల్సిన బీఏ, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఈ నెల 9వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈమార్పును గమనించాలని సూచించారు. -
డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ!
కేయూ పరిధిలో ముగిసిన మూడో దశ దరఖాస్తు గడువు రెండు దశల్లో కలిపి 43,578 మందికి ప్రవేశాలు రేపు సీట్ల కేటాయింపు ఇప్పటివరకు 26 కళాశాలల్లో ప్రవేశాలే లేవు.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొదటి దశలో 41,909, రెండో దశలో 17,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పలువురు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. రెండు దశల్లో కలిపి మొత్తంగా 43,578 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా, యూనివర్సటీ పరిధిలోని 26 డిగ్రీ కళాశాలల్లో అసలు ఒక్కరు కూడా చేరకపోవడం గమనార్హం. మరో ఎనిమిది కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే చేరారు. దీంతో ఆయా కళాశాలలను మూసివేయక తప్పదనే భావన నెలకొంది. మూడో దశలో 4,943 దరఖాస్తులు యూనివర్సిటీ పరిధిలోని పెద్దసంఖ్యలో కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండడంతో మళ్లీ మూడో దశలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు, మొదటి దశలో సీట్లు రాని వారు, కొందరు కళాశాలల్లో చేరినా మార్పు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈ దశలో అవకాశం కల్పించారు. అయితే, మూడో దశలో ఆన్లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియగా మొత్తం 4,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 492మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ దశలో దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తులు చేసి ఇప్పుడు వెబ్ఆఫ్షన్లు ఇచ్చుకున్న వారికి, కళాశాలల మార్పునకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మంగళవారం సీట్ల కేటాయింపు జరగనుంది. ఆయా విద్యార్థులు 4వ తేదీన కళాశాలల్లో చేరా>ల్సి ఉంటుంది. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తంగా యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లలో 50శాతం సీట్లు కూడా భర్తీ అవుతాయా అనేది అనుమానంగా ఉంది. 50శాతంలోపే సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్కువ శాతం మేర భర్తీ కాగా మరికొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే సీట్లు నిండాయి. ఇక కొన్ని రకాల కాంబినేషన్ కోర్సులకైతే అసలే ఆదరణ లేనట్లు సమాచారం. అలాగే, పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. మూడో దశ సీట్ల కేటాయింపు, విద్యార్థుల చేరిక ప్రక్రియ పూర్తయితే తప్ప ఎన్ని సీట్లు మిగిలిపోతాయనే అంశం తేలనుంది. కాగా, 4వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. -
గురుకులాల్లో ఖాళీల భర్తీకి 2న కౌన్సెలింగ్
మహబూబ్నగర్ విద్యావిభాగం: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 2వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్లలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఏలో 94, బీకాంలో 134, బీఎస్సీ(ఎంపీసీ)లో 17, మొత్తం 245 ఖాళీలున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు 2న ఉదయం 10గంటలకు రాంరెడ్డిగూడ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినీలు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. -
గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
డిచ్పల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులకు మండలంలోని ధర్మారం(బి)గురుకుల కళాశాలలో శనివారం జిల్లా కో–ఆర్డినేటర్ జె.సాయినాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించినట్లు సాయినాథ్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్లలో ప్రారంభం కానున్న నూతన డిగ్రీ కళాశాలల్లో ఏడు కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం సొంత భవనాలు లేనందున దోమకొండలోని గురుకుల కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్లో అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ పూర్ణచందర్రావు, ఆయాlగురుకుల కళాశాలల ప్రిన్సిపాల్లు సి.సింధు, సరోజిని దేవి నాయుడు, సంగీత, వి.శోభారాణి, తులసీదాస్, ఆంజనేయులు, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు చివరి అవకాశం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం చివరి దశ ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల 25నుంచి 30వ తేది వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు దోస్త్ (డీవోఎస్టీ) వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోని వారు సైతం ఈ నెల 25 నుంచి 30వరకు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మొదటి, రెండవ దశల్లో పేర్లు నమోదు చేసుకున్న వారు పై తేదిల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఆగస్ట్ 2వ తేదిన సీట్ల కెటాయింపు ఉంటుందని, 4వ తేదిన సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కేంద్రం నియమించడం పట్ల సోషల్ మీడియా మంగళవారం తనదైన శైలిలో తీవ్రంగా మండిపడింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమారు అరెస్టు వ్యవహారంలో బస్సీ వ్యవహరించిన తీరు ప్రధానంగా వివాదాస్పదమైన విషయం తెల్సిందే. కేంద్రంలోని బీజేపీ నాయకులకు ఒత్తాసు పలికే బస్సీ పాటియాల కోర్టులో కన్హయ్య కుమార్పై జరిగిన దాడిని కూడా అడ్డుకోలేకపోయారు. పైగా యూనివ ర్శిటీలో జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన విద్యార్ధులకు పాకిస్తాన్ టైస్టు హఫీజ్ సయాద్ మద్దతు కూడా ఉందంటూ ఓ నకిలీ మెయిల్ను సృష్టించి అభాసుపాలు కూడా అయ్యారు. అలాంటి వ్యక్తిని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీసు సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు తదితర ముఖ్యమైన సర్వీసులకు అభ్యర్థులను ఎంపికచేసే యూపీఎస్సీ సభ్యుడిగా నియమించడం ఏమిటంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని ఒకరు....చేతకాని చెత్త బ్యూరోక్రట్లను ఎంపిక చేయడం కోసమే నియమించారని కొందరు వ్యాఖ్యానించారు. యూపీఎస్సీలో కూడా హిందూత్వ ఎజెండాను అమలు చేయడం కోసమని కొందరు, 2016కు యూపీఎస్సీ టాపర్ బస్సీయేనని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మి చేయడం కోసం బస్సీ రాకను పురస్కరించుకొని అప్పుడే యూపీఎస్సీలో ఫొటోషాప్, వీడియో టేప్ల ఎడిటింగ్ తరగతులను ప్రారంభించారని మరొకరు వ్యంగ్యోక్తులు విసిరారు. ఒక చైర్మన్ పది మంది సభ్యులుండే యూపీఎస్సీలో సభ్యుడి పదవి కాలం ఆరేళ్లయినప్పటికీ 60 ఏళ్ల బస్సీ ఐదేళ్ల పాటే ఆ పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే అందులో పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం 1977 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ బస్సీ. -
సర్టిఫికెట్ల విషయంలో ఎటువంటి ఒత్తిడీ లేదు!
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడీ లేదని, తమను ఏ శక్తీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ యూనివర్శిటీ వెల్లడించింది. మోదీ సర్టిఫికెట్ల ధృవీకరణ విషయంలో చట్ట ప్రకారమే పరిశీలనా కార్యక్రమం జరిగిందని వర్శిటీ ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ యూనివర్శిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీలని, వర్శిటీలో తాము స్వయంగా పరిశీలిస్తామన్న కేజ్రీవాల్... ధృవీకరణకోసం డీయూను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ల సమస్యపై వైస్ ఛాన్స్ లర్ యోగేష్ త్యాగితో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో వర్శిటీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గుతోందన్న ఆరోపణలు అసత్యాలని, యూనివర్శిటీ ఆర్టీఐ సెల్... చట్ట ప్రకారం పనిచేస్తుందని వీసీ తెలిపారు. ప్రధాని సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తరుణ్ దాస్ సైతం వెల్లడించారు. ఆప్ ప్రతినిధుల బృందం మోదీ బిఏ రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో వారు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాల్సి వచ్చిందని వీసీ అన్నారు. ప్రధానమంత్రి బిఏ, ఎంఏ డిగ్రీలు నకిలీలని, మార్క్స్ లిస్టుతోపాటు, సర్జిఫికెట్ పై ఆయన పేరులో కూడ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆప్ ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. మోదీ డిగ్రీ రికార్డులను బయట పెట్టిన వర్శిటీ... ఆయన సర్టిఫికెట్లు ప్రామాణికమైనవేనని, మార్కులిస్టులో చిన్నపాటి తప్పిదాలు మాత్రం కనిపించాయని తెలిపింది. అంతేకాక ఆయన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లకు సంబంధించిన అన్ని రికార్డులు తమవద్ద ఉన్నాయని దాస్ తెలిపారు. -
ఇక డిగ్రీలో బయోమెట్రిక్!
