మెదక్: చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్కు చెందిన శాంతారాం, అశోక్, గణేష్ ముగ్గురు జల్సాలకు అలవాటుపడి... వారు చోరీల బాట పట్టారు.
ఆ క్రమంలో బెజ్జంకి, చిన్నకొండూరు, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోభాగంగా బుధవారం వారిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.