Vishva Hindu Parishad
-
‘సిట్’తో వాస్తవాలు బయటకు రావు’
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్పీ నేత కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’తో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.లడ్డులో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు మా దగ్గర లేవు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం మాట్లాడుతున్నాము. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలి’’ అని కోటేశ్వర శర్మ చెప్పారు.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలుఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్సీపీ గవర్నర్కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం: వీహెచ్పీ
కర్నూలు, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదు. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరం. .. ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. ఆ ఆరోపణలను నిరూపణ చేయాలి. ఈ అంశంపై దృష్టి పెట్టి కేసును అవసరమైతే సీబీఐకి అప్పచెప్పాలి. నిజంగానే లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షించాలి అని వీహెచ్పీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
Vishva Hindu Parishad: ధార్మిక సేవా అక్షౌహిణి!
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది. 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) – పగుడాకుల బాలస్వామి, వీహెచ్పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ (వీహెచ్పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) -
వలస కార్మికులకు వీహెచ్పీ చేయూత
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. రోజువారి జరిగే కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. దీంతో పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. లాక్డౌన్ విధించడంతో బస్సులు, రైళ్లు లేక సొంత ఊర్లకు వెళ్లలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారందరూ పనిలేక, డబ్బులు లేక, ఆశ్రయం లేక ప్రతి రోజు పస్తులు ఉంటున్నారు. వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం) హైదరాబాద్ మసీదుబండలో నిర్మిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర పని చేస్తున్న బెంగాల్, అస్సాం వలస కార్మికులకు విశ్వహిందూ పరిషత్ ఆహారాన్ని, నిత్యవసర సరుకులను అందించింది. దాదాపు 2000 మంది కార్మికుల వరకు ఇక్కడ చిక్కుకుపోయామంటూ విశ్వహిందూ పరిషత్కు కొంతమంది ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్లోని తమ సభ్యులను వెంటనే అక్కడికి వెళ్లి వారికి సాయాన్ని అందించాలని ఆదేశించింది. వారు వెంటనే కార్మికులు ఉంటున్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని చూసి వారికి ఆహారపు పొట్లాలను, నిత్యవసర సరుకులను అందించారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు తాము సాయం అందిస్తామని, లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరు పస్తులు ఉండటానికి వీల్లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు అన్నారు. దినసరి కూలీలు, పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేసుకునే వలస కూలీలు ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నం పెట్టేందుకు విశ్వహిందూ పరిషత్ ఎల్లవేళలా ముందు ఉంటుందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేస్తే ఎప్పుడైనా తాము సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో రెండో విడతలో మొదటిరోజైన ఏప్రిల్ 15న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి 11 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు. రెండో విడతలో మొదటిరోజు కోటి, బషీర్ బాగ్, ఫిల్మ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలలో సరుకులు అందజేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) విశ్వహిందూ పరిషత్ హెల్ప్లైన్ నంబర్కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నామని రాఘవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి , కార్యదర్శి బండారి రమేష్, క్షేత్ర సామాజిక సమరసతా ప్రముఖ్ భాస్కర్ , రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి , ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు. (మానవత్వం చాటుతున్న వన్ వే మిషన్) -
అయోధ్య: రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు!
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రామ మందిరం నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ మందిరం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది..? నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది..? ముఖ్యంగా మందిరం నిర్మాణం ఎలా ఉండనుంది..? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ సాయంతో మందిర నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ది రామ జన్మభూమి న్యాస్ భావిస్తోంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్పీ.. రామ జన్మభూమి న్యాస్తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్పైనే దృష్టి కేంద్రీకరించింది. మొదటి అంతస్తుకు సర్వం సిద్ధం... ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్పీ(ఐవీహెచ్పీ) అధ్యక్షుడు అలోక్కుమార్ వెల్లడించారు. -
‘అయోధ్య’పై ఎన్నో పార్టీలు ఎన్నో గొడవలు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ–రామ మందిరం వివాదం కేసుపై ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీల బెంచీ ముందు తుది విచారణ జరగుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. ఇది కేవలం ముస్లిం, హిందువులకు మధ్య కొనసాగుతున్న వివాదంగా సామాన్య ప్రజలకు కనిపిస్తోంది. కానీ ఎన్నో పార్టీల ప్రమేయం ఎన్నో గొడవలు ఉన్నాయి. అటు ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్ మసీదు నిర్మించారని, ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలని ‘నిర్మోహి అఖారా’ సంస్థ ఆది నుంచి డిమాండ్ చేస్తోంది. ఆది నుంచి రాముడిని పూజించే సన్యాసులతో కూడిన బృందం. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తామని ‘రామ్ లల్లా’, ‘రామ్ జన్మస్థాన్’ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రామ్ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్ సభ్యులు ఉండగా, రామ్ జన్మస్థాన్లో ఎక్కువగా ఆరెస్సెస్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని ‘నిర్మోహి అఖారా’ వాదిస్తోంది. ఇందులో తమకు ఉందని వాదిస్తోన్న రామ్ లల్లా, రామ్ జన్మస్థాన్ సంఘాలతో అది తీవ్రంగా విభేదిస్తోంది. మరో పక్క ముస్లిం సంస్థల్లో కూడా పరస్పర విభేదాలు ఉన్నాయి. షియా, సున్నీ బోర్డులు వివాదాస్పద బాబ్రీ మసీదు తమదంటే తమదని వాదిస్తూ వస్తున్నాయి. షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్’, ‘షియా వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్ బోర్డే. బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న ఆ మేరకు 1961లో కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. అది షియా మసీదని, తమకే చెందాలని షియా వక్ఫ్ బోర్డు విభేదించింది. ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు 2018లో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొదటి నుంచి ఉమ్మడిగా మసీదును నిర్మిద్దామని చెబుతున్న ‘అఖిల భారత్ షియా కాన్ఫరెన్స్’ ఆశ్చర్యంగా ‘సున్నీ వక్ఫ్ బోర్డు’కే ఇప్పటికీ అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. క్లిష్టంగా తయారైన ఈ వివాదంపై ఈ రోజు విచారణ ముగించే సుప్రీం కోర్టు తీర్పును ఎప్పుడు, ఎలా వెలువరిస్తుందో ఎదురు చూడాల్సిందే. -
బీజేపీకి వీహెచ్పీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని.. రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్పీ ధర్మ సన్సద్ను నిర్వహించనున్న నేపథ్యంలో...అలోక్కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్తో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్ను నేను కోరుతున్నా’ అని గోపాల్దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్పూర్లో అన్నారు. వీహెచ్పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్పీ కార్యకర్తలు -
మళ్లీ మంటలు.. భద్రతా వలయంలో అయోధ్య!
అయోధ్య: లోక్సభ ఎన్నికల్లోపే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం అయోధ్యలో ధర్మ సభ పేరుతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. శివసేన పార్టీ కూడా ఆదివారమే అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. దీంతో అయోధ్యలో 1992 నాటి ముస్లింలపై దాడి ఘటనలు మళ్లీ పునరావృతమవ్వొచ్చనే ఆందోళనతో అనేక మంది ముస్లింలు తమ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఇవన్నీ బీజేపీ ఎన్నికల గిమ్మిక్కులనీ, లోక్సభ ఎన్నికలలోపు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాదు కాబట్టి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనుబంధ సంస్థలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని కొందరు స్వామీజీలు సైతం విమర్శిస్తున్నారు. శారదా ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ మతపరమైన కట్టడాల నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత కాదనీ, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధర్మ సభ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించి భద్రత కల్పించాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టు ను కోరారు. అయోధ్యలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెంచుతున్న మూడో కార్యక్రమం ఇది. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చినప్పుడు, ఆ తర్వాత 2002 మార్చిలో మందిర నిర్మాణం కోసం శిలాదాన్ జరిగినప్పుడు కూడా అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్మసభకు మూడు లక్షల మందికి పైగా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని సమాచారం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధర్మసభ తర్వాత కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేకుంటే జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో అలహాబాద్లో ధర్మ సంసద్ను నిర్వహించి మందిర నిర్మాణంపై కేంద్రంతో ఆరెస్సెస్ తాడోపేడో తేల్చుకోనుంది. కుంభకర్ణుడి నిద్ర నుంచి కేంద్రం లేవాలి: ఠాక్రే ధర్మసభ కోసం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘కలియుగ కుంభకర్ణుడు (ప్రధాని మోదీ లేదా ఆయన ప్రభుత్వం) నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర నుంచి లేచి కేంద్రం వెంటనే రామాలయ నిర్మాణ తేదీలను ప్రకటించాలి. గుడి కట్టేందుకు చట్టమో, ఆర్డినెన్సో తేవాలి. అందుకు మా పార్టీ మద్దతు ఉంటుంది. ముందు తేదీ చెప్పిన తర్వాతే మిగతావి మాట్లాడాలి’ అని కోరారు. శివసే న మహారాష్ట్ర నుంచి దాదాపు 3,000 మంది కార్యకర్తలను అయోధ్యకు తీసుకొచ్చినట్లు సమాచారం. డ్రోన్లు, అదనపు బలగాలతో భద్రత ధర్మసభ నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ల సాయంతో నిరంతర గస్తీ నిర్వహిస్తారు. 10 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 42 కంపెనీల పీఏసీ, ఐదు కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ బలగాలను మోహరించినట్టు అయోధ్య ఏఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఒక అదనపు డీజీపీ, ఒక డీఐజీ, ముగ్గురు సీనియర్ ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 21 మంది డెప్యూటీ ఎస్పీలు, 160 మంది ఇన్స్పెక్టర్లు, 700 మంది కానిస్టేబుళ్లు కూడా ప్రత్యేక విధుల్లో ఉన్నారు. సరయూ నది మీదుగా కూడా పరిస్థితుల్ని సమీక్షించడానికి బలగాల్ని మోహరించారు. ప్రశాంతంగా బతకనివ్వండి: ముస్లిం పిటిషనర్ ధర్మసభకోసం ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లు తనకు సంతృప్తినిస్తున్నాయని బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారీ అన్నారు. అయితే, ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి లక్నోకో, ఢిల్లీకో వెళ్లాలి. అయోధ్యలో ఏం పని? ఇక్కడి ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అన్సారీ పేర్కొన్నారు. ‘అయోధ్యలోని 5 వేల మంది ముస్లింలలో 3,500 మంది ప్రాణభయంతో వెళ్లిపోయారు’ అని వెల్లడించారు. మరోవైపు రామాలయం అంశం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ వీహెచ్పీ ధర్మ సభ నిర్వహిస్తోందనీ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఆరెస్సెస్ నాలుగంచెల వ్యూహం లోక్సభ ఎన్నికల్లోపే రామాలయాన్ని నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆరెస్సెస్ నాలుగు అంచెల వ్యూహాన్ని రచించింది. అవి.. మొదటి దశ: నవంబర్ 25న దేశవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో సభలు. అయోధ్య, నాగపూర్, బెంగళూరులో ధర్మసభలు. రెండో దశ: ఆర్డినెన్స్ కోసం ఎంపీలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, సాధువులతో సభల ఏర్పాటు. మూడో దశ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు, డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ. నాలుగో దశ: డిసెంబర్ 18 నుంచి 27 వరకు మందిర నిర్మాణానికి దేశవ్యాప్త ఉద్యమం. యజ్ఞయాగాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయోధ్య వీధుల్లో భద్రతా సిబ్బంది పహారా -
అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), శివసేన చేపట్టిన ధర్మసభ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. దాదాపు 30 వేల మంది కరసేవకులతో పాటు శివసేన చీఫ్ ఉద్దవ్ఠాక్రే శనివారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగకుండా అక్కడి పరిసరాలల్లో పోలీస్శాఖ 144 సెక్షన్లు అమలుచేసింది. రామజన్మ భూమిని సందర్శించేందుకు ఇప్పటికే 25000 మంది శివసేన కార్యకర్తలు అయోధ్య రైల్వే జంక్షన్కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్శాఖ ముందస్తూ చర్యలును చేపట్టి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. శివసేన ర్యాలీ సందర్భంగా అయోధ్యలో ఆర్మీ దళాలను దింపాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు. అయోధ్యలో ఉద్రిక్తమైన వాతావరణాన్ని బీజేపీ కోరుకుంటుందని.. సుప్రీం తీర్పులపై వారికి నమ్మకం లేదని ఆయన అన్నారు. కాగా రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంట్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో సహా, హిందుత్వ పార్టీలు రామజపాన్ని అందుకున్నాయి. పార్లమెంట్ ఆర్డినెన్స్తో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామాలయ నిర్మాణం చేపడతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య వివాదంను సుప్రీం ధర్మాసనం విచారించనున్న విషయం తెలిసిందే. -
భక్తిలోనూ రాజకీయాలే!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి సుప్రీం కోర్టు తీర్పు మేరకు అన్ని వయస్కుల మహిళలను అనుమతించకుండా ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థల భక్తులు అడ్డుకుంటుండడంతో శుక్రవారం నాటికి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయ్యప్ప ఆలయానికి సరిగ్గా 23 కిలోమీటర్ల ఈవల నీలక్కళ్ వద్దనే ఓ టెంట్ వేసి ‘శబరిమల ఆచార సంరక్షణ సమితి’ బ్యానర్తో భక్తులు అయ్యప్ప ప్రార్థనలు జరుపుతున్నారు. అయ్యప్ప ఆలయానికి మొదటి ప్రవేశ మార్గంగా భావించే నీలక్కళ్ వద్దనే భక్తులతో వస్తున్న బస్సులను, ఇతర వాహనాలను ఆరెస్సెస్ కార్యకర్తలు ఆపివేసి మహిళలను దించివేస్తున్నారు. నీలక్కల్ వద్దనే ఆరెస్సెస్ టెంట్ వేయడంతో 1982లో చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ నిర్వహించిన ఆందోళన గుర్తుకు వస్తోంది. నీలక్కల్లోని శివాలయానికి సమీపంలో చర్చి నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన కుమ్మనమ్ రాజశేఖరన్ నేడు మిజోరమ్ గవర్నర్గా పనిచేస్తున్నారు. అప్పుడాయన కేరళ విశ్వహిందూ పరిషత్ ప్రధాని కార్యదర్శిగా పనిచేశారు. శివాలయానికి సమీపంలో శిలువ 1982కు కొన్నేళ్ల ముందు నీలక్కళ్ శివాలయానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో పెద్ద శిలువ దొరికిందన్న ప్రచారం జరిగింది. ఏసుక్రీస్తు 12 ముఖ్య ప్రచార బోధకుల్లో ఒకరైన థామస్ కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ చర్చిని నిర్మించారని, ఆ చర్చిలోని శిలువే బయటకు వచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో శిలువ దొరికినట్లు భావించిన చోట క్యాథలిక్ చర్చి సభ్యులు చిన్న గుడిసె వేసి ప్రార్థనలు జరపడం ప్రారంభించారు. అక్కడ చర్చి పునర్నిర్మాణం కోసం క్యాథలిక్ చర్చి ‘నీలక్కళ్ కార్యాలయ సమితి’ని ఏర్పాటు చేసింది. ఈ చర్చి ఆందోళనను అడ్డుకోవడానికి సంఘ్ పరివార్ కొచ్చీలో హిందీ మహా సమ్మేళనాన్ని నిర్వహించింది. శివాలయం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదంటూ ఆ సమ్మేళనం హిందువులకు పిలుపునిచ్చింది. 1982, మే 19న చర్చికి స్థలం కేటాయింపు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం ఇరు మతాల వారిని మంచి చేసుకోవడంలో భాగంగా శివాలయానికి నాలుగు కిలీమీటర్ల దూరంలో చర్చి నిర్మాణాకి ఓ హెక్టార్ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా వీహెచ్పీ నాయకుడు రాజశేఖరన్ నాయకత్వాన ఆరెస్సెస్ కార్యకర్తలు తిరువనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న కారణంగా వెయ్యి మంది ఆరెస్సెస్ కార్యకర్తలు నాడు అరెస్టయ్యారు. అయినా చర్చి నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారు. ‘ఆ చర్చి ప్రభుత్వం మతతత్వ వాదానికి ప్రతీక, ఓట్ల కోసం ఆడిన నాటకం’ అని నాడు రాజశేఖరన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వమర్శించారు. నాటి ఆందోళనతో కేరళలో హిందూ సంఘాలు కాస్త బలపడ్డాయి. మద్దతిచ్చి మాటమార్చిన ఆరెస్సెస్, బీజేపీ అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రం కోర్టు ఇచ్చిన తీర్పును అదే రోజు ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు స్వాగతించాయి. లింగ వివక్ష లేకుండా భక్తులందరికి సమాన హక్కులు ఉంటాయని, అందుకే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆరెస్సెస్ రాష్ట్ర కార్యదర్శి పీ గోపాలన్కుట్టీ వ్యాఖ్యానించారు. ఆలయ ప్రవేశం విషయంలో లింగ వివక్షను ఎంత మాత్రం అనుమతించేది లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. అక్టోబర్ మూడవ తేదీ నాటికి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఇద్దరు మాట మార్చేశారు. ఆరెస్సెస్ ప్రత్యక్షంగా ఆందోళనలోకి దిగి భక్తుల ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. ఎవరిది మాత్రం ఓట్ల రాజకీయం కాదు? -
కేంద్రానికి వీహెచ్పీ డెడ్లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్పీ నేతలు -
ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్
సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వీహెచ్పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై వీహెచ్పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. -
పరిపూర్ణానందస్వామి అరెస్ట్ సరికాదు
యాదగిరిగుట్ట (ఆలేరు) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్, నగర బహిష్కరణ చేయడం బాధకరమని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పుల్ల శివ, విశ్వహిందూపరిషత్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్ అన్నారు. స్వామీజీని వెంటనే విడుదల చేసి, ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు యాదగిరిగుట్టలో బీజేపీ, హెచ్డీపీఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శాంతియుతంగా చేపట్టిన ధర్మాగ్రహయాత్రను అడ్డుకొని, స్వామీజీని ఎవరికి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లడం శోచనీయమన్నారు. హిందూ దేవుళ్లను, ఆచారాలను గౌరవించే స్వామీజీలను అరెస్ట్ చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. స్వామీజీకి ప్రభుత్వం రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, హెచ్డీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పవీణ్, నవీన్ ఠాగూర్, నర్సింహారావు, లెంకలపల్లి శ్రీనివాస్ ఉన్నారు. -
అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి
పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం కలిశారు. బిహార్లోని నవడా జైలులో ఉన్న బజరంగ్ దళ్, వీహెచ్పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్పూర్లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు. హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు. -
మందిర్ తీర్పులో జాప్యం సహించం..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సంవత్సరాంతానికి రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యేలా రామ జన్మభూమి వివాదంపై విచారణను వేగవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయోధ్య కేసును త్వరితగతిన విచారించాలని ఈ కేసులో వీహెచ్పీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడితే ఈ ఏడాది చివరిలో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఇక బాబ్రీ విధ్వంసం కేసుకు, మందిర్ నిర్మాణానికి సంబంధం లేదని చెప్పారు. ఒకటి క్రిమినల్ కేసు కాగా, మరొకటి భూ యాజమాన్య హక్కులకు సంబంధించినదన్నారు. అయోధ్య వివాదానికి సంబంధించి కోర్టు తీర్పులో జాప్యం జరిగితే హిందూ సన్యాసులు, ప్రముఖుల సూచనలతో ముందుకు వెళతామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా, వీహెచ్పీని మతపరమైన ఉగ్రవాద సంస్థగా సీఐఏ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్ ఏజెన్సీ చర్యపై తాము ఆందోన చెందడం లేదని, ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకువెళ్లాలని తాము కోరుతున్నామన్నారు. -
‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’
ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్ : మరో నాలుగు నెలల్లోపు రామమందిరం నిర్మాణం చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు విశ్వ హిందూ పరిశత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తోగాడియా. రామ మందిర నిర్మాణం, గో రక్షణ వంటి అంశాల కోసం పని చేయడానికి బుధవారం ఫైజాబాద్లో ‘అంతరాష్ట్రీయ హిందు పరిషత్’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట మార్చి రామ మందిర నిర్మాణ అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటున్నారు. ఇలా మాటా మార్చడం పార్టీకే మంచిది కాదని తోగాడియా హెచ్చరించారు. ‘అక్టోబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలి. అలా చేయని పక్షంలో దేశంలోని హిందువులందరూ రోడ్లపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తార’ని హెచ్చరించారు తోగాడియా. అంతేకాక ‘ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మసీదులను సందర్శించడానికి తీరిక ఉంటుంది. కానీ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించడానికి మాత్రం తీరిక లేదు. మోదీ ఇలా మసీదులను సందర్శిస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నార’ని తొగడియా విమర్శించారు. ‘ఎందుకు మోదీ రామ మందిరం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారని’ ప్రశ్నించారు. ‘నేను బీజేపీకి ఒక్కటే చెప్పదల్చుకున్నాను. రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం. దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను మనం గౌరవించాలి. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది నిజంగా మన పార్టీకి చాలా గొప్ప విజయం అవుతుంది అన్నారు తోగాడియా. అయితే తోగాడియా వ్యాఖ్యల గురించి మాజీ బీజేపీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు వినయ్ కటియార్ ‘రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వీహెచ్పీకి ధన్యవాదాలు. రామ మందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు 2019 నాటికి తన నిర్ణయాన్ని తెలపకపోతే అప్పుడు మోదీనే మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేస్తార’ని తెలిపారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్పీ, భజరంగ్దళ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది. హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్పీ, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్ ఫ్యాక్ట్బుక్ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా ప్రకటించింది. -
తాజ్మహల్ గేటు ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: 400 ఏళ్లనాటి శివాలయం లోకి అనుమతించే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చారిత్రాత్మక కట్టణం తాజ్మహల్ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజ్మహల్కు సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మూసివేస్తోందని వీహెచ్పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధ్వేశ్వర మహాదేవ్ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్మహల్, సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఐరన్రాడ్లతో దాడిచేశారు. గేట్ను తొలగించి, అక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేలకు వారిని నిరోధించిన తాజ్ మహల్ సిబ్బంది వారిని అదుపులోకి కున్నారని తాజ్ భద్రతా అధికారి ప్రభాత్కుమార్ తెలిపారు. వీహెచ్పీ సభ్యులు రవిదుబే, మదన్వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30మంది పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. తాజ్మహల్ చుట్టూ ఉన్న హిందూసంస్కృతికి సంబంధించిన అంశాలను ఏఎస్ఐ నాశనం చేస్తోందని విహచ్పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ సత్సంగ్ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇకముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు. -
తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
ఆ సినిమాను విడుదల కానివ్వం: వీహెచ్పీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్పుత్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా ‘లవోరాత్రి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సినిమా పేరును ‘లవోరాత్రి’ అని నిర్ణయించారు. ఈ విషయం గురించి విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేశారు. ఈ సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించడానికి వీలులేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటా’మని తెలిపారు. ‘సుల్తాన్’, షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’, చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అభిరాజ్ మినావాలా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్ శర్మకు జోడీగా నటిస్తున్న వారినా హుస్సెన్కు కూడా ఇండస్ట్రీకి తొలి పరిచయం కావడం గమనార్హం. -
సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జంషెడ్పూర్ : గోవధను నిరోధించేందుకు జీవితఖైదుతో కూడిన కఠిన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్పీ నేత సాధ్వి సరస్వతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోవధను నియంత్రిస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా జాతీయస్థాయిలో కేంద్రం సరైన చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని ఆమె కోరారు. కేరళలో హిందూ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై ఏప్రిల్ 30న కేసు నమోదు చేసినా తాను తన కార్యకలాపాలను కొనసాగిస్తానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు. కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి తనపై కేసులున్నా తనను అవి నిరోధించలేవన్నారు. బీఫ్ తినడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్బుక్ పేజీలో 600 మందికి పైగా వ్యక్తులు తనను ట్రోల్ చేశారని చెప్పారు. జాప్యం నెలకొన్నా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. -
గవర్నర్కు వీహెచ్పీ బహిరంగ లేఖ
-
వీహెచ్పీ నుంచి వైదొలగిన తొగాడియా
గుర్గావ్: గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వీహెచ్పీ కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా హిమాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. -
గుజరాత్: తొగాడియాపై హత్యాయత్నం.. ట్రక్కు ఢీ ?
