‘జల్‌’ఫోన్‌..! | cell phone useful to srtart motor | Sakshi
Sakshi News home page

‘జల్‌’ఫోన్‌..!

Published Thu, Sep 22 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

స్టార్టర్‌కు ఆనుసంధానం చేసిన కిసాన్‌రాజా కంట్రోలర్‌,  పైపునుంచి వస్తున్న జలధారను చూస్తున్న రైతులు

స్టార్టర్‌కు ఆనుసంధానం చేసిన కిసాన్‌రాజా కంట్రోలర్‌, పైపునుంచి వస్తున్న జలధారను చూస్తున్న రైతులు

ఇంట్లో కూర్చొని..మొబైల్‌ ఫోన్‌లో మీటా నొక్కితే..టిక్కెట్ల బుకింగ్‌, బ్యాంక్‌సేవలు, ఆన్‌లైన్‌ సౌకర్యాలే కాదు..ఇకపై చేలకాడ ఉన్న కరెంట్‌ మోటార్లను కూడా నడిపించొచ్చంట.

  • మొబైల్‌తో రింగిస్తే నడిచే విద్యుత్‌ మోటార్‌
  • సత్తుపల్లిలో ఆసక్తిగా పరిశీలించిన రైతాంగం
  •  
    సత్తుపల్లి:  ఇంట్లో కూర్చొని..మొబైల్‌ ఫోన్‌లో మీటా నొక్కితే..టిక్కెట్ల బుకింగ్‌, బ్యాంక్‌సేవలు, ఆన్‌లైన్‌ సౌకర్యాలే కాదు..ఇకపై చేలకాడ ఉన్న కరెంట్‌ మోటార్లను కూడా నడిపించొచ్చంట. సత్తుపల్లిలో మోటార్‌కు ప్రత్యేక పరికరం అమర్చి..సెల్‌ఫోన్‌తో రింగిచ్చి దానిని ఆన్‌చేసే విధానం వివరించారు. హైదరాబాద్‌ నుంచి తెప్పించిన ఈ పరికరాన్ని జేడీఈ కె.జీవన్‌కుమార్‌ పరీక్షించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ‘మొబైల్‌ మోటార్‌’ విశేషాలేంటంటే.. 
    హైదరాబాద్‌కు చెందిన విన్ఫినెట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కిసాన్‌రాజా పేరుతో మొబైల్‌ మోటార్‌ కంట్రోలర్‌ను రూపొందించింది. సత్తుపల్లి విద్యుత్‌శాఖ ఏడీఈ కె.జీవన్‌కుమార్‌కు స్నేహితులైన ఈ సంస్థ నిర్వాహకులు దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డి గురువారం ఇక్కడికి తెచ్చారు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ విద్యుత్‌ మోటారుకు అనుసంధానం చేసి డెమో చేయగా రైతులు ఆసక్తిగా తిలకించారు. కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏడీఈ జీవన్‌కుమార్‌, ఏఈలు ప్రభాకర్‌, అంకారావు, పైడయ్య, సుబ్రమణ్యం, సర్పంచ్‌ మందపాటి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, రైతులు పాల్గొన్నారు. 
    • మోటార్‌ వద్ద సిమ్‌ పెట్టే..
    • రింగిస్తే నీళ్లు పోసే..
    - విద్యుత్‌ మోటర్‌కు కిసాన్‌రాజా పరికరాన్ని అమర్చారు. 
    - అందులో సిమ్‌ను పెట్టి దానికి అనుసంధానంగా సంబంధిత రైతు సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేశారు. 
    - ఆ తర్వాత సెల్‌ఫోన్‌తో ఆ నంబర్‌కు రింగివ్వగా..వెంటనే విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ అయి నీళ్లు పోసింది. 
    - విద్యుత్‌ ఓల్టేజీ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, విద్యుత్‌ తీగలు తెగినప్పుడు, బోరులో నీళ్లు మోటారుకు అందనప్పుడు సెల్‌కు మెసేజ్‌ వస్తుంది. 
    - తద్వారా మోటారు కాలిపోకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. 
    - విద్యుత్‌ సరఫరా ఉందా.. లేదా..? మోటారు నడుస్తుందా.. లేదా..? అనే సమాచారం కూడా సెల్‌కు మెసేజ్‌ రానుంది. 
    - మోటార్లు, స్టార్టర్ల దొంగతనం జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఎస్‌ఎంఎస్‌ రైతు మొబైల్‌కు వస్తుంది. 
    - ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2500 విద్యుత్‌మోటార్లకు ఈ సిమ్‌ సిస్టం అమర్చినట్లు కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement