
డిపోనకే పరిమితం
హిందూపురం టౌన్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలవివాదంలో భాగంగా ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురం డిపో నుంచి కర్ణాటకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మంగళవారం డిపోనకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం వెళ్లిన 4 బస్సులు మినహా మిగతా 10 బస్సులు డిపోలోనే నిలిచాయనినిలిచిన బస్సులు డిపో మేనేజర్ గోపీనాథ్ తెలిపారు.