bus
-
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు కండక్టర్ టికెట్ మెషీన్నే కొట్టేశాడు!
మలక్పేట(హైదరాబాద్): ప్లాట్ఫాంపై ఆగి ఉన్న బస్సులోని కండక్టర్ టికెట్ మెషీన్ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సూర్యాపేట డిపో బస్సు నగరానికి చేరుకుంది. తిరిగి సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్లోని 2 నంబర్ ప్లాట్ఫాంపై డ్రైవర్ బస్సు ఆపాడు. కండక్టర్ కృష్ణవేణి టికెట్ మెషీన్ తన బ్యాగులో పెట్టి కంట్రోలర్ వద్ద వెళ్లి వచ్చి చూసేసరికి కన్పించలేదు. బ్యాగులో టికెట్ మెషీన్, సెల్ఫోన్, పాస్బుక్ ఉన్నట్లు పోలీసులకు కండక్టర్ ఫిర్యాదు చేశారు. కండక్టర్ బస్సు దిగిన తర్వాత డ్రైవర్ కార్గో కేంద్రానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు బ్యాగును అపహరించాడు. ఇందంతా మూడు నిమిషాల్లోనే జరిగిందని కండక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్లాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
Super Six Scheme: ఇచ్చేది లేదు సచ్చేది లేదని.. నోటికొచ్చినట్టు చెప్తున్నారు!
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే టూరిస్టులకు మున్నార్ అందాలను మరింత అందంగా చూపించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్లో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. 'రాయల్ వ్యూ ప్రాజెక్ట్'లో భాగమైన ఈ బస్సులో పర్యాటకులు మున్నార్ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను గో కేరళ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో పర్యాటక ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది.ఇటీవల మున్నార్లో సందర్శన కోసం కొత్త డబుల్ డెక్కర్ బస్సును జెండా ఊపి రవాణా మంత్రి శ్రీ గణేష్ కుమార్ ప్రారంబించారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు వల్ల ప్రస్తుతం ఉన్న పర్యాటక సంబంధిత సౌకర్యాలకు ఎలాంటి ముప్పు ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు. దీని ప్రకారం, మున్నార్ రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సు తేయాకు తోటలు ,ఎత్తైన ప్రాంతాలను 360 డిగ్రీల వీక్షణ అందించేలా రూపొందించారు. గాజు అద్దాలతో, వినసొంపైన సంగీతం పారదర్శకంగా బయటి దృశ్యాలను చక్కగా చూపిస్తుంది. బస్సు ఎగువ డెక్లో 38 మంది, దిగువ డెక్లో 12 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ బస్సు మున్నార్-దేవికులం మార్గంలో రోజువారీ నాలుగు సర్వీసులను నడుపుతుందని సమాచారం.కామెంట్లు చూస్తే గుండె గుభిల్లు అయితే ఈ వీడియో చాలామంది అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులో నిస్సందేహంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కానీ ఈ రోడ్డుపై నా అనుభవం చాలా తీవ్రంగా ఉంది అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.. KSRTC డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా... పెద్ద ముప్పు తప్పదు అని ఒకరు, మోషన్ సిక్నెస్ రావచ్చు, ముఖ్యంగా పొగమంచు ఉన్న రోజుల్లో ఇది చాలా ప్రమాద కరమైనది కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పై చట్టపరమైన సవాళ్లు కొత్త బస్సు సర్వీస్ను పర్యాటకులు స్వాగతిస్తున్నప్పటికీ, ఇది చట్టపరమైన సమస్యలను రేకెత్తిస్తోంది. కేరళ హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాహనాలతో సహా అక్రమ వాహన మార్పులకు సంబంధించిన పిటిషన్లను సమీక్షిస్తోంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా మోటారు వాహనాల చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ , జస్టిస్ మురళీకృష్ణతో కూడిన డివిజన్ బెంచ్ నొక్కి చెప్పింది.మరోవైపు మున్నార్ టూరిస్ట్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ కొత్త బస్సు సర్వీస్ వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ సమస్య ప్రస్తుత పిటిషన్ పరిధిలోకి రాదని పేర్కొంటూ కోర్టు వారి దరఖాస్తును తోసిపుచ్చింది. తగిన మార్గాల ద్వారా చట్టపరమైన సహాయం తీసుకోవాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. KSRTC launches double-decker bus for tourists in Munnar 💚 pic.twitter.com/pJbn6mxik7— Go Kerala (@Gokerala_) February 11, 2025 -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
పెద్ద అంబర్పేట్లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్పేట్లో విషాదం జరిగింది. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దాడి ఎలా చేసారో చెప్పిన కార్పొరేటర్లు
-
బస్సు ప్రయాణికురాలి తల కట్
మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ కొందరు ఏదో కారణంతో తల బయటపెట్టి ప్రమాదాలకు గురవుతుంటారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి బస్సు ప్రయాణికురాలు దుర్మరణం చెందింది. శనివారం జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గుండ్లుపేటె తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) మృతురాలు. ఆమె మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సింధువళ్లి గ్రామం వద్ద మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయట పెట్టింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ, బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయాయి. ఆమె సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పీఎస్ఐ సిద్దరాజు, సిబ్బంది మహేంద్ర స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. -
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
పండక్కి ఇంటికి పోవాలంటే బస్సు ఆడనే ఎక్కాలే
-
టాటా మోటార్స్కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్ఆర్టీసీకి 1,297 బస్ ఛాసిస్లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్పీవో 1618 బస్టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
UP : ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. #UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ— ANI_HindiNews (@AHindinews) December 6, 2024కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. -
స్వర్గాన్ని తలపించే వెహికల్.. జర్నీ కోసం మాత్రమే కాదు: అంతకు మించి (ఫోటోలు)
-
ఆర్టీసీకి బీఎస్–6 బస్సులు
సాక్షి, హైదరాబాద్: భారత్ స్టేజ్–6 బస్సుల వాడకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాయు కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఉద్గారాల ప్రమాణాల జాబితాలోని బీఎస్–6 బస్సుల వాడకానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం బీఎస్–4 ప్రమాణాల బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి ఇప్పుడు బీఎస్–6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. 2020 నుంచి మన దేశంలో ఈ ప్రమాణ బస్సులను అందుబాటులోకి తెచ్చినా..ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోవటంతో ఆ శ్రేణి బస్సులు ఇప్పటివరకు సమకూరలేదు.గతేడాది ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, దశలవారీగా అవి సమకూరుతున్నాయి. కొత్త బస్సులన్నీ బీఎస్–6 శ్రేణి బస్సులే. తాజా యూరో ప్రమాణాల మేరకు ఇవి రూపొందాయి. కర్బన ఉద్గారాలు తక్కువ పరిమితిలో విడుదల చేయటంతోపాటు ఎక్కువ ఎల్రక్టానిక్ డిజైన్తో ఇవి రూపొందాయి. దీంతో వీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు బీఎస్–6 బస్సులున్న డిపోలను పర్యవేక్షిస్తున్న అధికారులకు చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ బస్సుల ప్రత్యేకత ఏంటంటే... మన దేశంలో 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్–1 ప్రారంభమైంది. అలా 2020 నుంచి బీఎస్–6 ప్రమాణాలు మొదలయ్యాయి. అంతకుముందు శ్రేణి వాహనాలతో పోలిస్తే వీటిల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేలా ఇంజిన్లను ఆధునికీకరించారు. అంతకు ముందున్న బీఎస్–4 (బీఎస్–5 స్కిప్) డీజిల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రా.గా ఉండేది. దానిని బీఎస్–6 బస్సుల్లో 80 మి.గ్రా.కు కట్టడి చేశారు. పరి్టక్యులేట్ మ్యాటర్ పరిమితిని 25 మి.గ్రా.ల నుంచి 4.5 మి.గ్రా/కి.మీ.కు తగ్గించారు. దీనివల్ల కొత్తతరం బస్సుల్లో కాలుష్య కారకాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. డాష్ బోర్డులో పలు రకాల సూచనలు ఈ బస్సుల్లో డాష్బోర్డుపై పలు రకాల సూచనలు బ్లింక్ అవుతుంటాయి. ఆ మేరకు డ్రైవర్లు బస్సులను నడపాలి. ఈ బస్సుల్లోని చాలా భాగాలు సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. పాత బస్సుల్లో డాష్ బోర్డుకు ప్రాధాన్యమే ఉండేదికాదు. డిస్ప్లే బోర్డులో రీడింగ్ మీటర్లు పగిలిపోయి రంధ్రాలే కనిపిస్తుండేవి. కానీ, కొత్తతరం బస్సుల్లో 31 సెన్సార్లు అలర్ట్లను చూపుతుంటాయి.ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి ఆయా బస్సులను నిర్వహిస్తున్న డిపోల అధికారులకు ముందు అవగాహన కలిగితే, వారు డ్రైవర్లను ప్రశ్నిస్తూ బస్సులు మెరుగ్గా నడిచేలా చూస్తారని సంస్థ భావిస్తోంది. ఈమేకు ఆయా డిపోల అధికారులను చెన్నైలోని అశోక్లేలాండ్ ప్లాంట్కు పంపింది. మొదటి బ్యాచ్ అధికారుల బృందం ప్రస్తుతం చెన్నై ప్లాంట్లో ఉంది. త్వరలో రెండో బృందం వెళ్లనుంది. కాలుష్య కణాలు వెలువడవుబస్సు వదిలే పొగలో లక్షల సంఖ్యలో కాలుష్య కణాలుంటాయి. అవి మన శరీరంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగగొట్టం నుంచి వెలువడే పొగతో అవి వాతావరణంలోకి చేరతాయి. కానీ, బీఎస్–6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే ఈ సూక్ష కణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో అవి మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో అవి వాతావరణంలో కలిసే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ బస్సుల్లో, పాతతరం బస్సుల తరహాలో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ బస్సుల్లో ఎన్నో ఉన్నాయి. -
లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి -
పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో సందడి నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దీపావళి, ఛట్ పండుగలు ఎంతో ముఖ్యం. ఈ మేరకు నగరంలో ఉంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తప్పనిసరిగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. దీపావళి పర్వదినానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో మంగళవారం పెద్ద ఎత్తున బయలుదేరారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి. నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు.. 👉హైదరాబాద్ నుంచి పాటా్న, కోల్కతా, వారణాసి, దానాపూర్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానాపూర్ ఎక్స్ప్రెస్, ఫలక్నుమా, దర్బంగా తదితర రైళ్లలో నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ సైతం వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో బుకింగ్కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు అనివార్యంగా జనరల్ బోగీలపై ఆధారపడాల్సి వస్తోంది. 👉 ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. జనరల్ బోగీల్లో కాలు మోపేందుకు కూడా చోటు లేకుండాపోయిందని దానాపూర్ ప్రయాణికులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ఏదోఒక విధంగా సొంత ఊళ్లకు వెళ్లాలనే పట్టుదలతో జనరల్ బోగీల్లోనే అతికష్టంగా బయలుదేరి వెళ్తున్నారు. మరో రెండు రోజుల పాటు కూడా ఇదే రద్దీ ఉండవచ్చని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. జనరల్ టికెట్ల కోసం అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా 30 వేల మంది ప్రయాణికులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కూలీలు నగరంలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. కుటుంబాలతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీలంతా దీపావళి వేడుకల కోసం సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దూరభారం దృష్ట్యా రోడ్డు మార్గంలో కంటే రైళ్లలో బయలుదేరి వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఈ రద్దీని ముందే ఊహించి అదనపు రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అవి ఏ మాత్రం చాలడం లేదు. ముఖ్యంగా జనరల్ బోగీల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వరకు 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి. కొన్నింటిలో మాత్రం 3 నుంచి 4 సాధారణ బోగీలు ఉన్నాయి. అయినప్పటికీ అందుకు 5 రెట్ల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. భార్యాపిల్లలతో సహా సికింద్రాబాద్ స్టేషన్కు తరలి వచి్చన ప్రయాణికులు చివరకు జనరల్ బోగీల్లో కూడా వెళ్లేందుకు అవకాశం లేక స్టేషన్ బయటపడిగాపులు కాస్తున్నారు. ‘తిరిగి ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే ఉండి ఏదో ఒక ట్రైన్ పట్టుకొని వెళ్లిపోవడం మంచిది కదా’ అని సంజన్ అనే ప్రయాణికుడు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. మంగళవారం అదనంగా మరో 30 వేల మందికి పైగా సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా. షాపింగ్ సందడి దీపావళి, ధన్తేరస్ సందర్భంగా నగరంలోని టపాసులు, బంగారం, వస్త్ర దుకాణాలు మంగళవారం కిటకిటలాడాయి. ఎటు చూసినా దీపావళి సందడే కనిపించింది. కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం రేట్లు కాస్త పెరిగినప్పటికీ... దీపావళితో పాటు ధన్ తేరస్, ముఖ్యంగా వివాహాల సీజన్ కావడంతో నగరంలో బంగారం కొనుగోళ్లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకున్న సెంటిమెంట్లు, అపోహలు ఇతర ఏ అంశాలు బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపలేదు. అంతేకాకుండా పండుగ నేపథ్యం, వివాహాల శుభకార్యాల కారణంగా వజ్రాభరణాల దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను సంతృప్తి పరచడానికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే.. షాపింగ్ మాల్స్ సైతం కొనుగోనుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. -
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది. ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.బస్సులో సూయజ్లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్లో చికిత్స అందిస్తున్నారు.ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.కర్నాటకలోని మూడ్బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం
పౌరీ: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
బ్యాటరీ బస్సులే తిప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్మెంట్తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉందినగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు. సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.అప్పుల రీస్ట్రక్చర్కు మార్గాలు పరిశీలించండిఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు. -
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
అద్దం కనిపిస్తలేదు.. స్టీరింగ్ తిరుగుతలేదు...
హుజూరాబాద్: ‘ఫుట్బోర్డుపై మీరు నిలబడితే నాకు సైడ్ మిర్రర్ కనిపిస్త లేదు. అద్దం చూడకుండా బస్సు నడపలేను. ఇంతమందితో బస్సు ముందుకు పోవాలంటే కష్టమే.. కనీసం స్టీరింగ్ తిరుగుతలేదు. కొందరు దిగాల్సిందే..’అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై నిలిపివేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్కు వెళ్తోంది. దారిలో హుజూరాబాద్ బస్టాండ్లో ఆగింది. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. నిల్చునేందుకు కూడా స్థలం లేదు. అయినప్పటికీ బస్టాండులో వరంగల్ వెళ్లేవారు మరికొంతమంది ఎక్కారు. డ్రైవర్ ఓవర్ లోడ్ అవుతోందని, బస్సు నడిపే పరిస్థితి ఉండదని ప్రయాణికులను వారించినా వినిపించుకోలేదు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చిన తరువాత డ్రైవర్కు సైడ్ మిర్రర్ కనిపించడం లేదు. దీంతో అద్దం కనిపించడం లేదని, వెనకనుంచి వచ్చే వాహనాలను గమనించకుండా బస్సుని నడపలేనని డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఇంతమంది ఎక్కితే కనీసం బస్సు స్టీరింగ్ తిరగడం లేదని చెప్పాడు. ప్రయాణికులు సహకరించి కొందరు దిగిపోవాలని అభ్యరి్థంచాడు. దీంతో కొంతమంది దిగిపోవడంతో బస్సు వరంగల్ బయల్దేరింది. -
ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. -
తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం.. ఇద్దరి మృతి
సాక్షి,హైదరాబాద్: తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం(ఆగస్టు 7) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డవారి మీద నుంచి వెనుక నుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘోర ప్రమాదం కారణంగా ఘాట్రోడ్డులో ట్రాఫిక్జామ్ అయింది. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక డబుల్ డెక్కర్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావా పోలీసు అధికారి సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ శనివారం రాత్రి 12:30 ప్రాంతంలో రాయ్బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న ముగ్గురు కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. #WATCH | Etawah, Uttar Pradesh: 7 killed in a collision between a double-decker bus and car on Agra Lucknow ExpresswaySSP Etawah Sanjay Kumar Verma says, "A double-decker bus going from Raebareli to Delhi collided with a car at around 12:30 am. There were 60 people on the bus,… pic.twitter.com/LcuMLYDLpN— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2024 -
పట్టాలపై నడుస్తుంది.. ట్రైన్ కాదు (ఫోటోలు)
-
ముంబై-పూణె ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం.. ఐదుగురు మృతి
ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 45 మంది గాయపడ్దారు. పండరీపూర్కు వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో బస్సు, ట్రాక్టర్ రెండూ అదుపు తప్పి కాలువలో పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పరుగుపరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబై పోలీస్ డీసీపీ వివేక్ పన్సారే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. #WATCH | DCP Navi Mumbai, Vivek Pansare says, "The people were going to Pandharpur through a private bus on the occasion of Asadhi Ekadashi. The bus collided with a tractor and fell into a ditch. 42 people, who were injured have been shifted to MGM Hospital, while 3 have been… https://t.co/nIaIt4kgrM pic.twitter.com/BOIAvHkSJE— ANI (@ANI) July 15, 2024 -
జడ్చర్ల వద్ద డీసీఎంను ఢీకొన్న APSRTC బస్సు దగ్ధం
-
హర్యానాలో బస్సు బోల్తా.. నలభై మంది పిల్లలకు గాయాలు
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
132 సీట్ల బస్సు.. పైలట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన గడ్కరీ
భారతదేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణంగా ప్రతివ్యక్తి సొంతంగా వాహనం కలిగి ఉండాలనుకోవడమే. ఓ ఇంట్లో నలుగురు జనాభా ఉంటే.. నలుగురికీ నాలుగు కార్లు ఉంటాయి. చాలామంది ప్రజా రవాణా ఉపయోగించడమే పూర్తిగా మానేశారు కూడా. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' పైలట్ ప్రాజెక్ట్ మొదలైనట్లు వెల్లడించారు.ఇటీవల ఇన్ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గడ్కరీ రాబోయే 132 సీట్ల బస్సు గురించి వివరించారు. ఈ బస్సులలో విమానం మాదిరిగా ఉండే సీట్లు, ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే 'బస్ హోస్టెస్' ఉంటారని వెల్లడించారు. ఇంధనం తక్కువగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకున్నట్లు, భవిష్యత్తులో భారత్ ఇంధన దిగుమతిదారుగా కాకుండా.. ఎగుమతిదారుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఇంధన వినియోగం తగ్గించడానికి ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా.. 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ప్రజా రవాణా ఖర్చును తగ్గించడానికి కూడా ప్రభుత్వం మార్గాలను అన్వేషితోందని గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సు ఒక కిమీ నవ్వడానికి 115 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 41, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 37 మాత్రమే ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు.. టికెట్ ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం మేము టాటాతో కలిసి నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. నేను చెక్ రిపబ్లిక్కు వెళ్ళినప్పుడు.. అక్కడ మూడు ట్రాలీలు ఉన్న బస్సు చూశాను. అలాంటిదే ఇండియాలో కూడా రోపొందించాలని అనుకున్నాను. రాబోయే ఎలక్ట్రిక్ బస్సు 132 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 40 సెకన్లలో 40 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జింగ్ వేసుకుంటుంది. దీనికోసం అయ్యే ఖర్చు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే. -
పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.నాటి నుంచి అడ్డంకులేపుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవునియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.కంపెనీలు వెనక్కే!పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆగడాలే కారణంకర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. -
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్చుప్గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
గుడారాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు కూలీలు మృతి
పనాజీ: గోవాలో బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న గుడారాల్లోకి దూసుకెళ్లింది. శనివారం(మే25) రాత్రి పనాజీకి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుడారాల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు నలుగురు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం మూడు గుడారాల్లో తొమ్మిది మంది ఉన్నారు. రోడ్డు పనులు చేయడం కోసం కూలీలు బీహార్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒక కంపెనీ ఉద్యోగులకు చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం కారణంగా బస్సులో ఉన్నవారెవరికీ ఏమీ కాలేదు. -
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి
చంఢీగడ్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని నూహ్కు సమీపంలోని కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై ఓ బస్సులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. हरियाणा के नूंह जिले में बड़ा हादसा। टूरिस्ट बस में आग लगी। 8 यात्री जिंदा जले। काफी यात्री झुलस गए। ये सभी मथुरा–वृन्दावन से दर्शन करके पंजाब–हरियाणा की तरफ लौट रहे थे। रात 2 बजे कुंडली–मानेसर–पलवल एक्सप्रेस वे पर हादसा हुआ है।#haryana #Accident pic.twitter.com/Be0gInGJiq— ShivRaj Yadav (@shivayadav87_) May 18, 2024ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనం యాత్రకు వెళ్లి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నూహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా పలువురు గాయపడ్డారని తెలిపారు.VIDEO | At least eight people were killed when the bus they were travelling in caught fire on the Kundli-Manesar-Palwal (KMP) Expressway near Nuh, #Haryana, late on Friday.(Source: Third Party) pic.twitter.com/xeE7XkhBGD— Press Trust of India (@PTI_News) May 18, 2024 -
ఓటు మా బాధత్య.. పల్లెకు బయల్దేరిన నగరవాసులు (ఫొటోలు)
-
బస్సు ఆపట్లేదని దాడి..
మహబూబాబాద్ : బస్సు ఆపడం లేదని ప్రయాణికులు సదరు బస్సుపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి తొర్రూరు బస్టాండ్లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం.. తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే తొర్రూరు డిపో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసింది. బస్సు ఎక్కేందుకు బయట ఉన్న ప్రయాణికులు యత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలపై రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపి డయల్–100కు కాల్ చేయగా పోలీసులు చేరుకుని గొడవను సద్దుమణిగేందుకు చర్యలు తీసుకున్నారు. పలువురు ప్రయాణికులకు బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష నిర్వహించి మద్యం తాగిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. -
సంధ్య ఆక్వా బస్సులో పోలీసుల తనిఖీలు..
-
ఆ బాక్సుల నిండా ఫైళ్లు!
పిఠాపురం: మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో నిలిపివేసిన సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులను విచారించగా బస్సు బ్రేక్ డౌన్ కావడంతో అక్కడ నిలిపి ఉంచినట్లు చెప్పారు. బస్సులోని అట్ట పెట్టెల్లో పలు ఫైళ్ల కట్టలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలియజేస్తామని ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం బస్సును ఆక్వా కంపెనీలోకి తరలించారు. -
అమ్మో ‘రాజధాని’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు. డిమాండ్ ఉన్నా.. రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2016లో కొన్న బస్సులే... ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు. అన్నీ సమస్యలే.... పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం..
వరంగల్: భూపాలపల్లి–కాటారం జాతీయ ప్రధాన రహదారిపై మల్లంపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం వైపు నుంచి భూపాలపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సును కాటారం వైపునకు వెళ్తున్న డీసీఎం ఢీకొంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మహాముత్తారం మండలం కనూకునూరుకు వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో మల్లంపల్లి క్రాస్ సమీపంలో భూపాలపల్లి వైపు నుంచి వస్తున్న డీసీఎం.. ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొంది. దీంతో డ్రైవర్ శ్రీనివాస్తో పాటు నలుగురు తీవ్రంగా, మరో 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్కు తరలించారు. ఆదివారంపేటకు చెందిన అతుకూరి సమ్మక్క, లావణ్య(ములుగుపల్లి), రాజేశ్వరి(కాటారం), లక్ష్మి (ముప్పారం) గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు కండక్టర్ ఎండీ హమీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. కాగా, క్షతగాత్రులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ నవీన్కుమార్ను ఆదేశించారు. -
స్కూలు వ్యానులో తిరుగుతూ.. అత్యధిక ఆదాయం సంపాదిస్తూ..
డబ్బు సంపాదించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో కష్టపడితేనే తగిన ఆదాయం వచ్చి, జీవితం సజావుగా సాగుతుంది. అయితే దీనికి భిన్నమైన సిద్దాంతాన్ని అనుసరిస్తున్న ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ పేరు అలిస్ఎవర్డీన్(32). అమెరికాలోని ఆస్టిన్లో ఉంటోంది. అలిస్ గతంలో ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఆమె వారానికి 50 నుండి 60 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి విసిగిపోయిన ఆమె ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఒక స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి, దానిని తన ఇంటిలా మలచుకుంది. ప్రస్తుతం ఆమె ఆ స్కూలు వ్యానులో దేశమంతా తిరుగుతోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్న ఆలిస్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తోంది. ఆలిస్ ఫ్రీలాన్సర్ కంటెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఆమె రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది. గతంలో ఆఫీసుకు వెళ్లి సంపాదించిన దానికంటే ఇప్పుడు రెట్టింపు సంపాదిస్తున్నానని అలిస్ తెలిపింది. ఆలిస్ వాయిస్ ఓవర్ వర్క్తో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యూజీసీ)కి సంబంధించిన వీడియోలను కూడా రూపొందిస్తుంటుంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్లలోనూ పనిచేస్తుంది. ఫలితంగా ఆమెకు అత్యధిక ఆదాయం వస్తోంది. టెక్సాస్లో నివసించడం చాలా ఖరీదైనదని, పాఠశాల బస్సులో నివసించడం ఎంతో చౌక అని అలిస్ తెలిపింది. పార్కింగ్, ఆహారం కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందని ఆమె పేర్కొంది. పార్కింగ్కు నెలకు ఆరు వేలు, పెట్రోలుకు రూ.80 వేలు, ఆహార ఖర్చులకు 20 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ మొత్తం టెక్సాస్లో నివసించడం కంటే చౌకైనదని ఆమె వివరించింది. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
ఇది మెట్రో కాదు..ఆర్టీసీ బస్సు
-
సిద్ధం సభ: బస్సు నడిపిన మాజీ మంత్రి పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సిద్ధం సభకు బస్సుల్లో కదిలారు. కార్యకర్తలతో కలిసి కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు బస్సులో దెందులూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు. ఇదీ చదవండి: YSRCP: సరికొత్త సామాజిక విప్లవం.. -
మెట్లెక్కకుండానే.. బస్సెక్కొచ్చు!
చింతపల్లి (దేవరకొండ): వృద్ధులైన అమ్మమ్మ, నానమ్మ బస్సు ఎక్కేందుకు పడుతున్న ఇబ్బందులను చూసిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి.. మెట్లు ఎక్కకుండానే బస్సులోపలికి వెళ్లగలిగే ఓ పరికరాన్ని డిజైన్ చేశాడు. సైన్స్ పాఠాల్లోని పాస్కల్ సూత్రాన్ని ఆధారం చేసుకుని, థర్మాకోల్, సిరంజీలు, పైపులతో ప్రొటోటైప్ను సిద్ధం చేశాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్కు చెందిన తోలు చంద్రయ్య, చిట్టెమ్మ దంపతుల కుమారుడు అజయ్ ఘనత ఇది. అక్కడి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతున్న అజయ్.. ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య సహకారంతో ‘పాస్కల్ డివైజ్ ప్రొటోటైప్’ను రూపొందించాడు. ఇందులో పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే ఒక ప్లాట్ఫాం ఉంటుంది. బస్సు ఆగినప్పుడు డ్రైవర్ ఒక లీవర్ లాగితే.. ఆ ప్లాట్ఫాం డోర్ దగ్గర నేలపైకి వస్తుంది. దానిపైకి ప్రయాణికులు ఎక్కాక మరో లీవర్ లాగితే.. ఆ ప్లాట్ఫాం మెల్లగా పైకిలేచి బస్సులోపలికి వెళ్లేంత ఎత్తుకు చేరుతుంది. వారు నేరుగా బస్సులోపలికి వెళ్లొచ్చు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెస్టివల్లో ఆకట్టుకున్న ఈ ఎగ్జిబిట్.. సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయవాడలో ఆ ప్రదర్శన జరగనుంది. పెద్దవాళ్లు ఇబ్బంది పడటం చూసి.. ‘‘మా అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్లు, గర్భిణులు బస్సు ఎక్కే సమయంలో ఇబ్బందిపడటం చూశాను. వారు సులువుగా బస్సు ఎక్కేలా పరికరం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మా సైన్స్ టీచర్ సహకారంతో ఈ పరికరానికి రూపకల్పన చేశాను. వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, కీళ్లనొప్పులున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. బరువైన లగేజీలను బస్సులోకి తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది..’’ అని అజయ్ చెప్పాడు. ఇక పాస్కల్ డివైజ్తో ఎంతో ప్రయోజనం ఉంటుందని, దాతలు ముందుకొస్తే దాని ప్రొటోటైప్ ఆవిష్కరించేందుకు వీలవుతుందని టీచర్ శ్రీవిద్య తెలిపారు. -
బస్సు కిటికీలో ఇరుక్కున్న తల
-
ఆర్టీసీ బస్డిపోలో రెండు బస్సులు దగ్ధం
చైతన్యపురి: దిల్సుఖ్నగర్లోని ఆర్టీసీ డిపోలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా మంటలంటుకుని రెండు మెట్రో ఎక్స్ప్రెస్ బస్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణం అయి ఉంటుందా అని ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... ఉదయం 4.50 గంటలకు ధర్మయ్య అనే డ్రైవర్ విధుల కోసం బస్డిపోకు చేరుకున్నారు. తనకు కేటాయించిన బస్సు (టీఎస్04జడ్0173) వద్దకు వెళ్లి తన బ్యాగ్ను బస్లో పెట్టి తాగు నీరు తెచ్చుకునేందుకు వాటర్ ఫిల్టర్ దగ్గరకు వెళ్లాడు. బస్ బయలుదేరేందుకు 45 నిమిషాలు సమయం ఉండటంతో అక్కడే సిబ్బందితో మాట్లాడుతున్నాడు. బస్ గ్యారేజ్ ఎదురుగా పార్కు చేసి ఉన్న బస్ నుంచి పొగలు రావటం గమనించిన మెకానిక్లు కొందరు బస్ దగ్గరకు పరుగెత్తారు. బస్ అడుగున బ్యాటరీ, గేర్బాక్స్ మధ్యలో మంటలు వస్తుండటంతో పైర్ సేఫ్టీ సిలెండర్ తీసుకొచ్చి ఆపే ప్రయత్నించారు. కానీ ఆగక పోగా క్షణాల్లోనే బస్మొత్తం వ్యాపించాయి. ఈలోగా కొంత మంది మెకానిక్లు మంటలు అంటుకున్న బస్ పక్కన ఉన్న మూడు బస్లను అక్కడ నుంచి తరలించారు. ప్రమాదం జరిగిన బస్ పక్కన ఉన్న మరో బస్తీసేందుకు వీలు కాక పోవటంతో (టీఎస్ 04 జడ్ 0193) బస్కు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఈలోగా సమాచారం అందుకున్న మలక్పేట ఫ్రైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. రెండు బస్లు పూర్తిగా దగ్ధం కాగా మరో గూడ్స్ వాహనం కొద్దిగా కాలింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనా..? దిల్సుఖ్నగర్ సిటీ డిపోలో రెండు బస్లు దగ్దం కావటానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక మరదైన కారణం ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి. మంటలు ముందుగా అంటుకున్న బస్ చౌటుప్పల్ రూట్లో నడుపుతారు. గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉండటంతో రెండు రోజులుగా నడపటం లేదని తెలిసింది. గేర్బాక్స్ మరమ్మత్తు పూర్తి చేసిరాత్రి 9గంటల సమయంలో బస్ వాషింగ్ చేసి పార్కు చేసినట్లు మెకానిక్లు తెలిపారు. బ్యాటరీ నుంచి వచ్చే వైర్లు ఏవైనా షార్ట్ అయి మంటుల వ్యాపించి గాలి ఎక్కువగా ఉండటంతో పక్కన ఉన్న బస్కూడా దగ్దం అయిందని అధికారులు తెలుపుతున్నారు. బస్లో తన బ్యాగ్ పెట్టి వాటర్ కోసం వేళ్లానని డ్రైవర్ దర్మయ్య తెలుపుతుండగా మంటలు అంటుకున్న సమయంలో బస్ స్టార్ట్కీ అన్ చేసిఉందని కొంతమంది డిపో సిబ్బంది చెప్పటం గమనార్హం. టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుండి పలువురు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై మలక్పేట పోలీస్ స్టేషన్లో డిపో మేనేజర్ హరి పిర్యాదు చేశారు. -
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
ఓర్వలేకే తప్పుడు ప్రచారం
ఇబ్రహీంపట్నం: అధికారం కోల్పోయిన అక్కసుతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుక్రవారం ఇబ్రహీంపట్నం బస్టాండ్లో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకాన్ని చాలామంది మహిళాలు వినియోగించుకుంటున్నారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ప్రతిపక్షాలకు అక్కసు పుట్టిందన్నారు. ఈ పథకంపై కావాలని బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతుండటంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ఉచిత ప్రయాణంపై మహిళలు బస్సుల్లో కొట్టుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 త్వరలో అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సదాలక్ష్మి, కవిత, ఉషశ్రీ, మాధవి, వెంకటమ్మ, మంజుల, అమృత, రత్నకుమారి, లావణ్య పాల్గొన్నారు. -
TSRTC: రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్కు ఏపీ సీఎం జగన్ పరామర్శ -
TSRTC: జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తాం..
మంచిర్యాలఅర్బన్: సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5నుంచి సమ్మెకు అద్దె బస్సుల నిర్వాహకుల నిర్ణయంతో బస్సులు నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 9న మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. 50శాతం నిండని బస్సుల్లో 75శాతం నుంచి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఏ బస్సుల్లో చూసినా పరిమితికి మించి 110 నుంచి 120 మంది ప్రయాణం చేస్తున్నారు. నిబంధనల మేరకు పల్లె వెలుగు బస్సుల్లో 56, ఎక్స్ప్రెస్ల్లో 51మంది ప్రయాణికులకే మాత్రం బీమాను యజమానులు చెల్లిస్తూ వస్తున్నారు. అంతకు మించి ప్రయాణికులు పెరిగినా బీమా వర్తించదని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత ఎవరిదనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులపై అదనపు భారం పడి.. వేగం తగ్గిపోతుందని బస్సుల యజమానులు వాపోతున్నారు. ఈ నెల 5నుంచి ఆర్టీసీలో సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. 309 బస్సులకు బ్రేక్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 606 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర వేస్తున్నారు. ఇందులో 303 అద్దె బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదిలాబాద్లో 60, మంచిర్యాలలో 69, నిర్మల్లో 77, భైంసాలో 49, ఆసిఫాబాద్లో 31, ఉట్నూర్లో 23 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ లెక్కన సంస్థ పరిధిలో నడిచే బస్సుల్లో సగం అద్దె బస్సులే అన్నమాట. మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సులు సరిపోవడం లేదు. కొన్ని రూట్లలో ఏ బస్సులో చూసినా రద్దీ తగ్గడం లేదు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులు రావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీలో అద్దె బస్సులు సగానికి పైగా సమ్మెకు వెళ్తే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. సమ్మె నోటీసు.. తమ డిమాండ్లు పరిష్కరించాలని అద్దెబస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే అద్దె బస్సుల యజమానుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే కావడంతో సమ్మెకు వెళ్తే ఎలా అనేదానిపై చర్చ సాగుతోంది. మొత్తం బస్సులు తిప్పితేనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాంటిది సగం బస్సులు నిలిచిపోతే ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
Telangana: ప్రయాణికులకు ప్రైవేట్ బస్సులే శరణ్యమా?
సాక్షి,హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు బస్సులు, రైళ్లలో ప్రయాణం అసాధ్యంగా మారింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లతో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 250 దాటి కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో బుకింగ్కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ వైపు చూస్తున్నారు. కానీ.. సాధారణంగా జనవరి మొదట్లోనే ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ కార్యాచరణ చేపడుతుంది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులు ముందస్తుగా రిజర్వేషన్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచి్చన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతానికి పెరిగింది. కొన్ని రూట్లలో ఎక్స్ప్రెస్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల రద్దీ మేరకు డీలక్స్ బస్సులను ఏర్పాటు చేయాల్సివస్తోంది. దీంతో సంక్రాంతికి ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీకి సవాల్గా మారింది. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా రాకపోకలు సాగించే లగ్జరీ, డీలక్స్ వంటి బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులను రద్దీ ప్రాంతాలకు మళ్లిస్తారు. కానీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి పల్లెవెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. ప్రతిరోజు 88 శాతం నుంచి 100 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఈ బస్సులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం కష్టమే. ఏటా 25 లక్షల మందికిపైగా ప్రయాణం.. సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకల కోసం నగరం నుంచి ప్రతి ఏటా సుమారు 25 లక్షల మందికి పైగా బయలుదేరి వెళ్తుంటారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన వెంటనే ప్రయాణాలు మొదలవుతాయి. జనవరి రెండో వారంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఇందుకనుగుణంగా ఆర్టీసీ సుమారు 4,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని దూరప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.మరోవైపు ఏపీఎస్ఆరీ్టసీ కూడా అదనపు బస్సులను అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ జిల్లాల్లోని డిపోల నుంచి అందుబాటులో ఉన్న బస్సులను సేకరిస్తారు. ముఖ్యంగా మహిళల ప్రయాణాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జిల్లాలకు అదనపు ట్రిప్పులు వేయడం కూడా సవాల్గా మారవచ్చని ఒక అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. “ఒకవేళ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా మళ్లిస్తే తెలంగాణ ప్రయాణికులకు బస్సుల కొరత ఏర్పడవచ్చు. కానీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపలేకపోతే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సివస్తోంది’ అని వివరించారు. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల 50 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మరో 30 బస్సులు త్వరలో రానున్నాయి. వీటిలో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని తదితర కేటగిరీలకు చెందిన బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు నడిపే అవకాశం ఉంది. కానీ రద్దీ తీవ్రత దృష్ట్యా అదనపు బస్సుల ఏర్పాటు ఈ సారి సవాల్గానే మారనుంది. ప్రైవేట్ బస్సుల దోపిడీ... ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడే ప్రైవేట్ బస్సులు ఈసారి మరింత రెచి్చపోయే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.910 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.1600కు పైగా వసూలు చేస్తారు. అలాగే విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు కూడా చార్జీలను రెట్టింపు చేస్తారు. ఈ సారి ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయలేకపోతే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలను పెంచే అవకాశం ఉందని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు అభిప్రాయపడ్డారు. -
సిటీ బస్.. టాప్ గేర్
హైదరాబాద్: సిటీ బస్సు ఇక రయ్రయ్మని పరుగులు తీయనుంది. నూతన సంవత్సరం కొత్త సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో ఇప్పటి వరకు కొత్తవాటిని ప్రవేశపెట్టకపోవడంతో ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపడం అసాధ్యంగా మారింది. మహిళా ప్రయాణికులకు ఉచిత సదుపాయంకల్పించినప్పటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. దీంతో పలు మార్గాల్లో అదనపు బస్సులను నడపడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగర శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా రద్దీ కారణంగా సకాలంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన 340 బస్సులను అద్దెకు తీసుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ చర్యలు చేపట్టింది. ఇంచుమించు కొత్త ఏడాది ఆరంభంలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే మరో 500 కొత్త బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ నాటికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం 840 కొత్త బస్సులు నగరంలో వినియోగంలోకి రానున్నాయి. ఈ బస్సులతో ప్రయాణికులకు కొంత మేరకు ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కోటిన్నర దాటి.. మహాలక్ష్మి పథకం గ్రేటర్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 8 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. డిసెంబరు 9వ తేదీన ఈ పథకం అందుబాటులోకి వచి్చన సంగతి తెలిసిందే. గతంలో 4 నుంచి 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేయగా.. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత ఏకంగా 8 లక్షలకు చేరింది. రోజు రోజుకు మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య కోటిన్నర దాటినట్లు అంచనా. గతంలో 67 నుంచి 69 శాతం వరకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో కూడా 80 శాతం దాటింది. రద్దీ రూట్లలో మహిళలు సైతం ఫుట్బోర్డుపై ప్రయాణం చేయాల్సివస్తోంది. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఉదయం కాలేజీలకు వెళ్లే విద్యారి్థనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పూట కాలేజీకి వెళ్లాల్సిన సమయంలో బస్సులు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణం అసాధ్యంగా మారుతోంది. దీంతో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయాలని విద్యారి్థనులు డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో పెరిగిన రద్దీ... ఉచిత ప్రయాణ సదుపాయంతో శివారు ప్రాంతాల్లోంచి నగరంలోకి రాకపోకలు సాగించే బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. డిమాండ్కు తగినవిధంగా బస్సులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణం చేయాల్సివస్తోంది. ‘సాధారణంగానే కొద్ది రోజులుగా రాకపోకలు పెరిగాయి. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత రద్దీ మరింత ఎక్కువైంది. కానీ కొత్త బస్సులు వచ్చే వరకు ట్రిప్పులను పెంచడం సాధ్యం కాదు కదా’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. డిపోల్లో స్పేర్లో ఉండే 10 శాతం బస్సులను సైతం నడుపుతున్నట్లు చెప్పారు. గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. ఈ దిశగా కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆశిద్దాం. ఫ్యామిలీ–24 టికెట్లు రద్దు మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్లో జారీ చేసే ఫ్యామిలీ–24, టి–6 టికెట్లను నేటి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జరార్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఫ్యామిలీ– 24, టి–6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ–24, టి–6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా బస్ సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. దీంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతోనే ఈ టికెట్లను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి సిటీ బస్సుల్లో ఈ టికెట్లు లభించవు. -
బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో..
మహబూబాబాద్: హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్ లోడ్తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి కూడా చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వోల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టింది. మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. -
97 డిపోలకు గాను 96 లాభాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు పెరగడంతో దశాబ్దం తర్వాత సంస్థ లాభాలను ఆర్జిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలి్పంచడంతో, వారి రూపంలో కోల్పోయే మొత్తాన్ని ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్ చేస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లెక్కలు ఖరారు చేశారు. గత సోమవారం (డిసెంబర్ 18) ఒక్కరోజే రూ.21.11 కోట్ల ఆదాయం నమోదైంది. ఈనెలలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే, సోమవారం ఏకంగా 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం చవిచూసింది. ఇలా 96 డిపోలు లాభాల్లోకి రావటం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్టైం రికార్డుగా నిలిచింది. డిసెంబరులో ఇప్పటివరకు 49 డిపోలు లాభాలు ఆర్జించాయి. దీంతో ఈనెల మొత్తానికి రూ.3.14 కోట్ల లాభం నమోదవుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలా ఒక నెల మొత్తానికి లాభాలు నమోదవడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. బస్సుల్లో సాధారణ రోజుల్లో కంటే సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. జీరో టికెట్ల జారీ మొదలైన తర్వాత తొలి సోమవారం (18వ తేదీ) 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు తేలింది. సోమవారం 30.12 లక్షల జీరో టికెట్లు (మహిళలకు ఇచ్చేవి) జారీ అయ్యాయి. కొత్త ఉత్సాహం కొన్ని డిపోలు సోమవారం ఒక్కరోజే 14 లక్షలకు మించి లాభాలు ఆర్జించటం విశేషం. ఒక్కో డిపో రోజుకు ఐదారు లక్షల నష్టాలను చవిచూసే పరిస్థితికి అలవాటుపడ్డ ఆర్టీసీకి తాజా లెక్కలు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం హనుమ కొండ డిపో రూ.14.10 లక్షలు, దేవరకొండ డిపో రూ.13.94 లక్షలు, మహబూబ్నగర్ డిపో రూ. 13.61 లక్షలు, హైదరాబాద్–1 డిపో రూ. 13.55 లక్షలు.. ఇలా పలు డిపోలు భారీ లాభాలు నమో దు చేసుకున్నాయి. ఒక్క కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం పొందటంతో మొత్తం డిపోల జాబితాలో నష్టాలు పొందిన ఏకైక డిపోగా మిగిలింది. 450కు మించి టికెట్ల జారీ సాధారణంగా జిల్లా సర్విసుల్లో ఒక కండక్టర్ గరిష్టంగా 300 వరకు టికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వాటిల్లో 450కి మించి టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నా.. వారు ఎక్కడి వరకు ప్రయాణిస్తారో తెలుసుకోవడం, వారు తెలంగాణ నివాసితులా కాదా అని ధ్రువపత్రాలు పరిశీలించడం లాంటి వాటి వల్ల టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. -
త్వరలో రూ.100 కోట్లు సమీకరణ.. ఎందుకో చెప్పిన సీఈఓ
ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫాం అభిబస్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన ఫ్రెష్బస్ విస్తరణ కోసం రానున్న రోజుల్లో రూ.100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఏడాది సిరీస్-ఏలో భాగంగా ఈ మొత్తాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు రూ.23.5 కోట్లను సేకరించిన స్టార్టప్ కంపెనీ సిరీస్-ఏ రౌండ్ని మార్చి 2024 వరకు ముగించాలని భావిస్తున్నట్లు ఫ్రెష్బస్ సీఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇంటర్సిటీ ఎలక్ట్రిక్బస్ కనెక్టివిటీని అందించే ఫ్రెష్బస్ సంస్థను 2022లో స్థాపించారు. టీవీఎస్ మోటార్ ఎండీ సుదర్శన్ వేణు, డార్విన్బాక్స్ వ్యవస్థాపకులు రోహిత్ చెన్నమనేని, జయంత్ పాలేటి, చైతన్య పెద్ది, ట్రావెల్ పోర్టల్ ఎక్సిగో, క్రెడ్ వ్యవస్థాపకులు కునాల్ షా, రివిగోకు చెందిన దీపక్ గార్గ్ ఈ కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. మార్చి 2027 నాటికి దేశవ్యాప్తంగా 1000 బస్సులతో 100 నగరాలల్లో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ చెప్పారు. ఇదీ చదవండి: లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా.. -
బస్సుల్లో మహిళల రద్దీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించడంపై చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ వద్ద సీఎం రేవంత్రెడ్డి ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్నందున.. కిక్కిరిసి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ముందే ఊహించారు. కీలక ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమీక్షించారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో రద్దీపై స్పష్టత ఉండదని.. సోమవారం నుంచి ఉచిత ప్రయాణ ప్రభావం ఎంతనేది తెలుస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాయింట్ల వద్ద సోమవారం అదనపు సిబ్బందిని పెట్టి బస్సులను, రద్దీని పర్యవేక్షించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించి.. అంతగా రద్దీ లేని రూట్ల నుంచి వాటివైపు బస్సులను మళ్లించాలని భావిస్తున్నారు. గుర్తింపు కార్డులు అడగకుండానే.. ఉచిత ప్రయాణ పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఉచితంగా ప్రయాణించాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ధ్రువపరిచే గుర్తింపు పత్రాలను కండక్టర్లకు చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఒక వారం రోజుల పాటు అలాంటి పత్రాల కోసం పట్టుబట్ట వద్దని, మహిళలందరినీ అనుమతించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజున ఎక్కడా గుర్తింపు కార్డులు అడగలేదు. అయితే ఎందరు ప్రయాణికులు, ఎంతెంత దూరం చొప్పున ప్రయాణించారన్న వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లో నమోదు చేసుకున్నారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేసేవరకు జీరో టికెట్లు జారీ చేయాల్సి ఉండనుంది. జీరో టికెట్కు సంబంధించి టిమ్స్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఆటోలు, క్యాబ్లు, సెట్విన్ బస్సులపై ప్రభావం! ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు నేపథ్యంలో ఆటోలు, క్యాబ్లు, సెట్విన్ బస్సుల్లో వెళ్లేవారు ఆర్టీసీ బస్సులవైపు మళ్లారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిలోనూ కొందరు బస్సులెక్కారు. ఈ పథకం ఆటోలు, క్యాబ్లు, సెట్విన్ బస్సులపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గితే కొంతమేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయలూ వస్తున్నాయి. మరోవైపు ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతున్నందున.. వీలైనంత తొందరలో కొత్త బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులు రోడ్డెక్కితే.. ఆర్టీసీ సర్విసులు పెరిగి ప్రైవేటు వాహనాల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
ఓటు వేయడానికి ఉర్లకు వెళ్తున్న ప్రజల తిప్పలు
-
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..
జమ్మూ కశ్మీర్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. జమ్ముకాశ్మీర్లో భారీ రోడ్డు ప్రమాదాలు 2019, జూలై 1: కిష్త్వార్లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు. 2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు. 2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం. 2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి. 2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం. 2019, మార్చి 15: రాంబన్లో కారు లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు. 2023, మే 24: కిష్త్వార్లోని దచాన్ ప్రాంతంలోని దంగ్దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు. 2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు. 2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి -
ఐపీఎస్ల ప్రజారవాణా సందేశం
బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c — South First (@TheSouthfirst) November 10, 2023 -
డబుల్ డెక్కర్.. ఉచిత ప్రయాణం
హైదరాబాద్: ఎన్నికల వేళ.. డబుల్డెక్కర్ రోడ్డెక్కింది. కొద్ది రోజులుగా హుస్సేన్సాగర్ చుట్టూ మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు రూ.2.5 కోట్ల చొప్పున 3 బస్సులను ప్రవేశపెట్టారు. కానీ చాలాకాలం వరకు ఈ బస్సులు పార్కింగ్కే పరిమితమయ్యాయి. నగరంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దఫాలుగా సర్వేలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రూట్లను ఖరారు చేయలేదు. దీంతో పార్కింగ్కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం సాగర్ చుట్టూ తిప్పుతున్నారు. సెక్రటేరియల్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విదేశీ పర్యాటకులు సైతం నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్, పరిసరాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఇదీ రూట్... ప్రస్తుతం సాగర్ చుట్టూ మూడు బస్సులు కూడా తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్సిటీ, లేక్ఫ్రంట్ పార్కు, జలవిహార్, నీరాకేఫ్, పీపుల్స్ప్లాజా, ఇందిరాగాంధీ, పీవీల విగ్రహాలు, అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సుల్లోనే ట్యాంక్బండ్ వైపు వెళ్లవచ్చు. అనంతరం ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్బండ్ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కు వరకు చేరుకొంటాయి. బస్సు మొదటి అంతస్తులో కూర్చొని ఈ రూట్లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇవీ వేళలు.. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డబుల్ డెక్కర్ బస్సుల్లో సాగర్ చుట్టూ విహరించవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్ డెక్కర్లకు డిమాండ్ కనిపిస్తోంది. -
భార్య డ్రైవర్, భర్త కండక్టర్
-
రైల్వే ట్రాక్పై బస్సు బోల్తా
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో బస్సు అదుపుతప్పి రైలు పట్టాలపై బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగులు మృతి చెందారు. దాదాపు 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వైపు 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది. 'ప్రమాదానికి గురైన వెంటనే 24 మందిని ఆస్పత్రికి తరలించాం. నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.' అని జిల్లా అదనపు కలెక్టర్ రాజ్కుమార్ కాస్వా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు.. ట్రాక్పై నుంచి బోల్తా కొట్టిన బస్సును తొలగించారు. ప్రమాదంపై సీఎం అశోక్ గహ్లోత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య -
సీఎం కేసీఆర్ బస్సులో తనిఖీలు..
సాక్షి,కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్తో పాటు హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేశారా రొటీన్ చెకింగ్లో భాగంగా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్లో స్కై బస్సు సర్వీస్ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? -
పోటెత్తిన దసరా రద్దీ
హైదరాబాద్: దసరా రద్దీ పోటెత్తింది. రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, నగర శివారు కూడళ్లలో శుక్రవారం ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఆర్టీసీ 5,250కి పైగా ప్రత్యేక బస్సులు.. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా కిటకిటలాడాయి. రెగ్యులర్ రైళ్లలో చాలా రోజుల క్రితమే రిజర్వేషన్లు బుక్ కావడంతో చాలామంది జనరల్ బోగీలను ఆశ్రయించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి. అదనంగా 600 రైళ్లు.. సాధారణంగా ప్రతి రోజు సుమారు 85 ఎక్స్ప్రెస్ రైళ్లు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. మరో వంద ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వరకు సుమారు 600 సర్వీసులను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 1.85 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రైవేట్ బస్సుల దోపిడీ.. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ బస్సులు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు లభించని దూరప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు. విజయవాడకు రూ.450 నుంచి రూ.800కు పెంచారు. ఒక్కో ట్రావెల్ సంస్థ ఒక్కో విధమైన చార్జీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సొంత వాహనాల్లోనూ.. బస్సులు, రైళ్లతో పాటు కార్లు, బైక్లు వంటి సొంత వాహనాల్లోనూ నగరవాసులు పల్లెబాట పట్టారు. టాటాఏస్, మ్యాక్సీ క్యాబ్లు భారీగా బయలుదేరాయి. దీంతో పలు టోల్ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగనుంది. రహదారులపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. -
రూపాయికే బస్ టికెట్..అయితే ఈ చాన్స్ ఎంతమందికి దక్కుతుందో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బుకింగ్ యాప్ అభిబస్ ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్కు బస్ టికెట్ వోచర్స్ ఇస్తారు. ఈ ఆఫర్ ప్రైవేట్ బస్లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్ బుకింగ్స్కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
తిరుపతి నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులు
-
దారుణం: కారును ఢీకొట్టి.. ఆపై ఫల్టీ కొట్టి
కోల్కతా: కోల్కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్ను లెక్క చేయకుండా వేగంగా దూసుకొచ్చిన బస్సు.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ బస్సు ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3rd Oct, 2023. Kolkata Sector 5 bus accident pic.twitter.com/nbNQuAL0jC — Saddam Hossain (@bestheart0027) October 4, 2023 అక్టోబర్ 2న ఉదయం రోడ్డంతా దాదాపుగా ఖాలీగా ఉంది. ఓ వైపు నుంచి వస్తున్న బస్సు ఎదురుగా ఉన్న రెడ్ సిగ్నల్ను గమనించకుండా వేగంగా దూసుకొచ్చింది. మరోవైపు నుంచి వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు మాత్రం ఫల్టీ కొడుతూ కిందపడింది. ఐదుగురు ప్రయాణికులకు తేలికపాటి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదీ చదవండి: Sikkim Flash Floods: సిక్కింలో కుంభవృష్టి.. 14 మంది మృతి.. 22 మంది జవాన్లు సహా 102 మంది మిస్సింగ్ -
టీటీడీ బస్సు చోరీ కేసు నిందితుడి అరెస్ట్
తిరుమల/తిరుపతి లీగల్ : టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయత్నగర్ మండలం అనంజపూర్ గ్రామంలోని నీలావర్ గణపతి కుమారుడు నీలావర్ విష్ణు (20) గతనెల 24వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాడు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. నిందితుడు అదేరోజు పోలీసులకు భయపడి నాయుడుపేట చెన్నై రహదారిపై బస్సును వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో గాలించి సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన నిలావర్ విష్ణు తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వలసి వచ్చి జీవిస్తున్నారు. 2015లో విష్ణు తండ్రి భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రివార్డులను ప్రకటించగా.. ఏఎస్పీ వారికి అందజేశారు.ఇదిలా ఉండగా నిందితుడు నీలావర్ విష్ణుకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
బస్సు రూటు మార్పుపై మహిళల ధర్నా
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులో బకింగ్హాం కాలువపై వంతెన పనులు పూర్తికావడంతో ప్యారిస్, మనలి మధ్య నడిచే నెంబర్ 56 బస్సు రూట్ మార్పు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మహిళలు ఆందోళన చేపట్టారు. చైన్నె, తిరువొత్తియూరు బకింగ్ హామ్ కాలువను అనుకుని ఉన్న రోడ్డులో ఐదేళ్లుగా ప్రభుత్వ బస్సు 56ఈ నడుస్తోంది. రాజాజీ నగర్, కార్గిల్ నగర్, వెట్రి వినాయక నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ బస్సును ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బకింగ్ హామ్ కాలువపై చేపట్టిన వంతెన పనులు పూర్తయి దానిని ప్రారంభించారు. దీంతో బకింగ్ హామ్ కాలువ మార్గంగా వెళుతున్న బస్సులను పాత మార్గంలోని వంతెనపై నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కార్గిల్ నగర్ మార్గంలోనే బస్సును నడపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 50 మందికి పైగా మహిళలు కొత్త వంతెన వద్ద రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తిరువొత్తియూరు పోలీసులు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. ఉన్నతాధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది. చదవండి: గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు -
బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సుల్లో నారీ శక్తి ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులో సీటు కోసం ఓ మహిళ వినూత్నంగా తన శక్తియుక్తులను ప్రదర్శించిన ఘటన జిల్లాలో జరిగింది. సోమవారం లింగసూగూరు బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు బస్సు రాగానే సీట్ల కోసం పోటాపోటీగా ఎగబడ్డారు. బాగల్కోటె నుంచి రాయచూకు వెళ్లే బస్సులో మహిళ బ్యాగ్ వేసినా సీటు దొరకదనే ఆందోళనతో మెదడుకు పని పెట్టారు. ఓ యువకున్ని వంగబెట్టి మరో మహిళ సాయంతో అతని వీపు పైకెక్కి కిటికీలో నుంచి బస్సులోకి దూరి సీటును దక్కించుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు అందరినీ అబ్బురపరిచాయి. -
బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్!
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్పోర్ట్ (ఎస్టీ) బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ, బస్సు నడపటం కనిపిస్తుంది. బస్సు టాప్ నుంచి నీరు కారుతున్నదని గ్రహించి, ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు. అయితే ప్రభుత్వ బస్సులో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదేమీ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. As the roof of the ST bus was leaking, the driver had time to hold the umbrella in one hand and the steering wheel in one hand. A video from Aheri Agar in Gadchiroli has come to light. #gadchiroli #Maharashtra #viral #viralvideo pic.twitter.com/AfwVQMrnW5 — Zaitra (@Zaitra6) August 25, 2023 కాగా ఈ తాజా వీడియో సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. యూజర్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో డ్రైవర్ వర్షం పడుతున్న సమయంలో గొడుగు పట్టుకుని బస్సును నడపడాన్ని గమనించవచ్చు. ఈ వీడియో మహారాష్ట్ర రవాణా వ్యవస్థ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇలా చేయడం వల్ల డ్రైవర్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్! -
బైక్ను ఢీకొట్టిన ఫార్మా కంపెనీ బస్సు... 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
శామీర్పేట్: ఓ ప్రైవేటు కంపెనీ బస్సు, బైక్ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారు అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సు, బైక్ పూర్తిగా దగ్ధమైన ఘటన మంగళవారం జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజ్పూర్ గ్రామానికి చెందిన సంపత్ కుమార్ గౌడ్ బైక్పై తుర్కపల్లిలో తను పనిచేసే యూజియా ఫార్మా కంపెనీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో జైడస్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు కొల్తూర్ వైపు నుంచి పోతారం వైపు వెళ్తోంది. కొల్తూర్ గ్రామ పరిదిలోకి రాగానే సంపత్కుమార్ బైక్ను అతివేగంగా ఢీకొట్టింది. దీంతో సంపత్ కుమార్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి బస్సుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బస్సుకు పూర్తిగా మంటలు వ్యాపించడంతో బైక్, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ వ్యాన్లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
విషాదం: లోయలో పడిన బస్సు.. ఏడుగురు పర్యాటకులు మృతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో విషాద ఘటన జరిగింది. 35 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో గంగోత్రి నుంచి వెనుదిరిగిన బస్సు.. గంజ్ఞాని వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తుకు సంబంధించిన బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: హాస్టల్ గదిలో మారణాయుధాలు.. బాంబులు, పిస్టళ్లతో విద్యార్థులు.. -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ను 2020 ఏప్రిల్లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్రోడ్స్ మీదుగా కొండాపూర్కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
టాటా చెప్పి వెళ్లొస్తా మమ్మీ అని.. చివరికి తండ్రి ముందే
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో ఘోరం జరిగింది. బీఎంటీసీ బస్సు మృత్యుశకటమై నాలుగు సంవత్సరాల బాలికను బలిగొంది. ఈ విషాద ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఉత్తరహళ్లి నివాసి ప్రసన్న సిస్కో కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూర్వీరావ్ బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీకేజీ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు సిద్దమైంది. తల్లికి టాటా చెప్పి, వెళ్లోస్తా అని తండ్రి ప్రసన్న బైక్ ఎక్కింది. ఉత్తరహళ్లి మెయిన్రోడ్డు పద్మావతి సిల్క్షోరూమ్ వద్ద వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్ బైక్ను ఢీకొంది. తండ్రీకుమార్తె కిందపడగా చిన్నారిపై బస్సు చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే.. -
దారుణం: కుంగిన రహదారి.. లోయలో బస్సు బోల్తా.. ఏడుగురి మృతి..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారి దెబ్బతిన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాతీయ రహదారి 5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంచారు. గురువారమే ఆ దారిలో తేలిపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. ఆ రహదారిలో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?
భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్మెంట్కు సూచనలు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా భువనేశ్వర్లోని బారాముండా బస్సు స్టేషన్లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
మహిళ ఓవర్ యాక్షన్.. టికెట్ అడిగాడని కండక్టర్పై తిట్ల పురాణం
యశవంతపుర(బెంగళూరు): బస్ కండక్టర్ను మహిళ ఒకరు నోటికొచ్చినట్లు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. బెంగళూరులో సిటీ బస్ ఎక్కిన మహిళ టికెట్ తీసుకోలేదు. కండక్టర్ ఆమెను టికెట్ తీసుకోవాలని కోరగా ఉచిత ప్రయాణమని తెలిపింది. ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ కోరగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని అని ఆమె ఐడీ కార్డు చూపారు. స్థానిక చిరునామా కార్డును చూపించాలని, లేదా టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో మహిళ రౌద్రరూపం దాల్చింది. ఇష్టానుసారం తిట్ల పురాణం వినిపించింది. కొందరు ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. #FreebusJourney in #KSRTCBus in #Karnataka An argument started between a woman passenger and a #bmtc bus conductor when the Conductor asked the woman to show Aadhar Card or Voter Card of Karnataka only to avail the free bus ride. The woman showed her Aadhaar card in her phone… pic.twitter.com/DoKMOsAvkQ — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 26, 2023 చదవండి: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
బస్సు వైపు దూసుకొచ్చిన ఏనుగు..అంతా చివరి రోజు అనుకున్నారు.. కానీ
మనం చేసే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపాన వస్తాయో గ్రహించడం కష్టమే. అయితే కొందరు ఈ ప్రమాదాల బారిన పడగా.. మరికొందరు మాత్రం తృటిలో వీటి నుంచి తప్పించుకుని హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. ఇటీవల ఓ ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్సు వైపు ఏనుగు కోపంగా దూసుకువస్తుంది అయితే చివరికి ప్యాసింజర్లకు హానికలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మనం జంతువులను హాని కలిగించకపోతే అవి కూడా మనకు ఎటువంటి హాని కలిగించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మాటను రుజువు చేసిందో ఘటన. ఓ వీడియోలో బస్ నిండుగా ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుంటుంది. అడవి ప్రాంతంలోకి వెళ్లగానే అకస్మాత్తుగా రోడ్డు పై ఓ ఏనుగు కనిపిస్తుంది. డ్రైవర్ కంగారు పడక... బస్సును రోడ్డు పక్కకు ఆపుతాడు. అంతలో ఆ ఏనుగు కోపంగా బస్సు వైపు దూసుకువచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఇదే చివరి రోజని అనుకుంటున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఏనుగు బస్సుకు లేదా ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏనుగు తమ పక్క నుంచి వెళుతుండగా బస్ డ్రైవర్తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉంటూ దాన్ని ప్రశాంతంగా వెళ్లనిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భయపడకండి.. ఆ ఏనుగు బస్లో ప్రయాణీకులను చెక్ చేయడానికి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video - in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi — Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023 చదవండి : UP Anju Facebook Love Story: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి. -
ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు. మృతుల్లో 7గురు మైనర్లు సహా 5గురు మహిళలు కూడా ఉన్నారు. గలకతి సదర్ జిల్లా పరిధిలో చత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్పూర్కు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉండటం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఇదీ చదవండి: విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. రెండు గంటలు అలాగే.. -
నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్..
లక్నో: కొద్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది. #उत्तरप्रदेशः #बिजनौर के मंडावली में #कोटावाली नदी का जलस्तर बढ़ा, एक बस तेज बहाव में फंसी, बस में करीब 40 यात्री सवार, जेसीबी से सभी का रेस्क्यू किया गया#UttarPradesh #bus #river #Bijnor #NewsUpdate pic.twitter.com/ZVUghS0wYm — News of Rajasthan (@NewsRajasthani) July 22, 2023 జేసీబీ మిషన్లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #बिजनौर में कोटा वाली नदी के बीच तेज बहाव में फंसी नजीबाबाद से हरिद्वार जा रही बस नदी में बस फंसने के बाद बस में मौजूद सवारियों को जेसीबी के सहारे सकुशल बाहर निकाला गया.#Bijnor #bijnorviralvideo #bijnorbus #bus #kotariver #haridwar #bijnaur #viralvideo #ManipurVideo pic.twitter.com/lEetwrOuGQ — Shailendra Singh (@Shailendra97S) July 22, 2023 ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్పై కారు నడిపి.. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పరిధిలోని జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి Kachidi Fish: కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రూ.3లక్షల 10వేలు!.దీని ప్రత్యేక ఇదే -
రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్గా మారిన బెంగళూరు ఏసీపీ!
బెంగళూరు: బెంగళూరులో బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర స్వయంగా బస్సు నడిపారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వీవీఐపీల (ప్రతిపక్ష నేతల సమావేశం) షెడ్యూల్ కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బస్సును రోడ్డుపైనే ప్రయాణికులతో సహా నిలిపివేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్ను బోవరింగ్ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందించేలా అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. బస్సు రోడ్డుపై నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ రద్దీకి కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించి.. ఏసీపీ ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నారు. డ్రైవర్ సీటులో కూర్చుని బస్సును ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేషన్ పార్కింగ్ ప్రదేశంలో బస్సును పార్క్ చేశారు. ఇదంతా బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏసీపీ స్పందించిన తీరుపై అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. Thank you for the care and compassion # LifeSaverCop @DgpKarnataka @CPBlr @alokkumar6994 @masaleemips @BlrCityPolice @blrcitytraffic @mybmtc@BMTC_BENGALURU #BMTC Small act of kindness, duty, compassion & respect for life is thy name of #NammaBengaluruPolice 👏 Contd 01 pic.twitter.com/LI0isc1NoX — Shubha Lakshmi (@Shubha_Lakshmi_) July 17, 2023 చదవండి ఆస్ట్రేలియా బీచ్లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
వరద ధాటికి నదిలో చిక్కిన బస్సు... ప్రయాణికుల ఆర్తనాదాలు.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX — NDTV (@ndtv) July 9, 2023 ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
రాజధాని ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం
-
Tsrtc: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ రూట్లలో 10 శాతం రాయితీ
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో ఆదివారం(జులై 2) నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ''విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్యాసింజర్కు ఆదా అవుతుంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని సూచించారు. చదవండి: గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్ -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
పెద్దేముల్: మండల పరిధిలోని ఇందూరు మీదుగా బస్సు నడపాలని సోమవారం జైరాంతండా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు గంట పాటు ఓంలానాయక్తండా– జైరాంతండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు రెండువైపులా నిలిచిపోయాయి. గతంలో ఇందూరు, తట్టెపల్లి మీదుగా బస్సు నడిచేదని, ఆ బస్సును అడ్కిచెర్ల, జిన్గూర్తి మీదుగా నడపడం వల్ల పాఠశాలకు వెళ్లే, వచ్చే సమయాల్లో బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సివచ్చిందని వారు వాపోయారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో ఓంలానాయక్తండా, జైరాంతండా ఉండటంతో బస్సులు తప్ప మరో అవకాశం లేదని, వెంటనే సంబంధిత అధికారులు బస్సును వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు తాండూరు డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడపాలని కోరారు. వెంటనే స్పందించి డీఎం తప్పకుండా జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడుపుతామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కేఎస్ ఆర్టీసీ బస్సులు
-
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
వింత బస్సు..చుట్టున్న వాహనాలను కప్పేసింది..
-
బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. టీఎస్ఆర్టీసీ మానవత్వం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసీ)కు ప్రయాణీకులు దైవంతో సమానమని, టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే కాదు వారిపట్ల మానవత్వంతో వ్యవహరించడంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం శుభపరిణామమని ఆయన కొనియాడారు. బస్సులో గుండెపోటుతో మరణించిన ఓ ప్రయాణికుడి మృతదేహాన్ని మానవతా దృక్ఫథంతో వ్యవహరించి అదే బస్సులో ఇంటికి చేర్చిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను శనివారం హైదరాబాద్లోని బస్భవన్లో అయన అభినందించారు. ప్రత్యేకించి ఆ సమయంలో చొరవ తీసుకున్న మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ ను కూడా ప్రశంసించి శాలువా, ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక బహుమతి అందించి వారి సేవలు ప్రశంసనీయమన్నారు. బస్సులో మృతదేహాన్ని తరలించడంలో పెద్దమనసుతో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే గుణం సిబ్బందిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివరాల్లోకి వెళితే, మహబుబాబాద్ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్కు 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్(57), బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. దీంతో కండక్టర్, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కండక్టర్, డ్రైవర్ల చొరవ అభినందనీయమని, సంస్థ వారిని చూసి ఎంతో గర్విస్తోందని సంస్థ ఎండీ సజ్జనర్ చెప్పారు. టిఎస్ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావంతో వ్యవహరిస్తున్న సిబ్బందికి సంస్థలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. -
డ్రైవర్ దాష్టీకం.. బస్సు ఆపకుండా మహిళలపైకి దూసుకెళ్లి
తుమకూరు(బెంగళూరు): టికెట్ కలెక్షన్ రాలేదనే కోపంతో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్తున్న డ్రైవర్ చర్యను మహిళలు అడ్డుకోగా వారిపైకి బస్సును దూకించేందుకు యత్నించాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటెగెరె నాగేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా కొళ్లేగాల నుంచి కొందరు మహిళలు జిల్లాలోని గోరవనహళ్లి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు నాగేనహళ్లి గేట్ వద్ద వేచి ఉన్నారు. ఆ మార్గంలో వచ్చిన కేఎస్ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కలెక్షన్ లేదని బాధతో ఉన్న డ్రైవర్ బస్సును ఆపలేదు. దీంతో మహిళలు బస్సు ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ వారిపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ప్రవర్తనపై మహిళలంతా తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మునిశామి రెడ్డి మహిళలకు వేరే బస్సును ఏర్పాటు చేశారు. బస్సు డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. చదవండి: Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లు ఫుల్.. ముందు బస్సు దిగేయండి’
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లన్నీ ఫుల్లయ్యాయి.. ముందు బస్సు దిగేయండి.. వెనుక ఖాళీగా వస్తోంది. ఆ బస్సులు రండి’ ఇదీ ఆర్టీసీ సిబ్బంది నుంచి వినిపిస్తున్న మాట. సీట్లు ఖాళీగా ఉన్నా.. ఆపేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపకపోగా.. కొందరు కండక్టర్లు టిక్కె ట్లు కొట్టి డబ్బులు తీసుకోవాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. బస్సు ఖాళీ లేదు.. దిగండి అంటూ.. ప్రయాణికులను ఒకింత దగమాయిస్తూ దింపేస్తున్నారు.. వెనుక వస్తున్న బస్సునైనా ఎక్కదామంటూ ఆ సిబ్బందే అదేమాట.. ఇదెక్కడో కాదండోయ్.. మన తిరుపతి జిల్లాలోనే.. దీంతో చేసేది లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. ప్రతి డిపో కష్టాల్లోనే నడుస్తోంది. దీనికితోడు 2020–21లో కోవిడ్ మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత తిరుపతి జిల్లా లాభాల దిశగా పయనిస్తోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంది. అయితే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్లో, స్టాపింగ్ పాయింట్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోతుండడం విమర్శలకు తావిస్తోంది. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది శ్రీకాళహస్తి, పుత్తూరు, చిత్తూరు మార్గాల్లో తిరుపతికి వచ్చిపోయే బస్సుల్లో స్టాపింగ్ ఉన్నా, ప్రయాణికులు చెయ్యెత్తి మొత్తుకున్నా బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. సార్ సీట్లు లేవు.. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు చెప్పిన మాటలు నిజమేనని తర్వాత వచ్చే వెనుక బస్సును ఆపినా అదే పరిస్థితి. మరీ పిల్లలు, వృద్ధులు ఉంటే అస్సలు ఆపడం లేదు. చిన్నపాటి బ్యాగ్లు ఉన్నా ఆపని పరిస్థితి. దీంతో ప్రజలు ఆర్టీసీ ఉద్యోగుల తీరును తప్పుపడుతున్నారు. తాము స్టాడింగ్ జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇదిగో సాక్ష్యం రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ బస్టాపింగ్ పాయింట్ వద్దకు చేరాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఓ ఆర్డినరీ సర్వీసు వచ్చింది. బస్సు ఖాళీగా ఉన్నా డ్రైవర్ ఆపలేదు. చెయ్యెత్తి మొత్తుకున్నా కన్నెత్తి చూడలేదు.. దీంతో చేసేది లేక తమిళనాడుకు ఆర్టీసీ బస్సులో ఆ యువకుడు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. సీట్లతో పనిలేదు సీట్లతో పనిలేదు. తప్పకుండా బస్సును ఆయా సర్కిళ్లలో నిలపాలి. ప్రయాణికులు చెయ్యెత్తిన చోటంతా బస్సును ఆపాల్సిందే. జిల్లాలోని డీఎంలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. లేదంటే డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తప్పవు. –చెంగల్రెడ్డి, ఆర్ఎం, ఆర్టీసీ -
బస్సంతా మహిళలే.. మరి మా పరిస్థితి ఏంటి..?
కర్ణాటక: ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులు, బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో అత్యధిక శాతం మంది మహిళలే ఉంటున్నారు. గతంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం పురుషులు, 25 శాతం మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఈ శాతం తారుమారైంది. నగరంలోని సెంట్రల్ బస్టాండు, రాయల్ సర్కిల్ వద్ద గల కొత్త బస్టాండులోను ఇదే పరిస్థితి ఉంటోంది. ఇకపై బస్సుల్లో మహిళల కోసం సీట్ల పరిమితిని పెంచాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు అంటున్నారు. బస్సు పూర్తిగా మహిళలతో నిండిపోతే పురుష ప్రయాణికులు గత్యంతరం లేక పుట్బోర్డులపై నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. -
చావును టచ్ చేసి.. తృటిలో తప్పించుకున్నారు, లేదంటే తల పగిలేది!
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఏ రూపంలో ఎటు నుంచి వస్తాయో ఊహించలేం. అందుకే మన ప్రయాణ సమయంలో కాస్త ఆచితూచి డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. ఈ రోడ్డు ప్రమాదాల్లో కొన్ని మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఘటనలు చూసే ఉంటాం. ఇదే తరహాలో ఇద్దరు విద్యార్థినులు చావును టచ్ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు స్కూటీపై వెళ్తుంటారు. ఇంతలో వారి ముందు వెళ్తున్న ప్రైవేటు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ఆ డ్రైవ్ చేస్తున్న యువతి ప్రయత్నిస్తుంది. అయితే ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం, ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా మరో లారీ వస్తుంది. దీంతో లారీని ఢీకొట్టడంతో ఆ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బస్సు, లారీ మధ్య ఆ స్కూటీ ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో యువతులకు పెద్దగా గాయాలు కాలేదు. వారు ధరించిన హెల్మెట్లు కూడా రోడ్డుపై దొర్లాయి. బస్సులోని ప్రయాణికులు కూడా కిటికీ నుంచి ఈ ప్రమాదాన్ని చూస్తున్న వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవ వైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనుంది. ఈ ఎగ్జిబిషన్లో ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. రాకేశ్ మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టీఎస్ఆర్టీసీ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ అటవీ శాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెండు టైగర్ రిజర్వ్ లలో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు. పులులు అడవుల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవి తోడ్పాడుతాయని వివరించారు. పులులను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పులులను సంరక్షిస్తే పర్యావరణాన్ని సంరక్షించినట్లే అని ఆయన చెప్పారు. పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ తో కలిసి టీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ ఆన్ వీల్స్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. మాటల ద్వారా వ్యక్తికరించలేని భావాలను ఫోటోలు చెప్తాయని వివరించారు. ఈ ఫొటో గ్రఫీ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్'లో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించామని చెప్పారు. అడవుల్లోకి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ లోని పులుల ఫోటోలను చూసి మంచి అనుభూతుని పొందవచ్చని అన్నారు. హైదరాబాద్ లోని జనసమర్థ ప్రాంతాల్లో హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సు తిరుగుతుందని, ప్రజలందరూ ఈ ఫోటోలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తోన్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పర్యవరణహితం కోసం టీఎస్ఆర్టీసీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్ట ప్లాన్ చేస్తోందని వివరించారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్ వ్యవస్థాపకుడు ఆక్విన్ మాథ్యూస్ అన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతో కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులులపై అవగాహన కల్పించాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ దాదాపు 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని అన్నారు. అడవుల్లో ఒక్కో పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. యువతకు పులుల సంరక్షణపై అవగాహన లేదని, వారికి పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అక్కడ తప్ప!
హుబ్లీ(బెంగళూరు): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లోని ప్రతిష్టాత్మక బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) చిగరి బస్సుల్లో లేదని సంబంధిత అధికారులు తెలిపారు. రూ.కోట్ల వ్యయంతో హుబ్లీ ధార్వాడ నగరాల మధ్య ప్రత్యేక మార్గం ద్వారా చిగరి బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా బీఆర్టీఎస్ పేరిట నిర్వహిస్తున్న చిగరి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వాయువ్య ఆర్టీసీ సంస్థ ఎండీ భరత్ విలేకరులకు తెలిపారు. చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
చిక్కమగళూరుకు టికెట్ అడిగితే మంగళూరుకు..
కర్ణాటక: చిక్కమగళూరుకు టికెట్ అడిగితే మంగళూరుకు టికెట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణకులకు ఇబ్బంది కలిగించిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు...కడూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 మంది తెలుగువారు ఎక్కారు. వీరు గురువారం చిక్కమగళూరు దత్తపీఠకు వెళ్లటానికి కడూరులో రైలు దిగి, అక్కడ నుంచి మంగళూరు బస్సు ఎక్కి చిక్కమగళూరుకు టికెట్ తీసుకున్నారు. అయితే కండక్టర్ మంగళూరుకు టికెట్ ఇచ్చి దత్తపీఠం భక్తులకు మోసం చేశాడు. చిక్కమగళూరుకు రూ. 45 చార్జీ ఉండగా మంగళూరుకు రూ. 202 తీసుకున్నాడు. కేవలం 40 కి.మీ ఇంత చార్జీ అవుతుందా అని ప్రయాణికులు ప్రశ్నించారు. చిక్కమగళూరులో దిగుతుండగా 18 మంది నుంచి టికెట్ వాపస్ ఇవ్వాలని అడగటంపై ప్రయాణికులు కండక్టర్పై ఆక్రోశం వ్యక్తం చేశారు. -
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..