సాక్షి, సూరత్ : విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం వెళ్లి డివైడర్ను తాకింది. ఈ క్రమంలో ఆ ట్రక్కు వాహనం డ్రైవర్ ఎలాంటి బ్రేకులు వేయలేదంట. అయితే, అదృష్టవశాత్తు తొగాడియా, ఆయన అనుచరులకు ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై స్పందించిన తొగాడియా గుజరాత్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రభుత్వం హత్యాయత్నానికి ప్రయత్నించిందని అన్నారు. తన వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత కూడా ఎందుకు బ్రేకులు వేయలేదని ప్రశ్నించారు. తాను ఆసమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లేకుంటే తన సిబ్బందితో సహా ఎవరూ ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఉద్దేశ పూర్వకంగానే భద్రత తగ్గిస్తూ వచ్చారని, జెడ్ప్లస్ కేటగిరినీ బలహీనపరుస్తూ వచ్చారని, కనీసం ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పంపించడం లేదని, ఇదంతా తనను హత్య చేసే కుట్రలో భాగమేనని అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనను ఒక ప్రమాదంగానే చెబుతున్నారు. వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
గుడుల్లోకి అందరినీ రానివ్వాలి
రామాయంపేట(మెదక్): దేవాలయాల్లో అన్ని వర్గాలవారికి ప్రవేశం ఉంటేనే ధర్మాన్ని రక్షించవచ్చని వీహెచ్పీ జాతీ య సహ కార్యదర్శి సత్యంజీ సూచించా రు. స్థానిక వివేకానంద ఆవాస విద్యాలయంలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటే నే అసలైన సార్ధకత లభిస్తుందన్నారు. గ్రామాల్లో కలిసికట్టుగా ఉంటేనే హిందూ సమాజం ముందుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి ఆశయ సాధన మేరకు ఆవాస విద్యాలయం పేద విద్యార్థులకోసం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో మెదులుతున్నారని ఆయన ప్రశంసించారు. ఆవాస విద్యాలయం వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ స్కూలులో చిన్ననాటి నుంచే విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతున్నామన్నారు. ఆవాసం ఆధ్వర్యంలో రామాయంపేట, చే గుంట, చిన్నశంకరంపేట మండలాల్లోని 30 గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు, కిశోర వికాస కేంద్రాలు, గ్రం థాలయాలు, అభ్యాసికలు, భజన మండళ్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలోగా కనీసం 60 సేవా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి ఆశయ సాధన విషయమై మనందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్ కార్పస్ ఫండ్ పెంచితే మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉందని, దీంతో పేద విద్యార్థులకు మరింతగా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు రాంచరణ్యాదవ్ మాట్లాడుతూ ఆవాసం విద్యార్థులు భారతమాత సేవలో çపునీతులవుతున్నారని ప్రశంసించారు. ఇందులో చిన్ననాటి నుంచే పిల్లలకు మంచి సంస్కారం నేర్పడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా చల్మెడ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దొంతినేని రాధిక పది మంది విద్యార్థులను దత్తత తీసుకొని రూ. లక్షా 50 వేల చెక్కు అందజేశారు. పది మంది పిల్లలకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గేయాలు, నృత్యాలతో అలరించారు. సంస్థ ప్రతిని ధులు బాణాల సూర్యప్రకాశరెడ్డి, సంగమేశ్వర్, పండరీనా«థ్, రఘుపతిగౌడ్, లక్ష్మణ్యాదవ్, పబ్బ సత్యం, శీలం మల్లారెడ్డి, బాల్రెడ్డి, ముత్యాలు, రాజు, నవాత్ మల్లేశం పాల్గొన్నారు. -
మోదీతో విభేదాల్లేవు.. భిన్నాభిప్రాయాలే
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రవీణ్ తొగాడియా... పరిచయం అక్కర్లేని పేరు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిందూ అతివాదిగా ముద్రపడ్డ ప్రవీణ్ తొగాడియాలో మరో కోణం ఉంది. ఆయన దేశంలోనే పేరుమోసిన కేన్సర్ వైద్య నిపుణుడు. బీజేపీ పాలిత రాజస్థాన్ పోలీసులు తనను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేశా రు. ఒకనాటి ఆత్మీయ మిత్రుడు మోదీతో భిన్నాభిప్రాయాలే తప్ప సైద్ధాంతిక విభేదాలు లేవన్నారు. ఎన్కౌంటర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. విజయవాడకు వచ్చిన తొగాడియా శుక్రవారం ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. సాక్షి: ప్రధానిగా మారిన తరువాత మోదీతో విభేదాలు తలెత్తాయనిపిస్తోంది! తొగాడియా: ప్రధానితో విభేదాలున్నా యని చెప్పానా? నాతో విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారా? లేదే... భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మేము ఇప్పటికీ స్నేహితులం. సాక్షి: రాజస్థాన్ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు..? తొగాడియా: ఆ అంశంపై నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. సాక్షి: అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారని భావిస్తున్నారు? తొగాడియా: ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను. సాక్షి: మీరు చేసిన ఆరోపణలపై సంఘ పరివార్ వర్గాలు స్పందించినట్లు లేదు కదా! తొగాడియా: రాజస్తాన్ హోంమంత్రి స్పందిం చారు. నాకు రాజస్తాన్, గుజరాత్ ప్రభుత్వాలపై నమ్మకం ఉంది. రాజస్థాన్ పోలీసులు ఇంకా అహ్మదాబాద్లో మకాం వేసి ఈ కేసు విచారణ పేరుతో ఏదో చేస్తున్నారు. అంటే ఏదో జరుగుతోందనుకుంటున్నా. సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుకు మీరు ఏ రేటింగ్ ఇస్తారు? తొగాడియా: నేను రేటింగ్ ఏజెన్సీని కాదు. హిందుత్వ వాదిని, వైద్యుడిని. సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుపై తొగాడియా సంతృప్తిస్థాయి ఏమిటో దేశం తెలుసుకోవాలి అనుకుంటే ఏం చెబుతారు? తొగాడియా: అందుకు ఐదు విధానాలు సమర్థంగా అమలు చేయాలని చెబుతాను. 1. దేశంలో ఏటా కోటికిపైగా కుటుంబాలు ఊహించని వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ప్రతి ప్రైవేట్ వైద్యుడు రోజుకు ఒకరికి ఉచితంగా వైద్యం అందిస్తే వారందరికీ ప్రయోజనం కలుగుతుంది. 2. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిని రేషన్, బ్యాంకు రుణాలకు, ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేయాలి. 3. జీడీపీ పెరుగుతోంది కానీ ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జీడీపీ 1 శాతం పెరిగితే కోటికి పైగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక విధానాలు రూపొందించాలి. 4. గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా నిర్ణయించాలి. 5. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి. కాశ్మీరీ హిందువులు తమ స్వస్థలాల్లో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండాలి. సాక్షి: ఈ అంశాల్లో ప్రధాని మోదీకి సలహా ఇవ్వొచ్చు కదా? తొగాడియా: ప్రధానికి ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సాక్షి: పదివేలకు పైగా క్యాన్సర్ సర్జరీలు చేసిన బిజీ డాక్టర్గా ఉంటూ వీహెచ్పీకి సమయం ఎలా కేటాయించగలిగారు? తొగాడియా: సర్జరీకి సర్జరీకి మధ్య కొంత సమయం తీసుకొని వీహెచ్పీ కార్యకలాపాలు చూసేవాడిని. ప్రస్తుతం సర్జరీలు చేయ డం లేదు. ఓపీ సేవలు కొనసాగిస్తున్నా. -
వీహెచ్పీని చీల్చేందుకు తొగాడియా వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రవీణ్ తొగాడియాను తొలగించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తుండగా, ఆయన విశ్వ హిందూ పరిషత్నే చీల్చేందుకు, తద్వారా సంఘ్ పరివార్లో కొత్త సమీకరణలకు తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుయాయులు తెలియజేస్తున్నారు. గత వారం కొన్ని గంటలపాటు అదృశ్యమైన ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా ఆస్పత్రిలో ప్రత్యక్షమవడం, తనను ఎన్కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించడం తెల్సిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రవీణ్ తొగాడియా ఓ పుస్తకం రాస్తున్నారని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో రామాలయం నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో విఫలమైనట్లు తొగాడియా ఆరోపించారని, అందుకని వీహెచ్పీ పదవి నుంచి ఆయన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను ఎన్కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని తొగాడియా ఆరోపించారు. తనను పదవి నుంచి తొలగించక ముందే విశ్వ హిందూ పరిషత్లో తన వర్గీయులతో కలసి విడిపోవాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల నినాదం చేసుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్న మోదీ–బీజేపీ వ్యూహాన్ని ముందుగానే దెబ్బగొట్టాలని కూడా తొగాడియా యోచిస్తున్నారట. అందుకని తక్షణమే రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాలని, తద్వారా హిందూ పరివారంలో కొత్త సమీకరణలకు తెర తీయాలని ఆయన వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ప్రవీణ్ తొగాడియాతో శ్రీరామ్ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్, ఉత్తర గుజరాత్ వీహెచ్పీ నాయకుడు అశ్విన్ భాయ్ పటేల్ తదితరులు సమావేశమవడం ఆయన భవిష్యత్ వ్యూహాన్ని సూచిస్తోంది. సంక్షోభం నివారణలో భాగంగా 2002లో హిందువులను, వీహెచ్పీ, భజరంగ్ దళాలను టార్గెట్ చేసిన గుజరాత్ పోలీసులు ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియాను టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఆరెస్సెస్తో బలమైన సంబంధాలు కలిగిన స్వామి చిన్మయానంద లాంటి వాళ్లు తొగాడియాలను తొలగించాలనే కోరుకుంటున్నారు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వీహెచ్పీ, ఆరెస్సెస్లు భావిస్తున్నారు. వీహెచ్పీ కార్యదర్శి సురేంద్ర జైన్ కూడా తొగాడియాను కలుసుకొని మంతనాలు జరిపారు. -
తొగాడియా నిష్క్రమణ ఖాయమేనా!?
విశ్వహిందూ పరిషత్లో ప్రవీణ్ తొగాడియా ప్రస్థానం ముగిసినట్టేనా? వీహెచ్పీ నుంచి ఆయనను బయటకు సాగనంపుతారా? తొగాడియాకు క్రమశిక్షణ లేదని వీహెచ్పీ వ్యాఖ్యానించడం.. అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తనను ఎన్కౌంటర్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలపై తాజాగా విశ్వహిందూ పరిషత్ మండిపడింది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణలేని తొగాడియా వ్యాఖ్యలను ఏ మాత్రం సహించేది లేదని వీహెచ్పీ నేత స్వామి చిన్మయానంద్ తెలిపారు. ఆయనకు విశ్వహిందూ పరిషత్ ఎంతో గౌరవాన్ని, సమున్నత స్థానాన్ని కల్పించిందని చెప్పారు. వీహెచ్పీ గౌరవానికి మచ్చే తెచ్చే వ్యక్తులను గౌరవంగానే సాగనంపుతామని.. పరోక్షంగా తొగాడియాకు ఆయన సంకేతాలు పంపారు. స్థానాన్ని కోల్పోయారు: క్షమార్హం కానీ వ్యాఖ్యలతో ప్రవీణ్ తొగాడియా విశ్వహిందూ పరిషత్లో స్థానం కోల్పోయారని చిన్మయానంద్ స్పష్టం చేశారు. మార్గదర్శక్ మండల్లో సభ్యుడైన చిన్మయానంద్ వ్యాఖ్యలు.. తొగాడియాను బయటకు పంపుతారన్న సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అనేది వ్యక్తుల చుట్టూ తిరిగే సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆయనపై గౌరవం ఉంది: ప్రవీణ్ తొగాడియా అంటే ఇప్పటికీ గౌరవం ఉందని వీహెచ్పీ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ స్పష్టం చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇస్తే గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఏది ఏమైనా మాకు, దేశానికి తొగాడియా ప్రియమైన వారని చెప్పారు. -
చిన్నకందుకూరులో గోరక్షకుల దాడి
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దళితులపై దాడి చేశారు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంక్రాంతి పండగ సందర్భంగా 14న చిన్నకందుకూరులో దళితులు అర్ధరాత్రి గోవును కోస్తున్న క్రమంలో 30 మంది ఆర్ఎస్ఎస్, గోరక్షక్, వీహెచ్పీ కార్యకర్తలు బైక్లపై వచ్చారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ, ఆర్ఎస్ఎస్ జిందాబాద్ అంటూ కర్రలతో దాడి చేశారు. దీంతో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పల య్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోచయ్య, ఎర్ర మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గోవును వధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దళితులపై కేసులు నమోదు చేశారు. నిందితులను శిక్షించాలి: టీమాస్ విషయం తెలుసుకున్న టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్లు బాధితులను శనివారం పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయా లని యాదగిరిగుట్ట ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. -
ఆర్ఎస్ఎస్లో కలకలం ; ప్రవీణ్ తొగాడియాపై వేటు?
న్యూఢిల్లీ : వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాపై మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ‘పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారం’టూ ఇటీవల తొగాడియా చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చడమేకాక బీజేపీ ప్రభుత్వాలను ఇరుకునపెట్టేలా ఉన్నాయని పరివార్ పెద్దలు భావిస్తున్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా తొగాడియాను, అతని అనుకూలురు మరో ఇద్దరిని సంస్థాగత పదవులనుంచి తప్పించనున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వేటుకు గురికానున్నవారి జాబితాలో తొగాడియాతోపాటు భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ, వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డిల పేర్లు ఉన్నాయి. అయితే సంఘ్ పరివార్కు చెందిన ఏ సంస్థా అధికారికంగా ఈ విషయాలను నిర్ధారించలేదు. అయితే, తొగాడియా ఆరోపణల అనంతరం పరివార్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో ఊహించని మార్పులు తప్పవని ఢిల్లీ, నాగ్పూర్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. పరివార్కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే ‘ప్రతినిధి సభ’ జరగడానికి ముందే నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. మోదీ వర్సెస్ తొగాడియా : అజ్ఞాతం నుంచి గత సోమవారం మీడియాముందుకు వచ్చిన ప్రవీణ్ తొగాడియా.. తనను పోలీస్ ఎన్కౌంటర్లో చంపేందుకు కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. ‘నా నోరు మూయించేందుకు సెంట్రల్ ఏజెన్సీలను మోహరించారు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. తొగాడియా ఆరోపణల అనంతరం సంఘ్పరివార్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సంపూర్ణ గోవధ నిషేధం అంశాల్లో మోదీ నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తొగాడియా గతంలోనూ పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. మరో కథనం ప్రకారం.. తొగాడియా ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. దాదాపు పూర్తికావచ్చిన ఆ పుస్తకంలో మోదీ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలున్నట్లు సమాచారం. రామజన్మభూమి ఉద్యమం ద్వారా బీజేపీ ఏ విధంగా రాజకీయ లబ్ధిపొందిందీ, ఏయే నాయకులు ఏ విధంగా లాభపడిందీ తదితర అంశాలు కూడా పొందుపర్చారని తెలిసింది. ఆ పుస్తకం 2019 ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశంఉన్నందున తొగాడియా విషయంలో ఆర్ఎస్ఎస్ ఏదోఒక కఠిన నిర్ణయం తీసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఈ విషయాలేవీ అధికారికంగా వెల్లడికాలేదు. -
కలకలం రేపిన వీహెచ్పీ చీఫ్ అదృశ్యం
-
కలకలం రేపిన వీహెచ్పీ చీఫ్ అదృశ్యం
అహ్మదాబాద్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా (65) అదృశ్యం అయ్యారన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. సోమవారం ఉదయం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి కార్యర్తలు ఆందోళన చేపట్టారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ అహ్మదాబాద్లోని సోల పోలీస్ స్టేషన్ ఎదుట వీహెచ్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తొగాడియాపై ఉన్న ఓ పాత కేసు విషయంలో రాజస్థాన్ పోలీసులు తమను సంప్రదించారని, అయితే ఆయన నివాసంలో కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారని సోల పోలీసులు వివరించారు. దీంతో తొగాడియా ఎక్కడున్నారో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయనను పోలీసులే అదుపులోకి తీసుకుని ఉంటారని భావించిన కార్యకర్తలు ఆయన ఆచూకీ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో సర్కెజ్-గాంధీనగర్ హైవేను దిగ్బంధం చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే చివరికి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడంతో వీహెచ్పీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓ పార్క్లో గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి స్పృహ కోల్పోయిన ఆయనను చంద్రామణి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఐ లవ్ ముస్లిమ్స్’ అన్నందుకు..
బెంగుళూరు : ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్మంగుళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసులో స్థానిక బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధన్య శ్రీ(20) చిక్మంగుళూరుకు చేరువలో గల ముడిగెరె పట్టణంలో బీకాం చదువుతోంది. శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంతోష్ అనే స్నేహితుడితో వాట్సాప్లో చెలరేగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చాట్లో కులం, మతాల ప్రస్తావన రావడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ‘నేను ముస్లింలను ప్రేమిస్తున్నాను’ అని ధన్య సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దాంతో కోపోద్రేకుడైన సంతోష్.. ముస్లింలతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించాడని చెప్పారు. అనంతరం ధన్యతో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్లను స్థానిక భజరంగ్ దళ్, విహెచ్పీ సభ్యులకు పంపినట్లు తెలిపారు. ఆ స్క్రీన్ షాట్లు సోషల్మీడియాలో వైరల్ కావడంతో ధన్య మానసికంగా కుంగిపోయినట్లు చెప్పారు. ధన్య ఇంటికి వెళ్లిన ముడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్ రాజ్.. ముస్లింలతో స్నేహంగా ఉండటంపై తల్లిదండ్రులను హెచ్చరించినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజే ధన్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. ఈ ఘటన తన జీవితాన్ని, చదువును నాశనం చేసిందని ధన్య శ్రీ సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంతోష్, మరో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. -
రాముడికి చలిగా ఉంది.. దుప్పట్లు ఇవ్వాలి
లక్నో: శీతాకాలంలో అయోధ్యలో బాల రాముడి (రామ్లల్లా)కి చలిపెడుతోందనీ, ఉన్ని దుస్తులు, దుప్పట్లు, రూమ్ హీటర్ కూడా ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ మంగళవారం డిమాండ్ చేసింది. చలి వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు ఆయనకు ఇవి అవసరమని వీహెచ్పీ ప్రాంతీయ మీడియా ఇన్చార్జ్ శరద్ శర్మ అన్నారు. రాముడంటే కోట్లాది ప్రజల నమ్మకం, భక్తి అనీ, అలాంటి రాముణ్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని ఆయన అన్నారు. రాముడి బాగోగులు చూసుకోడానికి అనేక హిందూ సంస్థలు, సాధువులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
మందిర్-మసీదు.. ముఖ్య ఘట్టాలు
రామజన్మ భూమి, బాబ్రీ మసీదుపై మంగళవారం తుది విచారణ జరగాల్సి ఉండగా.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రామజన్మ భూమి, బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాలు.. ముఖ్యఘట్టాలకు సంబంధించిన వివరాలివి. రామజన్మభూమి, బాబ్రీ మసీదుకు సంబంధించి 2010లో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభవించింది. ఒక భాగం నిర్మోహి అఖారాకు, మరొక బాగం రామజన్మభూమికి, మూడో భాగం మసీదుకు కోర్టుకు కేటాయించింది. ఈ తీర్పును ఉభయపక్షాలు సుప్రీంలో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో మసీదు వివాదానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలను పరిశీలిద్దాం. బాబ్రీ మసీదు టైమ్లైన్ 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మీద మీర్ బాఖీ నిర్మించారు. 1853 : మసీదుకు సంబంధించి మొట్టమొదటి హింస జరిగిన సంవత్సరం. నిర్మోహి అఖారాకు చెందిన హిందువులు, అలాగే అవధ్ నవాబ్ అయిన వాజిద్ ఆలీ షా వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు ఆధారాలున్నాయి. రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువులు తొలిసారి ఆరోపించారు. 1885 : బాబ్రీ మసీదుపై మొదటిసారిగా మహంత్ రఘుబర్దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. మసీదు స్థలం రామాలయయని ఆయన కోర్టుకు తెలిపారు. 1889 : హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగడంతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మసీదు చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. బ్రిటీష్ ప్రభుత్వం ముస్లింలకు లోపలి భాగం, హిందువులకు బయటి భాగాన్నిఅప్పగించింది. 1949 : బాబ్రీ మసీదులోకి ప్రవేశించిన కొందరు హిందువులు.. అక్కడ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టించారు. 1950 : బాబ్రీ మసీదులోని ఖాళీ ప్రాంతంలో ప్రార్థనలను చేసుకునేందుకు అనుమతించాలంటూ.. మహంత్ పరమహంస రామచంద్ర దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఖాళీ భాగంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించన కోర్టు.. లోపలి భాగంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. 1959 : మొత్తం స్థలాన్ని తమకు అప్పగించాలంటూ నిర్మోహి అఖారా మూడోసాకి కోర్టును అశ్రయించింది. 1961 : మసీదు ఖాళీప్రాంతాన్ని స్మశానంగా మార్చుకునేందుకు అనుమతి కోరుతూ.. సున్నీ సెంట్రల్ బోర్డు, షియా వక్ఫ్ బోర్డులు కోర్టుకెక్కాయి. 1984 : రామజన్మ భూమిలో రామాలయాన్నినిర్మించడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రకటన. రామాలయం నిర్మాణం కోసం ఉద్యమం మొదలు పెట్టిన అద్వానీ. 1986 : బాబ్రీ మసీదులో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చంటూ జిల్లా కోర్టు తీర్పు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు.. బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. 1989 : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మసీదులోని ఖాళీ స్థలంలో రామాలయం నిర్మాణానికి శిలాన్యాస్. అంతేకాక మసీదును మరో ప్రాంతానికి తరలించాలంటూ.. కోర్టులో కేసును దాఖలు చేసిన వీహెచ్పీ 1990 : చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొందరు కర సేవకులు బాబ్రీ మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో ప్రధాని చంద్రశేఖర్.. ఇరు వర్గాల మధ్య చర్చలతో సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే బీజేపీ సీనియర్ నేత అద్వానీ రామాలయం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలు పెట్టారు. 