కరీంనగర్: ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీస్ అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. శనివారం జారీ చేసిన ఈ నోటీసులలో ఏఎస్పీ జనార్ధన్ రెడ్డితో పాటు మరో 30 మంది పేర్లను పేర్కొంది. ముగ్గురు డీఎస్పీలు బుచ్చి రాములు, భాస్కర్ రాజు, సాయి మనోహర్లకు, సీఐలు ప్రకాశ్, మల్లయ్యలకు నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.