బనశంకరి: ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ గ్యారంటీ ప్రకటించగా, ప్రైవేటు బస్సుల యజమానుల ఆదాయానికి గండి పడుతుందనే భయం యజమానుల్లో నెలకొంది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం ఈ నెల 11 నుంచి ఏసీ బస్సులు మినహా మిగిలిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుంది. దీంతో ప్రైవేటు బస్సు యజమానుల్లో గుబులు నెలకొంది. ఇప్పటికే అంతంతమాత్రం ఇంధన ధరలు పెరగడం, పన్నుల భారంతో ప్రైవేటు బస్సులు అంతంతమాత్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 9 వేల ప్రైవేటు బస్సులు ఉన్నాయి. బస్సుల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, ట్రావెల్స్ ఏజెంట్లుతో కలిసి 75 వేలమందికి పైగా ఆధారపడి ఉన్నారు. కోవిడ్, లాక్డౌన్తో చాలా నష్టాలు అనుభవించిన ప్రైవేటు బస్సుల రంగం గత ఏడాది కాలంగా కొద్దిగా గాడిలో పడింది. ప్రస్తుతం ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంతో మహిళలు, సహజంగా ప్రభుత్వ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తారు. నిరుపేదలు, మధ్యతరగతి మహిళలు ప్రైవేటు బస్సుల వైపు చూడరు. మరోపక్క ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న కార్మికవర్గానికి చెందిన మహిళలు సైతం ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. దీని వల్ల తమ బస్సులకు గిరాకీ పడిపోతే నడపడం ఎలా అని ప్రైవేటు బస్సు యజమానుల్లో, అలాగే సిబ్బందిలో కలవరం నెలకొంది. రవాణా మంత్రిని కోరతాం సర్కారు పథకం వల్ల ప్రైవేటు బస్సులు రంగానికి నెలకు సుమారు రూ.66 కోట్ల నష్టం వస్తుందని ఆ బస్సుల సంఘం ప్రముఖులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని త్వరలో రవాణామంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తామని, ప్రైవేటు బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ వసతిని కల్పించి ఆ చార్జీలను తమకు చెల్లించాలని కోరతామన్నారు. ఇంకా పలు రకాల పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలను కోరతామని కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్ శర్మ తెలిపారు. ప్రభుత్వం దీనికి సమ్మతించకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. -
ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి
తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ బస్సు డ్రైవరు చివరిసారిగా బస్సుకు ముద్దుపెట్టి కన్నీటిపర్యంతం అయ్యాడు. తమిళనాడు, మదురై తిరుప్పరకుండ్రం సమీపంలోని పైకరావుకు చెందిన ముత్తుపాండి (60). ఇతను 1993 నుంచి తిరుపరకుండ్రం ప్రభుత్వ రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ముత్తుపాండి రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ ముందు రోజు విధులు నిర్వహించి బస్సు నడుపుకుంటూ డిపోకు చేరారు. ఆ సమయంలో అతను సీటు నుంచి దిగడం ఇష్టం లేక స్టీరింగుకు ముద్దుపెట్టి తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. బస్సు నుంచి దిగుతూ వందనం చేశాడు. బస్సు ముందు భాగానికి వెళ్లి తన రెండు చేతులతో బస్సును హత్తుకుని తడుముతున్నట్లు నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో సహా ఉద్యోగుల కళ్లు చెమర్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: Imran Khan: అరెస్టుతో నా పరువు పోయింది! 1,500 కోట్ల పరిహారం కోరుతూ NABకి లీగల్ నోటీసులు -
కావేరి ట్రావెల్స్ బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ‘పుష్ప 2’ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు!
-
డాక్టరైన మహిళా కండక్టర్
బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ డాక్టర్గా మారి సురక్షితంగా కాన్పు చేసింది. చిక్కమగళూరు డిపోకు చెందిన కేఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తోంది. బెంగళూరు నుంచి బేలూరుకు ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ప్రసవ వేదన ఆరంభమైంది. బస్సు వెళ్లే మార్గంలో అటు ఇటు 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఆసుపత్రి లేదు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ ఎస్.వసంతమ్మ బస్సును నిలిపి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆమె గర్భిణికి కాన్పు చేయగా ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.మహిళ నిరుపేద కావడంతో చేతిలో ఖర్చులకు కూడా డబ్బులు లేవు, ఆమె పరిస్థితిని గమనించి కండక్టర్, డ్రైవరు ప్రయాణికులు కలిసి రూ.1,500 సేకరించి బాలింతకు అందజేశారు. తరువాత అంబులెన్స్ ద్వారా శాంతిగ్రామ ఆసుపత్రిలో చేర్చారు. మహిళా కండక్టర్ను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..
-
బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళలు, కళాశాల విద్యారినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్కు తన సమస్యల గురించి వివరించింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్ గుర్తు చేశారు. అలాగే మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కూడా ప్రస్తావించారు. Shri @RahulGandhi hops on to a BMTC bus & interacts with women passengers to understand their vision for Karnataka. They candidly discuss topics including the rising price of essentials, Gruhalakshmi scheme and the Congress' guarantee of free travel for women in BMTC and KSRTC… pic.twitter.com/wqXySTY6Qw — Congress (@INCIndia) May 8, 2023 రాహుల్ బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన వీడియోను కాంగ్రెస్ యూత్ విభంగా ఎన్ఎస్యూఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బెంగళురు విజన్ గురించి కర్ణాటక మహిళలలు ఏమనుకుంటున్నారో రాహుల్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రచారం చివరిరోజున రాహుల్ తీరిక లేకుండా గడపనున్నారు. కాంగ్రెస్ నిర్వహించే పలు ర్యాలీలకు హాజరుకానున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు ప్రీపోల్ సర్వేలు తెలిపాయి. బీజేపీ మాత్రం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
తమిళనాడు: మామల్లపురం సమీపంలోని గడుంబాడి ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు మృతి చెందారు. పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తోన్న ఆటోను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు మరణించారు. ఆటో నుజ్జునుజ్జుగా మారింది. మామల్లపురం పోలీసులు మృతదేహాలను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్స్టర్ హతం -
ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు.. సింపుల్గా బస్సులోనే బస!
ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గాని, ఇల్లు కట్టడం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా సామాన్యులు చేయలేరు. అయితే, ఇంగ్లాండ్కు చెందిన కాన్రాడ్ క్రిక్, ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు. ఒక పాత బస్సునే తన ఇల్లుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. లగ్జరీ ఫ్లాట్కు ఏమాత్రం తీసిపోని ఈ డబుల్ డెక్కర్ బస్సులో ఒక కిచెన్, హాలుతోపాటు మూడు బెడ్రూమ్లు, రెండు బాత్రూములు ఉన్నాయి. అతని భార్య నికోల్ మిక్కార్తీతో పాటు వారి నలుగురు పిల్లలు, రెండు పెంపుడు పిల్లులు, రెండు కుక్కలు కలసి ఈ బస్సులో నివాసం ఉంటున్నారు. వీరంతా వారి సొంతింటి కల కోసం రీసైకిలింగ్ వస్తువులనే వాడుతూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు. ఇక పిల్లల స్కూల్ ఫీజు, బిల్లులు, ఇతర ఖర్చులు అన్నీ కలసి వీరి నెల ఖర్చు వెయ్యి పౌండ్లు (సుమారు రూ.98 వేలు). ఇంగ్లండ్లో ఇది చాలా తక్కువ. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బస్సు ఇంటిని.. క్రిక్, యూట్యూబ్ వీడియోలు చూసి చేశాడట. త్వరలోనే ఓ అందమైన నిజమైన ఇంటిని నిర్మించుకుంటామని ఈ కుటుంబం అంటున్నారు. -
మహా నగరం.....
మహా నగరం చైన్నెలోని మెట్రో, ఎలక్ట్రిక్, ఎంటీసీ బస్సు సేవలను ఒకే గూటికిందికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను కంబైన్డ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి అప్పగించింది. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యేక యాప్ రూపకల్పనపై దృష్టి సారించారు. -
మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..
బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్లోని రెస్ట్రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. (చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్) -
అలనాటి వైభవానికి ఆటంకాలెన్నో.. డబుల్ డెక్కర్లేవి?
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలం నాటి డబుల్ డెక్కర్ బస్సుల వైభవాన్ని తలపించేలా హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు నగరవాసులకు, పర్యాటకులకు ఇంకా దూరంగానే ఉన్నాయి. నగరంలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 6 బస్సులతో డబుల్ డెక్కర్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫార్ములా– ఈ సందర్భంగా 3 బస్సులను మాత్రం పరిచయం చేశారు. ఇంకా మరో 3 బస్సులు అందుబాటులోకి రావాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా దశలవారీగా 30 డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మూడు బస్సులు మాత్రం పీపుల్స్ ప్లాజాకే పరిమితమయ్యాయి. అప్పుడప్పుడు ట్యాంక్బండ్పై మాత్రం వీటిని ప్రదర్శిస్తున్నారు. కొరవడిన స్పష్టత.. నాలుగు వందల ఏళ్ల నాటి హైదరాబాద్ చారిత్రక కట్టడాలను సందర్శించే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా చార్మినార్, గోల్కొండ కోట, గోల్కొండ టూంబ్స్, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్నుమా వంటి ప్రాంతాలతో పాటు ట్యాంక్బండ్, బొటానికల్ గార్డెన్, కేబుల్బ్రిడ్జి, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, పీపుల్స్ప్లాజా, గండిపేట్, జూపార్కు తదితర ప్రదేశాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపాలని హెచ్ఎండీఏ భావించింది. కానీ.. వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి రూట్ సర్వేలు నిర్వహించకపోవడం గమనార్హం. బస్సులను ఏ రూట్ నుంచి ఏ రూట్లో, ఏయే ప్రదేశాలకు నడపవచ్చనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు పలు మార్గాల్లో బస్సులను నడిపేందుకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని మున్సిపల్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మార్చి మొదటి వారం నుంచే ఈ బస్సులను ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని భావించారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వేసవి సెలవుల దృష్ట్యా ఈ బస్సులు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. బస్సులు నడిపేదెవరు... మరోవైపు ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ సొంతంగా నిర్వహిస్తుందా లేక ఆర్టీసీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుందా అనే అంశంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తయారు చేసిన ఈ బస్సులను ఒకొక్కటి రూ.2.16 కోట్ల చొప్పున హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. మొదటి దశలో వచ్చిన మూడింటితో పాటు మరో మూడు బస్సులు ఈ నెలలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. రూ.కోట్లు వచ్చించి బస్సులను కొనుగోలు చేసినప్పటికీ వినియోగంలోకి రాకపోవడం గమనార్హం. వీకెండ్స్లో మాత్రం అప్పుడప్పుడు ట్యాంక్బండ్ పరిసరాల్లో ఈ బస్సులు కనువిందు చేస్తున్నాయంతే. -
ఆదాయం బాటలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి. కార్గో సేవలతో ఊపు ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయవాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా. ఇతర ఆదాయ వనరుల ద్వారా.. అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచిపెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది. -
ప్రమాదవశాత్తు రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
చివ్వెంల (సూర్యాపేట): సాంకేతిక లోపంతో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామ శివారులో ఆది వారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయ వాడ డిపోకు చెందిన వెన్నెల బస్సు 30 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివా రులోని సాయికృష్ణ హోటల్ వద్దకు రాగానే బస్సు లైట్లు ఫెయిల్ కావడంతో ప్రయాణికు లను వేరే బస్సుల్లో వారిని విజయవాడకు తరలించారు. విజయవాడకు చెందిన మరో అమరావతి బస్సును వెన్నెల బస్సు వద్దకు తీసుకువచ్చారు. మరమ్మతుకు గురైన బస్సు బ్యాటరీకి చార్జింగ్ ఎక్కించే క్రమంలో బ్యాటరీ వైర్లలో నుంచి మంటలు చెలరేగాయి. ఆర్టీసీ డ్రైవర్లు అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకునే లోపు అమరావతి బస్సు పూర్తిగా కాలిపోగా, వెన్నెల బస్సు పాక్షికంగా కాలిపోయింది. -
హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ హైడ్రోజన్తో నడిచే బస్ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
Viral Video: అదృష్టం అంటే వీడిదే.. సైకిల్ ముక్క కూడా మిగలలేదు..!
-
డబుల్ డెక్కర్ ఆగయా.. నిజాం నాటి బస్సులకు పూర్వ వైభవం..
సాక్షి, హైదరాబాద్: ‘అలనాటి చారిత్రక డబుల్ డెక్కర్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తూ రెండంతస్తుల బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ అందమైన అనుభవాన్ని నగరవాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించనున్నట్లు ఆయన అప్పుడే చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించినట్లుగానే పర్యావరణ ప్రియమైన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంగళవారం ప్రారంభించారు. నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న మూడు డబుల్ డెక్కర్ బస్సులను నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫార్ములా– ఈ ప్రిక్స్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్లాదభరింతంగా పర్యాటక విహారం.. ఫార్ములా– ఈ ప్రిక్స్ సందర్భంగా ప్రారంభించిన డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం రేసింగ్ ట్రాక్ పరిధిలోని ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, పారడైజ్ ,నిజాం కాలేజీ రూట్లలో తిరుగుతాయి. మొదటి విడతగా హెచ్ఎండీఏ 6 బస్సులను కొనుగోలు చేయగా ప్రస్తుతం మూడింటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. దశలవారీగా మొత్తం 20 బస్సులను ప్రవేశపెట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫార్ములా– ఈ ప్రిక్స్ అనంతరం డబుల్ డెక్కర్ బస్సులను చారిత్రక, వారసత్వ కట్టడాల సర్క్యూట్లలో నడుపుతారు. హైదరాబాద్ పర్యాటక స్థలాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇదీ నేపథ్యం... నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 2003 వరకు నడిపింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూపార్కు వరకు, అఫ్జల్గంజ్ వరకు ఇవి నడిచేవి. సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం వరకు డబుల్ డెక్కర్లు ఉండేవి. నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బస్సులో పయనించేందుకు ఎంతో మక్కువ చూపేవారు. ట్యాంక్బండ్ మీదుగా ఇందులో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి. కాలక్రమంలో బస్సుల నిర్వహణ భారంగా మారడంతో వీటికి కాలం చెల్లింది. ఫ్లైఓవర్ల కారణంగా కూడా బస్సులు నడపడం కష్టంగా మారింది. మంత్రి కేటీఆర్ చొరవ మేరకు ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. -
Viral Video: బ్రేక్ టెస్టింగ్ చేసిన బస్సు
-
ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్లైన్ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్లైన్ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్పాస్లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
రూ.5,000 కోట్లు విలువ చేసే ఈ–బస్లకు టెండర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) తాజాగా 4,675 ఎలక్ట్రిక్ బస్లకు టెండర్లను పిలిచింది. వీటి విలువ రూ.5,000 కోట్లు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (ఎన్ఈబీపీ) కింద టెండర్లను ఆహ్వానించడం ఇది రెండవసారి అని సీఈఎస్ఎల్ గురువారం తెలిపింది. డ్రై లీజ్ ప్రాతిపదికన ఈ బస్లను తెలంగాణ, ఢిల్లీ, కేరళలో ప్రవేశపెడతారు. డ్రై లీజ్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లు లేకుండా ఈ బస్లను ఆపరేటర్లు రాష్ట్ర రోడ్డు రవాణా (ఎస్టీసీ) సంస్థలకు సరఫరా చేస్తారు. ఎస్టీసీలు తమ సిబ్బందితో వీటిని నడిపిస్తాయి. యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణ బాధ్యతలను 10, 12 ఏళ్లపాటు సర్వీస్ ప్రొవైడర్లు (ఆపరేటర్లు) చేపడతారు. ఒక్కో బస్కు నిర్దేశిత రుసుమును ఆపరేటర్లకు ఎస్టీసీలు చెల్లిస్తాయి. బిడ్డర్లు, ఎస్టీసీలు తప్పనిసరిగా మహిళలను నియమించుకోవడంతోపాటు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. 4,675 ఎలక్ట్రిక్ బస్లు వస్తే ఏటా 15 లక్షల కిలోలీటర్ల ఇంధనం ఆదా అవుతుందని సీఈఎస్ఎల్ తెలిపింది. -
డ్రైవర్కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్ నవసారీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెస్మా గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు సూరత్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్లో పాల్గొని తిరిగివస్తున్నారు. టొయోటా ఫార్చునర్ డ్రైవర్కు గుండెపోటు వచ్చి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో ఎస్యూవీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని 28 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన 11 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్యూవీలో ప్రయాణించిన వారిని అంకలేశ్వర్కు చెందినవారిగా గుర్తించారు. వస్లాద్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.2లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందించనున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాాలని ఆకాంక్షించారు. అమిత్షా దిగ్భ్రాంతి.. ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకుు స్థానిక అధికారులు చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చదవండి: షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి -
అదృష్ట జాతకుడు.. బస్సు కింద పడినా.. సేఫ్గా..
ముంబై: బస్సు తనపై నుంచి వెళ్లినా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వృద్ధుడు. వెంటనే లేచి నడుచుకుంటూ వచ్చాడు. మహారాష్ట్ర ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై కార్లు ఇతర వాహనాలు వెళ్తున్నాయి. అయితే ఓ వృద్ధుడి రోడ్డు దాటుతుండగా అప్పుడే ఓ బస్సు వచ్చింది. ముందున్న వ్యక్తిని డ్రైవర్ గమనించలేదు. అలాగే పోనిచ్చాడు. దీంతో బస్సు కింద పడిపోయాడు వృద్ధుడు. బస్సు అతనిపై నుంచి వెళ్లింది. అక్కడున్న వారు గట్టిగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపాడు. కింద ఉన్న వృద్ధుడు ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా? అని అందరూ చూస్తుండగా.. అతడు బస్సు కింద నుంచి లేచి నడుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దీంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు. #WATCH | Elderly man's close shave in Powai area of Mumbai. The incident was captured on a CCTV camera. (Source: viral video) pic.twitter.com/50LV4N2Pvk — ANI (@ANI) December 15, 2022 చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
షాకింగ్: కదులుతున్న బస్సు కింద తల పెట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై కదులుతున్న బస్సు కింద తల పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం అంధేరి వెస్ట్లోలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ప్రకారం.. జనాలు, వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అటువైపుగా వస్తున్న బస్సును గమనించాడు. బస్సు దగ్గరికి రావడంతో వెంటనే దాని చక్రాల మధ్య పడుకుండిపోయాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో అతని నడుము భాగం మీద నుంచి వెనక టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. డిసెంబర్ 6న ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి రాకముందే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ గఫార్ ఇస్మాయిల్ సయ్యద్ (59)గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వ్యక్తి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రాలేదు. చదవండి: బస్ టైర్ల కిందకు దూసుకెళ్లిన బైకర్.. హెల్మెట్ ఉండడంతో సేఫ్.. #Watch | On Camera, Mumbai Man Lunges Under Moving Bus On Busy Road, Dies pic.twitter.com/lWmv3cQE9V — NDTV Videos (@ndtvvideos) December 13, 2022 -
బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమాన.. ఆ అధికారం కండక్టర్కే
ముంబై: ముంబై వాసులకు రవాణా సేవలందిస్తున్న బస్సుల్లో పాన్, గుట్క, పొగాకు నమిలి ఉమ్మివేసే ప్రయాణికులకు రూ.200 జరిమానా విధించాలని సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జరిమానా వసూలుచేసే అధికారం బస్సు డ్రైవర్, కండక్టర్కు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికున్ని పోలీసులకు అప్పగించే అధికారం కూడా వారికే కట్టబెట్టింది. దీంతో ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిల్లరాయుళ్లకు ముకుతాడు వేసినట్లైంది. బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో అనేక మందికి గుట్క, పాన్, సున్నం–తంబాకు (పొగాకు) నమిలే అలవాటుంది. సాధారణ (నాన్ ఏసీ) బస్సులో అయితే ఎక్కడైన బస్సు ఆగిన చోట లేదా అదను చూసుకుని కిటికిలోంచి బయటకు ఉమ్మివేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏసీ బస్సుల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేయడానికి ఏ మాత్రం వీలులేకుండా పోయింది. కిటికీలు, డోర్లు అన్ని మూసి ఉంటున్నాయి. ఒకవేళ ఉమ్మి వేయాలంటే కిందికి దిగాల్సిందే. దీంతో పాన్, గుట్కా నములుతున్న ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీటు కింద లేదా రెండు సీట్ల మధ్య ఖాళీగా ఉన్న స్ధలంలో మెల్లగా, ఎవరు చూడకుండా ఉమ్మి వేసి చేతులు దులుపేసుకుంటున్నారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి ప్రయాణికుల నిర్వాకంవల్ల బస్సు దుర్గంధంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి సీట్లవద్ద ప్రయాణికులు కూర్చోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. డిపోలో ఈ మరకలను శుభ్రం చేయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాన్, గుట్కా తిని ఉమ్మివేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ రూ.200 జరిమాన వసూలు చేయనున్నారు. జరిమాన చెల్లించేందుకు నిరాకరిస్తే బస్సు వెళ్లే రూట్లో మార్గమధ్యలో ఎక్కడైన పోలీసు స్టేషన్ లేదా చౌకి ఉంటే అక్కడ ఉమ్మివేసిన వారిని అప్పగించే బాధ్యతలు సిబ్బందికి కట్టబెట్టింది. అయితే ఇలా ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిళ్ల రాయుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు, జనాలను జాగృతం చేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్మెంట్ చేసే సిస్టంను అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంతమంది ప్రయాణికుల్లోనైన మార్పు వస్తుందని సంస్ధ భావిస్తోంది. -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
బస్సులోనే ప్రసవం.. అటు నుంచి నేరుగా..
బులంద్షహర్: ఉత్తర ప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి సొంతూరుకు వెళుతున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆ వెంటనే డ్రైవర్ ఆ బస్సును ప్రభుత్వ ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లి తల్లిని, నవజాత శిశువును వైద్యులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి యూపీలోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌకు వెళ్తుండగా ఆదివారం చోటుచేసుకుందని ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి యూపీలోని ఈటా జిల్లా లోని సొంతూరుకు తాము వెళ్తున్నట్లు మహిళ భర్త సోమేశ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో బస్సులోనే పురిటి నొప్పులు వచ్చాయని అతను వివరించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. -
రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
వైరల్ వీడియో : బైక్ను నెత్తిన పెట్టుకొని మరీ బస్సెక్కించాడు
-
బైక్ను నెత్తిన పెట్టుకొని.. బస్సెక్కించాడు.. వైరలవుతున్న వీడియో
కుటుంబాన్ని పోషించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పనులు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం కొందరు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. తమ శక్తికి మించి చెమట చిందిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా బైక్ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు.. అలాంటిది ఓ వ్యక్తి బైక్ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్పైన ఉన్న క్యారియర్పై బైక్ను దించేశాడు. బైక్ను నెత్తిన పెట్టుకుని కొద్ది దూరం నడిచి బస్సు టాప్పైకి ఎక్కించారు. అయితే అది ఎక్కడ జరిగిందో, అతనెవరనేదానిపై స్పష్టత లేదు. గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దీనిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఎలాంటి సాయం లేకుండా బైక్ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని సూపర్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: సత్యేందర్ జైన్ మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ -
హైదరాబాద్: పార్కింగ్ లో ఉన్న బస్సు లో చెలరేగిన మంటలు
-
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
వనపర్తి: చెరుకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు
-
అర్ధరాత్రి ఘోర ప్రమాదం
కొత్తకోట: అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెరకు లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గరుడ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాడ్ల ఆంజనేయులు (42), క్లీనర్ తుప్పతూర్తి సందీప్యాదవ్ (19), వడ్డె శివన్న(47) అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని బంధువులు హైదరాబాద్లోని ఆస్పత్రులకు తరలించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. కాగా, ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీగా నిలిచిన ట్రాఫిక్ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటలపాటు వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనపర్తి డీఎస్పీ ఆనంద్రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. భారీ క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతుల్లో బస్సుడ్రైవర్ ఆంజనేయులుది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం కాగా.. క్లీనర్ సందీ‹ప్యాదవ్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవేడు వాసి. ప్రయాణికుడు శివన్నది ఏపీలోని అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం వెంకటంపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు, క్లీనర్ సందీప్ మృతిచెందడంతో హైదరాబాద్లోని మియాపూర్ డిపో సిబ్బంది వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: అద్దె బస్సులు కొంటాం! -
పేటీఎం ట్రావెల్ సేల్
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ‘ట్రావెల్ సేల్’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్, అమెక్స్ కార్డ్లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం
సెంట్రల్ మాలీలో విషాద ఘటన జరిగింది. పేలుడు పరికరాన్ని బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిహాదీల హింసకు నిలయమైన మోప్టీ ప్రాంతంలో ఈ ఘోర పేలుడు ఘటన జరిగింది. జీహాదీలకు కేరాఫ్ అడ్రగ్ అయిన ఈ ప్రాంతంలో తరచూ రక్తపాతం జరుగుతోంది. హింసాత్మక ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మాలీని విడిచిపెట్టారు. చదవండి: బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్లు... -
ఆన్వీల్ ట్రైనింగ్.. బస్సులో బడి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు నిత్య విద్యార్థులు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రోజుకో మెలకువ నేర్చుకుంటూ ఉండాలి. దీన్నే సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) అంటారు. కొత్త మెలకువలు నేర్చుకోవాలంటే ఎక్కడో ప్రత్యేక ఇన్స్టిట్యూట్కో, సంస్థకో వెళ్లాలి. కానీ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోకే బస్సు వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత)లో భాగంగా శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బస్సును గురువారం తీసుకొచ్చింది. శుక్రవారం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మైరెడ్డి నీరజ ‘ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శనివారం వరకు సాగే ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిలో పనిచేసే వైద్యులు, పీజీలు, హౌస్ సర్జన్లు దాదాపు 200 మంది శిక్షణ తీసుకోనున్నారు. ల్యాప్రోస్కోపిక్పై శిక్షణ ప్రధానంగా ఈ బస్సు బడిలో అతి చిన్న కోతలు అంటే ల్యాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ ఎలా చేయాలి, కుట్లు ఎలా వేస్తే త్వరగా గాయం మానే అవకాశం ఉంటుందన్న విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులోనే ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత ఆధునిక పరికరాలతో సర్జరీ మెలకువలు నేర్పించారు. కొంతమంది ప్రొఫెసర్లు సైతం ఈ టెక్నిక్లను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. పెద్దగా గాట్లు పెట్టడం, కుట్లు సరిగా వేయకపోవడం వంటి కారణాలతో రక్తస్రావం అవుతుంది. ఇలా రక్త స్రావం కాకుండా సర్జరీ ఎలా చేయాలి అన్నదానిపై ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. సర్జరీ అనంతరం రోగి వీలైనంత త్వరగా డిశ్చార్జి అయ్యేలా, అందుకు తగ్గట్టు ఆపరేషన్లు ఎలా సూక్ష్మగాటుతో చేయాలనే దానిపై చూపించారు. సుమారు రూ.10 కోట్లతో రూపొందించిన ఈ బస్సు ఆధునిక వైద్య విజ్ఞాన వేదికగా ఉందని పలువురు పీజీ వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు. ఇదొక సువర్ణావకాశం వైద్యశాస్త్రంలో రోజుకో కొత్త మెలకువ వస్తోంది. అది ప్రాక్టికల్గా చేస్తే గానీ తిరిగి పేషెంటుకు చెయ్యలేం. అలా కొత్త టెక్నిక్ స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులో నేర్చుకునే అవకాశం వచ్చింది. వైద్యవిద్యార్థులకే కాదు మాకు కూడా ఇది బాగా ఉపయోగపడింది. –డా.రామకృష్ణ నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటేనే.. పాతికేళ్లుగా సర్జరీలు చేస్తున్నా. ఏరోజుకారోజు కొత్తే. దీన్ని నేర్చుకోవాల్సిందే. ఇక్కడకు వచ్చిన బస్సులో వైద్యులు, విద్యార్థులు అందరికీ ఉపయోగపడే కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. ప్రధానంగా గైనకాలజీ సర్జరీల్లో కుట్లు చాలా ముఖ్యం. దీనిపై కొత్త మెలకువలు చెప్పారు. –డాక్టర్ మాణిక్యాలరావు, హెచ్ఓడీ, గైనకాలజీ విభాగం