విద్యార్థులు, అధ్యాపకులకు తప్పనిసరిగా అమలు ఉన్నత విద్యా మండలి నిర్ణయం 75 శాతం హాజరుంటే నే పరీక్షలకు అనుమతి సెమిస్టర్ విధానం అమలు.. ఒక్కో సెమిస్టర్కు 90 పనిదినాలు నవంబర్లో మొదటి సెమిస్టర్, ఏప్రిల్లో రెండో సెమిస్టర్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. లెక్చరర్లు ఇకపై నెలకోసారి తమ రోజు వారీ పనితీరు నివేదికలను (టీచింగ్ డైరీ) కళాశాల విద్యాశాఖకు అందజేయాలని స్పష్టం చేసింది. అకడమిక్ కేలండర్ ప్రకారం ఏ రోజు ఏ పాఠం చెప్పాలి, తామేం చెప్పారన్న అంశాలపై టీచింగ్ డైరీ రాసి యూనివర్సిటీకి, అక్కడి నుంచి కళాశాల విద్య కమిషనరేట్కు అందజేయాలని సూచించింది. డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న సంస్కరణలపై సోమవారం మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని డిగ్రీ కాలేజీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేయా లని నిర్ణయించారు. యూనివర్సిటీలు ఇందుకు అవసరమైన చర్య లు చేపట్టడంతోపాటు సెమిస్టర్ విధానం అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. డిగ్రీలో యూనివర్సిటీ యూనిట్గా ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని అమలు చేయాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలో మూడు వరకు హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కామన్ అకడమిక్ కేలండర్ ప్రకారమే అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలు, విద్యా బోధన, పరీక్షలు జరగాలి. మే 1వ తేదీన డిగ్రీలో ప్రవే శాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే నెలాఖరుకల్లా ప్రవేశాలను పూర్తిచేసి... జూన్ రెండోవారంలో తరగతులు ప్రారంభిస్తారు. డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలు చేస్తారు. ఒక్కో సెమిస్టర్లో 90 రోజుల పనిదినాలు ఉంటాయి. ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో, రెండో సెమిస్టర్ పరీక్షలు తర్వాతి ఏడాది ఏప్రిల్లో నిర్వహిస్తారు. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానం ఉంటుంది. ► ప్రశ్నపత్రాలను మాత్రం యూనివర్సిటీల వారీగా తయారుచేసుకుని... కామన్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ► విద్యార్థులకు ప్రతి సెమిస్టర్లో 75 శాతం హాజరు ఉండాల్సిందే. లేకపోతే పరీక్షలకు అనుమతించరు. ► విద్యార్థులు, లెక్చరర్లకు కాలేజీలు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలి. ఈ హాజరు డాటాను యూనివర్సిటీకి, కళాశాల విద్యాశాఖకు, ఉన్నత విద్యా మండలి వెబ్సైట్కు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ► ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ► బోగస్ విద్యార్థులు, రెండు మూడు చోట్ల ప్రవేశాలను నిరోధించేందుకు విద్యార్థుల ఆధార్ నంబర్ తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే ఈ డాటాను ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన ఈ పాస్ వెబ్సైట్కు అనుసంధానం చేస్తారు. -
డిగ్రీ తర్వాత ఏది బెటర్?!
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ విద్య పూర్తి చేసిన తరువాతే సీఏ చదవడం ఉత్తమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఐసీఏఐ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆడిట్పై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చార్టర్డ్ అకౌంటెంన్సీ (సీఏ) చదవాలనే లక్ష్యం గల విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ పూర్తిచేసిన తరువాతే సీఏ కోర్సులో చేరడం మంచిదన్నారు. ఇంటర్మీడియెట్లో స్థాయిలో ఎంఈసీ కోర్సు అభ్యశించిన విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నప్పటికీ సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత శాతం అత్యంత తక్కువగా ఉంటోందని చెప్పారు. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు సీఏ కోర్సుపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఐసీఏఐ శాఖకు సొంత భవన నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. సీఏలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత రీతిలో ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. మార్కెట్ అవసరాలు, మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఏ కోర్సు సిలబస్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బ్యాంక్ ఆడిట్పై ఆడిటర్లకు అవగాహన కల్పించిన దేవరాజారెడ్డి సీఏ విద్యార్థులకు ఉపయోపడే సమాచారాన్ని అందించేందుకు ఐసీఏఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నాలెడ్జ్ కియోస్క్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఐఆర్సీ కౌన్సిల్ చైర్మన్ ఈ ఫల్గుణకుమార్, గుంటూరు శాఖ చైర్మన్ చేకూరి సాంబశివరావు, వైస్ చైర్మన్ చేగు అశోక్కుమార్, కార్యదర్శి కేవీ సుబ్బారావు, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, సికాస చైర్మన్ ఎన్ శివరామకృష్ణ, సభ్యులు, ఆడిటర్లు, సీఏలు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 వరకు జరిగే ఈ పరీక్షలకు ఎస్వీయూ పరీక్షల విభాగం అవసరమైన ఏర్పాట్లుచేసింది. ఎస్వీయూ పరిధిలో 136 డిగ్రీ కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాయడానికి వీలుగా అధికారులు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 39,583 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆమేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్బాబు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికీ ఇతర కళాశాలలకు చెందిన అధ్యాపకుడిని పరిశీలకుడిగా నియమించినట్లు చెప్పారు. మూడు బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్గా ఏర్పాటు చేశామన్నారు. -
లేటరల్ ఎంట్రీ ఇవ్వండి !
అర్ధంతరంగా ఉన్నత విద్యను మానేసిన వారికి తమ కోర్సు నిరాటంకంగా కొనసాగించేందుకు దూరవిద్యావిధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో ప్రవేశపెట్టారు. అయితే డిగ్రీ, పీజీ కోర్సులు అర్ధంతరంగా ఆపిన వారికి ఇతర వర్శిటీల్లోలా ఎస్కేయూలో కూడా లేటరల్ ఎంట్రీకి అనుమతివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. అవకాశం ఉంటే తాజాగా ఇచ్చిన నోటీఫికేషన్లోను అనుమతిచ్చే వెసలుబాటు కల్పించాలంటున్నారు. ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం 2015-16కి నూతన నోటిఫికేషన్ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేశారు. పీజీ, డిగ్రీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు నూతనంగా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అర్ధంతరంగా ఉన్నత విద్య మానేసిన వారికి తమ కోర్సును నిరాటంకంగా కొనసాగించడం, అలాంటి అవకాశం కల్పించడానికి దూరవిద్య విధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్సిటీలలో ప్రవేశపెట్టారు. దూరవిద్య విధానం మొదటి ప్రాధాన్యత ఇదే. కానీ ఎస్కేయూలో కేవలం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్ధంతరంగా మానేసిన వారికి అండ లేటరల్ ఎంట్రీ : డిగ్రీ, పీజీ కోర్సు చేస్తూ అర్ధంతరంగా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉన్నత విద్యను మధ్యలో ఆపేసిన వారు రాయలసీమ జిల్లాల్లో వేలాదిగా ఉన్నారు. వీరిలో సింహభాగం కోర్సు పూర్తీ చేయాలని ఉన్నా, అవకాశం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి ఆంధ్రా వర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర వర్సిటీల్లో లేటరల్ ఎంట్రీ కింద డిగ్రీ, పీజీ దరఖాస్తులు కల్పిస్తున్నారు. ఇందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి సైతం అంగీకరించింది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 177 అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్న ఎస్కేయూలో మాత్రం అలాంటి అవకాశం కల్పించలేదు. మొత్తం ఎస్కేయూ అధ్యయన కేంద్రాల్లో 60 వేల మంది డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. లేటరల్ ఎంట్రీ అంటే.. : రెగ్యులర్ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థి రెండో సంవత్సరం వరకు చదివి అర్ధంతరంగా చదువు ఆపేశాడు. అదే విద్యార్థికి దూరవిద్య విధానం ద్వారా చదివే అవకాశం కల్పించడాన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. అలాగే పొరుగు వర్సిటీల్లోని దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ కోర్సు అర్ధంతరంగా మానేసిన విద్యార్థికి ఎస్కేయూ దూరవిద్య విధానం ద్వారా ఉన్నత విద్య చదవడానికి తగిన అనుమతి ఇవ్వడం. ఈ తరహా విధానం ఎస్కేయూ దూరవిద్య విధానంలో అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కల్పిస్తే తాజాగా ఇచ్చే నోటిఫికేషన్లోనే అడ్మిషన్ పొందటానికి తగిన వెసలుబాటు కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఒకేసారి రెండు డిగ్రీలు కుదరదు: యూజీసీ
న్యూఢిల్లీ: విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు అనుమతించాలన్న ప్రతిపాదనకు ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని మంగళవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. అందువల్ల వర్సిటీలు గత నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంది. రెగ్యులర్ విధానంలో ఒక డిగ్రీ చేస్తున్న విద్యార్థి.. దూరవిద్య, లేదా ఓపెన్ విధానంలో మరో డిగ్రీ చేసేందుకు అనుమతించాలని యూజీసీ నిపుణుల కమిటీ గతంలో సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను అన్ని వర్గాలూ వ్యతిరేక రావడంతో తాజాగా వెల్లడించింది. -
చచ్చిపోతానని బెదిరిస్తోంది... ఏం చేయను?
జీవన గమనం డిగ్రీ పూర్తి చేశాను. నాకు పాటలు పాడటం ఇష్టం. సినీ రంగంలో ప్రయత్నించాలని ఉంది. కానీ అమ్మ, నాన్న ఒప్పుకోవడం లేదు. వాళ్లు చెప్పిన రంగంలోనే అడుగిడాలని బలవంతం చేస్తున్నారు. నేను దాన్ని ఎంజాయ్ చేయలేనని ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయాలో తోచక కుమిలిపోతున్నాను. అమ్మానాన్నలకు నా బాధ అర్థమవ్వాలంటే ఏం చేయాలి? - అక్షర, హైదరాబాద్ ప్రస్తుతం చాలామంది యువతకున్న సమస్య ఇది. మనకు ఒక రంగంలో ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకేమో మనం ఇంకో పని చేస్తే బాగుంటుందని అని పిస్తుంది. కొంతవరకూ మీ తల్లిదండ్రులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పాలి. మీ సమస్యకు ఉత్తమమైన పరిష్కారం ముందు మీరు మీ సంపాదనపై నిలబడటం. జీవితపు ప్రారంభ దశలో మనకిష్టమైన వృత్తిని చేపట్టడం కుదరక పోవచ్చు. మన అభిరుచికి వ్యతిరేకంగా, డబ్బు కోసం, ఇష్టం లేని వృత్తిని చేపట్టాల్సి రావొచ్చు. అప్పుడేం చేయాలంటే... ఆర్థికంగా నిలదొక్కు కోవడం కోసం ముందు మీరు ఒక ఉద్యోగంలో చేరండి. తర్వాత మీకిష్టమైన వృత్తిలోకి మారండి. కానీ మీకిష్టమైన ఆ వృత్తి మీకు జీవితాధారం ఇవ్వగలిగేంత ఆర్థిక వనరుల్ని సమకూర్చేదై ఉండాలి. అలా సమకూర్చే వృత్తి కాకపోతే... బతకడం కోసం మొదటి వృత్తిలోనే కొనసాగి, మరోవైపు మీ అభిరుచిని కొనసాగించండి. అప్పుడు జీవితంలో నిరాకస్తత పోతుంది. ఒకవేళ మీ అభిరుచి ఆర్థికంగా నిలదొక్కు కునే వీలున్నదైతే... కొంతకాలానికి అదే మీ వృత్తి అవుతుంది. నేనో ప్రభుత్వ ఉద్యోగిని. జనంలో కలిసిపోయి, జనం కోసం పని చేసే ఉద్యోగం నాది. సమస్యలు చెప్పుకోడానికి, సహాయం కోరడానికి చాలామంది ఫోన్ చేస్తారు. వారిలో ఆడవాళ్లూ ఉంటారు. అది నా భార్యకు నచ్చదు. మహిళల దగ్గర్నుంచి ఫోన్వస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. మొదట్నుంచీ తనకు అనుమానమే. తన గొడవ పడలేక కాలేజీ ఫ్రెండ్కి కూడా దూరమైపోయాను. చివరికి బంధువుల్లో ఆడవాళ్లతో మాట్లాడినా తట్టుకోలేదు. ఏమైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. పిల్లల కోసమని భరించేకొద్దీ దీనికి అంతం లేకుండా పోతోంది. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరకదా? - పాండురంగ ప్రసాద్, విజయనగరం మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఉద్యోగరీత్యా ఆడవారికి ఏ రకంగా సహాయపడుతూ ఉంటారు? ఫోన్లు ఆఫీసు టైమ్లోనే వస్తాయా లేక అర్ధరాత్రి కూడా వస్తుంటాయా? బంధువుల్లో ఆడవారితో భార్య ఈర్ష్య పడేంతగా మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇలా కూడా ఆలోచించవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చూసుకుంటే... కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు. అభ్రదతా భావం, విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్లని నిరంతరం అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా వినరు. వాళ్లను బాధపెట్టకుండా సహ జీవనం చేయడం తప్ప వేరే దారి లేదు. వీలయినంత వరకూ ఆఫీసు సమయం లోనే సహాయం చేస్తూ ఉండండి. అదొక్కటే మార్గం. నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా లక్ష్యం ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేయడం. అయితే నాతోపాటు కోచింగ్ తీసుకుంటున్న ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. పదే పదే డిస్టర్బ్ చేయడంతో కాన్సన్ట్రేషన్ తప్పుతోంది. అతణ్ని ఎలా అవాయిడ్ చేయాలో అర్థం కావడం లేదు. నేనెలా అయినా నా లక్ష్యాన్ని సాధించాలి? ఏం చేయాలో సలహా ఇవ్వండి. - తన్మయి, మెయిల్ ఆ అబ్బాయి మిమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడు? నిజంగా మీకు చదువే గమ్యం అయితే ఆ అబ్బాయిని అవాయిడ్ చేయడం అంత కష్టం కాదు. మీ నాన్న గారికి చెప్పండి. లేదంటే మీ ప్రిన్సిపల్తో చెప్పండి. అదీ సాధ్యం కాని పక్షంలో మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా పెద్దవారికి చెప్పండి. ఇంటర్ చదివే కుర్రాడిని భయపెట్టి మీ నుంచి దూరం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ మీ ఉత్తరం చూస్తుంటే, అతణ్ని అవాయిడ్ చేయడం మీకే ఇష్టం లేదేమో అనిపిస్తోంది. అతను మీ వెంట పడుతూ ఉండాలి, మీరు కాదంటూనే ఉండాలి. ఒకవేళ మీ స్థితి ఇలాంటిదయితే మాత్రం మీరు చదువు మీద అస్సలు దృష్టి నిలపలేరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
స్మృతికి ఝలక్ ఇచ్చిన స్టూడెంట్
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్ పర్యటనకు ముందే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ విద్యార్థి ఝలక్ ఇచ్చాడు. కేంద్రమంత్రి సోమవారం ఇస్లామిక్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అయితే మంత్రి నుంచి ఎంబీఏ పట్టా తీసుకోబోనని ఓ విద్యార్థి ప్రకటించాడు. అందుకుగల కారణాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి 2008లో సమీర్ గోజ్వారీ అనే విద్యార్థి ఎంబీఏ పూర్తి చేశాడు. సోమవారం కేంద్రమంత్రి చేతుల మీదగా సమీర్ పట్టా అందుకోవాల్సివుంది. భావప్రకటన స్వేచ్ఛపై దేశం జరుగుతున్న దాడులకు నిరసనగా తాను పట్టా తీసుకోవడం లేదంటూ సమీర్ ప్రకటించాడు. సాహిత్య అకాడమి అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్న రచయితలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఓ విద్యార్థి తన జీవితంలో మాస్టర్ డిగ్రీను అందుకోవడంలో ఉన్న ఆనందం.. మిగతా ఏ ముఖ్యమైన అవార్డు అందుకున్నప్పుడు ఉండదన్నాడు. కానీ దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు విలువలు తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్మృతి ఇరానీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీనగర్ అధికారులతో పాటు యూనివర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం జరగాల్సిన పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.అంజిరెడ్డి బుధవారం తెలిపారు. -
‘అంబేడ్కర్’ వర్సిటీ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను డైరెక్ట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆలస్యరుసుం లేకుండా ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 ఆఖరి గడువు అని వారు తెలిపారు. -
డిగ్రీ ఉంటేనే.. అంగన్వాడీ కొలువు!
వర్కర్ పోస్టుల విద్యార్హత పెంపునకు ఉన్నతాధికారుల ప్రతిపాదన * హెల్పర్ల విద్యార్హతనూ 10వ తరగతికి పెంచే అవకాశం * ప్రభుత్వామోదం లభిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల * త్వరలో 1,800 అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇటీవల గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలను కూడా పెంచాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు టెన్త్ విద్యార్హతతోనే అంగన్వాడీ వర్కర్ల నియామకం జరగ్గా ఉన్నతాధికారులు తాజాగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఇకపై‘అంగన్వాడీ కొలువు’కు కనీస అర్హత డిగ్రీ కానుంది. హెల్పర్ల విద్యార్హతను ఏడవ తరగతి నుంచి టెన్త్కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వివిధ జిల్లాల్లో పలు సీడీపీవో ప్రాజెక్టుల కింద సుమారు 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహిళా శిశుసంక్షేమ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పథకాల సమగ్ర అమలు కోసమే.. మహిళలు, బాలల సంక్షేమం కోసం కేంద్రంతోపాటు తాము ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చే యాలంటే అంగన్వాడీ వర్కర్లకు తగిన విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లుగా డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు దొరకని పక్షంలో.. ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ‘ఏ’ కేటగిరీ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీలను ‘బి’ కేటగిరీగా విభజించాలని నిర్ణయించారు. ‘ఏ’ కేటగిరీ అంగన్వాడీల్లో వర్కర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీ కలిగిన అభ్యర్థులనే పరిగణన లోకి తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లకు కనీస అర్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35,334 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 31,606 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుకాగా, 3,728 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీల్లో బాధ్యతలు ఇలా.. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 23నే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కేంద్రాల వర్కర్లకు గతంలో రూ.4,200లుగా ఉన్న వేతనాన్ని రూ.7 వేలకు, మినీ అంగన్వాడీల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచింది. వర్కర్లు నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన బాధ్యతలను కూడా పెంచింది. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాల విధులను సూచించింది. అంగన్వాడీ వర్కర్లు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూలింగ్ నిర్వహించాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను భాగస్వాములను చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్వై, ఆర్ ఎస్బీకే, కెఎస్వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. ఆపై ప్రభుత్వం అప్పగించిన ఏ బాధ్యతలనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. -
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రెవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాకే తలమానికంగా గుర్తింపు పొందిన ఈ కళాశాలలో ఇటీవల మంజూరైన రెండు కోర్సులను కలుపుకొని మొత్తం 16 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 760 సీట్లు అందుబాటులో ఉండగా.. తొలివిడత కౌన్సెలింగ్లో 350 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఫీజు సైతం చెల్లించారు. ఆయా విభాగాల అధిపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు పర్యవేక్షించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులకు శనివారం కౌన్సెలింగ్ జరగనుంది. తగిన అర్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న కౌన్సిలింగ్కు హాజరుకావాలని పోలీసు కోరారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో... పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మొదటి జాబితా కౌన్సెలింగ్లో వివిధ కోర్సుల్లో 70 శాతం మేర ప్రవేశాలు పూర్తయ్యాయి. వీటిని ప్రిన్సిపాల్ మైథిలి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా కౌన్సెలింగ్కు హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా కళాశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. తాగునీటి కోసం పరుగులు తీశారు. -
ఇంజనీరింగ్లోనూ సీబీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) తన పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీసీఎస్ అమల్లోకి వస్తే మార్కుల విధానం ఇకపై ఉండదు. విద్యార్థుల మార్కుల రేంజ్నుబట్టి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, క్రెడిట్ పాయింట్ల విధానం రానుంది. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ పరిధిలో 500కుపైగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులను నిర్వహించే డి గ్రీ, పీజీ కాలేజీలు ఉండగా వాటిన్నింటిలోనూ దీన్ని అమలు చేయనున్నారు. అలాగే జేఎన్టీయూహెచ్ ఇన్నాళ్లూ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయట్లేదు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రథమ సంవత్సరంతోపాటు అన్ని సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునే అవకాశం కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సీబీసీఎస్ను 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. -
ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. అనుసంధానమెప్పుడు? సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తాము సూచించిన సిలబస్లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి. సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది. -
ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అన్ని కళాశాలలకు సొంత భవనాలు, ల్యాబ్ల సౌకర్యం, ల్యాబ్ పరికరాల కొనుగోలుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం సచివాలయంలో పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ముందుగా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆ తరువాత బోధనా సిబ్బంది నియామకం చేపడుతామన్నారు. 25 కళాశాలలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.142.42 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. 19 పాలిటెక్నిక్ కాలేజీల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 19 కోట్లు ఇచ్చామని, ఇందులో 15 హాస్టళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. అలాగే వికారాబాద్లో రూ. 8 కోట్లతో పాలిటెక్నిక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 34 కోట్లతో 23 పాలిటెక్నిక్లను అప్గ్రేడ్ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రారంభించిన 8 పాలిటెక్నిక్లలో బోధన సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. ఇదిలాఉండగా, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ఉచితంగా ప్రవేశాలు కల్పించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉప కడియం శ్రీహరి స్వయంగా ఈ అంశంపై పరిశీలన జరుపుతున్నారు. -
ఎస్వీ పరిధిలో డిగ్రీకీ సెమిస్టర్ విధానం
తిరుపతి(చిత్తూరు): శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇకపై డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానం 2015-2016 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఎస్వీయూలో ప్రస్తుతం పీజీ కోర్సుల్లో మాత్రమే సెమిస్టర్ విధానం ఉంది. దీంట్లో భాగంగా ఏటా రెండు సెమిస్టర్లు నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం ఎస్వీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. -
కేయూ సమస్యలు పరిష్కరిస్తా
- ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు - డిగ్రీ ‘స్పాట్ ’ త్వరలోనే కొనసాగింపు కేయూ క్యాంపస్ : కేయూలో నెలకొన్న పరిస్థితుల పై తనకు అవగాహన ఉందని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఇన్చార్జి వీసీ, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు అన్నారు. ఇన్చార్జి వీసీ బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా గురువారం యూనివర్సిటీకి వచ్చారు. పరిపాలనా భవనంలోని సేనేట్ హాల్లో ప్రిన్సిపాల్స్, డీన్, విభాగాల అధిపతులు, పరిపాలనా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్రొఫెసర్లు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పీహెచ్డీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, విద్యార్థుల మెస్ సమస్యను పరిష్కరించాలని, నిలిచిపోయిన డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరారు. స్పందించిన చిరంజీవులు మాట్లాడుతూ యూనివర్సిటీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో సమయపాలన పాటించాలన్నారు. బుధవారం లేదా గురువారం తప్పనిసరిగా తాను యూనివర్సిటీకి వస్తానని చెప్పారు. డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్ను సోమవారంలోగా మళ్లీప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ టి.శ్రీనివాసులు, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీవీఎస్.శర్మ, ప్రొఫెసర్ వై.నర్సింహారెడ్డి, డాక్టర్ టి.సుమతి, ఉమామహేశ్వరి, డాక్టర్ ఎం.తిరుమలాదేవి, కెమిస్ట్రీ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ గాదె దయాకర్, ప్రొఫెసర్ పురుషోత్తం పాల్గొన్నారు. కాగా, పాఠశాలల ముగింపు చివరి రోజు చిరంజీవులు స్థానిక రేడియో స్టేషన్లో రేడియో టాక్ ద్వారా పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి కాశిబుగ్గ : విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని కేయూ ఇన్చార్జి వీసీ, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓయాసిస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల చైర్మన్ జేఎస్.పరంజ్యోతి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఐక్రోప్ సహకారంతో డిజిటల్ ‘ట్యాబ్-ల్యాబ్’ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు. దీనిని చిరంజీవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకమ్యునికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతపై వివరించారు. ప్రిన్సిపాల్ పరంజ్యోతి మాట్లాడుతూ డిజిటల్ ట్యాబ్ క్లాస్ రూం మొత్తం వైఫై సౌకర్యం కలిగి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో వడుప్సా ప్రతినిధులు భూపాల్రావు, నారాయణరెడ్డి, షణ్ముఖాచారి పాల్గొన్నారు. -
డిగ్రీ తర్వాత మార్గాలు
ఉద్యోగమా... ఉన్నత విద్యా? ఉన్నత విద్య- పీజీ ‘విజ్ఞానం’ ఉన్నతం: క్యాన్సర్పై పరిశోధనలైనా.. అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల గుట్టు విప్పేందుకు చేపట్టే అంతరిక్ష యాత్రలైనా.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కటీ ‘సైన్స్’తో సంబంధమున్నదే! ఇలాంటి ‘విజ్ఞాన’రంగంలో+ ఉన్నత కెరీర్లో నిలదొక్కుకోవాలంటే నచ్చిన సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాల్సిందే! ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలు సంప్రదాయ సబ్జెక్టులుగా ఉన్నాయి. వీటికి దీటుగా ప్రస్తుత జాబ్ మార్కెట్కు అనుగుణంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2015-16లో ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ వంటి అధునాత స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. వీటిని పూర్తిచేసి ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)కి ప్రాధాన్యం ఏర్పడిన నేపథ్యంలో డీఆర్డీవో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి పరిశోధన సంస్థల్లో ప్రవేశించి, నవ్య ఆవిష్కరణల్లో పాలుపంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ సైన్స్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశం కల్పించే కోర్సులు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. బీకామ్ తర్వాత పీజీ కోర్సులు బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (హెచ్ఆర్ఎం). వీటిలో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా జాబ్ మార్కెట్ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్లో ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్లలో ఎంకామ్ను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, ఇతర ఆర్థిక సంబంధిత కార్పొరేట్ సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా, ఇంటర్నల్ ఆడిటర్స్గా ఉద్యోగాలు సొంతం చేసుకోవ చ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ స్పెషలైజేషన్లో ఎంకామ్ పూర్తిచేసిన వారు కంపెనీ సెక్రటరీకి సహాయకులుగా వైట్కాలర్ జాబ్ను చేజిక్కించుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తిచేసిన వారికి కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సులో కొన్ని పేపర్లలో మినహాయింపు లభిస్తుంది. అందువల్ల భవిష్యత్తులో తేలిగ్గా సీఎస్ కోర్సును పూర్తిచేసి, కెరీర్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. బీకామ్ తర్వాత ఎల్ఎల్బీ (ట్యాక్స్ లాస్, కంపెనీ లాస్..) చేసి, కార్పొరేట్ కంపెనీల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) అనగానే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ు వంటి స్పెషలైజేషన్లు అందరికీ గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం ఎంఏలోనూ ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన వెంటనే ఉపాధి లభిస్తుంది. అందుకే వీటిని జాబ్ గ్యారంటీ స్పెషలైజేషన్లుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ), సోషియాలజీ, సైకాలజీ వంటి స్పెషలైజేషన్లను మాస్టర్ స్థాయిలో అందిస్తోంది. సోషల్ వర్క్, సోషియాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంంటాయి. ఎంబీఏ, ఎంసీఏ గ్రాడ్యుయేషన్ తర్వాత మేనేజ్మెంట్ విభాగంలో కెరీర్ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ను చేయొచ్చు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు జాబ్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఉదాహరణలుగా రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ను చెప్పొచ్చు. వీటిని పూర్తిచేస్తే సంబంధిత సంస్థల్లో ఎంట్రీలెవల్లో ఎగ్జిక్యూటివ్గా కెరీర్ను ప్రారంభించవచ్చు. ఎంసీఏ: సాంకేతిక విద్య వైపు ఆసక్తి ఉంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ను సుస్థిరం చేసుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయ మార్గమిది. ఈ కోర్సులో ప్రవేశానికి కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. ఉపాధ్యాయ విద్య బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ కోర్సుల్లోకి ప్రవేశించాలంటే బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు పూర్తిచేయాలి. ఇందులో ప్రవేశాలకు ఎడ్సెట్ రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. వీటికి ఉద్దేశించిన కోర్సులు లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిలో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీసెట్) రాయాలి. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కొన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి, ఆధునిక కొలువులను సొంతం చేసుకోవచ్చు. వీటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితరాలు. ఈ విభాగాలకు సంబంధించి పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. విదేశీ భాషలు.. విదేశీ భాషల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రంగాల్లో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఫారెన్ లాంగ్వేజ్లు తెలిసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలు తెలిసిన వారికి డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ విభాగాల్లో ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. ‘లా’లో కెరీర్ దేశంలో బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో ఇవి విస్తరణ పథంలో పయనిస్తున్నాయి. ఈ విభాగాల్లో న్యాయసేవల అవసరం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సు చేయొచ్చు. రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయాలి. జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.ఎల్ఎల్బీ పూర్తయ్యాక వివిధ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, కార్పొరేట్ లా, పేటెంట్ లా వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా బహుళజాతి, కార్పొరేట్ సంస్థల్లో, పేటెంట్ సంస్థల్లో లీగల్ అడ్వయిజర్స్గా, లీగల్ మేనేజర్స్గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఉద్యోగమే లక్ష్యమైతే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ప్రస్తుత తీవ్ర పోటీ వాతావరణంలో ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలంటే అకడమిక్ కోర్సులు చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధంకావాలి. రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి. ఉద్యోగాలు ఎస్ఎస్సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ట్యాక్స్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్(ఆడిట్, అకౌంట్స్, కమర్షియల్ ఆడిట్) ఎస్ఎస్సీ- సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్ఐలు రైల్వే-ఏఎస్ఎం, గూడ్స్గార్డ్, సూపర్వైజర్, కమర్షియల్ క్లర్క్, రిజర్వేషన్ కం ఎంక్వైరీ క్లర్క్ బ్యాంకులు - క్లర్క్, పీవో, మేనేజ్మెంట్ ట్రైనీ ఎల్ఐసీ - డీఓ, ఏఏవో, ఏవో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియామక పరీక్షలు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వెలువరించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ తదితర పరీక్షల్లో ప్రతిభ ద్వారా ప్రభుత్వ కొలువును దక్కించుకోవచ్చు. అన్ని విభాగాలకూ పెరుగుతున్న ప్రాధాన్యం బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా గుర్తొచ్చేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ). ఇప్పుడు ఈ పీజీ కోర్సుల్లో అన్ని స్పెషలైజేషన్లకూ ప్రాధాన్యం పెరుగుతోంది. కేవలం సైన్స్, మ్యాథ్స్ చేసిన వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాలు ఇప్పుడు లేవు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఆర్ట్స్ విద్యార్థులు మానసికంగా తమ దృక్పథం మార్చుకోవాలి. ఆర్ట్స్ గ్రూప్లంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మార్గంగానే భావించకుండా ఇతర అవకాశాలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో కెరీర్ పరంగా రాణించాలంటే ఉన్నత విద్యను అభ్యసించడం మేలు. సైన్స్ విద్యార్థులు దీర్ఘకాలిక ప్రణాళికతో పీహెచ్డీ కోర్సుల వైపు కూడా ఇప్పటి నుంచే ఆలోచించడం అభిలషణీయం. - ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, అడ్మిషన్స్ డెరైక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ. ఉన్నత విద్యతో సమున్నత అవకాశాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పీజీ వంటి ఉన్నత విద్య కోర్సులు అభ్యసించడం ద్వారా సమున్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో స్పెషలైజేషన్ల ఎంపికలో వినూత్నంగా వ్యవహరించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల పరిధిలో పీజీ స్థాయిలో కొత్త కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలి. బేసిక్ స్పెషలైజేషన్స్కే పరిమితం కాకుండా ఇంటర్ డిసిప్లినరీ స్పెషలైజేషన్లు దిశగా దృష్టి పెట్టాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఇలా అన్ని ఫ్యాకల్టీల్లో కొత్త కోర్సులు వస్తున్నాయి.. ఇవి భవిష్యత్తులో కొలువులను ఖాయం చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు పీజీ చేయడం ద్వారా తమ డొమైన్ సబ్జెక్ట్లలో పరిపూర్ణత సాధించి కెరీర్ పరంగా పోటీలో ముందంజలో నిలవడానికి ఆస్కారం లభిస్తుంది. - ప్రొఫెసర్ ఒ.అనిల్ కుమార్, అడ్మిషన్స్ డెరైక్టర్, ఆంధ్రా యూనివర్సిటీ. -
విద్యా, పోటీ పరీక్షల సమాచారం
2 వరకు సంగీత పరీక్ష ఫీజు చెల్లింపు గడువు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మే నెలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందు కోసం సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె. తోమాసయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్టు ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సెమిస్టర్ విధానం సాక్షి, హైదరాబాద్: డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కాలేజీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్క్యూఎఫ్, సీబీసీఎస్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా శుక్రవారం సమావేశ మైంది. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 15 వరకు ఇగ్నో అడ్మిషన్లకు గడువు విజయవాడ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2015 సెషన్కు జరుగుతున్న అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ బి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం జూలై 2015 సెషన్కి ఎంబీఏ ప్రోగ్రామ్ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష (ఓపెన్మేట్) కోసం దరఖాస్తు ఫారాలు ఇగ్నో స్టడీ సెంటర్లలో, ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు ఇగ్నో న్యూఢిల్లీ చిరునామాకు అందేలా పంపించాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 15వ తేదీన జరగనుందని తెలిపారు. -
డిగ్రీ ‘చరిత్ర’లో మార్పులకు కమిటీ
దక్కన్ చరిత్ర, తెలంగాణ ఉద్యమంపై పాఠాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ స్థాయిలో ఉన్న చరిత్ర పుస్తకాల సిలబస్లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఫుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డిగ్రీ చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పులపై బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, వివిధ వర్సిటీల చరిత్ర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలబస్ మార్పుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు మనోహర్రావు, అర్జున్రావు, సుదర్శన్, వరలక్ష్మి, సదానందం, 8 మంది డిగ్రీ లెక్చరర్లు ఉంటారు. ఇవీ మార్పులు: దక్కన్ చరిత్రకు మార్పుల్లో పెద్ద పీట వేస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై పాఠ్యాంశాలు ఉంటాయి. అంతేకాక హుస్సేన్సాగర్, రామప్ప, లక్నవరం వంటి చెరువులు, వాటిని తవ్వించిన రాజులు, అప్పటి పాలన విధానం, వారి ప్రాధాన్యాలపై పాఠ్యాంశాలు ఉంటాయి. వాటితోపాటు కాకతీయులు, సమక్క-సారలమ్మ, నాటి పరిస్థితులపై పాఠాలుంటాయి.చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి తెలంగాణ యోధులు, 1969 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం, అందులో వివిధ రంగాల పాత్ర, తెలంగాణ భాష, సంస్కృతిపై పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు. -
మార్కుల విధానానికి స్వస్తి!
ఆదిలాబాద్ టౌన్ : ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు గ్రేడింగ్ రూపం లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు చేయాలనే ఉద్దేశంతో యూజీసీ (యూనివర్సి టీ గ్రాంట్ క మిషన్) యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు ఈ నెల 12న ఈ విధానంపై ఆదేశాలు జారీ చేసింది. 2008 సంవత్సరంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు క్రెడిట్, బేస్డ్, చేయిస్ సిస్టంను యూజీసీ తయారు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలో ఈ విధానం అమలులో ఉంది. ఈ కొత్త విధానం అమలైతే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా చదవుకునే విద్యార్థులకు ఒకే విద్యావిధానం అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి.. 2015-16 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ డిప్లొ మా, సర్టిఫికెట్ కోర్సులు చదివే విద్యార్థులకు మార్కుల రూపంలో కాకుండా గ్రేడ్ రూపంలో పాయింట్ల విధానాన్ని అమలు చేయనున్నారు. సబ్జెక్టులతోపాటు విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తారు. కోర్సు గ్రేడింగ్, స్టూడెంట్ గ్రేడింగ్ ఉంటాయి. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేడింగ్ విధానంలో సెమిస్టర్ విధానంలో తరగతులు ఉంటాయి. 90 రోజుల కు ఒక సెమిస్టర్ విభజి స్తారు. సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటా యి. 450 తరగతుల విద్యబోధన జరుగుతుంది. మూడు రకాల కోర్సులు గ్రేడింగ్ విధానంలో మూడు రకాల కోర్సులు ఉంటాయి. ఇందులో ప్ర ధాన కోర్సు, ఎంపిక కోర్సు, ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి. ఫౌండేషన్ కోర్సుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తప్ప నిసరి. మరొకటి ఎంపిక కోర్సు. విద్యార్థికి స్టూడెంట్ గ్రేడింగ్, కోర్సు గ్రేడింగ్ కలిపి మొత్తం గ్రేడింగ్ సర్టిఫికెట్ పాయింట్ల రూపంలో ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గ్రేడింగ్ విధానంలో తనకు నచ్చిన ఏ సబ్జెక్టు అయినా ఎంపిక చేసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు గ్రేడింగ్ విధానంలో విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు లభిస్తుందని డిగ్రీ కళాశాల లెక్చరర్లు పేర్కొంటున్నారు. ప్రతీ సబ్జెక్టుల్లో విద్యార్థికి గ్రేడింగ్ పాయింట్ కేటాయిస్తారు. నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలులో ఉంటుంది. విద్యార్థి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ చదువును కొనసాగించవచ్చు. సర్టిఫికెట్లకు ప్రాధాన్యం లభిస్తుంది. -
అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు, గ్రేడ్ పారుుంట్ల విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణరుుంచింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానం అవుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. జాతీయు, అంతర్జాతీయు స్థారుు విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇకపై అన్ని స్థాయిల్లో అమలు చేయూలని నిర్ణరుుంచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అవుల్లోకి తేనుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూజీసీ నిబంధనలకులోబడి ఆయూ రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైస్చాన్సలర్లకు వుంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను కేంద్రీయ, రాష్ట్ర యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా అవులు చేయూలని యూజీసీ ఆదేశించింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో వర్సిటీలను బట్టి వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. ఒక కోర్సులో మార్కుల విధానం అవుల్లో ఉంటే, కొన్ని కోర్సుల్లో మార్కులతోపాటు గ్రేడింగ్ విధానం అవుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వూర్కుల విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని యుూజీసీ నిర్ణయించింది. ఇకపై అన్ని రాష్ట్రాల్లో, అన్ని కోర్సుల్లో గ్రేడింగ్ విధానమే అవులు చేయునుంది. కోర్సులోని అన్ని సబ్జెక్టుల్లో కలిపి విద్యార్థి ప్రగతిని క్యుములేటివ్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(సీజీపీఏ) రూపంలో ప్రకటించనుంది. ఇందులో రెండు వరుస సెమిస్టర్లను ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి కోర్సులో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఇక ప్రతి సబ్జెక్టులో విద్యార్థి ప్రగతికి ఇచ్చే ప్రతి గ్రేడ్కు ఒక పారుుంట్ ఇస్తారు. మెుత్తం సబ్జెక్టులకు ఇచ్చే పారుుంట్లను కలిపి వాటి సగటుతో సీజీపీఏను నిర్ధారిస్తారు. సెమిస్టర్వారీగా కూడా గ్రేడ్లను, గ్రేడ్ పారుుంట్లను ఇస్తారు. వాటిని సగటును సెమిస్టర్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(ఎస్జీపీఏ)గా పరిగణిస్తారు. అలాగే విద్యార్థులు గణితంతో పాటు ఆర్ట్స్ సబ్జెక్టులను కూడా చదువుకునే వీలు కల్పించాలని యూజీసీ నిర్ణయించింది. గ్రేడింగ్ విధానమిదే.. గ్రేడ్ గ్రేడ్ పారుుంట్ ఓ (ఔట్ స్టాండింగ్) 10 ఎ+ (ఎక్సలెంట్) 9 ఎ (వెరీ గుడ్) 8 బి+ (గుడ్) 7 బి (ఎబోవ్ యావరేజీ) 6 సి (యావరేజీ) 5 పి (పాస్) 4 ఎఫ్ (ఫెయిల్) 0 ఏబీ (ఆబ్సెంట్) 0 -
యూకే వర్సిటీల్లో సీబీఎస్ఈ +2కి గుర్తింపు
న్యూఢిల్లీ: యునెటైడ్ కింగ్డమ్(యూకే)లోని యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకపై భారత్లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇచ్చే ప్లస్ టూ సర్టిఫికెట్కు గుర్తింపునిచ్చేందుకు యూకేలోని యూనివర్సిటీలన్నీ అంగీకరించాయి. ఇప్పటివరకు అక్కడి చాలా విద్యాసంస్థలు సీబీఎస్ఈ ప్లస్ టూ సర్టిఫికెట్ ఆధారంగా భారతీయ విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి అనుమతించకపోయేవి. బ్రిటిష్ విధానంలో పాఠశాల విద్య భారత్ విధానంలో కన్నా ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హత సంపాదించాలంటే అదనంగా మరో కోర్సు చేయల్సిందిగా ఆ విద్యాసంస్థలు కోరేవి. దాంతో యూకేలో ఉన్నత విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ఇబ్బంది పడేవారు. దాంతో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని యూకేతో చర్చించి, సానుకూల ఫలితం పొందిందని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వీసా సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్తున్న భారతీయ విద్యార్థులకు సాయపడేందుకు కూడా యూకే అంగీకరించిందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన 6వ యూకే- ఇం డియా ద్వైపాక్షిక విద్యా సదస్సుకు ఆమె అధ్యక్షత వహించారు. -
నేరాల్లో డిగ్రీ!
డిగ్రీ చదివాడు. ఆర్మీ ఉద్యోగం కూడా సంపాదించాడు.. కానీ వ్యసనాలు అతన్ని పతనం చేశాయి. ఘరానా మోసగాడిగా మార్చాయి. మత్తు పానీయాలు ఇచ్చి మహిళలను లోబరచుకోవడం, ఆనక బంగారు నగలతో ఉడాయించడం.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగలను ముంచడం.. యథేచ్ఛగా చోరీలకు పాల్పడటంతోపాటు హత్యలకు తెగబడటం ద్వారా ఆ యువకుడో ఘరానా నేరగాడిగా మారాడు. పాలకొండ రూరల్:సోమవారం ఉదయం.. విశాఖపట్నం నుంచి పాలకొండకు వెళ్లేందుకు ఓ మహిళ బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు తన పక్క ఖాళీగా ఉన్న సీటులో కూర్చోమన్నాడు. మిగతా సీట్లు నిండిపోవడంతో ఆమె అతని పక్క సీట్లో కూర్చుంది. ఆ ప్రయాణికుడు మెల్లగా ఆమెతో మాటలు కలిపాడు. తనది కూడా పాలకొండేనని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్దనున్న కూల్డ్రింక్ ఇచ్చాడు. మొహమాటంతో ఆమె తీసుకొని తాగింది. అప్పటికే అందులో నిద్రమాత్రలు కలిపి ఉండటంతో మత్తులోకి జారుకుంది. వెంటనే ఆగంతకుడు తన పని కానిచ్చేశాడు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలు చేజిక్కుంచుకొని బస్సు దిగి వెళ్లిపోయాడు. కొంత సేపటికి తేరుకున్న ఆ మహిళ జరిగిన మోసాన్ని గ్రహించి పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఆధారాల ప్రకారం వేట సాగించిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతను చెప్పిన వివరాలు విని విభ్రాంతికి గురయ్యారు. అతడు గుండెలు తీసిన బంటని అర్థమైంది. హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాలు అతనికి నిత్యకృత్యమని.. అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. చదువుతోపాటే వ్యసనాలు పోలీసులు అరెస్టు చేసిన ఈ ఘరానా మోసగాడి పేరు కొట్టిశ లక్షుంనాయుడు. వీరఘట్టం మండలం వండువ స్వగ్రామం. డిగ్రీ వరకు చదివిన నాయుడు.. చదువుకుంటున్నప్పుడే వ్యసనాలకు బానిసయ్యాడు. విలాసాలు మరిగి చిన్న చిన్న మోసాలకు పాల్పడేవాడు. చదువు పూర్తి అయిన తర్వాత ఆర్మీ ఉద్యోగం సంపాదించినా వ్యసనాలు, నేరాలతో దాన్ని దూరం చేసుకున్నాడు. ఒక సందర్భంలో జైలుకు వె ళ్లగా అక్కడ కొందరు చోరీ కేసు నిందితులతో ఏర్పడిన పరిచయాలు.. అతని నేరచరిత్రను మరోమలుపు తిప్పాయి. నేరాల చిట్టా ఇదీ.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం లక్షుంనాయుడు నేరాల చిట్టా చాంతాండంత ఉంది.. 2006లో ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు స్వగ్రామమైన వండువలోనూ పలువురు నిరుద్యోగులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించాడు. చివరికి విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేటలో అరెస్టయ్యాడు. వివాహం చేసుకున్న నాయుడు వివాహానంతరం కుటుంబ సభ్యులనూ మోసం చేశాడు. 2005లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ సంస్థ యజమాని నుంచి రూ.1.50 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని యజమాని ఒత్తిడి చేయడంతో అతన్ని మెళియాపుట్టి మండలం పెద్దమడి వద్ద క్లచ్ వైరుతో ఉరి వేసి హతమార్చాడు. మృతదేహాన్ని పెద్దపాడు కాలువలో పడవేశాడు. 2010లో ఏలూరులో జరిగిన ఓ హత్య కేసులో లక్షుంనాయుడు పాత్ర కీలకమైనదని పోలీసులు చెప్పారు. ఇదే ఏడాది ఒక అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. వారితో మాటలు కలిపి మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి.. వారిలో ఒంటిపై ఉన్న ఆభరణాలు చోరీ చేసేవాడు. వీలైతే వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 2013లో పాలకొండలో రెండు, టెక్కలిలో ఒకటి, రాజాంలో ఒక ఇంటిలో చొరబడి బంగారం, వెండి ఆభరణాలను కూడా దొంగలించినట్టు విచారణలో వెల్లడైంది. సుమారు 25 తులాల వెండి, 19 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు లక్షుంనాయుడు అంగీకరించాడు. అతని నుంచి 8 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. తస్మాత్ జాగ్రత్త లక్షుంనాయుడును మీడియా ముందు ప్రవేశపెట్టిన పాలకొండ డీఎస్పీ దేవానంద్శాంతో మాట్లాడుతూ నేరగాళ్లు రోజురోజుకు పెచ్చిమీరిపోతున్నారని, ఈ నేపథ్యంలో మహిళలతో పాటు అన్ని వర్గాల వారు చైతన్యం వంతం కావాలన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, వారికి ఫోన్ నెంబర్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ఆ విధంగా ప్రవర్తించడం కారణంగానే లక్షుంనాయుడు వంటి నేరగాళ్లకు అవకాశం కల్పించినట్టవుతుందన్నారు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలో సీఐ మజ్జి చంద్రశేఖర్, ఎస్సై ఎల్.చంద్రశేఖర్తో పాటు క్రైమ్ విభాగం నుంచి గవరయ్య, రమేష్, గోవింద్ తదితరులు బృందాలుగా ఏర్పడి ఘరానా మోసగాడిని అదుపులోకి తీసుకున్నారని ప్రశంసించారు. -
సింహాచలంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్
భూ సమస్య త్వరలో పరిష్కారం కనకమహాలక్ష్మి, అప్పన్న ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభోత్సవంలో మంత్రి గంటా పాతపోస్టాఫీసు/ సింహాచలం : బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. తొలుత కనకమహాలక్ష్మి ఆలయం లో ప్రారంభించి ప్రసంగించారు. సింహాచలం దేవస్థానంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ, కోస్ట్గార్డు కళాశాలలు ఏర్పాటు చేయాలి చూస్తున్నట్టు తెలిపారు. సింహాచలం భూముల వివాదం ఒకటి, రెండు నెలల్లో పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. కొండపై కాటేజీలు నిర్మాణం చేసే యోచన ఉందన్నారు. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, ప్రణాళికలు తయారుచేసి కార్యాచరణకు దిగుతామన్నారు. తాజ్, ఒబెరాయ్, ఫోర్పాయింట్స్ హోటల్స్కు సింహాచలం దేవస్థానానికి చెందిన కొంత స్థలాలు కేటాయించి వాటిలో షేర్ తీసుకోవడం, వుడా, జీవీఎంసీ సంయుక్త భాగస్వామ్యంతో దేవస్థానం స్థలాల్లో ఐటీ అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి యోచిస్తున్నట్టు వివరించారు. తొలుత కనకమహాలక్ష్మి అమ్మవారికి మంత్రి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పాల్గొన్నారు. కొండపై రోజుకు 5వేల మందికి అన్నదానం సింహగిరిపై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ రోజుకు ఐదు వేల మందికి అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. దేవస్థానం తరఫున వైద్య సదుపాయం అందించేందుకు అడవివరం ఆరోగ్య కేందాన్ని దత్తత తీసుకోవాలా లేదా కొత్తగా వైద్యశాల నిర్మించాలా వంటి ఆలోచన చేస్తున్నా మన్నారు. తొలుత శ్రీగోకుంలో గోపూజల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణాపురంలోని గోశాలలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
సబ్జెక్ట్ పరంగా అత్యుత్తమ డిగ్రీ.. పీహెచ్డీ
ప్రస్తుతం ఏదో ఒక డిగ్రీ పూర్తి చేయగానే కారణాలేమైనా ఉద్యోగంలో చేరే ధోరణి పెరుగుతోంది.. దాంతో ఉన్నత విద్యవైపు ఆసక్తి చూపే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఆయా సబ్జెక్ట్లలో బోధించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కావల్సిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉండడంలేదు. ఫలితంగా పీహెచ్డీ విద్య ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్గం ఇలా: పీహెచ్డీలో చేరేందుకు మార్గాలు.. సీఎస్ఐఆర్-నెట్: సైన్స్ స్ట్రీమ్ అభ్యర్థులకు ఉద్దేశించింది. కెమికల్, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటికల్, ఫిజికల్, ఇంజనీరింగ్, ఎర్త్, అట్మాస్పియర్, ఓషన్ అండ్ ప్లానెట్రీ సెన్సైస్ సబ్జెక్ట్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత సంబంధిత సబ్జెక్టులో 55శాతం మార్కులతో బీఎస్ (నాలుగేళ్ల కోర్సు)/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ఎంఎస్సీ. వెబ్సైట్: www.csirhrdg.res.in యూజీసీ-నెట్: హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్తో కలిపి), ఫోరెన్సిక్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ వంటి దాదాపు 95 సబ్జెక్ట్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. వెబ్సైట్: http://ugcnetonline.in ఎన్సీబీఎస్(నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సెన్సైస్), డీబీటీ-బీఈటీ, టిస్, సీఎస్డీఎస్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, ఐసీపీఆర్,ఐసీఎస్ఎస్ఆర్, ఐసీఎంఆర్ తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు క్యాట్ స్కోర్ ఆధారంగానే పీహెచ్డీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఎఫ్పీఎం) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎక్స్ఎల్ఆర్ఐ, ఎండీఐ, ఐఐటీలు, నిట్లు, ఇతర ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు మేనేజ్మెంట్లో పీహెచ్డీ కోర్సుల్లో క్యాట్/ఎక్స్ఏటీ/ జీమ్యాట్/ జీఆర్ఈ/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు చేపడతాయి. కొన్ని యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కూడా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా డీఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్డీ చేయొచ్చు. అర్హత: సంబంధిత కోర్సుల్లో ఎంఎస్సీ.