వీహెచ్పీ ఆవిర్భావ వేడుకలు
Published Fri, Aug 26 2016 11:52 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
మక్తల్ : విశ్వహిందూ పరిషత్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతకు పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. వాసవీమాత దేవాలయం లో ఓంకార ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీకష్ణ జన్మాష్టమి రోజున వీహెచ్పీ దినోత్సవం ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు భీంరెడ్డి, కె.సత్యనారాయణ, హన్మంతు, రాంమోహన్, బాబు, ఈసరినాగప్ప, భాస్కర్రెడ్డి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement