Published
Fri, Sep 23 2016 11:31 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు
సూర్యాపేట : పట్టణంలోని రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. లేదా అని కీ రిజిస్టర్ను పరిశీలించారు. అలాగే స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. దాడుల్లో కోదాడ, హుజూర్నగర్ డీటీసీఎస్లు ఏవీ రమణారావు, చంద్రశేఖర్, సురేష్, ఆర్ఐసీఎస్ అల్లావుద్దిన్, వెంకట్ తదితరులు ఉన్నారు.