సీఎస్ఐఆర్ జేఆర్ఎఫ్-గేట్ స్కీమ్: ఈ విధానం ద్వారా ఇంజనీరింగ్/ఫార్మాస్యూటికల్ గ్రాడ్యుయేట్లు సీఎస్ఐఆర్ లేబొరేటరీల్లో పీహెచ్డీ చేయవచ్చు. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులు గేట్లో, ఫార్మసీ విద్యార్థులు జీప్యాట్లో అర్హత సాధించాలి. గేట్/జీప్యాట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.వివరాలకు: http://csirhrdg.res.in/jrfgate.pdf ప్రోత్సాహకాలు: సీఎస్ఐఆర్-నెట్లో జేఆర్ఎఫ్ అర్హత సాధించిన వారు ఐఐటీలు, నిట్లు, అన్ని పరిశోధనశాలలు, యూనివర్సిటీల్లో పీహెచ్డీలో చేరవచ్చు. దీని ద్వారా ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000 చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్జెన్సీ గ్రాంట్గా రూ. 20,000 చెల్లిస్తారు. ఆ తర్వాత మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ. 18,000 చెల్లిస్తారు. అంతేకాకుండా సీఎస్ఐఆర్ నెట్ పరీక్షలో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ ప్రత్యేక ఫెలోషిప్ను ఐదేళ్లు అందిస్తారు. దీనిద్వారా మొదటి రెండేళ్లు నెలకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తారు. మూడో ఏడాది నుంచి నెలకు రూ.24,000 ఇవ్వడంతోపాటు ఏడాదికి రూ. 70,000 కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు. నెట్లో జేఆర్ఎఫ్నకు ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. స్వీయ పరిశీలన: దేశంలో పీహెచ్డీలో చేరిన విద్యార్థుల్లో 50శాతానికిపైగా మాత్రమే తమ థీసిస్ను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు కోర్సులో చేరడానికి మనం ఎంత వరకు సిద్ధంగా ఉన్నామో స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.. పీహెచ్డీ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి తదనుగుణంగా అవసరమైన వనరులు, సమయాన్ని కేటాయించగలమా?లేదా? అనే చూసుకోవాలి. ఎంచుకునే అంశం, సంబంధిత గైడ్ వంటి విషయాల్లో స్పష్టంగా ఉండాలి. పరిశోధన చేయాలనుకుంటున్న అంశంపై నెలకోసారి ఆర్టికల్స్ ప్రచురితమయ్యేట్లు చూసుకుంటే ప్రయోజనకరం. ఎంచుకున్న టాపిక్పై సమగ్ర సినాప్సిస్ రాసి, గైడ్తో ఫైనలైజ్ చేయించుకోవాలి. సొంతంగా పరిశోధనలు: పీహెచ్డీ కోర్సుల ముఖ్య ఉద్దేశం.. నూతన జ్ఞానాన్ని పెంపొందించడం. నిబద్ధత, అంకితం, పట్టుదల ఈ మూడు గుణాలు ఉంటేనే పీహెచ్డీ కోర్సును విజయవంతంగా పూర్తిగా చేయగలం. పీహెచ్డీ అంటే తన సంబంధిత సబ్జెక్ట్లో స్వతంత్రంగా పరిశోధనలు నిర్వహించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడం. ఇందుకోసం సబ్జెక్ట్పై విస్తృతంగా అధ్యయనం చేయాలి. సంబంధిత సబ్జెక్టులో అప్పటికే పరిపూర్ణ నైపుణ్యం సాధించిన ప్రొఫెసర్/గైడ్ పర్యవేక్షణలో పరిశోధన కొనసాగించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పీహెచ్డీ అనేది అనేది స్వతాహాగా ప్రేరణ పొందుతూ పూర్తి చేయాల్సిన కోర్సు. గైడ్ ఉన్నప్పటికీ..అతని పాత్ర పరిమితంగానే ఉంటుంది. కాబట్టి సొంతంగా నేర్చుకోవడంపైనే పూర్తిగా దృష్టిసారించాలి. కీలకం: పీహెచ్డీ చేసే క్రమంలో మూడు దశలు కీలకం. అవి.. సమస్యను గుర్తించడం (పరిశోధనకు తగిన అంశాన్ని ఎన్నుకోవడం),దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, దాన్ని సమర్ధవంతంగా ప్రెజెంట్ చేయడం. ఒక కొత్త ఆలోచన ద్వారా మాత్రమే ఒక అంశాన్ని ఎన్నుకోవడం సాధ్యమవుతుంది. అదే క్రమంలో దాన్ని పరిష్కారించడానికి విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేయాలి. వాటి ఆధారంగా వచ్చిన ఫలితాలను ప్రభావవంతంగా ప్రెజెంట్ చేసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఈ క్రమంలో కనీసం ఐదు నుంచి ఏడు అసైన్మెంట్లు చేపట్టాలి (సబ్జెక్ట్ను బట్టి మారుతు ఉండొచ్చు). ఇందులో కనీసం ఒక సెమినార్ లేదా రీసెర్చ్ పేపర్ అయిన ఉండాలి. ఏ సబ్జెక్లో పీహెచ్డీ పూర్తి చేసినా సంబంధిత థిసిస్ను మాత్రం ఇంగ్లిష్లోనే సమర్పించాలి. ఈ మేరకు యూజీసీ నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎన్నో రకాలు: పీహెచ్డీకి సంబంధించి పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్-పీహెచ్డీ, పార్ట్టైమ్ పీహెచ్డీ కోర్సులుగా వ్యవహరిస్తారు. డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులనే ఇంటిగ్రెటెడ్ పీహెచ్డీలుగా పేర్కొంటారు. ఐఐఎస్సీ- బెంగళూరు, జేఎన్సీఏఎస్ఆర్-బెంగళూరు,ఐఐఏ, ఐఐటీలు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. పని చేస్తూ పీహెచ్డీ చేయాలనుకునే వారి కోసం కొన్ని ఇన్స్టిట్యూట్లు పీహెచ్డీ కోర్సులను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. వీటిని పార్ట్టైమ్ పీహెచ్డీలుగా వ్యవహరిస్తారు. ఫుల్టైమ్ పీహెచ్డీని 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలో, పార్ట్టైమ్ పీహెచ్డీ 4-7 ఏళ్లలో పూర్తిచేయాలి.ఐఐటీలు, బిట్స్ వంటి ఇన్స్టిట్యూట్లు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎం, పలు బిజినెస్ స్కూల్స్ నిర్వహిస్తున్న ఎఫ్పీఎం, పీహెచ్డీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంబీఏకు పీజీడీఎంకు మధ్య ఉన్న తేడానే ఈ రెండు కోర్సుల మధ్య ఉంటుంది. ఓపెన్కు నో: యూజీసీ-2009 మార్గదర్శకాల మేరకు ఎంఫిల్/పీహెచ్డీ కోర్సులను ఓపెన్ విధానంలో పూర్తి చేయడానికి వీలు లేదు. యూజీసీ-2009 మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి కొన్ని ఓపెన్ యూనివ ర్సిటీలకు మాత్రం పీహెచ్డీ/ఎంఫిల్ కోర్సులను దూర విద్యా విధానంలో నిర్వహించేందుకు అనుమతిస్తారు. ఈ క్రమంలో పీహెచ్డీ చేసే విద్యార్థి ప్రిన్సిపల్ గైడ్ అదే ఓపెన్ యూనివర్సిటీకి చెంది ఉండాలి. అవసరమైన పక్షంలో జాయింట్ గైడ్ వేరే యూనివర్సిటీ నుంచి ఉండొచ్చు. ప్రయోజనం తనకిష్టమైన రంగంలో విస్తృత పరిశోధనల చేయడం ద్వారా సంబంధిత సబ్జెక్ట్లో నిష్ణాతులుగా మారొచ్చు. పీహెచ్డీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించవచ్చు. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్లు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన వేతనంతో ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు. జూనియర్ సైంటిస్ట్గా సీనియర్ శాస్త్రవేత్తల వద్ద పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం చాలా కంపెనీలకు సొంతంగా ఆర్ అండ్ డీ విభాగాలున్నాయి. పీహెచ్డీ చేసిన వారికి వీటిలో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టొచ్చు. సంస్థలను ఏర్పాటు చేయొచ్చు. పీహెచ్డీతో కెరీర్ను ప్రారంభిస్తే నెలకు రూ.35 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది. పీహెచ్డీని కేవలం పేరు ముందు డాక్టర్ అనే మూడక్షరాలను పెట్టుకునేందుకు మార్గంగా భావించకూడదు. నిజమైన ఆసక్తితో పీహెచ్డీలో అడుగు పెట్టాలి. అప్పుడు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి కారకులవుతారు. ఒక అంశాన్ని ఎంచుకునే ముందు.. సదరు అంశంపై ఇదివరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా? లేదా? అని గుర్తించి అప్పుడు మాత్రమే ఆ అంశాన్ని ఎంచుకోవాలి. సదరు అంశంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యను గుర్తించాలి. సదరు అంశానికి పరిష్కారం నిర్దిష్ట కనీస వ్యవధిలో పూర్తవగలదా? లేదా? అని గుర్తించడం. ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్ట్లలో ఇది ఎంతో అవసరం. ఈ విషయంలో ‘గైడ్’ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి సరైన గైడ్ను ఎంపిక చేసుకోవాలి. పీహెచ్డీలో భాగంగా ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త పద్ధతులను ఆవిష్కరించే విధంగా కదలాలి. ఉదాహరణకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్లలో డిజైన్ అనాలిసిస్, సిమ్యులేషన్, ప్రాక్టికల్ అప్లికేషన్ వంటి సాధనాల ద్వారా తమ పరిశోధనకు వాస్తవికతను అందించొచ్చు. అంతేకాకుండా లైబ్రరీ, లేబొరేటరీ, ఇంటర్నెట్ సమాచారాన్ని వినియోగించుకోవాలి. ప్రతి నెల ఒక పేపర్ పబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. కాన్ఫరెన్స్లు, సెమినార్లకు నిరంతరం హాజరవుతూ.. ఆ రంగంలోని నూతన ఆవిష్కరణలు, వాటి నేపథ్యం వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇలా చేస్తేనే నిర్దిష్ట సమయంలో పీహెచ్డీ పూర్తి చేసి థీసిస్ సబ్మిట్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. థీసిస్ రిపోర్ట్ను అంతకుముందు పీహెచ్డీ స్కాలర్స్ రూపొందించిన అంశాలనే కాపీ-పేస్ట్ పద్ధతిలో రూపొందిస్తే అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాపీ-పేస్ట్కు సంబంధించి ఇటీవల ఒక కొత్త సాఫ్ట్వేర్కు కూడా రూపకల్పన జరిగింది. దీని ప్రకారం ఏదైనా ఒక థీసిస్ రిపోర్ట్ను అంతకుముందు రిపోర్ట్ల నుంచి కాపీ చేస్తే సాఫ్ట్వేర్ ఆధారంగా ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి అభ్యర్థులు సొంతగా థీసిస్ రిపోర్ట్ రూపొందించాలి. అప్పుడు మాత్రమే డాక్టరేట్ డిగ్రీ సొంతమవుతుంది. - జి. సూర్యనారాయణ రాజు, వైస్ చాన్స్లర్, ఆంధ్రా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్: అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో 55శాతం మార్కులతో పీజీ. ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా (సీఎస్ఐఆర్-నెట్, యూజీసీ-నెట్,ఐసీఎంఆర్, ఐసీఏఆర్, డీబీటీ-జేఆర్ఎఫ్,ఇన్స్పైర్ ఫెలోషిప్, టీచర్ ఫెలోషిప్, ఏపీసెట్, జెస్ట్లలో అర్హత సాధించిన/ రెగ్యులర్గా ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు) ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2014 (రూ. 400 లేట్ ఫీజుతో ఆగస్టు 20) వివరాలకు: http://ouadmissions.com గమనించాల్సినవి: యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. పీహెచ్డీ కోర్సును పర్యవేక్షించడానికి అనుభవ వజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారా? కావల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో? లేవో పరిశీలించాలి.అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో సభ్యత్వం ఉందో లేదో తెలుసుకోవాలి.పీహెచ్డీ, పరిశోధనలకు సంబంధించి యూనివర్సిటీ గత రికార్డును పరిశీలించాలి. -
డిగ్రీ తర్వాత.. పయనమెటు?
అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి సంప్రదాయ గ్రూప్లతో డిగ్రీ పూర్తిచేసిన వారు ఆయా డిగ్రీలలోని గ్రూప్ సబ్జెక్టులు లేదా అనుబంధ సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ప్రస్తుతం పీజీలో సంప్రదాయ సబ్జెక్టులతో పాటు జాబ్ మార్కెట్కు అనుగుణంగా వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ వంటి కోర్సులను చెప్పుకోవచ్చు. ఇంకా సెన్సైస్ అభ్యర్థులకు.. కెమిస్ట్రీ (ఇన్ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫార్మాస్యూటికల్/ ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), అప్లైడ్ మ్యాథమెటిక్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఎంఏలో సంప్రదాయ ఆప్షన్లతో పాటు ఆంత్రోపాలజీ, డెవలప్మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్వర్క్, సైకాలజీ వంటి సబ్జెక్ట్లను ఎంపిక చేసుకోవచ్చు.ఎంకామ్లో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటివి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, జేఎన్యూ-న్యూఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అన్ని రకాల ఆప్షన్స్తో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ సైన్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని కోర్సులు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలుగా వ్యవహరిస్తారు. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్.. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ (ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్) కోర్సును ఇగ్నో సహకారంతో నిర్వహిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారిస్తే కెరీర్లో ఉన్నతంగా స్థిరపడవచ్చు. ఈ క్రమంలో పీజీ తర్వాత యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్-నెట్ ద్వారా పీహెచ్డీ చేయొచ్చు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్, సీఎస్డీఎస్, తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ దిశగా అడుగులు డిగ్రీ తర్వాత మేనేజ్మెంట్ కెరీర్ వైపు దృష్టి సారించాలనుకుంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. టెక్నికల్ వైపు ఆసక్తి ఉంటే ఎంసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) పరీక్ష రాయాలి. అత్యధిక మంది ఎంపిక టీచింగ్ సంప్రదాయ డిగ్రీ కోర్సుల తర్వాత అత్యధిక మంది విద్యార్థులు టీచింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో డిగ్రీ తర్వాత బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్సెట్) రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎల్పీసెట్) రాయాలి. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోని పలు ఇన్స్టిట్యూట్లు ఈ విభాగంలో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్గా, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా సేవలందించవచ్చు. లా కోర్సులు న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే లా కోర్సులను ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు హాజరు కావచ్చు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్), ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. జర్నలిజం భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి. దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి. మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి. కొత్త కెరీర్లు డిగ్రీ విద్యార్థులు ప్రస్తుతం ఆవిర్భవించిన నూతన కెరీర్ వేదికల వైపు దృష్టి సారించడం ద్వారా మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. అటువంటి వాటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, రిటైల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, బీపీఓ, కెపీఓ, మెడికల్ ట్రాన్స్కిప్షన్. వీటికి సంబంధించి ఆయా విభాగాల్లో ఉండే పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. తద్వారా మెరుగైన కెరీర్ దిశగా అడుగులు వేయవచ్చు. అందుకు అనుగుణంగా స్కిల్స్ మెరుగుపర్చుకోవడం తప్పనిసరి. బాసటగా విదేశీ భాషలు ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు బాగా డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న సంబంధిత కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ఉద్యోగమే లక్ష్యమైతే ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారుు. ఈ పరీక్షల్లో రాణించేందుకు అకెడమిక్స్ చదువుతూనే పోటీ పరీక్షల కోసం సిద్ధంకావాలి. ప్రతి రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి. ప్రోత్సాహకాలు ప్రస్తుతం సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దాంతో సంబంధిత విభాగాలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పలు రకాల స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై-www.kvpy.org.in), ఇన్స్పైర్ స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్ (www.inspire-dst.gov.in), యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్షిప్స్ (ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీ)ను, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్షిప్స్ను అందజేస్తుంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్డీ వంటి ఎన్నో ఉన్నత కోర్సులను చదవడానికి, పరిశోధనల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ స్కాలర్షిప్స్ ఉపయోగపడతాయి. దీన్ని బట్టి సైన్స్ స్ట్రీమ్కు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సైన్స్ కోర్సులను చదివితే అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు డిమాండ్ ప్రస్తుతం జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే బ్యాచిలర్ స్థాయిలో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్సీతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాల్లో రెండు, మూడు వారాల పాటు శిక్షణ ఇస్తున్నాం. ఆర్ట్స్ చదివే విద్యార్థులు కూడా కంప్యూటర్స్పై అవగాహన, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ వంటి అంశాలను నేర్చుకుంటున్నారు. బీఎస్సీలో న్యూట్రిషిన్, ఫుడ్ టెక్నాలజీ వంటి కాంబినేషన్లు ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఉద్యోగావకాశాలుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కోర్సులు పూర్తిచేసిన వారు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఉన్నత విద్య దిశగా వెళ్లాలంటే పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం వల్ల కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో అయితే స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు. - ప్రొఫెసర్ బి.టి.సీత, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ (మహిళలు), హైదరాబాద్.