Published
Wed, Aug 17 2016 9:50 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి
నాగార్జునసాగర్ : పుష్కర భక్తుల సౌకర్యార్థం కొత్తబ్రిడ్జి వరకు ఉచిత బస్సులు వెళ్లేలా చూడాలని ఎస్పీ ప్రకాశ్రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్లోని శివాలయం, సురికివీరాంజనేయ స్వామి ఘాట్లను సందర్శించారు. భక్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న ఎస్పీ పైవిధంగా స్పందించారు. వెంటనే సాగర్ భద్రతను పరిశీలించే డీస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఘాట్లలోని అధికారులతో కలిసి కోఆర్డినేషన్ మీటింగులు జరపాలన్నారు.