1991 : అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అద్వానీ రథయాత్రతో మొదటిసారి ఉత్తర్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. దీంతో అయోధ్యలో కరసేవకుల ఉద్యమం మరింత ఉధృతమైంది. 1992 : డిసెంబర్ 6న శివసేన, వీహెచ్పీ, బీజేపీ కార్యకర్తలు భారీగా వివాదాస్పద ప్రాంతానికి చేరుకుని.. మసీదును కూల్చారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో 2 వేలమందిపైగా మరణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ను నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2002 : గుజరాత్ నుంచి అయోధ్యకు రైలుతో తరలివెళుతున్న కరసేవకులపై గోధ్రా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. 58 మంది కరసేవకుల మృతి. గోధ్రా ఘటన తరువాత చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది మరణించారు. 2002 : బాబ్రీ మసీదు ప్రాంతంపై సర్వే చేయాలంటూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించిన హైకోర్టు. 2003: బాబ్రీ మసీదు ప్రాంతంలో సర్వే పనులు మొదలు పెట్టిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మసీదు కింది భాగంలో ఆలయం ఉన్నట్లు తేల్చిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. 2009 : బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ నివేదిక కేంద్రానికి సమర్పించింది. ఇందులో బీజేపీ అగ్రనేత అద్వానీ సహా మరో 68 మందిని దోషులుగా తేల్చింది. 2010 : బాబ్రీ మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు మొదటిసారి తీర్పును వెలవరించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి.. నిర్మోహి అఖారాకు, రామజన్మభూమికి, మసీదుకు కేటాయిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును ఇరు వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2011 : అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీం. 2014 : నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో ఘనవిజయం. 2015 : అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా వీహెచ్పీ దేశవ్యాప్తంగా రాళ్ల సేకరణ. సరిగ్గా రెండు నెలల తరువాత రెండు ట్రక్కుల రాళ్లు వివాదాస్పద ప్రాంతానికి చేరుకున్నాయి. మోదీ ప్రభుత్వం అనుమతిస్తే రామాలయాన్ని నిర్మిస్తామంటూ.. మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటన. 2017 : అమోధ్య ధ్వంసానికి సంబంధించి అద్వానీపై తిరిగి కేసును రీ ఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు. 2017 : ఉత్తర్ప్రదేశ్లో సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017 మార్చి 21 : బాబ్రీ మసీదు విషయం చాలా సున్నితమైనది. దీనిని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు. 2017 డిసెంబర్ 5 : అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన వర్గాల వాదనలు వినేందుకు సిద్ధపడ్డ సుప్రీం కోర్టు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బాబ్రీ మసీదు విచారణను.. వచ్చే ఏడాది 8కి వాయిదా వేసిన కోర్టు. -
‘ప్రతి హిందువు.. నలుగురు పిల్లల్ని కనాలి’
సాక్షి, ఉడిపి : ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ హరిద్వార్ పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని.. హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్దేవ్ గిరిరాజ్ మహరాజ్ శనివారం పిలుపునిచ్చారు. అలా చేయడం వల్లే జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గు ముఖం పడుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని ఆయన చెప్పారు. గోవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని ఆయన చెప్పారు. అదే సమయంలో గోవుల రక్షణ కోసం శ్రమిస్తున్న గో రక్షక్లను ఆయన కొనియాడారు. నేడు కొంతమంది గో రక్షక్లను నేరస్తులుగా చూస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గో రక్షక్లు అత్యంత శాంతి ప్రియులని చెప్పారు. -
నిప్పుతో ఆటలొద్దు
వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్కు మమత వార్నింగ్ శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు ఆయుధ పూజ నిర్వహిస్తాం : వీహెచ్పీ సాక్షి, కోల్కతా : దుర్గా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో శాంతికి విఘాతం కల్గిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. దుర్గా నవరాత్రుల సందర్భంగాఘాయుధ పూజకు నిర్వహిస్తామని ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్దళ్ వాటి అనుబంధ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే నిప్పుతో ఆటలాడుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు. దుర్గా నవరాత్రుల సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ముస్లింల పండుగ మెహర్రం కూడా నవరాత్రుల సమయంలో రావడంతో.. ఆమె దుర్గా దేవి విగ్రహాల నిమజ్జన విషయంలో కఠినమైన ఆంక్షలు విధించారు. ఆయుధ పూజ చేసి తీరుతాం : వీహెచ్పీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధ పూజను పశ్చిమ బెంగాల్లో నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. కోల్కతా సహా పశ్చిమ బెంగాల్లోని మొత్తం 300 ప్రాంతాల్లో విజయదశమి, ఆయుధ పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వీహెచ్పీ తెలిపింది. విజయ దశమి అనే పండుగను.. చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటామని వీహెచ్పీ కార్యదర్శి సచీంద్రనాథ్ సిన్హా చెప్పారు. వీహెచ్పీ యూత్వింగ్, భజరంగ్దళ్ మహిళా విభాగమైన దుర్గా భవానీ ఇప్పటికే ఆయుధ పూజ గురించి జిల్లాల్లో ప్రచారం మొదలు పెట్టాయని చెప్పారు. -
రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి మూడు ట్రక్కుల ద్వారా ఎర్రరాళ్లు చేరాయి. రామ మందిరం నిర్మాణం కోసం రాజస్థాన్కు చెందిన భరత్పూర్ సంస్థ ఈ రాళ్లను పంపించినట్లు రామ జన్మభూమి వీహెచ్పీ ప్రతినిధి ప్రకాశ్ కుమార్ గుప్తా తెలిపారు. రామ్సేవక్ పురమ్ వీహెచ్పీ వర్క్పాష్ సమీపంలోని రామ్ జన్మభూమి న్యాస్ ప్రాంతంలో క్రేన్స్ ద్వారా ఈ రాళ్లను దించారు. కాగా రామమందిర నిర్మాణం కోసం కావాల్సిన రాళ్లను ఇక్కడే చెక్కుతున్నారు. అయితే అప్పటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఇటుకల తరలింపుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అటువంటి ఆంక్షలు విధిస్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మందిర నిర్మాణానికి ఇటుకలను సేకరించి పంపాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్న మహంత్ నృత్య గోపాల్ దాస్...రామ్ జన్మభూమి న్యాస్కు నేతృత్వం వహిస్తున్నారు. -
‘వాళ్లు రెండు నరికితే.. మనం 50 తలలు నరకాలి’
-
‘వాళ్లు రెండు నరికితే.. మనం 50 తలలు నరకాలి’
తిరుమల: విశ్వ హిందు పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ సైనికులు మన ఇద్దరు జవాన్ల తలలు తీసుకెళ్లినందుకు బదులుగా.. మనం 50 మంది పాకిస్తాన్ సైనికుల తలలను తెగ నరకాలి. మనదేశంపై పాకిస్తాన్ అప్రకటిత యుద్ధం చేస్తోంది. సైనికులకు మద్దతుగా జై జవాన్.. జై కిసాన్ నినాదం ఇవ్వాల్సిన అవసరం మళ్లీ వచ్చిందని’ ఆయన పేర్కొన్నారు. తిరుమలలో పర్యటిస్తున్న తొగాడియా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ సిబ్బంది ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి సేవలో పాల్గొన్న అంనంతరం రంగనాయకుల మండపం వద్ద శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మన వీర జవాన్లు ఇద్దరి తలల తీసుకెళ్లినందుకు, పాక్ నుంచి 50 మంది సైనికుల తలలు తెగనరికి తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను విడిపించాలని తొగాడియా గత నెలలో అన్నారు. భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు అని గతేడాది ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్పై బాంబు వేసి, ఆయన్ను విడిపించండి
జంషెడ్పూర్: విశ్వ హిందూ పరిషత్ ఫైర్ బ్రాండ్ ప్రవీణ్ తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను విడిపించాలని తొగాడియా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను చూసి భారత్ నేర్చుకోవాలని సూచించారు. శుక్రవారం జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తొగాడియా మాట్లాడుతూ.. ట్రంప్ను ప్రశంసించారు. అఫ్ఘానిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై ట్రంప్ బాంబు వేయించారని చెప్పారు. గూఢచర్యం కేసులో పాక్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్ను విడిపించేందుకు భారత్ కూడా ఇలాంటి దాడి చేయాలని వ్యాఖ్యానించారు. 'వాషింగ్టన్కు 10 వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న అఫ్ఘాన్లోని ఐఎస్ స్థావరాలపై అమెరికా బాంబు వేసింది. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్పై బాంబు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలి. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే భద్రత దళాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులనే ఏరివేయాలి. కశ్మీర్లో పౌరులకు, భద్రత దళాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించాలి' అని తొగాడియా అన్నారు. -
భజే వాయుపుత్రం
– కర్నూలులో వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ కర్నూలు (న్యూసిటీ): వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీని గురువారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జమ్మిచెట్టు నుంచి పూలబజార్, రాజ్విహార్, కొత్తబస్టాండు మీదుగా శ్రీరామ ఆంజనేయస్వామి దేవాలయం వరకు ర్యాలీ కొనసాగింది. హనుమాన్ చిత్ర పటాన్ని పెట్టుకొని జై శ్రీరామ్.. జై హనుమాన్.. అంటూ పెద్ద ఎత్తున వీహెచ్పీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ మందిరాన్ని పార్లమెంట్లో చట్టం చేసి నిర్మించాలన్నారు. వీహెచ్పీ దక్షిణాంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి శ్రీరామోత్సవాల పేరుతో వీరహనుమాన్ విజయయాత్ర ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. రామమందిరం నిర్మాణం కోసం అనేక వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీలు జరిగాయని వీహెచ్పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య అన్నారు. వీహెచ్పీ నగర అధ్యక్షుడు డాక్టర్లక్కిరెడ్డి అమర సింహారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటసాని రాంభూపాల్రెడ్డి, వీహెచ్పీ ప్రాంత నాయకులు సందడి మహేశ్వర్, ప్రాణేష్, నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
'దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్షమించం'
కరీంనగర్ : హిందువుల రక్షణ కోసం వీహెచ్పీ కట్టుబడి ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. భారతదేశం హిందురాజ్యమని, ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారిని క్షమించేది లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. దేశంలో ఎక్కడైనా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
‘రామమందిరం కోసం మళ్లీ కొత్త ఉద్యమం’
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను బీజేపీ స్వాగతించగా విశ్వహిందూ పరిషత్ మాత్రం తాము మరో సమరానికి సిద్ధమని ప్రకటించింది. మరో కొత్త ఉద్యమాన్ని రామాలయ నిర్మాణం కోసం ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా రెండు లక్షల గ్రామాల్లో, ఉత్తరప్రదేశ్లోని 70 వేల గ్రామాల్లో రామ మహోత్సవం నిర్వహిస్తామని కూడా విశ్వహిందూ పరిషత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ జోనల్ అధ్యక్షుడు ఈశ్వరీ ప్రసాద్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాముడు జన్మించిన భూమిలోనే రామమందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రాముడి జీవిత చరిత్రను ప్రజలే చెబుతారని, ఆయోధ్యలో రామమందిరం జరగాల్సిందేననే డిమాండ్ను తాము లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 వరకు రామమహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జల్లికట్టును ఆర్డినెన్స్ రక్షించగా లేనిది.. అదే ఆర్డినెన్స్తో రామమందిరాన్ని ఎందుకు నిర్మించి రక్షించకూడదని ఆయన ప్రశ్నించారు. సంబంధిత మరిన్ని కథనాలకోసం చదవండి.. బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
మోదీ ‘మిషన్’ కోసం 24 లక్షల మంది
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే మద్దతు తెలిపిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇప్పుడు నగదు రహిత మిషన్కు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. అంతేకాదు స్వయంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను కూడా తలకెత్తుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అద్భుత నిర్ణయాలు తీసుకుంటుందని, నగదు రహిత దేశం బాగుంటుందని, ఇందుకోసం తమ వంతుకు ప్రభుత్వానికి సహాయం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. తమ సంస్థలకు మొత్తం 24లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వీరందరిచే దేశమంతటా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతామన్నాయి. ‘నగదు రహిత ఉద్యమం కోసం బజరంగ్ దళ్ త్వరలో 24 లక్షల మందితో మిషన్ ప్రారంభిస్తుంది. ఒక్కొక్కరు పది మందిని కలిసి వారికి ఈ విషయంపై అవగాహన కల్పిస్తారు. దాని వల్ల పొందే ప్రతిఫలాలు కూడా వివరిస్తాయి’ అని విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ చెప్పారు. ప్రజలంతా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి భయపడుతున్నారని, అపోహలన్నీ తొలగించే బాధ్యతలు తీసుకుంటామన్నారు. గురుదక్షిణ కూడా డిజిటల్ రూపంలోనే ఇస్తున్నారని, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుందని వారు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిలో ఓ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ఉంటే అంతా తేలికైపోతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును విజయవంతం చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల బాధ్యత కూడా అని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
20న గురురామ్రతన్జీ రాక
కర్నూలు(న్యూసిటీ): నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద్ధయోగి గురురామ్రతన్జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా సత్సంగం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సాయిబాబా భక్తులు హాజరు కావాలన్నారు. -
హిందువులంతా ఐక్యంగా ఉండాలి
నాగర్కర్నూల్ : హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, పండగల విశిష్టతను తెలియజేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ పట్టణం మార్కెట్ శివాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హిందూ శ్మశానవాటిక కబ్జాకు గురికాకుండా కాపాడాలన్నారు. ఇక్కడి స్థలాన్ని సర్వే చేయించాలన్నారు. దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాంచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
యూరి దాడి ఘటనపై ఆగ్రహజ్వాల
కర్నూలు : యూరి దాడి ఘటన హేయమైన చర్య అని విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్పీ)రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి అన్నారు. భారతసైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్ర పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్షరీఫ్ దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన తెలి పారు. ఈ సందర్భంగా నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రశాంతతను భంగం కలిగించడమే పాకిస్థాన్ లక్ష్యంగా మారిందన్నారు. వీహెచ్పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ మన సైన్యాన్ని ఎదుర్కొవటం చేతగాక దొడ్డిదారిలో పొరుగుదేశం దాడులకు పాల్పడుతుందన్నారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ జేసీ –2 రామస్వామికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టన్న, నగర కార్యదర్శి భానుప్రకాష్, బజరంగ్దళ్ రాష్ట్ర ప్రముఖ్ వేద ప్రకాష్, నగర ప్రముఖ్ రామకృష జిల్లా అధ్యక్షుడు నరసింహుడు పాల్గొన్నారు. -
వీహెచ్పీ నేత హత్య
టీనగర్: హొసూరులో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నేత దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి జిల్లా, హొసూర్ తాలూకా కార్యాలయం వీధికి చెందిన సూరి (40). తమిళనాడు వీహెచ్పీ జిల్లా కార్యదర్శి. ఇతనికి రాధిక అనే భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూరిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల రాజకీయాల్లో నిమగ్నమైన ఈ యన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేబు ల్ బిజినెస్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హొసూర్ నెహ్రూనగర్లో ఇంటి స్థలాలను విక్రయించేందుకు ఒక ప్లాట్ను సిద్ధం చేశారు. ఇందుకోసం అక్కడ ఒక కార్యాలయం ప్రారంభించారు. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి విక్రయాలు జరిపేవారు. సోమవారం ఉదయం ఎప్పటిలా సూరీ నెహ్రూ నగర్ కార్యాలయానికి వెళ్లా రు. అక్కడ పనులు ముగించుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్నేహితులతో ఇంటికి వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చారు. అతని స్నేహితులు వాహనాలు తీసుకునేందుకు వెళ్లగా చీకట్లో పొంచివున్న నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు స్నేహితులకు కత్తులు చూపి బెదిరించి వెళ్లగొట్టారు. ఈ లోపున సూరి వారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అతన్ని వెంటాడిన ముఠా కార్యాలయం సమీపంలోనే అతనిపై దాడి చేసి హతమార్చింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన సూరి స్నేహితులు సూరి ప్రాణంతో వున్నట్లు భావించి వెంటనే హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అయితే సూరి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సూరి హత్యకు గురైన సంఘటన దావానలంలా హొసూరు అంతటా వ్యాపించింది. అక్కడికి వెళ్లిన అడిషనల్ ఎస్పీ రోహిత్ నాథన్ ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ జరిపారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో సూరికి పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. దుకాణాల బంద్: సూరి హత్య కారణంగా హొసూర్ నగరంలో మంగళవారం దుకాణాలు మూసివేశారు. సేలం సర్కిల్ డీఐజీ నాగరాజన్, కృష్ణగిరి ఎస్పీ మహేష్కుమార్ ఆరుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో ఐదు వందల మందికి పైగా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. దీనిగురించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
‘పాక్ పై దండెత్తడానికి ఇదే సరైన సమయం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పేర్కొంది. దాయాది దేశంపై దాడి చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి తెచ్చుకోవాలని వీహెచ్ పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర కుమార్ జైన్ అన్నారు. పాకిస్థాన్ తో యుద్ధానికి పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ పై భారత్ దాడి చేయాలి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. ఇది భారత న్యాయమైన హక్కు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. దీనికి అనుగుణంగా పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించాల’ని జైన్ వ్యాఖ్యానించారు. యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతోందని చెప్పారు. పాకిస్థాన్ ఇప్పుడు ఒంటరైందని, పొరుగుదేశంపై దండెత్తడానికి ఇదే సరైన సమయమన్నారు. -
గో రక్షకులపై వేధింపులు తగదు: వీహెచ్పీ
సుల్తాన్ బజార్: తెలంగాణలో గో రక్షకులపై పోలీసులు అమానుష దాడులకు పాల్పడుతున్నారని వీహెచ్పీ నేతలు ఆరోపించారు. ఆదివారం కోఠిలోని వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి ప్రచార విభాగం సమావేశం నిర్వహించారు. వీహెచ్పీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు, రాష్ట్ర సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రావినూతల శశిధర్, సత్యనారాయణలు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు కొనసాగిన హిందూ వ్యతిరేక పాలన నేడు మళ్లీ 2014 నుంచి కొనసాగుతుందని వారు ఆరోపించారు. ఖాశీం రజ్వీ ఏ విధంగానైతే హిందువులపై బరితెగించి దాడి చేశాడో, అదేరీతిలో ఇప్పటి పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న ఎంఐఎం నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి సూచనల మేరకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. దీనిపై డీజీపీ స్పందించాలని వారు కోరారు. లేనిపక్షంలో డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. చిన్న చిన్న జంతువులను హింసిస్తే, అప్పటికప్పుడు వాలిపోయే జంతు ప్రేమికులు గోహత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రచార ప్రముఖ్లు హాజరయ్యారు. అంతకుముందు భారతమాత విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ ప్రచార విభాగం నాయకులు రాంబాబు, అనిల్యాదవ్, రాధాకష్ణ,రాజేందర్, కృష్ణ, ధీరజ్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. -
రామమందిరంపై వీహెచ్పీ కొత్త ప్రకటన
పాట్నా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ)నేత ప్రవీణ్ తొగాడియా భారీ ప్రభావం పడే ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి వీహెచ్పీ ఎలాంటి ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం చేయాలని అనుకోవడం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు వరకు తాము అలాంటి ప్రతిపాదనతో ఏ కార్యక్రమం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే, రామ మందిరం నిర్మాణం విషయంలో వీహెచ్పీ కట్టుబడి ఉందని అన్నారు. 'అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఇది రూఢి అయిన వాస్తవం' అని ఆయన మంగళవారం పాట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అదే సమయంలో బిహార్లో మద్యం నిషేధాన్ని అమలు జరుపుతుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, రామమందిరం అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తే ముస్లిం ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలోనే తొగాడియా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేసినట్లుందని పలువురు రాజకీయ మేథావులు అంటున్నారు. -
'తన్నండి కానీ.. ఎముకలు విరగ్గొట్టొద్దు'
మీరట్: తమ సంస్థకు చెందిన యువ గో సంరక్షకులకు విశ్వహిందూ పరిషత్ మరో సలహా చెప్పింది. గోవులను అక్రమంగా తరలించేవారిని, హింసించేవారిని కొట్టండి అయితే, వారి ఎముకలు మాత్రం విరగ్గొట్టద్దు అంటూ మరో వివాదాస్పద సలహాను ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా విశ్వహిందూపరిషత్ కు చెందిన వారే. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్చంద్ మాట్లాడుతూ 'గోవులను స్మగ్లింగ్ చేసేవారిని కొట్టండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టద్దు. విశ్వహిందూపరిషత్కు చెందినవారు, చెందని వారు ఈ విధంగా ముందుకు వెళితే ఏ ఒక్కరూ ఆవులను తరలించేందుకు సాహసం చేయలేరు. కనీసం అలాంటివారు ఎదురుపడలేరు. ఆవుల సంరక్షణ అంటే మేక్ ఇన్ ఇండియా కాదని.. దేశాన్ని రక్షించుకోవడం' అని చెప్పారు. 'ఈ మధ్య ప్రధాని మోదీ గో సంరక్షణపై చాలా మాట్లాడారు. ఆయన చెప్పిన చాలా అంశాలతో నేను అంగీకరించను. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరిస్తా. ఏ ఒక్కరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ విషయం నేను తరుచుగా చెబుతూనే ఉన్నాను. అందుకే స్మగ్లర్లను తన్నండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టొద్దు. ఎందుకంటే పోలీసులతో కేసులై సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇక మోదీ మాటలతో నేను విభేదించకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు భారత్ను బంగారు పక్షి అనేవారు. నాడు ఎలాంటి పరిశ్రమలు లేవు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఆ రోజుల్లో భారత్ కు బంగారు పక్షి అని పేరు వచ్చిందా? మొత్తం భారత్ను ఆ రోజుల్లో కాపాడింది గోవులే. గో సంరక్షకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో వారు వీరమరణం కూడా పొందుతున్నారు' అని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో గో సంరక్షణ పేరిట దళితులపై, ముస్లింలపై దాడులు ఎక్కువవుతున్నాయని కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
గోసంరక్షణ పేరుతో దాడులు తగవు
పాలకొల్లు అర్బన్ : గో సంరక్షణ పేరుతో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కార్యకర్తలు దళితులపై చేస్తున్న దాడులు వెంటనే విరమించుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ కోరారు. ఆదివారం స్థానిక లజపతిరాయపేటలో విలేకరులతో మాట్లాడుతూ గో చర్మంతో తయారుచేసిన పాదరక్షలను వినియోగించడం పాపం కాదా అని ప్రశ్నించారు. పాదరక్షలు తయారుచేసే పలు కార్పొరేట్ కంపెనీలు ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నాయకులవే అన్నారు. గోసంరక్షణ కార్యకర్తలు తక్షణం లెదర్ పాదర„ý లు మానాలని సూచించారు. ప్రతి గోసంరక్షణ కార్యకర్త రోడ్లపై తిరుగుతున్న గోవులను దత్తత తీసుకుని సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వి ప్పర్తి ప్రభాకరరావు, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, నాయకులు పార్శి వెంకటరత్నం, నల్లి జయరాజు, తోటె సుందరం తదితరులు పా ల్గొన్నారు. -
సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్షాప్లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్షాప్లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్షాప్లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్షాప్లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీహెచ్పీ ఆవిర్భావ వేడుకలు
మక్తల్ : విశ్వహిందూ పరిషత్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతకు పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. వాసవీమాత దేవాలయం లో ఓంకార ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీకష్ణ జన్మాష్టమి రోజున వీహెచ్పీ దినోత్సవం ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు భీంరెడ్డి, కె.సత్యనారాయణ, హన్మంతు, రాంమోహన్, బాబు, ఈసరినాగప్ప, భాస్కర్రెడ్డి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకలో షాకింగ్ ఘటన!
ఉడిపి: ఆవులు తరలిస్తున్నారని ఓ బీజేపీ కార్యకర్తను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), బజరంగ్ దళ్ శ్రేణులు అతి కిరాతకంగా కొట్టిచంపారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ పూజారి రెండు ఆవులను టెంపో వాహనంలో తరలిస్తూ వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలకు చిక్కాడు. ఉడిపిలోని హెబ్రీ ప్రాంతంలో అతని వాహనంపై దాదాపు 20మంది దాడి చేశారు. వారి వద్ద పదునైన ఆయుధాలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ప్రవీణ్ పూజారీ చనిపోయాడని ఉడిపి ఎస్పీ కేపీ బాలకృష్ణన్ తెలిపారు. ఈ కేసులో 17మందిని అరెస్టు చేశామని వివరించారు. తన మిత్రుడు అక్షయ్తో కలిసి ప్రవీణ్ టెంపోలో ఆవులు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. -
‘హిందువులను మోదీ అవమానించారు’
న్యూఢిల్లీ: గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. వీహెచ్పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు. -
ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
గన్నవరం : విజయవాడలో కూల్చివేసిన దేవాలయలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని, హామీని నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విశ్వహిందూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎస్ నాయుడు, అఖిల భారత సంయుక్త కార్యదర్శి గరిమెళ్ల సత్యం పిలుపునిచ్చారు. కేసరపల్లి శివారు శ్రీభువనేశ్వరి పీఠంలో మంగళవారం పీఠాధిపతులు సత్యానంద భారతీ స్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. నాయుడు, సత్యం మాట్లాడుతూ ఆలయాలు, సేవా కేంద్రాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. త్రేతాయుగం నాటి సీతమ్మవారి పాదాలను కూడా తొలగించడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని చెప్పారు. మరో 90 ఆలయాలను కూడా కూల్చివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పుష్కరాలలోగా ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని, లేకుంటే మహా ఉద్యమ రూపంలో హిందూ శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. పుష్కరాల్లో 500 మందితో సేవలు రానున్న కృష్ణా పుష్కరాల్లో వీహెచ్పీకి చెందిన 500మంది కార్యకర్తలతో సేవలందించనున్నామని చెప్పారు. పుష్కరాల్లో రోజుకు ఐదు వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. వీహెచ్పీతో పాటు శివస్వామి ఆశ్రమ భక్తులు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని వివరించారు. -
కబేళాకు గోవుల తరలింపు
వీహెచ్పీ, భజరంగ్దళ్ ఫిర్యాదుతో కేసు కరీంనగర్ గోశాలకు తరలింపు చొప్పదండి : అనుమతి లేకుండా కబేళాకు తరలిస్తున్న పది ఆవులను మండల కేంద్రంలో మంగళవారం భజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమ ందించడంతో ఎస్ఐ రవీందర్ కేసు నమోదు చేశారు. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో మంగళవారం జరిగిన పశువుల సంతలో ఐదు పెద్ద ఆవులు, ఐదు చిన్న ఆవులను కొని ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా చొప్పదండిలో భజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులు అడ్డుకొని ఆటో డ్రైవర్ను ప్రశ్నించారు. ఎండీ మోయిన్ ఆవులను కబేళాకు తరిలిస్తున్నట్లు తెలుసుకున్న నాయకులు ఎస్ఐ రవీందర్కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి అనంతరం వాటిని కరీంనగర్ గోసంరక్షణ శాలకు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందిగా ఆమలు చేయాలని వీహెచ్పీ మండల అధ్యక్షుడు పడకంటి క్రిష్ణ, గోరక్షక్ కాపర్తి మల్లికార్జున్, భజరంగ్దళ్ ప్రముఖ్ బత్తిని మురళీ, నలుమాచు రామక్రిష్ణ, పొన్నాల తిరుపతి, మావురం జగన్, సాయిగణేశ్, విజయ్, దుర్గా ప్రసాద్ కోరారు. -
ఆజాద్ అడుగుజాడల్లో పయనిద్దాం
ఉడిత్యాల (బాలానగర్) : చంద్రశేఖర్ ఆజాద్ అడుగుజాడల్లో పయనించేందుకు యువత కషిచేయాలని వీహెచ్పీ నాయకుడు హెద్దె నాగేశ్వర్రావు అన్నారు. శనివారం బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో ఏర్పాటుచేసిన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోహత్య ఎంతో పాపమని భరతమాతను పూజించాలన్నారు. బీజే పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఉగ్రవాద శక్తులు జిహాద్ పేరుతో దేశంలో అల్లకల్లోలు సష్టిస్తున్నాయని ఆరోపించారు. మతఛాందసవాదులను తిప్పికొట్టాలన్నారు. అనంతరం యువకులు ఎస్వీస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన, ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిర్మలాలక్ష్మీనారాయణ, వీహెచ్పీ నాయకులు దుష్యంత్రెడ్డి, శరణయ్య, నర్సింలు, బండారి రమేష్, జ్ఞానందగిరిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సాధ్వీ ప్రాచీపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీపై కేసు నమోదు అయింది. ముస్లిం ముక్త్ భారత్'కు ఇదే తరుణమంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రాచీ వ్యాఖ్యలపై బహుజన్ ముక్తి మోర్చ కార్యకర్త సందీప్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు సాధ్వీ ప్రాచీపై ఐపీసీ సెక్షన్ 153 ఏ, ఐపీసీ 153బీ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సంజయ్ పాండే తెలిపారు. కాంగ్రెస్ ముక్త్ భారత్' మిషన్ దాదాపు పూర్తి కావచ్చిందని, 'మస్లిం ముక్త్ భారత్'కు సమయం ఆసన్నమైందని ఈ నెల 7న రూర్కీలో ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలోనూ పలుసార్లు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఖాన్ల సినిమాలు బాయ్కాట్ చేయాలని, ముస్లిం విద్యా సంస్థలపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. -
చావైనా.. బతుకైనా అతడితోనే..
► భర్త ఇంటి ముందు యువతి మౌనపోరాటం ► విజయవాడ నుంచి వచ్చి ఆందోళనకు దిగిన దివ్యాంగురాలు ► బాధితురాలికి అండగా నిలిచిన మిగిలిన దివ్యాంగులు దర్శి : పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేశాక భర్త పట్టించుకోక పోవడంతో ఓ యువతి తీవ్ర ఆవైదనకు గురై తన అత్తగారి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాలు.. విజయవాడ భవానీపురానికి చెందిన నర్రా మాధ వి మూడేళ్ల క్రితం మండల పరిధిలోని తూర్పుచౌటపాలెంలోని బంధువుల వివాహానికి వచ్చింది. అక్కడ మరో సామాజిక వర్గానికి చెందిన కుడి మెల చంద్రబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో చంద్రబాబు విశాఖపట్నంలో చదువుతున్నాడు. 2013 మే 19వ తేదీన ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా విజయవాడ సమీపంలోని గుణదలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయాన్ని చంద్రబాబు చాలాకాలం వరకు తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. విశాఖపట్నంలో చదువుకుంటూ పది రోజులకు ఒకసారి విజయవాడలోని తన భార్య మాధవి ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఆమెను మూడుసార్లు గర్భిణిని చేసి అబార్షన్ కూడా చేయించాడు. పెళ్లి విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని, ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తానని భార్యను నమ్మించాడు. రెండేళ్ల అనంతరం విషయం చంద్రబాబు ఇంట్లో తెలిసింది. కుమారునికి మరో సంబంధం చూస్తున్నారు. అప్పటి నుంచి మాధవితో ఆమె భర్త సరిగా మాట్లాడటం లేదు. ఆమె ఫిర్యాదు మేరకు 2015 అక్టోబర్ 31వ తేదీన దర్శి పోలీసుస్టేషన్లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కాపురానికి పంపారు. విజయవాడలో వేరు కాపురం కూడా పెట్టారు. మళ్లీ కుక్కతోక వంకరే మూడు నెలల కాపురం అనంతరం మళ్లీ భార్యను వదిలి ఇంటికి వచ్చేశాడు. భార్యతో ఫోన్లో కూడా మాట్లాడేందుకు నిరాకరించాడు. బుధవారం రాత్రి బాధితురాలు తన భర్త చంద్రబాబు ఇంటికి వెళ్లింది. భార్యను ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయట గేటు వేశారు. రాత్రంతా ఇంటి బయటే మెట్లపై కూర్చొంది. బాధితురాలికి వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్, జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, జాతీయ వర్కింగ్ అధ్యక్షురాలు కొల్లి మాధవీలత మద్దతుగా నిలిచారు. దివ్యాంగురాలిని వేధించడం అన్యాయం బాధితురాలికి అండగా నిలిచిన వీహెచ్పీఎస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగురాలిని కించపరిచి మోసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాధవికి న్యాయం చేయాల్సిందేనని కోరారు. తన భర్త వచ్చే వరకూ ఇక్కడే కూర్చొంటానని బాధితురాలు తేల్చి చెప్తోంది. గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చారు. బాధితురాలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వనట్లు తెలిసింది. -
'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం'
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా చీర్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయిస్తే మ్యాచ్ లు అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరించింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్డేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్పీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహణలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంపై వీహెచ్పీ ఆగ్రహంగా ఉండటమే ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది. -
డీఎస్పీ కార్యాలయంలో భజరంగ్ దళ్ ఆందోళన
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం వీహెచ్పీ, భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా గొడవకు దిగిన కార్యకర్తలపై మీర్పేట్ పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందులో ఒక యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్పీ, భజరంగ్దళ్ కార్యకర్తలు డీఎస్పీని డిమాండ్ చేశారు. -
అందరూ భారత్ మాతాకీ జై అనాల్సిందే..
వీహెచ్పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్జైన్ హైదరాబాద్ : దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ భారత్మాతాకీ జై, గోమాతాకీ జై అనాల్సిందేనని, అలా అననివారు దేశం నుండి వెళ్లిపోవాల్సిందేనని వీహెచ్పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్జైన్ అన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం కోఠి వద్ద జరిగిన హనుమాన్ శోభాయాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశంలో అన్ని వర్గాలవారికి, అన్ని మతాలవారికి సమానహక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ భారతమాతను గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల క్రితం భజరంగ్దళ్,వీహెచ్పీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హనుమాన్ జయంతి శోభాయాత్ర నేడు దేశంలోని ప్రతి నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీసు ల తీరు దారుణంగా ఉందని భజరంగ్దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై. భానుప్రకాష్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, భజరంగ్దళ్, వీహెచ్పీ నేతలు గోవింద్రాఠి, యమన్సింగ్, విమల్దాల్మియా, భరత్వంశీ, సత్యనారాయణ, రమేష్, వీరేశలింగం, లక్ష్మణ్రావు, గిరిధర్, ప్రకాష్ గిరి, అనిల్, కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సెక్యులరిజం పేరిట దేశాన్ని చీల్చే కుట్ర’
హైదరాబాద్ : భారతదేశంలో జీవించాలంటే భారత్ మాతాకీ జై అనాల్సిందేనని వీహెచ్పీ రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి ఆకారపు కేశవరాజు అన్నారు. సోమవారం కోఠిలోని వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛ ముసుగులో భారత్కు విద్రోహం అనే అంశంపై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా కేశవరాజు మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేసేం దుకు సెక్యులరిజం పేరిట కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తలతీసేసినా భారత్ మాతాకీ జై అనను అని నినదించిన హైదరాబాద్ ఎంపీ అసద్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంఐఎం నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుం టే.. తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీహెచ్పీ ప్రచార ప్రముఖ్ హెబ్బార్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఏ దేశ పౌరుడైనా ఆ దేశాన్ని ప్రే మించాలి తప్ప ద్వేషించడం తగదన్నా రు. కార్యక్రమంలో ప్రాంత సహప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, అనిల్కుమార్ పాల్గొన్నారు. -
‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’
మాజీ మావోయిస్టు తల్లి వేడుకోలు... పలాస : కొన్నేళ్లుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న తన కుమారుడు దున్న కేశవరావు విడుదలకు ఆంధ్రా పోలీసులు సహకరించాలని మందస మండలం బొడ్డులూరు గ్రామానికి చెందిన దున్న కాములమ్మ వేడుకొంది. ఈ మేరకు కాశీబుగ్గలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకొని అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావుతో మాట్లాడి కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు చూపించి తిరిగి ఒడిశా పోలీసులకు అప్పగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తప్పుడు కేసు పెడుతూ జైలులో హింసిస్తున్నారని, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ప్రస్తుతం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు తన కుమారుడుని తనకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని నా బిడ్డకు సరెండర్ చేయిస్తే చివరకు నాకు దూరం చేశారని, తన కుమారుడిని చూసేందుకు ఒడిశా వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తన బిడ్డ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే తన కుటుంబం మొత్తం చనిపోవాల్సి ఉంటుందని, అందుకు ప్రజాప్రతినిధులు, ఆంధ్రా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు జోక్యం చేసుకొని తన బిడ్డను ఇంటికి పంపించాలని కోరారు. -
శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయలేం
♦ ఇక్కడ పుట్టినవారంతా మా సోదరులే.. ♦ వీహెచ్పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా కరీంనగర్ కల్చరల్: భారతదేశంలో ఉంటూ శత్రువు కావాలని వారికుంటే ఏమీ చేయలేమని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్భాయి తొగాడియా అన్నారు. వీహెచ్పీ, భజరంగ్దళ్ కార్యకర్తల శిక్షణకు ఆదివారం హాజరైన ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారతమాతాకీ జై అంటే వారు తమ వారేనని, భారతదేశం అంటే ఇష్టంలే ని వారికి ఈ దేశంలో స్థానం లేదన్నారు. ఇక్కడ పుట్టిన వారు తమ సోదరులేనని, భాయి భాయి అంటూనే శత్రువుగా తయారుకావాలని చూస్తుంటే ఏం చేసేది లేదని, వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిం చారు. రానున్న వందేళ్లలో హిందూ దేశంలోనే హిం దువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రభాతసేవలో ప్రవీణ్ తొగాడియా వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్టు సభ్యుడు జి. భానుప్రకాష్రెడ్డి ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
ముస్లిం ఉన్నతాధికారికి ఒవైసీ సెగ
బెంగళూరు: ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ భరతమాత వ్యాఖ్యల వివాదం కర్ణాటకలో ఓ ముస్లిం ఉన్నత ఉద్యోగిని చుట్టుకుంది. పుత్తూరు లోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ఎబి ఇబ్రహీం ఈ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హిందూ దేవాలయ ఉత్సవాల్లో ఆ ముస్లిం అధికారి పేరు ఉండానికి వీల్లేదంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళితే ఆలయ ఉత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో ముస్లిం అధికారి ఏబీ ఇబ్రహీం పేరు ఉండడంపై వీహెచ్పీ, భజరంగ దళ్ అభ్యంతరం తెలిపింది. ఉత్సవాల్లో ఆయన పేరును తొలగించాలని స్థానిక విశ్వ హిందూపరిషత్ , భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేసింది. కొత్త కార్డులు ముద్రించాలని పట్టుబట్టింది. అయితే ఇబ్రహీంకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యా శాఖ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. మతమూఢుల కోసం ప్రభుత్వ నియమాలు మారవని స్పష్టం చేశారు. అటు ఈ అంశంపై ఇబ్రహీం స్పందిస్తూ తన పరిధిలో ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా దేవాలయ అభివృద్ధి కోసం చాలా చేశానన్నారు. కాగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాలనా అధికారి ఇలాంటి ఇబ్బందులు కావడం మొదటిసారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వందల మంది ముస్లిమేతర ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి మతపరమైన వివక్ష ఎదురు కాలేదన్నారు. -
షారుఖ్ షూటింగ్కు 'అసహన' సెగ!
భుజ్ (గుజరాత్): దేశంలో మత అసహనంపై బాలీవుడ్ సూపర్ష్టార్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఆయన తాజా సినిమా షూటింగ్ను అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రయత్నించింది. గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో జరుగుతున్న షారుఖ్ సినిమా 'రాయిస్' షూటింగ్ వద్ద వీహెచ్పీ కార్యకర్తలు బుధవారం ఆందోళన నిర్వహించారు. గత ఏడాది నవంబర్లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో తీవ్ర మత అసహనం ఉందని షారుఖ్ వ్యాఖ్యలు చేశాడు. 'మత అసహనం కలిగి ఉండటం, లౌకికంగా వ్యవహరించకపోవడం దేశంలో తీవ్రమైన నేరమే' అని ఆయన పేర్కొన్నాడు. షారుఖ్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వెనుకకు తగ్గారు. భారత్ అసహన దేశమని తాను ఎన్నడూ అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షారుఖ్ సినిమా షూటింగ్కు భుజ్ పట్టణంలో అనుమతి ఇవ్వవద్దంటూ గతకొన్ని రోజులుగా వీహెచ్పీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించిన ఆందోళనకారులు.. అక్కడి నుంచి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరారు. వారిని దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకొని చెల్లాచెదురు చేశారని స్థానిక ఎస్సై ఎంబీ పర్మార్ తెలిపారు. -
'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ'
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత రామరాజు ఖండించారు. ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ లాంటిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న పదవుల కోసం మజ్లిస్.. టీఆర్ఎస్ తో జత కడుతోందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా మంగళవారం పాతబస్తీలో పలు చోట్ల మజ్లిస్ నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగారు. అధికార, విపక్ష అభ్యర్థులను భయపెట్టారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై మలక్పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. -
ప్రతి గ్రామంలో రామాలయం
దేశవ్యాప్తంగా నిర్మిస్తామన్న వీహెచ్పీ లక్నో/మీరట్: దేశంలోని ప్రతి గ్రామంలో రామాలయాన్ని నిర్మిస్తామని వీహెచ్పీ ప్రకటించింది. అయోధ్యలో రామాలయ అంశం కోర్టులో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా అయోధ్యలో నిర్మాణం మొదలవుతుందని.. అయితే అది అందరి ఏకాభిప్రాయం, కోర్టు అనుమతితోనే జరుగుతుందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇటీవలే వ్యాఖ్యానించారు కూడా. తాజాగా సోమవారం ఈ అంశంపై వీహెచ్పీ ప్రతినిధి శరద్ శర్మ లక్నోలో, మరో నేత సాధ్వీ ప్రాచి మీరట్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 25వేల గ్రామాల్లో రామాలయాలు నిర్మించాలని వీహెచ్పీ నిర్ణయించినట్లు శర్మ చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమి నుంచి వారం రోజులపాటు రామ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొన్నేళ్లుగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 75 వేల గ్రామాలకు దీనిని తమ సంస్థ చేరవేసిందని చెప్పారు. ఈసారి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వీటిని నిర్వహిస్తామని తెలిపారు. -
'దేశ వ్యాప్తంగా రామమందిరాలు నిర్మిస్తాం'
లక్నో: ఉత్తరప్రదేశ్లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంపట్ల అసంతృప్తితో ఉన్న వీహెచ్పీ దేశ వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో రామమందిరాన్ని నిర్మించాలని తాము నిర్ణయించినట్లు వీహెచ్ పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. రామ మహోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 15న శ్రీరామ నవమితో ప్రారంభిస్తామని ఏడు రోజులపాటు ఈ ఉత్సవం కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో హిందువులు శ్రీరాముడిని కొలుస్తారని చెప్పారు. ఇలా చేసే గ్రామాల సంఖ్య 1.25లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గతంలో దాదాపు య75 వేల గ్రామాల్లో రామనవమి మహోత్సవాలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చి ప్రాదాన్యం సంతరించుకుంది. -
అశోక్ సింఘాల్ కన్నుమూత
గుర్గావ్లోని ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస ♦ రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక ♦ ఆరెస్సెస్, వీహెచ్పీల్లో వివిధ హోదాల్లో విధులు ♦ సింఘాల్ మృతి వ్యక్తిగతంగా తీరని లోటన్న ప్రధాని మోదీ గుర్గావ్: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) సీనియర్ నేత, రామజన్మభూమి ఉద్యమ సారథి అశోక్ సింఘాల్ కన్ను మూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధ పడుతున్న సింఘాల్(89) మంగళవారం మధ్యాహ్నం 2.24 గంటలకు స్థానిక మెడాంట మెడిసిటీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రఇబ్బంది, ఇతర సమస్యలతో నవంబర్ 14న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కృత్రిమ శ్వాసపైననే ఉన్నారు. గుండె రక్త నాళాల వైఫల్యం, రక్తం విషపూరితం అవడమనే సమస్యల వల్ల సింఘాల్ మృతి చెందారని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. సింఘాల్ మృతదేహాన్ని ఢిల్లీలోని జండేవాలన్లో ఉన్న ఆరెస్సెస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్ధం బుధవారం మధ్యాహ్నం 3 గం. వరకు సింఘాల్ మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని, అనంతరం నిగంబోధ్ స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తొగాడియా వెల్లడించారు. 1980 దశకం చివర్లలో ప్రారంభమైన రామజన్మభూమి ఉద్యమాన్ని దేశ, విదేశాల్లో విస్తృతం చేయడంలో అశోక్ సింఘాల్ది కీలక పాత్ర. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ‘కరసేవ’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి కోసం వీహెచ్పీ చేపట్టిన ప్రచారానికి విదేశాల నుంచి నిధులు సేకరించడంలో సింఘాల్ కృషి గణనీయమైనది. వ్యక్తి కాదు.. వ్యవస్థ: మోదీ అశోక్ సింఘాల్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. దేశసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అశోక్ సింఘాల్ ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని అభివర్ణించారు. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వెనుక చోదక శక్తి సింఘాలేనని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. సింఘాల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలిపారు. సింఘాల్ మృతి తననెంతో బాధకు గురి చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితం ఆయనను ఒక వ్యవస్థగా మార్చిందన్నారు. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్, రాజస్తాన్ బీజేపీ నేతలు, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్.. తదితరులు సింఘాల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్ను అజాత శత్రువుగా అభివర్ణించిన కళ్యాణ్ సింగ్.. ఆయన మృతి సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. బ్రహ్మచారి.. హిందూత్వ యోధుడు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 1926 అక్టోబర్ 2న అశోక్ సింఘాల్ జన్మించారు. చిన్నతనం నుంచే హిందూత్వ విశ్వాసాలున్న సింఘాల్ 1942లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మెటలర్జీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆరెస్సెస్లో పూర్తిస్థాయి ప్రచారక్గా పనిచేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ, హర్యానాలకు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ అయ్యారు. 1980లో సంఘ్ పరివార్లో భాగమైన విశ్వహిందూ పరిషత్లో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 1984లో వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడై డిసెంబర్ 2011 వరకు ఆ హోదాలో పనిచేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం లక్ష్యంగా సాగించిన రామ జన్మభూమి ఉద్యమాన్ని అన్నీ తానై నడిపించిన సింఘాల్.. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సింఘాల్ మృతికి రాష్ట్ర బీజేపీ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్సింఘాల్ మృతికి బీజేపీ రాష్ట్ర నేతలు సంతాపాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ సానుభూతిని, దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.