ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం..

Published Sat, Mar 16 2024 1:05 AM | Last Updated on Sat, Mar 16 2024 7:24 AM

- - Sakshi

పలువురి ప్రయాణికులకు గాయాలు

మల్లంపల్లి క్రాస్‌ వద్ద ఘటన

వరంగల్‌: భూపాలపల్లి–కాటారం జాతీయ ప్రధాన రహదారిపై మల్లంపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం వైపు నుంచి భూపాలపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సును కాటారం వైపునకు వెళ్తున్న డీసీఎం ఢీకొంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మహాముత్తారం మండలం కనూకునూరుకు వెళ్లి తిరిగి వస్తోంది.

ఈ క్రమంలో మల్లంపల్లి క్రాస్‌ సమీపంలో భూపాలపల్లి వైపు నుంచి వస్తున్న డీసీఎం.. ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొంది. దీంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు నలుగురు తీవ్రంగా, మరో 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌కు తరలించారు. ఆదివారంపేటకు చెందిన అతుకూరి సమ్మక్క, లావణ్య(ములుగుపల్లి), రాజేశ్వరి(కాటారం), లక్ష్మి (ముప్పారం) గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ మేరకు కండక్టర్‌ ఎండీ హమీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు. కాగా, క్షతగాత్రులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌ను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement