Published
Wed, Aug 24 2016 10:09 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
బీఎస్ఎన్ఎల్ మెగా రోడ్షో
హాలియా : బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో బుధవారం హాలియాలో మెగా రోడ్షోను జిల్లా టెలికాం బోర్డు సభ్యులు చెన్ను వెంకటనారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మనదేశం–మన బీఎస్ఎన్ఎల్ అనే నినాదంతో ఫ్రీ సిమ్ ఆఫర్తో పాటు రూ.49లకే ల్యాండ్లైన్ కనెక్షన్, 2ఎంబీపీఎస్ ఇంటర్నెట్ రూ.479లకే అందిస్తుందని తెలిపారు. భారత ప్రభుత్వ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జెఈ సంతోష్, జñ టీఓ కిరణ్, లైన్మెన్స్ శబి, నారాయణ, గురువయ్య, వెంకటేశ్, నర్సింహ, వీరయ్య పాల్గొన్నారు.