హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, పండగల విశిష్టతను తెలియజేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ పట్టణం మార్కెట్ శివాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.
హిందువులంతా ఐక్యంగా ఉండాలి
Published Sun, Sep 25 2016 12:29 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
నాగర్కర్నూల్ : హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, పండగల విశిష్టతను తెలియజేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ పట్టణం మార్కెట్ శివాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హిందూ శ్మశానవాటిక కబ్జాకు గురికాకుండా కాపాడాలన్నారు.
ఇక్కడి స్థలాన్ని సర్వే చేయించాలన్నారు. దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాంచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement