suryapeta
-
దసరా పండుగ ఉత్సవాల్లో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం
సాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్పై చిలుకూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు -
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
-
వంద రోజుల్లో తెలంగాణ అస్తవ్యస్తమైంది: కేసీఆర్
సాక్షి,సూర్యాపేట: కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్’ అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ‘రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థత, తెలివితక్కువతనమే ఈ పరిస్థితికి కారణం. రైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునేవాడు దిక్కులేడు. ఎండిపోయిన పంటలపై నివేదిక తెప్పించుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఊరుకోదు. వెంట పడతాం. మెడలు వంచుతాం. ఒకరిద్దరని గుంజుకుని చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎండిన పంటలకుగాను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలు ఓపిక పట్టి నాలుగో నెలలో మాట్లాడుతున్నాం. వాగ్దానాలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు రూ.500 బోనస్, రుణమాఫీ ఇతర హామీలపై దీక్షలు, ధర్నాలు చేస్తాం. నీళ్లిస్తామంటే నమ్మి పంటలు వేశామని రైతులు పొలంబాటలో నాతో చెప్పారు.రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మా హయాంలో నీరు,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం చేశాం. కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా అమలు చేశాం. 2014లో 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండకపోయేది. కానీ ఆ తర్వాత మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాం. త తక్కువ కాలంలో రైతులు బాధపడతారు అనుకోలేదు.జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించాం. కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు.నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదు.ముందే తెలిస్తే ఓట్లు వెయ్యకపోయే వాళ్లమంటున్నారు. రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు చేయటం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రాజకీయనాయకులు రాష్ట్రం మేలు కాంక్షించాలి. రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. హైదరాబాద్లో నీటి కటకట ప్రారంభం అయ్యింది. నీటి ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి హైదరాబాద్ ప్రజలకు వచ్చింది. మా హయాంలో తెలంగాణలో బిందె పట్టుకున్న ఆడబిడ్డ కనిపించలేదు. ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మళ్లీ స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోతుంది కానీ తెలంగాణ లో పోదు అనే స్థాయికి తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీనికి స్పందించిన కేసీఆర్ కరెంటు ఇట్లా వస్తూ పోతుందన్నారు. ఇదీ చదవండి.. జనగామలో పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ -
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి vs ఎమ్మెల్యే సైదిరెడ్డి
-
సూర్యాపేట : మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేస్తూ పట్టుబడ్డ ప్రభుత్వ వైద్యుడు
-
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రి జగదీశ్రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి
సాక్షి,హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సెప్టెంబరు చివరికల్లా రోడ్డు పనులు పూర్తికానుండటంతో వెంటనే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గిపోనుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు నాలుగు వరుసల రోడ్డు అందుబాటులో ఉండగా, సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య ఇంతకాలం రెండు వరుసల రోడ్డే ఉండేది. రోడ్డు కూడా బాగా దెబ్బతినిపోవడంతో ప్రయాణ సమయం బాగా పెరుగుతూ, తరచూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో దీన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించిన కేంద్రం 2019లో ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో మూడు నెలల అదనపు సమయాన్ని నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఫలితంగా సెప్టెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 58.63 కిలోమీటర్లకు ఇప్పటికే 49.55 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. (క్లిక్: బ్లాక్ ఫిల్మ్లు, నంబర్ ప్లేట్లపై నజర్.. స్పెషల్ డ్రైవ్) -
తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు: ఈటల రాజేందర్
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని హుజూర్ నగర్లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతో మంది ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. రాజకీయాల కోసం ఎంతో మందిని హుజురాబాద్ పంపించి ఎలాగైనా నన్ను ఓడించాలనే ప్రయత్నం చేసినా.. అక్కడ ప్రజలెవరూ నమ్మక కర్రు కాల్చి వాత పెట్టారు. దళితులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేసి కంటితుడుపు చర్యగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీఆర్ఎస్ అంటూ కొత్తగా మరో నాటకానికి తెరలేపారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మధ్యాహ్న భోజనం కింద నగదును సమకూర్చే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అన్ని ఆధారాలు చూపించినా.. వారిపై చర్యలు తీసుకునే సాహసం లేదు అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్కు బీజేపీని ఎదిరించే దమ్ముంది -
మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ
ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్ తొలి మహిళా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సీతాదేవి పరిచయం. ‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి. టెలివిజన్ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది. తెర నిండుగా వినోదం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్ ఉమన్. నాకు రోల్ మోడల్’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరీర్ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి. దూరదర్శన్ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్కి స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్ తయారీ పెద్ద సవాల్. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్ సరిపోదు. సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి. ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది. కాపీ రైట్ పోరు ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్ భారతీయ విద్యాభవన్కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్ తీసుకున్నాం. దూరదర్శన్ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం. అవి టెలికాస్ట్ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్ క్రానికల్లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్ కుమ్మక్కై కాపీ రైట్స్ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్లో ఆరోగ్యం కొత్త సవాల్ విసిరింది. అనారోగ్యంతో పోరాటం మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్ స్లె్కరోసిస్ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్ చిత్రీకరణ వంటి ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్ అండ్ బ్లూస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను. అవకాశం కోసం జూబ్లీహిల్స్ క్లబ్లో బ్యూటీ సెలూన్ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు. అలా 2005 క్రిస్టమస్ రోజు మొదలైన పార్లర్ ఇప్పుడు నలభై బ్రాంచ్లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది. నేను విజేతనే ‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్ని రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించారు. – పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్బీ సెలూన్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ట్రైనింగ్ విద్యార్థిని.. ఇంటికి వస్తేనే సంతకాలు పెడతానంటూ..
సాక్షి,సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది గురువులు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ కోసం వచ్చిన బీఈడీ విద్యార్థినిని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని బుధవారం డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విద్యార్థిని సూర్యాపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. బీఈడీ టీచింగ్ ట్రైనింగ్లో భాగంగా 20రోజులుగా జిల్లా కేంద్రంలోని నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలకు వస్తోంది. ట్రైనింగ్ పూర్తవ్వడంతో çసంబంధిత పాఠశాల హెచ్ఎం ట్రైనింగ్ పూర్తిచేసినట్లు రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే సదరు విద్యార్థిని రెండు మూడు సార్లు హెచ్ఎం దగ్గరకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించింది. తన రికార్డులపై సంతకాలు చేయాలని కోరగా ఇంటికి వస్తే గాని సంతకాలు చేయనని హెచ్ఎం ఫోన్లోనే అసభ్యంగా మాట్లాడినట్లు ఆ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రైనింగ్కు వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం తనను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తెలిపింది. హెచ్ఎంపై దాడి..? హెచ్ఎం చేష్టలకు విసిగిపోయిన సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో వారు హెచ్ఎంపై దాడి చేసినట్లు సమాచారం. హెచ్ఎంపై దాడి చేసి అక్కడ నుంచి వచ్చి డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హెచ్ఎంపై బీఈడీ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత హెచ్ఎంపై విచారణ చేపట్టి.. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –అశోక్, డీఈఓ చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. -
ప్రజల గుండె చప్పుడు
పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్మన్గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు. సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్ రాజబహదూర్ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్రెడ్డి కూడా ఆయన హాస్టల్ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు. ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్ వర్కర్స్ సంఘం, లారీ డ్రైవర్స్ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు చేపట్టాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
మహిళను మింగిన ఇసుక గుంత
ఆత్మకూర్–ఎస్ (సూర్యాపేట):. ఇసుక గుంత ఓ మహిళను మింగింది. ఈ ఘటన మండల పరిధిలోని మక్తా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ(34) పొలం పనుల నిమిత్తం ఏటిలో నుంచి అవతలికి వెళ్తుండగా ఇసుకకోసం తీసిన గుంతలో కాలుజారి పడడంతో నీటిలో మునిగింది. సమీప రైతులు గమనించి ఆమెను రక్షించేలోపే మృతిచెందింది. మృతురాలికి భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇష్టానుసారంగా ఇసుకతవ్వకాలు పాతర్లపహడ్, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూరు, బొప్పారం, మక్తాకొత్తగూడెం గ్రామల నుంచి బిక్కేరు వాగు వెళ్తుంది. ఈ వాగు నుంచి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇసుకతరలిస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.వర్షాలు వచ్చినప్పుడు అందులో నీరుచేరడంతో తెలియక పశువులు, మనిషులు ప్రమాదాల బారిన పడుతున్నారు.మక్తా కొత్తగూడెంలో ఏరు దాటే సమయంలో ఎక్కడ గుంతలు ఉన్నయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండు నెలల క్రితం మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన మహిళ ఏరుదాటుతూ నీటిలో మునిగి మృతిచెందగా ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ ఇసుక తవ్వకంతో ఏర్పడిన గుంతలో జారిపడి మృతిచెందడం ఇసుక మాఫియా ఆగడాలకు నిదర్శనం. వాగుదాటేదెలా... మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి 15కిలో మీటర్లకు పైగా వెళ్తున్న బిక్కేరు వాగు అవతల పలు గ్రామాల భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూముల్లో సాగుచేయడానికి రైతులు ప్రమాదమని తెలిసినా దాటకతప్పడంలేదు. వాగు దాటి రైతులు తమ భూముల్లోకి వెళ్లడానికి ఎక్కడా వంతెనలు లేవు. ప్రమాదమని తెలిసినా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వాగులో నుండే వెళ్తున్నారు. లేదా దూరమైనా వేరే గ్రామాల నుంచి తిరిగివస్తున్నారు. తమ భూములు సాగుకు నోచుకోవాలంటే వంతెనలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. -
సూర్యాపేటలో కుంభవృష్టి, 10 గంటలపాటు..
-
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్భాస్కర్రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
ఇంట్లోనుంచి పోనంటున్న ఉడుత
-
కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా
సూర్యాపేట క్రైం: మలేసియా సముద్రతీరంలో సూర్యాపేట యువకుడు రిషివర్ధన్రెడ్డి(21) గల్లంతయ్యారు. మోటకట్ట వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారుడు రిషివర్ధన్ మలే సియాలో సరుకుల రవాణా నౌకలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లభించలేదని, బుధవారం సాయంత్రంలోగా తెలుస్తుందని అధికారులు ఫోన్లో తెలిపారు. దీంతో బిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. ఎలారా బతికేది? మూడ్రోజుల క్రితం ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మురిపించావు. ఆ మాటల్ని ఇంకా మరువనే లేదు. అంతలోనే సముద్రంలో కొట్టుకుపోయావని చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది? కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా. – రిషివర్ధన్రెడ్డి తల్లిదండ్రులు -
దేశ సంపద కార్పొరేట్కు ధారాదత్తం
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజాజీవితం అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వంట గ్యాస్ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాక అనేక రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగి పోయాయని, వాటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఏడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల భూములను ధరణి పేరుతో భూస్వాములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి తదితరులు సభలో పాల్గొన్నారు. -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు. -
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరద బీభత్సం
-
‘బి’ బ్లడ్ గ్రూప్ వారికే ఎక్కువగా కరోనా!
సూర్యాపేట: పలానా గ్రూపు రక్తం వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందట.. పలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట అని చాలాసార్లే విని ఉంటాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది. కరోనా వైరస్ మొదటి, సెకండ్ వేవ్ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ చికిత్సపొందిన 200 మంది రోగుల రక్తనమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది. సేకరించిన రక్తనమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావూరి స్వరూప పాల్గొన్నారు. -
దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని చాకలిగూడెంకు చెందిన దర్శనం శిల్ప తమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో అభ్యర్థించింది. తన భర్త సతీశ్.. తొమ్మిది నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడని, దీంతో తాను, ముగ్గురు పిల్లలు దిక్కులేని వారమయ్యామని వాపోయింది. స్పందించిన కేటీఆర్.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన శుక్రవారం చాకలిగూడెం వెళ్లి శిల్ప కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. శిల్పకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శిల్ప మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిశోర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: పీఆర్సీ వర్తించేది వీటికే.. -
ప్రతీకార హత్యకు ప్లాన్ చేసిన నిందితులు..
సాక్షి, కోదాడ(సూర్యాపేట): తన అన్నను చంపిన వాడిని చంపాలని హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తితో పాటు సుపారీ గ్యాంగ్ను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మంగళవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి వెల్లడించారు. కోదాడ మండలం నల్ల బండగూడెం శివారు రామాపురం క్రాస్ రోడ్కు చెందిన గుగులోతు సురేష్ గతేడాది సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో డీజే నడిపిస్తూ అక్కడ బస్వరాజు తిరపతయ్యను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి ఇంటిలో అద్దెకు ఉంటూ ఆయన భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గమనించిన తిరపతయ్య అతడిని మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న అతడిని ఎలాగైనా హత్యచేయాలని సురేష్ స్నేహితుల సాయంతో తిరపతయ్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ కేసులో జైలు వెళ్లి వచ్చి స్వగ్రామంలో ఉంటున్నాడు. అన్నను చంపిన వాడిని హత్య చేయాలని.. తన అన్నను చంపిన వాడిని హత్యచేయాలని తిరపతయ్య తమ్ముడు జనార్దన్ తనకు పరిచయం ఉన్న ఖమ్మం జిల్లా దాచేపల్లికి చెందిన దాచేపల్లి సురేష్ సాయంతో చెర్వుమాదారంకు చెందిన రఫీతో గుగులోతు సురేశ్ను హత్య చేయడానికి రూ.2.50 లక్షల సుపారీ కుదుర్చుకుని ఫొటోను వివరాలను ఇ చ్చాడు. రఫీకి అడ్వాన్గా రూ.34వేలను గూ గుల్ పే ద్వారా పంపించాడు. దాచేపల్లి సురేశ్ రఫీలు ఇద్దరు కలిసి గుగులోతు సురేశ్ ను హత్య చేయడానికి అతడి ఇంటి రెక్కీ నిర్వహించి హత్యకు కావాల్సిన వేటకొడవళ్లను రోడ్డు వెంట భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రఫీ తన గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడైన రాకేశ్కు డబ్బు ఆశ చూపి అతడిని కూడా ఒప్పించి, తరువాత తమ వాళ్ల కాదని, తన గ్రామస్తుడైన ఏసోబుకు చెప్పగా అతడు హైదరాబాద్లోని పల్లపు నరేందర్ గ్యాంగ్ ఉందని చెప్పి అతడితో లక్ష రూపాయాలకు ఒప్పందం చేసుకుని రూ.4వేలు ఇచ్చారు. ఆ తర్వాత నరేందర్ గ్యాంగ్ ఈ నెల 23న ఏసోబుతో కలిసి హత్య చేసేందుకు రామాపురం క్రాస్రోడ్డు వద్దకు చేరుకుని రఫీకి ఫోన్ చేయగా అతడు ఎత్తకపోవడంతో సురేశ్ అడ్రస్ తెలియపోవడంతో వెళ్లిపోయారు. హత్య ఆలస్యం అవుతుందని జనార్దన్ ఒత్తిడి చేస్తుండటంతో 24 రాత్రి ఒంటి గంట సమయంలో రఫీ, రాకేష్ను తీసుకుని ద్విచక్రవాహనంపై రామాపురం క్రాస్రోడ్లోని గుగులోతు సురేశ్ ఇంటికి వెళ్లి సురేశ్ తల్లిని మీ కొడుకు లేడా అని కత్తులతో బెదిరించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేవరకు పరారయ్యారు. ఈ క్రమంలో ఒక కత్తి కిందపడిపోయింది. ఈ సంఘటనపై సురేష్ తల్లి రాంబాయి ఈ నెల 25న రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వి చారణ చేపట్టారు. ఎలాగైన అతడిని చంపాలని రఫీ, రాకేశ్లు రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగా పోలీసులు పట్టుకుని వారిని వి చారించి అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతం చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ వై. సైదులుగౌడ్ను, సిబ్బందిని సీఐ అభినందించారు. -
మానాపురం మిర్చి యమా హాట్ గురూ!
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: మానాపురం మాగాణంలో పచ్చళ్లమిర్చి ‘ఎర్ర బంగారం’లా మెరుస్తోంది. కల్లాల్లో ఎర్రగా నిగనిగలాడే మిర్చికుప్పలు బంగారం రాశుల్లా తళుక్కుమంటున్నాయి. మిర్చి పంటకు మానాపురం తండా కేరాఫ్గా నిలిచింది.. మానాపురం మిర్చి ఘాటే కాదు, యమా హాట్ కూడా! 8 జిల్లాలకు ఈ మిర్చి రుచి చూపిస్తోంది ఈ తండా.. ఈ తండా సూర్యాపేట జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. హైబ్రిడ్, లబ్బ విత్తన రకాల సాగు ఈ ప్రాంతం ప్రత్యేకత. మానాపురంతోపాటు ఏనెకుంట తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు తండా, పప్పుల తండాలో పచ్చళ్ల మిర్చి పంట సాగవుతోంది. నాలుగు తండాల్లో 500 ఎకరాలపై చిలుకు ఈ పంట ఉంటే, అందులో 300 ఎకరాల వరకు మానాపురంలోనే సాగైంది. పదిహేనేళ్లుగా సాగు.. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం మానాపురంలో 150 కుటుంబాలు, ఏనెకుంట తండాలో 100, పప్పుల తండాలో 60, రావులపల్లి క్రాస్రోడ్డులో 200 గిరిజన కుటుంబాలున్నాయి. బోర్లు, బావుల కింద పదిహేనేళ్లుగా గిరిజన రైతులు సాధారణ మిర్చిని సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి కొద్దోగొప్పో బావులు, బోర్లలో నీళ్లున్న కాలంలోనూ ఇతర పంటలు వేయకుండా పచ్చళ్ల మిర్చినే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలు వచ్చి భూగర్భ జలాలు పెరగడంతో దీని సాగుకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి.. తండాలకు కాంతి సెపె్టంబర్లో మిర్చిపంట సాగు చేస్తే సంక్రాంతికల్లా కోతకు వస్తుంది. సంక్రాంతి వచి్చందంటే తండాలకు కొత్తకాంతి వచి్చ నట్టే. చేలల్లో కూలీలు పంటను కోయడం, వీటిని ఆటోలు, ట్రాలీల్లో అమ్మకపు ప్రాంతాలకు తరలించడంతో ఈ తండాల్లో సందడి నెలకొంటుంది. ఎర్రగా నిగనిగలాడే మిర్చిని కోత కోసి చేలల్లోనే రాసులుగా పోస్తారు. కూరగాయల వ్యాపారులు చేల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్కు కూడా ఈ మిర్చి వెళుతోంది. ఆదాయం భళా పంటకాలం నాలుగున్నర నెలలు. ఎకరా సాగుకు లక్ష ఖర్చవుతుంది. ఎకరానికి 40 – 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే రూ.2 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. తొలి కాయ కిలో రూ.50 – రూ.70 మధ్య ధర పలికితే, ఆ తర్వాత వచ్చే కాయ ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంటుంది. ఈ పంటకు నీళ్లు ఎక్కువ కావాల్సి ఉండటం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో తక్కువ విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. మా మిర్చికి హైదరాబాద్లో గిరాకీ పచ్చళ్లకు ఉపయోగించే లబ్బ మిర్చికి హైదరాబాద్లో బాగా గిరాకీ ఉంటుంది. ధర కూడా కేజీకి రూ.100 పైనే ఉం టుంది. అంత దూ రం వెళ్లలేక చుట్టుపక్కల ఉన్న మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ తీసుకెళ్తాం. పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చు ఈ పంట పైనే వెళ్లదీస్తున్నాం. – జాటోతు విజయ, మానాపురం, నాగారం మండలం లాభాలొస్తున్నందునే.. ఏటా ఎకరంలో నాటు, హైబ్రిడ్ లబ్బమిర్చి, బజ్జీ మిర్చి సాగు చేస్తాం. ఎకరానికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తే ఈ పెట్టుబడి పోను ఎకరానికి రూ.రెండు లక్షల వరకు లాభం వస్తుంది. 20 ఏళ్లుగా ఈ పంట పెడుతున్నాం. ఎన్నడూ నష్టం రాలేదు. –ఆంగోతు రంగమ్మ, ఏనెకుంట తండా, నాగారం మండలం విదేశాలకు మా మిర్చి పచ్చడి లబ్బమిర్చి మాకు ఎర్ర బంగారం. ఈసారి రెండు ఎకరా ల్లో పెట్టాం. పదిహే ను రోజుల నుంచి కాయ కోస్తున్నాం. ‘మీ మిర్చితో పచ్చడి చేసి ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు పంపిస్తున్నామ’ని ఇక్కడికి వచ్చి కాయ కొనుక్కొనేవారు చెబుతుంటారు. - లకావత్ తావు, మానాపురం, నాగారం మండలం -
కోతుల భయం.. తీసింది ప్రాణం
మద్దిరాల: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి బాలింత దుర్మరణం పాలైంది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంలకు చెందిన జేసీబీ డ్రైవర్ దోమల సైదులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే నాలుగేళ్ల కొడుకు బిట్టు, రెండున్నరేళ్ల కుమార్తె మాన్యశ్రీ ఉన్నారు. మూడో కాన్పు కోసం శ్రీలత (24) మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెల క్రితం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం తల్లిగారింటి ముందు రేకుల షెడ్ కింద ఊయలలో చిన్నారి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీలత బట్టలు ఉతికి ఆరేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడిచేసింది. కోతుల బారి నుంచి తప్పించుకుని బాబును తీసుకుని ఇంట్లోకి వెళ్లాలనుకున్న శ్రీలత.. కోతుల గుంపు మరింత ముందుకు ఉరకడంతో భయంతో బాబును అక్కడే ఉంచి ఇంట్లోకి పరుగుతీసింది. ఈ క్రమంలో గడప తగిలి కిందపడగా, అటుపక్కనే ఉన్న మంచంకోడు తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్ కేసులు
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో ఈ రోజు(సోమవారం)కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది. వీరిలో సూర్యపేట పట్టణానికి చెందిన ఇద్దరితోపాటు, కుడకుడలో వచ్చిన వ్యక్తి బంధువులు.. నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన 6గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 14 వార్డుల్లో రెడ్జోన్గా ప్రకటించారు. ప్రజలంతా మాస్క్లు ధరించాలని, సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. (పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్) కాగా నిర్మల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్దారించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40 మంది రక్త నమూనాలు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపగా.. వారిలో ముగ్గురికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు గత నెలలో ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు, కరోనా మహమ్మారీతో ఇప్పటికే జిల్లాలో ఒకరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 97 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపించారు. ఇంకా 22 మందికి సంబంధించిన శాంపిళ్లను పరీక్షించాల్సి ఉందన్నారు. (కరోనా: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి విరాళం) -
విషాదం : నవ దంపతుల ఆత్మహత్య
సాక్షి, భువనగిరి : నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో అక్కడికక్కడే భర్త మృతిచెందగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణా లు విడిచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల అంజయ్య–మంగమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఆలకుంట్ల స్వామి(24) ప్రస్తుతం ఘట్కేసర్ మండలం అనోజీగూడలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శివరాత్రి ఉమారాణి తన కుటుంబ సభ్యులతో కలిసి పటాన్చెరువులో ఉంటుంది. స్వామి, ఉమారాణి ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 16న ఇద్దరు కలిసి ఇంటినుంచి వెళ్లి పోయారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని అదే రోజు ఘట్కేసర్లోని పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులకు విన్నవించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సోమవారం రాత్రి భువనగిరి పట్టణ శివారులో ఉన్న డాల్ఫిన్ హోట ల్కు వచ్చి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు తీసుకొని లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108కి, పోలీస్లకు సమాచారం అందజేశారు. ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్వామి మృతిచెందాడు. ఉమారాణి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. విషయం తెలుసుకున్న బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
అభ్యర్థిపై రాళ్లదాడి.. పరిస్థితి విషమం..!
సాక్షి, నల్గొండ : సహకార ఎన్నికల నేపథ్యంలో చిట్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ వార్డు అభ్యర్థిగా పోటీచేసిన గోధుమ గడ్డ జలందర్రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మొహం, ఉదర భాగంలో రాళ్లతో చితకబాదారు. బాధితున్ని హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో నేరుగా తలపడలేక ప్రత్యర్థి వర్గంవారు రౌడీయిజానికి దిగారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘర్షణ.. ముగ్గురికి గాయాలు సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం లో సహకార ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. -
కేసీఆర్ సారొస్తుండు!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్లో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజూర్నగర్ రావాల్సి ఉండగా వర్షంతో సభ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంతో కృతజ్ఞత సభ నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇవ్వాలని ముఖ్యనేతలు కోరడంతో ముఖ్యమంత్రి ఈ సభకు హాజరవుతున్నారు. అయితే ఈ సభలో సీఎం నియోజకవర్గానికి ఏం వరాలు ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. భారీగా నిర్వహించేందుకు.... ఇటీవల సభ రద్దయిన ప్రాంతంలోనే వేదికను సిద్ధం చేశారు. ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో సభ నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ నలు మూలల నుంచి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని మండలాల నుంచి జనసమీకరణకు వాహనాలను కేటాయించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై నియోకవర్గ నేతలతో శుక్రవారం సమీక్షించారు. కృతజ్ఞత సభ నియోజకవర్గ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చేయాలని ముఖ్యనేతలు నిర్ణయించినట్లు సమాచారం. సభ ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో పాటు కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్లు పరిశీలించారు. సిద్ధమవుతున్న సభా వేదిక ఈ సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని... నియోజకవర్గంలోని పలు సమస్యలపై సీఎం ఈ సభా వేదికగా ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టణ పరిధిలోని ఫణిగిరి గుట్ట సమీపంలో 4వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటికి కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి కానున్నాయి. హుజూర్నగర్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా చేయడం, హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా చేయడం, రింగ్రోడ్డు పూర్తి చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలను కోదాడ కోర్టు నుంచి హుజూర్నగర్ కోర్టు పరిధిలోకి తేవడం, చింతలపాలెం, మఠంపల్లి మండలంలో టేలాండ్ భూములకు కృష్ణానది నుంచి ఎత్తిపోతలతో నీళ్లు తేవాలన్న డిమాండ్లు ఎన్నికల ప్రచారంలో కూడా బాగా జరిగాయి. ఇవన్నింటిపై ముఖ్యమంత్రి సభావేదికపై వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం టూర్ ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి మధ్యాహ్నం 11 గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి 1.30 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటారు. ఇక్కడ త్రివేణి ఫంక్షన్హాల్లో ముఖ్యనేతలతో కలిసి భోజనం ముగించుకుని సాయంత్రం 3 గంటలకు హుజూర్నగర్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. 4 గంటలకు హుజూర్నగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై కేసీఆర్ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. -
హుజుర్నగర్ ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు
సాక్షి, సూర్యాపేట: ఓటర్లకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హుజుర్నగర్ పోలీస్ స్టేషన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు సందర్భంగా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని..13 చెక్పోస్ట్ల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి స్పెషల్ స్ట్రికింగ్ ఫోర్స్, ఎంసీసీ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికల కోడ్, పోలీసు యాక్ట్ అమలులో ఉందని.. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఐదు పారా మిలిటరీ బృందాలను రప్పిస్తున్నామన్నారు. 36 ప్రాంతాల్లో 76 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని..21 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి 650 మంది పోలీసు సిబ్బంది విధులకు హాజరవుతారని చెప్పారు. ఏడు ఎస్ఎస్టీ, నాలుగు వీడియో బృందాలు ఏర్పాటు చేసామని.. ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి నిఘా పెట్టామన్నారు. -
‘నిరంతర విద్యుత్ కోసం సీఎం కేసీఆర్ ముందుచూపు’
సాక్షి, సూర్యాపేట : నిరంతర విద్యుత్ విషయంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగించుకునేందుకు గ్రిడ్స్ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, విద్యుత్ విషయంలో ఎల్లప్పుడూ ముఖ్యమంత్రికి పూర్తి నివేదిక అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
పదోసారి పోటీకి సై.. ఓడినా పట్టింపు నై..
సాక్షి, నల్లగొండ: ‘‘ప్రజాసేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం జీవితాంతం పోటీ చేస్తూనే ఉంటా.. ఒక్క ఓటు వచ్చినా.. రాకున్నా పోటీ చేస్తూనే ఉంటాను. డిపాజిట్లు ముఖ్యం కాదు. నాకు ఆశయమే ముఖ్యం. అందుకోసం నేను బతికున్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటా’’ అని ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి నెహెమియా అంటున్నారు. నల్లగొండ లోక్సభకు శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆయన నామినేషన్ వేయడం పదోసారి. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులు నాకున్నారు. ప్రతిసారీ నేను పోటీ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అత్యధికంగా అభిమానులు ఓట్లు వేశారు’ అని అంటున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన తనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఎంతో అభిమానమని, కేవలం కరపత్రాలు, పోస్టర్లు మినహా పెద్దగా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. తాను బతికున్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటానన్నారు. 1984 నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్సభ స్థానానికి, మిర్యాలగూడ రద్దయిన తర్వాత నల్లగొండ లోక్సభ స్థానానికి ఆయన నామినేషన్లు వేసి పార్లమెంట్కు పోటీ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 9వ సారి పోటీ చేశాను. 56 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయని, 10వ సారి నల్లగొండ ఎంపీగా నామినేషన్ సమర్పించినట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మరో మూడు పర్యాయాలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినట్లు చెప్పారు. – మీసాల శ్రీనివాసులు, సాక్షి– నల్లగొండ -
చెరువులో జారిపడి నలుగురు విద్యార్థుల మృతి
-
బుచ్చిరాములుకు కన్నీటి వీడ్కోలు
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములుకు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలనుఆయన తనయుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి నిర్వహించారు. అంతకుముందు సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట నేతలు ఎల్.రమణ, బి.వెంకట్ తదితరులు ఆయన పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్తో పాటు పలువురు నివాళులర్పించారు. తన జీవితాన్ని పేద ప్రజల కోసం ధారపోసి కమ్యూనిస్టు యోధుడిగా మిగిలారని.. నమ్మిన సిద్ధాం తం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి బుచ్చిరాములు అని వారు కొనియాడారు. -
గుండెపోటుతో ఎన్నికల ఏజెంట్ మృతి
సాక్షి, సూర్యపేట : తెలంగాణ తొలి పంచాయితీ ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాలు.. విలాస కవి సత్యం రాజు(70) సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో ఎన్నికల ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. సోమవారం ఉదయం గుండెపోటు రావడం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా దురదృష్టావషాత్తు మార్గమధ్యలోనే మరణించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. -
సూర్యాపేట: బస్సును ఢీకొన్న కారు
-
అరచేతిలో వాతావరణ సమాచారం
సూర్యాపేట : వాతావరణ సమాచారాన్ని ఇకనుంచి సెల్ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నూతన యాప్ను అందుబా టులోకి తీసుకొచ్చింది. టీఎస్ వెదర్ యాప్ను ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రా జేందర్ ఆవిష్కరించారు. ఆటోమేటెడ్ పరికరాలతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను, తాజా అంచనాలను ఈ యాప్ద్వారా తెలుసుకోవచ్చు. టీఎస్వెదర్ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న మొబైల్ పోర్ట్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వాతావరణ వివరాలైన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రాంతాల్లో నెలకొన్న వర్షపాతం, ఉష్ణోగ్రత, పీడనం, గాలి గమన దిశలు మొదలైన వాతావరణ వివరాలను 24గంటలు అందుబాటులో అందరికి ఉంచడానికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ఈ యాప్ను రూపొం దించింది. మొబైల్ యాప్లో ఉండే వివరాలు.. ఆ ప్రాంతంలో ఆటోమెటిక్ వెదర్స్టేషన్ పం పిన వాతావరణ వివరాలతో పాటు ఆ ప్రాంత సమీపంలో ఉండే ఐదు ఆటోమెటెడ్ వెదర్స్టేషన్లకు సంబంధించిన వివరాలుంటాయి. అదే విధంగా రాష్ట్రంలో నమోదైన వర్షపాతానికి సం బంధించి 10 ప్రాంతాల వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నమోదైన వర్షపాతం, అత్యధిక వర్షపాతానికి చెందిన ఐదు ప్రాంతాల వివరాలు ఉంటాయి. యాప్తో అనేక ప్రయోజనాలు టీఎస్ వెదర్యాప్ అందుబాటులోకి రావడంతో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా రైతులకు వర్ష సూచన తెలియక విత్తనాలు విత్తుకునేవారు. సకాలంలో వర్షాలు కురవక నష్టాల్లో కూరుకుపోతున్నారు. టీఎస్ డీపీఎస్ రూపొందించిన వెదర్యాప్తో ఎప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ నూతన యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో ఇటు రైతుల్లో, అటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. - బాదె లింగయ్య,జిల్లా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ -
చూపున్న కాళ్లు.. నడకనేర్పుతున్న కళ్లు !
సూర్యాపేట : నడవ లేని ఆమె కాళ్లు చూపులేని ఆయనను నడిపిస్తున్నాయి... అలాగే చూపులేని ఆయన కళ్లు ఆమెకు దారిచూపుతున్నాయి. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. కాళ్లు లేని ఓ మహిళ మూడు చక్రాల రిక్షాపై కూర్చొని కళ్లు లేని తన భర్తసాయంతో ఆ రిక్షాను నడిపిస్తూ బతుకుబండిని లా గిస్తోంది. సూర్యాపేట పట్టణానికి చెందిన శోభ– సత్తయ్య దంపతులకు ఎవరూ లేకపోవడంతో పొట్ట కూటికోసం స్థానిక పాత శివాలయం వద్ద ఇలా యా చిస్తూ సాక్షి కెమెరాకు చిక్కారు. అయితే సత్తయ్యకు రెండు కళ్లు కన్పించవు.. శోభకు కాళ్లు కదలలేని పరిస్థితి. కాగా వీరి ప్రయాణం మాత్రం భర్త మూడు చక్రాల బండిని తోసుకుపోతుండగా.. భార్య దారి చూపుతోంది. వీరిని చూసేవారు అయ్యో పాపం అనుకుంటున్నప్పటికీ ఈ వృద్ధ దంపతుల అనోన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
కట్టంగూర్(నకిరేకల్) : భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకన్న(40) ఈనెల 15న రాత్రి మృతిచెందాడు. బంధువులు సహజమర ణం అనుకుని గ్రామంలోని సబ్స్టేషన్ సమీపంలో 16న అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం గ్రామంలో చిన్నకర్మ జరిపేందుకు వచ్చిన మృతుడి బంధువులు అనుమానంతో వెంకన్న భార్య స్వర్ణను గట్టిగా నిలదీయడంతో తానే గొంతు పిసికి చంపానని ఒప్పుకుంది. దీంతో మృతుడి తమ్ముడు కొత్తపల్లి శ్రీను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్హెచ్ఓ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. తహసీల్దార్ తిరందాసు వెంకటేశం, శాలిగౌరారం రూరల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, నకిరేకల్ ప్రభుత్వ వైద్యాధికారి శ్మశాన వాటిక వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. సీఐ స్వర్ణను విచారించగా తన భర్త నిత్యం మద్యం తాగివచ్చి ఇబ్బందులకు గురిచేసే వాడని, కుటుంబ పోషణ పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విసిగెత్తి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి హత్య వెనక ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
వృద్ధుడి దారుణ హత్య
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్ఎస్ మండలం బొప్పారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఎడ్ల మాధవయ్య(60) అనే వృద్ధు డు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఆరుబ యట నిద్రిస్తున్న వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు పదునైన గొడ్డలితో తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు..మాధవయ్య మనుమడు(కుమార్తె కొడుకు) పెళ్లి ఈ నెల 24న కోదాడ మండలంలోని కొమరబండలో జరగనుంది. మాధవయ్య భార్య భాగ్య మ్మ పెళ్లి పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం కుమార్తె ఇంటికి(కొమరబండ) వెళ్లింది. లారీక్లీనర్గా పనిచేస్తున్న మాధవయ్య చిన్నకుమారుడు వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి ఇంటికి చేరుకోగా తండ్రి, కొడుకు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల అనంతరం మాధవయ్య ఇంటి ముందు నిద్రకు ఉపక్రమించగా.. వెంకటేశ్వర్లు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి మద్యం సేవించాడు. అనంతరం వచ్చి తండ్రి మంచానికి కొద్ది దూరంలో మరో మంచం వేసుకుని నిద్రపోయాడు. తెల్లవా రుజామున లేచిన వెంకటేశ్వర్లు తండ్రిని లేపడానికి వెళ్లగా రక్తపు మడుగులో ఉండడంతో నిర్ఘాంతపోయి, పక్క ఇంట్లో వేరుకాపురం ఉంటున్న తన అన్న జలంధర్ను నిద్రలేపి విషయం తెలిపాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యపై అనుమానాలు మాధవరావు హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతబడి అనుమానంతోనే హత్య జరిగినట్టు స్థానికులు అంటుండగా, వివాహేతర సంబంధం, భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ హరిక్రిష్ణ పరిశీలించారు. హత్యకు వాడిని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ హరిక్రిష్ణ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది
సూర్యాపేట : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంట్లోని తమ కూతురు ఏడాది నుంచి పొట్టలోపలి భాగంలోని ఫ్రాంక్టాటిస్లో గడ్డ కావడంతో బాధపడుతూ.. రోజురోజుకూ క్షీణిస్తున్న బిడ్డ ఆరోగ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రి తల్లడిల్లిపోతున్నారు. తమ గారాలపట్టికి ఎలాగైనా వైద్యమందించి బతికించుకునేందుకు సూర్యాపేట పట్టణానికి చెందిన నిమ్మ బింధు తల్లిదండ్రులు నిమ్మ శ్రీనివాస్–రాజేశ్వరి సాయం కోసం వేడుకుంటున్నారు. పట్టణానికి చెందిన శ్రీనివాస్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలో చదవిస్తున్నాడు. వారిలో చిన్న కుమార్తె బిందు ఇమాంపేట గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బిందు ఏడాది కాలంగా కడుపులోనొప్పితో బాధపడుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులో వైద్యం చేయించాడు. ఇటీవల తీవ్రమైన కడుపులో నొప్పి రావడంతో హైదరాబాద్లోని నక్షత్ర హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా.. కడుపులోని ఫ్రాంక్టాటిస్లో పెద్దగడ్డ ఉందని.. దానిని ఆపరేషన్ చేసి తీయాలని.. దీని కోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి జబ్బు వెయ్యిలో ఒకరికి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు 20 రోజుల క్రితం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో గల నక్షత్ర కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు చిన్నారి బిందును చేర్పించారు. వారి చేతిలో ఉన్న రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆపరేషన్ కోసం మరో రూ.5 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం కోసం ఎదురుచూపు పేద తల్లిదండ్రులు తమ బిడ్డ బింధు ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. దయఉంచి సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 99123 69343, 90107 50593, 99487 64487 సెల్ నంబర్లను సంప్రదించవచ్చు. అకౌంట్ నంబర్ ఎస్బీహెచ్ సూర్యాపేట 62259021457.ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి తన కుమార్తె బింధు వైద్యానికి మనసున్న దాతలు సాయం చేసి ఆదుకోవాలి. ఇప్పటికే వైద్యం కోసం సంవత్సర కాలంలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేశాం. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నాం. వైద్యం కోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. నా బిడ్డ ఆపరేషన్ కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నా. -
యువతే టార్గెట్గా దందా
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: యువతే లక్ష్యంగా సూర్యాపేట జిల్లాలో గంజాయి దందా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి జాతీయ రహదారి వెంట గంజాయిని యథేచ్ఛగా రాష్ట్ర రాజధానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని కళాశాల హాస్టల్లో 100 కేజీలకు పైగా గంజాయి పట్టుబడడం చర్చనీయాంశ మైంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పట్టణంలోని గాయత్రి కళాశాల సమీపంలోనే ఈ కాలేజీ బాలుర హాస్టల్ ఉంది. రాత్రి 10.30 గంటల సమయంలో విద్యార్థులు చదువుకుంటుండగా హాస్టల్ వార్డెన్ తెజావత్ లింగయ్య 12 కార్టన్ల గంజాయిని ఓ ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులతో కలసి తీసుకొచ్చి విద్యార్థుల మంచాల కింద దాచి పెట్టాడు. దీనిని గమనిం చిన విద్యార్థులు ఏమిటని వార్డెన్ను అడగ్గా పరీక్ష పేపర్లని చెప్పి బయటికి వెళ్లాడు. కొంత సేపటికి విద్యార్థులకు ఏదో కొత్తరకంగా వాసన రావడంతో అనుమానం వచ్చి కార్టన్లను తెరిచి చూశారు. ఓ విద్యార్థి తనకు తెలిసిన విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విద్యార్థి సంఘం నాయకులు హాస్టల్కు చేరుకొని ఆ కార్టన్లను తెరిచి చూస్తే గంజాయి కనిపించింది. దీంతో వెంటనే వారు బయటకు తీసుకెళ్లి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ చేరుకొని సుమారు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యవహారం బయటకు పొక్కడంతో వార్డెన్ లింగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. గురువారం పలు విద్యార్థి సంఘాల నేతలు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కొందరు కళాశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎంత డబ్బైనా వెచ్చించి.. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి పట్టణాల్లో ప్రధానంగా కళాశాలలు ఉన్న నేపథ్యంలో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కళాశాల సమీపానికి తమ మనుషులను పంపించి విద్యార్థులను పరిచయం చేసుకుని వారిని రోజుల వ్యవధిలోనే గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలను సాగిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో పడిన విద్యార్థులు, యువత ఎంత డబ్బైనా వెచ్చించి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని విద్యార్థులు దీనికే వినియోగించేలా వ్యాపారులు ప్రేరేపిస్తున్నారు. గతంలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి తాగే వ్యక్తులు ఇప్పుడు జన సంచారం ఉన్న ప్రాం తాల్లోనే నేరుగా సిగరెట్లలో పెట్టుకొని కాలుస్తున్నారు. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో గంజాయి దందా నిరాటంకంగా కొనసాగుతోందని విమర్శలు వస్తున్నాయి. మానసికంగా ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులను కూడా వ్యాపారులు టార్గెట్ చేస్తున్నారు. డబ్బులు బాగా ఉన్న వ్యక్తులను ఈ మార్గంలోకి దించి వారిని పెట్టుబడిదారులుగా మార్చి లాభాలను చూపిస్తూ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. హైదరాబాద్కు తరలింపు.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రం ఉం డడంతో గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. రాత్రికిరాత్రి విజయవాడ నుంచి బయలుదేరి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. విజయవాడతో పాటు ఖమ్మం, విశాఖపట్నం, గుంటూరు, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి సూర్యాపేట మీదుగా రాజధానికి అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయాల్లో .. కొన్ని ముఠాలు రాత్రి సమయంలో వివిధ వాహనాల అడుగు భాగాన గంజాయిని దాచి రవాణా చేస్తున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న గంజాయి విక్రయదారులు కార్లు, ట్రాలీ ఆటోలు ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా తమ అడ్డాలకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. -
సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
-
నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం!
సూర్యాపేట: జిల్లాలో ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. ఆత్మకూరు(ఎస్) మండలం ఎంపీపీ కసాగాని లక్ష్మిబ్రహ్మం కుమారుడు సతీష్, ముల్కలపల్లికి చెందిన యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇన్నాళ్లు ప్రేమించిన సతీష్ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని యువతి ఆందోళనకు దిగింది. ఎంపీపీ ఇంటిముందు బైఠాయించి.. తన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. సతీష్ తాను నాలుగేళ్లుగా ప్రేమించుకున్నామని, అతను పెళ్లికి నిరాకరించడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పింది. అయినా, తనకు న్యాయం జరగకపోవడంతోనే ఎంపీపీ ఇంటిముందు న్యాయపోరాటానికి దిగినట్టు తెలిపింది. ఆమె ధర్నాతో స్పందించిన పోలీసులు ఆమె ప్రియుడు సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. -
నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం!
-
టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఎల్కరం గ్రామంలో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎల్కారం టీడీపీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు జనార్థన్ అభివృద్ధి పనులపై ప్రశ్నించాడు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఎంక్వైరీ కోసం పై అధికారులను ఆశ్రయించాడు. దీంతో కోపం పెంచుకున్న ఒంటెద్దు వెంకన్న తన అనుచరులతో కలిసి జనార్థన్పై దాడికి దిగాడు. ఈ ఘటనలో జనార్థన్కు గాయాలవ్వడంతో సూర్యాపేట్కు తీసుకువెళ్లారు. జనార్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పెన్పహాడ్(సూర్యాపేట): బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కోటయ్య భార్య కవిత(22) గ్రామ శివారులోని బావిలో పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఏడాది వయసున్న ఓ పాప ఉంది. -
సూర్యాపేటలో దారుణం
సూర్యాపేట: సూర్యాపేటలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువునువదిలి వెళ్లారు. కట్ట పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడి ఉన్న పసికందును ఎలుకలు తినడంతో.. శిశువు మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
భీమారం(కేతేపల్లి) : కేతేపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ సూర్యాపేట–మిర్యాలగూడెం రహదారిపై శనివారం మండలంలోని భీమారం గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సూర్యాపేటకు కేవలం 15 కి.మీ దూరంలో ఉన్న కేతేపల్లి మండలాన్ని నల్లగొండ జిల్లాలో కొనసాగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన 80 శాతం మంది విద్యార్థులు సూర్యాపేటలోని పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుతున్నారని పేర్కొన్నారు. రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ మద్దెల క్రిష్ణయ్య సిబ్బందితో భీమారం గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామస్తులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ధర్నాలో ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు సుక్క వినయ్సాగర్, బడుగుల చంద్రశేఖర్, అవిరెండ్ల రమేష్, కూరెళ్ల వెంకన్న, ఆదాం, గునగంటి రాము, రహీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓ కార్యాలయ పనుల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్నాయక్ ఆదివారం సందర్శించారు. దసరా రోజు నుంచి ఇక్కడి నుంచే పాలన కొనసాగనున్న దృష్ట్యా పనులను సూచించారు. కాంట్రాక్టర్ దగ్గర ఉండి పనులు చేయించాలన్నారు. ఆయన వెంట ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, కోటాచలం, సముద్రాల సూరి తదితరులు ఉన్నారు. -
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట : చెరువులపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శనివారం పట్టణంలోని చౌదరి చెరువులో మున్సిపల్ చైర్పర్సన్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువుల్లో చేపల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. వరుణిడి కరుణతో చెరువులు నిండి కళకళలాడుతున్నాయన్నారు. మత్స్యకారులు, ముదిరాజ్, గంగపుత్రులతోపాటు ఇతర కులాలకు చెందిన మత్స్య కార్మిక సంఘాల ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వలస పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్య పారిశ్రామిక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలోని చౌదరి, పుల్లారెడ్డి, నల్లచెరువు తండాల్లో ఈ చేపల పెంపకం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, ఎఫ్డీఓ ఎస్కె.రెహమాన్, వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, వర్థెల్లి శ్రీహరి, షాహినాబేగం, వెలుగు వెంకన్న, షఫీఉల్లా, నెమ్మాది భిక్షం, బైరబోయిన శ్రీను, తండు శ్రీను, బత్తుల ఝాన్సీలక్ష్మి, అంగిరేకుల రాజశ్రీ, గోదల భారతమ్మ, పెదపంగు స్వరూపారాణి, గుడిపూడి వెంకటేశ్వర్రావు, దేవేందర్, ఈఈ విద్యాసాగర్రావు, డీఈ వెంకటేశ్వర్రావు, ఏఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు
సూర్యాపేట : నూతన జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఆరోపించారు. పసునూరు గ్రామాన్ని నాగారంలో కలపొద్దని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ సర్పంచ్ లింగయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులను శుక్రవారం రాత్రి అక్కడి పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ రాంరెడ్డి దామోదర్రెడ్డి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి చేరుకొని గ్రామ సర్పంచ్లతో పాటు కాంగ్రెస్ నాయకులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూరు గ్రామాన్ని తుంగతుర్తి మండలంలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పసునూరు గ్రామాన్ని తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగారంలో ఎలా కలుపుతారన్నారు. నాగారంలో కలిపితే ప్రజలు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. అలాగే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్ యంత్రం ఎందుకు పని చేయడం లేదని సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15రోజుల్లో ప్లేట్లెట్ యంత్రం పని చేయకపోతే ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చెవిటి వెంకన్న యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, బైరు వెంకన్నగౌడ్, షాహినాబేగం, చెంచల శ్రీనివాస్, అయూబ్ఖాన్, గుడిపాటి నర్సయ్య, రాంబాబు, అంజద్అలీ, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు. -
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట ప్రపంచానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారన్నారు. రంగురంగుల పూలలాగా రాష్ట్రంలోని ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతి పండుగను కూడా ఐక్యంగా ఉండి జరుపుకోవాలన్నారు. సూర్యాపేటలో ఎప్పుడైనా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని..ఈసారి అంతకంటే ఘనంగా జరుపుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో సూర్యాపేట జిల్లాగా మారనుందని తెలిపారు. ఎనిమిది రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు బతుకమ్మలను పేర్చుకొని వచ్చి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ప్రతిరోజు బతుకమ్మ ఆడేందుకు వచ్చిన వారికి ఇద్దరిని ఎంపిక చేశారు. వారికి మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. టీఎస్యుటీఎఫ్కు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాష్రెడ్డి, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, డీఎస్పీ సునితామోహన్, తహసీల్దార్ మహమూద్అలీ, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్పాషా, మండాది గోవర్ధన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు
సూర్యాపేటః ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మిరప విత్తనాల విక్రయాలకు సంబంధించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు దుకాణాల్లో డివిజన్ వ్యవసాయాధికారి కె.శంఖర్ రాథోడ్ ఆధ్వర్యంలో తనఖీలు చేశారు. స్థానిక సాయికృప ఆగ్రో ఏజెన్సీస్, శ్రీరామచంద్ర సీడ్స్ దుకాణల్లో నకిలీ మిరప విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు దుకాణాల్లోనూ జీవ ఆగ్రో జెనిటిక్స్ కంపెనీకి చెందిన జేసీఫోర్ 801 మిరప విత్తనాలను విక్రయించడం జరిగిందని తెలిపారు. విత్తనాల విక్రయ రసీద్లను స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. విత్తన, ఎరువుల దుకాణాల యాజమానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓలు అరుణ, సందీప్తో పాటు పలువురు ఉన్నారు. -
‘పేట’ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన రాష్ట్ర బృందం
సూర్యాపేట : స్వచ్ఛ అభియాన్ కాయకల్ప్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంగళవారం సూర్యాపేట ఏరియాస్పత్రిని ఫ్యామిలీ ప్లానింగ్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను జిల్లాకో బృందం వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఏరియాస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల కల్పన ఎలా ఉందని రోగులను అడిగితెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో దేవరకొండ, డిండి, చందంపేట, నల్గొండ, నకిరేకల్ ఆస్పత్రులను పరిశీలించామన్నారు. ఆమె వెంట యునీసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ ఉమా శంకర్, లీగల్ కన్సల్టెంట్ వాణి, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్, వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ మాండన్ సుదర్శన్సింగ్, మోహినుద్దీన్ తదితరులు ఉన్నారు. -
గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్తో త్వరలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా నాయకులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం, 12 శాతం రిజర్వేషన్, డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు..ప్రమోషన్లు తదితర హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట్యానాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ భిక్షంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేటకు ‘స్వచ్ఛ పురస్కార్’
సూర్యాపేట: పట్టణంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి సూర్యాపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ పురస్కార్ ఇండోస్యాన్–2016 అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. అదే విధంగా శనివారం జరగనున్న వర్క్షాప్లో ఆమె పాల్గొననున్నారు. -
పీఎస్ఎల్వీ సీ 35 విజయంలో సూర్యాపేట వాసి
సూర్యాపేట : పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం విజయవంతంలో సూర్యాపేట పట్టణానికి చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ కీలక భాగస్వామ్యంతో సూర్యాపేట ప్రతిష్ట అంబరాన్నింటింది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ35 కోసం పట్టణంలోని గణేష్నగర్కు చెందిన చెరుకుపల్లి లింగయ్య – సరోజినిల పెద్ద కుమారుడు వెంకటరమణ సహకారం అందించారు. మారిషస్ భూ కేంద్రంలోని రాకెట్ ట్రాకింగ్ ద్వారా ముఖ్యమైన డేటాను శ్రీహరికోటకు అందించారు. గతంలో పీఎస్ఎల్వీ సి30 ప్రయోగ సమయంలో కూడా అతడు అల్కాటారా నుంచి టెలియాస్–1 ఉపగ్రహ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య వెంకటరమణ సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల (నెం – 2)లో విద్యనభ్యసించారు. అనంతరం హైదరాబాద్లోని ఈస్ట్ మారెడుపల్లిలో ట్రిపుల్ ఈ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అనంతరం లక్నోలోని అంతరిక్ష కేంద్రంలో 15 సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. కాగా వెంకటరమణను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో జిల్లా వాసి భాగస్వామి కావడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు. -
రాయినిగూడెం వద్ద లారీ బోల్తా
రాయినిగూడెం(సూర్యాపేటరూరల్): అదుపుతప్పి నాకౌట్ కంపెనీకి చెందిన బీర్ల లోడ్తో వెళ్తున్న లారీబోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో నాకౌట్కంపెనీకి చెందిన 1250 కాటన్ల బీర్లను లోడ్ చేసుకుని విజయవాడకు వెళ్తున్న లారీ తెల్లవారుజామున రాయినిగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి సర్వీస్రోడ్డు మీద బోల్తా పడింది. దీంతో బీరు సీసాలు చాలా వరకు పగిలిపోయాయి. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. గ్రామస్తులు బీరు కాటన్లు ఎత్తుకుపోకుండా పోలీసులు లారీ వద్ద కాపలా ఉన్నారు. -
రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు
సూర్యాపేట : పట్టణంలోని రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. లేదా అని కీ రిజిస్టర్ను పరిశీలించారు. అలాగే స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. దాడుల్లో కోదాడ, హుజూర్నగర్ డీటీసీఎస్లు ఏవీ రమణారావు, చంద్రశేఖర్, సురేష్, ఆర్ఐసీఎస్ అల్లావుద్దిన్, వెంకట్ తదితరులు ఉన్నారు. -
వేరుశనగ రైతుల ఆందోళన
సూర్యాపేట : ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంటకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు నూతనకల్, మునగాల, తుంగతుర్తి ప్రాంతాలకు చెందిన రైతులు రెండు రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్కు వేరుశనగ కాయను విక్రయించేందుకు తెచ్చారు. రైతులకు వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు కోట్ చేస్తున్నారు. క్వింటా వేరు శనగకాయను రూ. 1100లకు మార్కెట్ ఖరీదుదారులు ఖరీదు చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు ఖరీదు చేయడంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రైతులు వారు తెచ్చిన వేరుశనగ వద్ద ఆందోళనకు దిగారు. మార్కెట్లో వేరుశనగ కాయను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం మద్దతు ధర ఇవ్వకుండా మాయచేస్తున్నారని మండిపడ్డారు. వేరుశనగ వర్షానికి తడిసిందనే సాకుతో పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శని, ఆదివారం సెలవు దినంగా ప్రకటించడంతో తాము తెచ్చిన వేరు శనగకాయను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించడం లేదు – అయోధ్యరాములు, గట్టికల్, రైతు వేరు శనగకాయకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రెండు రోజుల క్రితం పంటను మార్కెట్కు తీసుకొచ్చాను. వర్షం వస్తున్నా మార్కెట్లోనే తలదాచుకుంటున్నాను. అయినా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఖరీదుదారులు వారి ఇష్టానుసారంగా ధరలు పెడతామంటున్నారు. పెట్టుబడులు వెళ్లేటట్టు లేదు – గుగులోత్ జామిరి, కందగంట్లతండా, మహిళా రైతు వేరుశనగ పంటకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఎంతో ఆశతో మద్దతు ధర వస్తుందని ఎదురు చూశా. కానీ సూర్యాపేట మార్కెట్లో వేరు శనగ కాయ విక్రయిద్దామని వస్తే మద్దతు ధర పెట్టడం లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు. వేరు శనగ కాయ తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రైతులు ఆరబెట్టిన కాయను తీసుకురావాలి – వెంకటేశం, మార్కెట్ సెక్రటరీ, సూర్యాపేట. మార్కెట్కు వేరుశనగకాయను తీసుకువచ్చే రైతులు ఆరబెట్టి తీసుకురావాలి. వేరుశనగ కాయ తడిసి ఉన్నట్లైతే మద్దతు ధర రాదు. భారీ వర్షాల సూచనతోనే మార్కెట్కు శనివారం సెలవు ప్రకటించాం. రైతులు ఎవరూ ఎలాంటి ధాన్యాన్ని తీసుకురావద్దు. -
పేరిణి నాట్యం ప్రాముఖ్యాన్ని తెలియజేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : పేరిణి నాట్యం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ జిల్లాల్లో పేరిణి నాట్యం 101వ రోజులు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని అందరికి తెలియజెప్పాల్సిన బాధ్యత కళాకారులపైనే ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి సైతం ఈ నాట్యం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ నాట్యం వైపు దృష్టి మరలించేలా చేయాలని సూచించారు. అనంతరం పేరిణిలోని లాస్యం, తాండవం ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జనార్దన్రెడ్డి, పేరిణి వెంకట్గౌడ్, వీరునాయుడు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, సతీష్, రాజ్తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
సూర్యాపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎంతో చేస్తామని మాయమాటలుచెప్పి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మాటలు తప్ప చేతలు లేవన్నారు. రాష్ట్రం వస్తే ఎంతో మేలు జరుగుతుందని మాయమాటలు చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రైతు రుణమాఫి చేస్తామని చెప్పి నేటికి మూడో దపా రుణమాఫి కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. మూసీ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీరందించకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేనప్పుడు కాలువలు మరమ్మతులు చేసుకుంటారు కానీ, నిండుకుండలా నీళ్లు ఉన్నప్పుడు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేశారన్నారు. వంద రోజుల్లో సూర్యాపేటకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికిన వారు నేడు నీటి సమస్యను తీర్చడంలో విఫమలయ్యారని విమర్శించారు. సూర్యాపేటకు టూటౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈద్గా రోడ్డులో డివైడర్ వేయడంలో అర్థం లేదన్నారు. ఇరుకు రోడ్లలో డివైడర్ వేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలేత్తేలా చేశారని మండిపడ్డారు. కలెక్టరేట్ను జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్రావు, ముదిరెడ్డి రమణారెడ్డి, అంజద్అలీ, అయూబ్ఖాన్, చెంచల శ్రీను, బొల్లె జానయ్య, -
రైతుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
సూర్యాపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎంతో చేస్తామని మాయమాటలుచెప్పి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మాటలు తప్ప చేతలు లేవన్నారు. రాష్ట్రం వస్తే ఎంతో మేలు జరుగుతుందని మాయమాటలు చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రైతు రుణమాఫి చేస్తామని చెప్పి నేటికి మూడో దపా రుణమాఫి కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. మూసీ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీరందించకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేనప్పుడు కాలువలు మరమ్మతులు చేసుకుంటారు కానీ, నిండుకుండలా నీళ్లు ఉన్నప్పుడు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేశారన్నారు. వంద రోజుల్లో సూర్యాపేటకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికిన వారు నేడు నీటి సమస్యను తీర్చడంలో విఫమలయ్యారని విమర్శించారు. సూర్యాపేటకు టూటౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈద్గా రోడ్డులో డివైడర్ వేయడంలో అర్థం లేదన్నారు. ఇరుకు రోడ్లలో డివైడర్ వేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలేత్తేలా చేశారని మండిపడ్డారు. కలెక్టరేట్ను జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్రావు, ముదిరెడ్డి రమణారెడ్డి, అంజద్అలీ, అయూబ్ఖాన్, చెంచల శ్రీను, బొల్లె జానయ్య, -
సూర్యాపేట జిల్లాలో కలపాలి
మిర్యాలగూడ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలోనే కలపాలని గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి జిల్లా చైర్మన్ బాణావత్ రతన్సింగ్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పాటయ్యే సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడను కలపడం వలన నియోజకవర్గంలోని అన్ని గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడ నాటి నుంచి నేటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిందన్నారు. కొత్త జిల్లాలో చేరిస్తే అధిక నిధులతో పాటు అధిక అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన 12శాతం హామీని అమలు చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నీటి సంఘం చైర్మన్ ధీరావత్ మంగ్యానాయక్, మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ రెడ్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు వారణాసి వెంకటేశ్వర్లు, కూచీమళ్ల ఆనంద్, డకనానాయక్, కమిల్యా తదితరులున్నారు. -
సూర్యాపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
సూర్యాపేట : సూర్యాపేట డిపోలోని కంప్యూటర్స్ విభాగాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఐటీ) ఎ.పురుషోత్తం ఆదివారం తనిఖీ చేశారు. కంప్యూటర్స్ డిపోలో ఉన్న టిమ్ మిషన్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆర్టీసీలో రూ. 30 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ సిస్టం ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సిస్టం ద్వారా తెలంగాణలోని అన్ని డిపోల్లో పని తీరును, లాభనష్టాల విషయాలను సులువుగా తెలుసుకోవచ్చన్నారు. సూర్యాపేట డిపోలో పని తీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. డిపోలో ఓటీ పేమెంట్, డ్యూటీ చేసిన సిబ్బందికి హాజరు పడడం లేదని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. టెక్నికల్గా కొద్దిగా సమస్య ఉందని, దానిని వెంటనే పరిష్కరించి సిబ్బంది జీతాలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎఫ్ సక్రం, డీసీ యాదయ్య, స్టేషన్ మేనేజర్లు లింగానాయక్, ముత్తయ్య, సిస్టం సూపర్వైజర్ సిమ్లారాణి, వేణు, టీఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శ్రీనివాస్, యూనియన్ నాయకులు ఎన్సీ సైదులు, జిఎన్ రావు, దేవసాయం, చెరుకు వెంకటయ్య, ఎన్.వీరయ్య, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
సూర్యాపేట : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. తిరంగాయాత్రలో భాగంగా శుక్రవారం పట్టణంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి రజాకార్ల వారసులుగా ఉన్న ఎంఐఎంకు భయపడి హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వెనుకంజ వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీలను విస్మరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎండి.హబీద్, నాయకులు నలగుంట్ల అయోధ్య, కొణతం సత్యనారాయణరెడ్డి, రంగినేని ఉమాలక్ష్మణ్రావు, చల్లమల్ల నర్సింహ, రంగరాజు రుక్మారావు, జటంగి వెంకటేశ్వర్లు, బండపల్లి పాండురంగాచారి, అనంతుల యాదగిరి, వల్దాస్ ఉపేందర్, వీరేంద్ర, జీడి భిక్షం, ఫణినాయుడు, నరేందర్రెడ్డి, కత్తి వెంకన్న, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా
సూర్యాపేటరూరల్ : గ్రామపంచాయతీ ఉద్యోగ, వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జీఓ నం.63ను సవరణ చేయాలని సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వక హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు గుమ్మడవెల్లి వెంకటేశం, ఆదిమల్ల సైదులు, చెర్కుపల్లి రాజు, మేకల రవి, బట్టు సుజాత, ఆదిమల్లు నాగయ్య, మోదుగు శేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
250 కిలోల నల్లబెల్లం పట్టివేత
సూర్యాపేట మున్సిపాలిటీ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన ధరావత్ పూర్ణ హైదరాబాద్ నుంచి టాటా ఏసీ వాహనంలో 250 కేజీల బెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తీసుకొస్తున్నాడు. సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పట్టణంలోని కుడకుడ రోడ్డులో పట్టుకున్నారు. వాహనంలో ఉన్న బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. వ్యాపారి పూర్ణపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ శ్రీధర్, ఎస్ఐ హనుమంతు, సిబ్బంది రాములు, బాలాజీ, వీరయ్య, రాంమూర్తి తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ
సూర్యాపేట : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ అన్నారు. శనివారం పట్టణంలోని న్యూవిజన్ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలన్నారు. ప్రతి సంవత్సరం మల్లు పెదరామకృష్ణారెడ్డి మెమోరియల్ అవార్డ్సు అందించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మల్లు సుకవీర్రెడ్డి, ప్రిన్సిపల్ నవనీత, డాక్టర్ కె.కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు
సూర్యాపేట : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల చివరి వారంలో సూర్యాపేట పట్టణంలో మూడు రోజుల పాటు జరగనున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర ఐదు నెలల పాటు 5,500 కిలో మీటర్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల పంపిణీ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇప్పటికి సక్రమంగా అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం ఏకమొత్తంలో రైతు రుణమాఫీ చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో విభజన జరగాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం డివిజన్ నెమ్మాది వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కోట గోపి, జిల్లా కమిటీ సభ్యురాలు బొప్పని పద్మ, వెంపటి గురూజీ, పల్లేటి వెంకన్న, ఎల్గూరి గోవింద్, మట్టిపల్లి సైదులు, వెంకన్న, బొలిశెట్టి యాదగిరిరావు, సత్యం, మామిడి మరియమ్మ, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట : పేదలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్ యంత్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించేలా నిధులు రప్పించి సమకూరుస్తానని తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్ యంత్రంతో చుట్టు పక్కల ప్రజలకు ఎంతో మేలు కలుగనుందన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోతుందని పేర్కొన్నారు. జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఉండేందుకు గాను నాణ్యమైన వైద్యం అందించి సీఎం ఆలోచనలకు అనుగుణంగా వైద్యులు పని చేయాలని సూచించారు. ప్లేట్లెట్ యంత్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, సూర్యాపేట రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మీలా సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ ఇరిగి కోటేశ్వరి, కౌన్సిలర్ బైరు దుర్గయ్యగౌడ్, డాక్టర్ సంపత్కుమార్, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, వై.వి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, ఆకుల లవకుశ, డాక్టర్ వనజ, షేక్ తాహేర్పాషా, టైసన్ శ్రీను, కోడి సైదులు యాదవ్, పల్స వెంకన్న, పిడమర్తి శంకర్, బండారు రాజా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అభివృద్ధికి సీఎం కృషి
సూర్యాపేటమున్సిపాలిటీ : రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. సోమవారం 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. అమరుల కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. తొలిదశ ఉద్యమ పునాదులై మలిదశలో ఉద్యమ భాగస్వాములైన తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇచ్చి పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, వర్కింగ్ ప్రసిడెంట్ కోటేశ్వర్రావు, వెంకటేశం, లక్ష్మారెడ్డి, ముత్తారెడ్డి, అమీద్ఖాన్, వీరయ్య, రామనర్సయ్య, ధర్మయ్య, వెంపటి మనోహర్, కాశయ్య, విశ్వేశ్వర్రావు, మల్లయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినూరు కన్నతల్లితో సమానం
సూర్యాపేట పుట్టినూరు కన్నతల్లితో సమానమని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాలకూరి నారాయణగౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో నూతనకల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికంలో పుట్టి అనేక దుర్భరపరిస్థితులను అనుభవించి ఉన్నత స్థానాల్లోకి వెళ్లినప్పటికీ నెలకొకసారైనా స్వగ్రామాన్ని సందర్శించకుండా ఉండలేనన్నారు. గ్రామానికి చెందిన ఎంతోమంది ఉద్యోగులు తనకు ఆదర్శప్రాయమన్నారు. తనతో అయ్యే ఎలాంటి సహాయసహకారాలైనా గ్రామస్తులకు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంతోమంది పేద విద్యార్థులకు మనమంతా ఆదర్శంగా నిలవాలని తోటి ఉద్యోగులకు సూచించారు. గ్రామానికి చెందిన పగడాల వెంకటనారాయణ, కర్నాటి వెంకటేశ్వర్లును కూడా ఘనంగా సన్మానించారు. ఇటీవల ఐఏఎస్ ర్యాంకు సాధించిన చామకూరి శ్రీధర్ ఫోన్లో తన సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గ్రామానికి చెందిన రేసు శ్రీనివాస్ వ్యవహరించగా గ్రామ శ్రేయోభిలాషులు మెంచు కనకమల్లు, గ్రామానికి చెందిన హసనబాద రాజేష్, డాక్టర్ ఎస్.కృష్ణ, సీహెచ్.శ్రీనివాస్, రాణి, డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ చంద్రయ్య, వైఎస్ ఎంపీపీ లక్ష్మణ్, సర్పంచ్ఘంట నాగార్జున, 1వ వార్డు కౌన్సిలర్ వర్ధెల్లి శ్రీహరి, తాళ్లపల్లి యాదగిరి, పులుసు సాయిబాబా, పులుసు వెంకటనారాయణ, రేసు మల్లేష్, కాంపాటి రాధాకృష్ణ, బెల్లంకొండ రాంమూర్తి, నామాల సోమయ్య, రేసు రాములు పాల్గొన్నారు. -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేట : శాంతిభద్రలలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉచిత బంకమట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయాలకు, పండుగలకు పెద్దపీఠ వేస్తోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) కెమికల్స్ విగ్రహాలతో కాలుష్యం ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు కలిగే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి కాలుష్య నివారణకు కృషి చేయాలన్నారు. మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ సునితామోహన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, కక్కిరేణి నాగయ్యగౌడ్, కౌన్సిలర్లు వర్ధెల్లి శ్రీహరి, ఆకుల లవకుశ, నిమ్మల వెంకన్న, తాహేర్పాషా, రంగినేని ఉమా, డాక్టర్ వనజ, నర్సింహ, పోలెబోయిన రాధిక, నేరేళ్ల మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధే ధ్యేయం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలెబోయిన రాధిక, ఆకుల లవకుశ, డీఈ వెంకటేశ్వర్రావు, సూర్గి శంకర్, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓ కార్యాలయానికి భవనాల పరిశీలన
సూర్యాపేట : నూతనంగా జిల్లా కాబోతున్న సూర్యాపేటలో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం(డీఎంహెచ్ఓ) ఏర్పాటుకు శుక్రవారం డీఎంహెచ్ఓ భానుప్రసాద్ నాయక్ పట్టణంలో పలు భవనాలను పరిశీలించారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భాగంలోని క్వార్టర్స్ను, పాత ఆర్డీఓ కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల ప్రతిపాదనలను కలెక్టర్కు పంపనున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్, ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రమేష్నాయక్, మాండన్ సుదర్శన్, తీగల నర్సింహ, భాస్కరరాజు, సల్వాది శ్రీనివాస్, పోతరాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పైలేరియా నివారణకు కృషి చే యాలి
సూర్యాపేటటౌన్ : పైలేరియా వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. మంగళవారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డీఈసీ ఆల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన పైలేరియా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఈ మాత్రలు రెండు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, దర్ఘీకాలిక వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నేరేళ్ల లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, సీనియర్ సబ్లిక్ హెల్త్ అధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డాక్టర్ ఎల్.రమేష్నాయక్, సబ్ యూనిట్ అధికారులు సముద్రాల సూరి, తీగల నర్సింహ, గవ్వా శ్రీధర్రెడ్డి, మనోజ్రెడ్డి, వెంకన్న, ఉపేందర్, నర్సింహ, ఉప్పల్రెడ్డి, ఇ.లోకేందర్, సబిత, నాగమణి, ఏకస్వామి, పద్మమ్మ, భిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలను నెలకొల్పాలి
సూర్యాపేట : వివేకానందుని సూక్తులను స్ఫూర్తిగా తీసుకొని యువకులు నూరు శాతం బంకమట్టి విగ్రహాలను నెలకొల్పాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ వి.సునితామోహన్లు అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బంకమట్టి వినాయక విగ్రహాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖల అ«ధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతి«థులుగా హాజరై ప్రసంగించారు. పీఓపీ విగ్రహాలకు బదులుగా బంకమట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, మేనేజర్ రాంచందర్రావు, తహసీల్దార్ మహమూద్అలీ, సీఐ మొగలయ్య, నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్ ఎస్ఐ జాఫర్, వివిధ పార్టీల మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు ఆకుల లవకుశ, షాహినాబేగం, అనంతుల మల్లీశ్వరి, ఎల్గూరి జ్యోతి, వల్దాస్ దేవేందర్, రంగినేని ఉమా, నాగవెల్లి బ్రహ్మయ్య, మహిళా పొదుపు సంఘాల సభ్యురాళ్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్యాన్ని అందించాలి
సూర్యాపేటటౌన్ : నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తబస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక ఆసుపత్రిని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి ఎదుట మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు గంట దయాకర్రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్, రాజమనోహర్రెడ్డి, డాక్టర్ శిల్ప, మధుబాబు, చింతరెడ్డి వినీల, పాపిరెడ్డి, ఎన్వి రావు, యామా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో ఉన్న కేతేపల్లి మండలాన్ని ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో కలిపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మండలాన్ని సూర్యాపేట జిల్లాలో విలీనం చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చేందుకు మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కేతేపల్లిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమంలో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున ప్రజలతో నల్లగొండకు వెళ్లి జిల్లా కలెక్టరేట్కు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి మండల ప్రజలు, మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన జె.వెంకటనర్సయ్యయాదవ్, కోట మల్లికార్జునరావు, కోట పుల్లయ్య, కె.ప్రదీప్రెడ్డి, ఎ.జోగిరెడ్డి, కోట లింగయ్య, చందా రామ్మూర్తి, బి.జాన్రెడ్డి, కోట సంపత్రావు, ఎన్.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్లో విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేశాయని.. ఆ పోరాటంలో బాలస్వామి, విష్ణువర్ధన్రెడ్డి, రామకృష్ణ వంటి నాయకులను కాల్పులు చేసి చంపిందన్నారు. నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ చార్జీలను పెంచి పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గురూజీ, మట్టిపల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు, పెంటయ్య, రాంచరణ్, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పేట’లో గంజాయి మాఫియా
సూర్యాపేట గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలో విస్తరించిన ఈ మాఫియా.. చిన్నారులు మొదలు.. ఇంజినీరింగ్ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. మత్తుకు అలవాటుపడుతున్న యువకులు›తల్లిదండ్రులను చితకబాదడం ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి వారితో సంబంధాలు ఏర్పరుచుకుని ఈదందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న యువతకు గంజాయిని అందిస్తూ జీవితాలు బుగ్గిచేస్తున్నారు. పట్టణ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న బొడ్రాయి బజార్, పాత వ్యవసాయ మార్కెట్, రాజీవ్నగర్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, ఇందిరమ్మ కాలనీల్లో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. కొంతమంది యువకులు మధ్యవర్తులుగా ఉండి విద్యార్థులు, యువతకు చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో టిప్పర్, బొలేరో వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. యువతకు గంజాయి అందిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు పెట్టినా ఈ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా.. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి రవాణా కొనసాగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాల ప్రహరీని ఆనుకొని కొందరు వాహనాల్లో వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తుకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు తమ జీవితాలను చిత్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బొడ్రాయిబజార్కు చెందిన కొందరు యువకులు కూడా గంజాయి రవాణాలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నంబరు ప్లేట్లు లేని కార్లను వినియోగిస్తూ.. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం – వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశాం. నర్సాపూర్, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. గంజాయి వాడుతూ దొరికిన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయం.. ఏకంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. గంజాయి రవాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. చెడు అలవాట్లను మాన్పించే బాధ్యత తల్లిదండ్రులదే. -
విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) : చదువుకు పేదరికం అడ్డుకాదని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించి నేడు గ్రూప్ 1 ఆఫీసర్గా మీ ముందుకొచ్చానని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇమాంపేట ఆదర్శపాఠశాలలో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే డిక్షనరీల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం చదువని, ఆ ఆయుధంతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు. అమ్మా పౌండేషన్ వ్యవస్థాపకులు పోలా గాంధీ, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
సూర్యాపేట : సీపీఐ బలోపేతానికి బలమైన ఉద్యమాలను నిర్వహించేందుకు శాఖ స్థాయి నుంచే పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ధర్మబిక్షం భవన్లో పార్టీ నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మగాని ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కేవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను, సంక్షేమాన్ని కాపాడుకోవడానికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కమ్యునిస్టు పార్టీ కార్యకర్తలు బలపడాలని కోరారు. దోరెపల్లి శంకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, బొమ్మగాని వెంకటయ్య, అనంతుల మల్లీశ్వరి, ఖమ్మంపాటి అంతయ్య, జానిమియా, పొలగాని వీరభద్రం, పాషా, రాము, సత్యనారాయణ, మురళి, పద్మరేఖ, రాములు, విద్యాసాగర్, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేటలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను శుక్రవారం సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట ఎంపీడీఓ, స్త్రీశక్తి భవనం, పాత మున్సిపల్ , సహకార బ్యాంకు కార్యాలయం, మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల్లో జిల్లా కార్యాలయాలు అనువుగా నెలకొల్పిందేందుకు వీలుగా ఉన్నాయా.. లేవా.. అని చూశారు. భవనాల పరిస్థితి, వాటి అంచనాలను రికార్డుల్లో నమోదు చేయించారు. ఆయన వెంట తహసీల్దార్ మహమూద్ అలీ, ఆర్ఐలు ప్రభుకుమార్, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పెదపంగు పూర్ణశశికాంత్ అన్నారు. శుక్రవారం స్థానిక గౌతమి డిగ్రీ కళాశాలలో మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని మొదటి సంవత్సరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కీత యాదగిరి, దైద వెంకన్న, మీసాల ప్రసాద్, కొండ రవి, అనిత, సాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఆర్డీఆర్ పరామర్శ
సూర్యాపేటరూరల్ : మండలంలోని కాసరబాదలో కాంగ్రెస్పార్టీ పేట పట్టణ అధ్యక్షుడు అబ్దుల్రహీం మామగారైన తన్నీరు సత్యం(75) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని గురువారం రాంరెడ్డి దామోదర్రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే రామారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన బొడ నర్సయ్య(80) ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నర్సయ్య కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు కొప్పుల వేణారెడ్డి, డీసీసీబి డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, ఉపసర్పంచ్ కోతి గోపాల్రెడ్డి, సింగిల్విండో డైరక్టర్ చిలుముల సునీల్రెడ్డి, నాయకులు గట్టు శ్రీను, పాలవరపు వేణు, మిద్దే రమేష్, పల్సా మనోజ్గౌడ్, ఉయ్యాల మల్సూర్, పల్స వెంకటయ్య, మేకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారుల మన్ననలు పొందాలి
సూర్యాపేట : మన్నిక గల వాహనాలను వినియోగదారులకు అందించి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి వెంట నూతనంగా నిర్మించిన వెంకటలక్ష్మి హీరో షోరూం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనదారుల మన్ననలు పొందినప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, వైస్చైర్ పర్సన్ నేరెళ్ల లక్ష్మి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, వట్టె జానయ్య యాదవ్, వంశీ, గండూరి ప్రకాష్, ఎంవీఐ కొండయ్య, హీరో కంపెనీ అధికారులు స్వామినాథన్, కరంచందాని, కిరణ్కుమార్, హీరో డీలర్ రాచర్ల కమలాకర్, మొరిశెట్టి శ్రీనివాస్, నాగిరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వర్లు, చల్లా లక్ష్మికాంత్, చల్లా లక్ష్మిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి
సూర్యాపేటటౌన్ : నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ డివిజన్తోపాటు కేతేపల్లి మండలాన్ని కూడా కలపాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెద్దిరెడ్డి రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడను రాజకీయ ఒత్తిళ్ల మేరకు నల్లగొండ జిల్లాలోనే కొనసాగిస్తున్నట్టు ముసాయిదాలో ఉందన్నారు. ప్రస్తుత ముసాయిదా బిల్లు ప్రజలకు అనుకూలంగా లేదని, ప్రజల అభిప్రాయాల మేరకు మిర్యాలగూడ, కేతేపల్లిని సూర్యాపేటలో కలిపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిష్కార వేదిక అధ్యక్షుడు పాల్వాయి జానయ్య, నవీన్, నాగరాజు, వెంకన్న, సైదులు, రాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
సూర్యాపేటరూరల్ : యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట–జనగాం రోడ్డుపై యర్కారం స్టేజీ వద్ద యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ రెండు గంటల పాటు టీవీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు విద్యాబ్యాసానికి దూరమవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి హామీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మోదాల భిక్షపతి, మెడిగ శ్రీకాంత్, ఆవుదొడ్డి పరమేష్, కుమ్మరికుంట్ల సాయిబాబా, మర్యాద ప్రవీణ్, శ్రీను, సైదులు, గౌతమి, భవాని, సంధ్య, వాణి, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న బాలిక మృతి
సూర్యాపేటరూరల్ : తల్లితో గొడవపడి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం మండలంలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన బాషపంగు మహేశ్వరి(16) తల్లి పద్మను కొత్త డ్రస్ కొనివ్వమని అడగడంతో ప్రస్తుతం కొనివ్వలేనని చెప్పింది. దీంతో ఆవేశానికి లోనైన మహేశ్వరి జూన్ 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకుంది. గాయాలపాలైన మహేశ్వరిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతున్న మహేశ్వరి మంగళవారం మృతి చెందింది. ఈ మేరకు పోస్ట్మార్టం చేయించి మృతదేహాన్ని తల్లి పద్మకు అప్పగించామన్నారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం
సూర్యాపేటటౌన్ : పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు విమర్శించారు. సోమవారం స్థానిక గాంధీపార్కులో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు పేదలకు, వ్యవసాయ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, బచ్చలకూరి రాంచరణ్, నల్లమేకల అంజయ్య, శేఖర్, చింతలచెర్వు భిక్షం, సాంబయ్య, బాబు, నర్సిరెడ్డి, బండారు నాగయ్య, రేణుక, పద్మ, సైదులు, బిక్షం, లింగానాయక్, రాంబాబు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి
సూర్యాపేట : రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి 148వ జయంతి సందర్భంగా నిర్వహించిన స్మారక క్రీడోత్సవాల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం పట్టణంలోని రెడ్డి హాస్టల్లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెంకట్రామరెడ్డి ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రెడ్డి హాస్టల్లో కేవలం ఒకే కులానికి కాకుండా అందరికి వసతి కల్పించడం అభినందనీయమన్నారు. రెడ్డి హాస్టల్లో యూత్ లీడర్షిప్ అవసరముందన్నారు. హాస్టల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు హాస్టల్ గుర్తుండేలా చేయాలని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక, సోమా భరత్కుమార్, మర్రి లక్ష్మారెడ్డి, వెదిరె రాంమోహన్రెడ్డి, పోరెడ్డి మధుసూదన్రెడ్డి, యానాల యాదిగిరిరెడ్డి, డాక్టర్ కరుణాకర్రెడ్డి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, బైరు దుర్గయ్యగౌడ్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, కోడి సైదులుయాదవ్, నల్లపాటి అప్పారావు, పటేల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పేట’తో పాతికేళ్ల అనుబంధముంది
సూర్యాపేట : సూర్యాపేట పట్టణానికి నేను కొత్తేమి కాదని, పేటతో నాకు పాతికేళ్ల అనుబంధం ఉందని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన మర్చంట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేటలోని వ్యాపారులతో తనకు దగ్గరి సంబంధాలు, మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెనాలికి వెళ్లేటప్పుడు ఎక్కువగా సూర్యాపేటలోనే ఆగి విశ్రాంతి తీసుకున్నానని పేర్కొన్నారు. సూర్యాపేటకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రముఖ పట్టణం ఉందంటే అది సూర్యాపేటేనని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పేటకు పూర్వ వైభవం తీసుకొచ్చే సమయం కేవలం రెండు రోజులు మాత్రమే ఉందని నిండు సభలో తెలపడంతో వ్యాపారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సూర్యాపేట ఆర్యవైశ్య సంఘానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రకటించిన అవార్డును రోశయ్య చేతుల మీదుగా ఆ సంఘం సభ్యులు మురళీధర్, ఈగా దయాకర్, విద్యాసాగర్, గోపారపు రాజులకు అందజేశారు. అలాగే ఈ నలుగురికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నతపదవులు కట్టబెట్టనున్నట్టు ప్రపంచ మహాసభ ఆర్యవైశ్య అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్త, ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మాండ్లపల్లి మురళీధర్గుప్త, ఈగా దయాకర్, నరేంద్రుని విద్యాసాగర్, రవీందర్, వీరెల్లి లక్ష్మయ్య, మల్లిఖార్జున్, ఉప్పల శారద, ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, దైవాదినం, నూకా వెంకటేశంగుప్త, బాలచంద్రుడు, గోపారపు రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రోశయ్యకు స్వాగతం పలికిన మంత్రి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మర్చంట్స్ డే కార్యక్రమానికి హాజరైందుకు వస్తూ ముందుకు పట్టణంలోని రహదారి బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పూలబోకె అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు టీఆర్ఎస్ నాయకులు కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, మోదుగు నాగిరెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, కటికం శ్రీనివాస్, కోడి సైదులుయాదవ్, తూడి నర్సింహారావు తదితరులు ఉన్నారు. -
జోనల్ విధానం రద్దు సరైన చర్య కాదు
సూర్యాపేటటౌన్ : సరైన అవగాహన లేకుండా అత్యంత ప్రాధాన్యత గల జోనల్ విధానాన్ని రద్దు చేయడం సరైన చర్య కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం(ఎస్టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సంఘం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ తెలంగాణలో పది జిల్లాలు ఒకే రకంగా అభివృద్ధి చెందలేవని, దీంతో జోనల్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అన్ని జిల్లాలు సమానం కావడంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకకు నెట్టబడే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్రూల్స్ అమలుకై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.యతిపతిరావు, కె.వీరరాఘవులు, కె.చంద్రమౌళి, మధు, బొలిశెట్టి వెంకటేశ్వర్లు, సత్తయ్యగౌడ్, జలంద్రాచారి, గోపాలరావు, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : ప్రస్తుత సమాజంలో చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి హాస్టల్ అధ్యక్షుడు డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి స్మారక 24వ జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఏదేని క్రీడను ఎంచుకొని అందులో రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి, గ్రామానికి, కళాశాలలకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. వ్యక్తిగత ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి స్మారక క్రీడోత్సవాల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పోరెడ్డి మధుసూదన్రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి, పీఈటీలు వెంకటేశ్వర్లు, ఐతగాని శ్రీనివాస్గౌడ్, తంగెళ్ల సురేందర్రెడ్డి, లింగాల రవిగౌడ్, విక్రంరెడ్డి, రాంబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో ఆర్డీఆర్ పూజలు
సూర్యాపేట మున్సిపాలిటీ : పట్టణంలోని తాళ్లగడ్డలో గల ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శనివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి కరుణించి వర్షాలు పడి రైతులకు కలిసొచ్చి పంటలు పండేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలో నియోజకవర్గంలో అన్ని పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, బైరు వెంకన్నగౌడ్, బైరు శైలెందర్గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్ఎంల ధర్నా
సూర్యాపేట : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు శనివారం సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, గురూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచి జీఓ 14ను విడుదల చేసినప్పటికీ అందులో రెండో ఏఎన్ఎంలను గుర్తించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మంది సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పదో పీఆర్సీ ప్రకారం.. నెలకు రూ.21,300 వేతనం పెంచి, ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పీఎస్ డీఎస్వీ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు రమాదేవి, కల్యాని, యశోద, సువర్ణ, దేవేంద్ర, స్వప్న, రజియాబేగం, కవిత, కమల, భారతి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికుల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్దన్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీపార్కులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీల్లో 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేక వేతనాల పెంపుదల చట్టబద్దమైన సౌకర్యాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులచేయాలని కోరారు. కార్యక్రమంలో గురూజీ, నాతి సవీందర్, గంట నాగయ్య, బొమ్మగాని శ్రీనివాస్, కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీనివాస్, నీలా శ్రీనివాస్, సైదులు, వై.వెంకటేశ్వర్లు, శంకర్, లక్ష్మి, సరి, జయమ్మ, రమేష, వెంకన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన lమాట్లాడుతూ రెండు సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాసరావు, సృజన, భట్టు శివాజీ, బొమ్మగాని శ్రీనివాస్, పుట్టపాక శ్రీనివాస్, కోటయ్య, సిరపంగి నాగరాజు, కొండల్, లతీఫ్, రాంరెడ్డి, అంతయ్య, దోరెపల్లి శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మూసీ కాల్వలకు మరమ్మతులు
సూర్యాపేటరూరల్ : ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా ఉన్న మూసీ కాలువలు కొన్ని రోజులుగా శుభ్రం అవుతున్నాయి. పిల్లలమర్రి గ్రామంతో పాటు చాలా గ్రామాల్లోని మూసీ కాలువలు ఉపాధిహామీ పథకం కింద కూలీలు చెత్తాచెదారం, కంపచెట్లను తొలగిస్తున్నారు. అన్ని గ్రామాల్లోని మూసీ కాలువలు శుభ్రం చేయడంతో పాటు తూములు మరమ్మతు చేస్తే మూసీ ప్రాజెక్ట్ ఆయకట్టు వరకు సాగునీరు అందుతాయని రైతులు పేర్కొంటున్నారు. కాలువలు శుభ్రం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పబ్లిక్ క్లబ్లో షటిల్ కోర్టు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : అత్యాధునిక హంగులతో పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో నిర్మించిన ఉడెన్ షటిల్ కోర్టును సోమవారం క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 42లక్షలతో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా షటిల్ కోర్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యాదేశ్వర్రావు, కార్యవర్గ సభ్యులు రవి, శ్రీనివాసరావు, కేశవరెడ్డి, శంకర్రెడ్డి, బాబు, సయ్యద్సలీం, గోపాల్రావు, భీష్మారెడ్డి, చకిలం రాజేశ్వర్రావు, బైరు వెంకన్నగౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, అబ్దుల్రహీం, అయూబ్ఖాన్, అంజద్అలీ, చెంచల శ్రీను, తోట శ్యాం, స్వామినాయుడు, షేక్ జహీర్, ఆలేటి మాణిక్యం, ఎన్.దశరథ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
సూర్యాపేట : వ్యవసాయ కార్మికులకు 2016లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్లో నిర్వహించిన వ్య.కా.స డివిజన్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల పోరాటం వల్ల చట్టాలు, జీఓలు వచ్చినా వాటిని గ్రామ స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు బొప్పని పద్మ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెమ్మాది వెంకటేవ్వర్లు, మట్టిపల్లి సైదులు, చినపంగి నర్సయ్య, పల్లేటి వెంకన్న, వెంకన్న, రాంచరణ్, అంజయ్య, బాబు, పారిజాత, బిక్షం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా యాతాకుల వెంకన్న, మట్టిపల్లి సైదులును ఎన్నుకున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో మొబైల్ షాపు దగ్ధం
సూర్యాపేట మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్తో ఓ మోబైల్ షాపు దగ్ధమైన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పూలసెంటర్లో గల గౌస్ మోబైల్స్ దుకాణాన్ని శనివారం రాత్రి రోజుమాదిరిగానే బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూటై దుకాణం నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన చుట్టుపక్కల వారు దుకాణ యజమానికి సమాచారం అందించారు. యజమాని వెంటనే లబోదిబోమంటూ దుకాణం వద్దకు చేరుకునే సరికి రూ. 20 లక్షల ఆస్తి బుగ్గిపాలైపోయింది. దుకాణంలో ఉన్న విలువైన మోబైల్స్, ఇతర సామగ్రి పూర్తి కాలిబూడిదైపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వై.మొగలయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు గౌస్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
రెండు బైక్లు ఢీ.. ఒకరు మృతి
సూర్యాపేటరూరల్ : రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, సోలిపేట గ్రామాల మధ్య రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అంతటి నర్సయ్య(33) అర్వపల్లి మండలంలో బంధువుల ఇంటికి పండుగకు వెళ్లాడు. తిరిగి 7 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్పై వస్తున్నాడు. ఇదే క్రమంలో తుంగతుర్తి మండలం శాంతినగర్కు చెందిన కలీం రామచంద్రాపురం వైపు నుంచి తుంగతుర్తికి బైక్పై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అంతటి నర్సయ్య అక్కడిక్కడే మృతి చెందగా, కలీంకు చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. బైక్లు రెండు దెబ్బతిన్నాయి. వెంటనే 108 సిబ్బంది గాయాలపాలైన కలీంను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన
సూర్యాపేట : ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో సన్న బయ్యం మార్చి దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వార్డెన్లు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీజీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ఖాళీ ప్లేట్లతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో సన్న బియ్యం ఏర్పాటు చేస్తుంటే కొంత మంది ఉపాధ్యాయులు, వార్డెన్లు దొడ్డు బియ్యం వండిస్తున్నారని ఆరోపించారు. విద్యాధికారులు స్పందించి సన్నబియ్యం మాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సైదుల సాయి, కూజ ఎల్లేష్, ఆకారపు నిరంజన్, సతీష్, వీరారెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
సూర్యాపేట మున్సిపాలిటీ శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సంతోషిమాతను ప్రత్యేక ఊయలలో పరుండబెట్టి పవళింపు సేవ నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, దయాకర్, సురేష్, విద్యాసాగర్, పాపిరెడ్డి, శ్రీకాంత్, పురుషోత్తం, జగన్నాథశర్మ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
సూర్యాపేట : పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు ఇవ్వాలని సీపీఎం డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు నూకల మధుసూదన్రెడ్డి, పట్టణ కార్యదర్శి కోట గోపిలు డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ సమావేశం ఎంవీఎన్ భవన్లో వల్లపుదాసు సాయికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కాకముందే అధికార పార్టీ కౌన్సిలర్లు పంచుకొని అమ్ముకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతుందన్నారు. అనేకమంది ఇళ్లు లేక ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారన్నారు. దరఖాస్తులు గతంలో పెట్టిన వారిని పరిశీలించి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెంటయ్య, భాస్కర్, వెంకన్న, లక్ష్మయ్య, వెంకటరెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా
మున్సిపాలిటీ : సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. మంగళవారం పట్టణంలోని 27వ వార్డులోని ప్రియాంక కాలనీలో మెటల్ రోడ్డు పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు వచ్చినప్పుడు పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి అందివ్వాలన్నారు. అనంతరం కాలనీలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్ బైరు దుర్గయ్యగౌడ్, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, టైసన్ శ్రీను, దేశగాని శ్రీనివాస్, డీఈ వెంకటేశ్వర్రావు, కాంట్రాక్టర్లు వెంకటరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాసభ ఏర్పాట్ల పరిశీలన
సూర్యాపేట : నాటి తెలంగాణ మహాసభ స్ఫూర్తితో.. నేటి సామాజిక తెలంగాణ ఆర్తి కోసం ఆగస్టు 11న సూర్యాపేటలోని గాంధీపార్కులో నిర్వహించతలపెట్టిన తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తుల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని గాంధీపార్కులో మహాసభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ గడ్డ విముక్తి కోసం ఆగస్టు 11న 1997లో ఇదే సూర్యాపేట గడ్డపై డాక్టర్ చెరుకు సుధాకర్ నాయకత్వంలో వేలాది మందితో మహాసభను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఇదే మహాసభను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఏర్పాటయ్యాక స్ఫూర్తిసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు తెలంగాణ వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూవీ నాయకులు అనంతుల మధు, నాగేశ్వర్, కిరణ్, శేషు, వినోద్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
క్రీడలతో ఉల్లాసం
సూర్యాపేట : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రెండో అదనపు జిల్లా జడ్జి షేక్ రజాక్ ఉజ్ – జమ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తి పరంగా ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతారని, అలాంటి సమయంలో క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ మెజిస్ట్రేట్ డి.నర్సింహాచార్యులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూరి వెంకటేశ్వర్రావు, న్యాయవాదులు జె.శశిధర్, నలగుంట్ల అయోధ్య, తల్లమల్ల హస్సేన్, ఎం.వెంకట్రెడ్డి, కె.లింగయ్య, మీలా రమేష్, రామరాజు, సుంకరబోయిన రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రంధి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష తులసిపూజ
సూర్యాపేటటౌన్ : బదరినారాయణ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆదివారం లక్ష తులసిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ నారాయణమంత్రాన్ని లోకానికి అందించిన బదరీనారాయణ మంత్రాన్ని పఠించిన వారికి మాత్రమే మోక్షం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది పఠించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్వీ సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణ, కృష్ణమూర్తి, రవీందర్, మంజుల, అరుణ, నాగమ్మ, మాధవరావు, అరుణ, సరోజ, సంకర్షణాచార్యులు, శ్రీహరిఆచార్యులు, ఫణికుమారాచార్యులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రేపు సుదర్శన హోమం ఈ నెల 9న మంగళవారం శ్రీసుదర్శన జయంతి సందర్భంగా దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నట్టు దేవాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. -
ఘనంగా బోనాల పండుగ
సూర్యాపేట బోనాల పండుగను ఆదివారం సూర్యాపేట పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కృష్ణటాకీస్ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ గుడిలో ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించారు. వివిధ పార్టీల నాయకులు పటేల్ రమేష్రెడ్డి, తండు శ్రీనివాస్యాదవ్, బైరు వెంకన్నగౌడ్, శనగాని రాంబాబుగౌడ్, పెద్దిరెడ్డి రాజా, ముశం రవికుమార్, షఫిఉల్లా, గోదల రంగారెడ్డి, బూర బాలసైదులుగౌడ్, వెలుగు వెంకన్న, పొదిల రాంబాబు, బైరు దుర్గయ్యగౌడ్, వెలుగు సంతోషి, తాహేర్పాషా, వల్దాసు దేవేందర్, సుష్మారాణి, అనంతుల యాదగిరి, టైసన్ శ్రీను, దేవస్థానం కమిటీ సభ్యులు సారగండ్ల రాములు, గుంటి సైదులు తదితరులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం పట్టణంలోని వేలాది మంది భక్తులు ఊరేగింపుగా వచ్చి బోనాలు చెల్లించారు. సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బోనం ఎత్తుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఇన్స్పెక్టర్ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే పట్టణంలోని 1, 7, 8 వార్డుల్లోని ముత్యాలమ్మ దేవాలయాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటమైసమ్మ బజార్లో... పట్టణంలోని మార్కెట్రోడ్డులోని కోటమైసమ్మ బజార్లో గల కోటమైసమ్మ దేవాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పటేల్ రమేష్రెడ్డి పూజలు నిర్వహించారు. రమేష్రెడ్డిని వార్డు కౌన్సిలర్ వెలుగు సంతోషి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షఫీఉల్లా, వల్దాస్ దేవేందర్, దారోజు జానకిరాములు, వెలుగు వెంకన్న, నరేడ్ల సోమయ్య, నాగభూషణం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. గౌండ్ల బజార్లో... పట్టణంలోని గౌండ్ల బజార్లో బోనాల పండుగ సందర్భంగా పోతరాజుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన వారిలో గోపగాని వెంకటనారాయణగౌడ్, బైరు వెంకన్నగౌడ్, బైలు శైలెందర్గౌడ్, పరుశరాములు, నాగరాజు, మహేష్ తదితరులు ఉన్నారు. -
21న సూర్యాపేటకు తమిళనాడు గవర్నర్ రాక
సూర్యాపేట : ఈ నెల 21వ తేదీన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సూర్యాపేటలోని జమ్మిగడ్డలో గలసుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించనున్న మర్చంట్స్డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బ్రాహ్మాండపల్లి మురళీధర్గుప్త తెలిపారు. శనివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల 21న మర్చంట్స్డే, ఆర్యవైశ్య జనాభాగణనకు సంబంధించిన వెబ్సైట్ను పూర్తి వివరాలతో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ రోశయ్యతో పాటు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నిజామాబాద్ఎమ్మెల్యే బీగాల గణేష్గుప్తా, గిరీష్సంఘీ, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, వీరెల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఈగ దయాకర్, గోపారపు రాజు, నూక వెంకటేశం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సువెన్’ సేవలు అభినందనీయం
సూర్యాపేటరూరల్ : సమాజ అభివృద్ధికి సువెన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం సువెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీలో ఏర్పాటు చేసిన శాంతినగర్, కేసారం, దురాజ్పల్లి, ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెంచీలు, నోట్బుక్స్ షూ, సాక్స్, టై, బెల్ట్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనూ కంపెనీ భాగస్వామ్యం కావాలని, మొక్కలను నాటడమే కాకుండా..వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల విలువైన స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్ మహమూద్అలీ, ఎంఈఓ గ్లోరి, సర్పంచ్ బాలిని పద్మ, లింగస్వామి, ఎంపీటీసీ సూర సంధ్య, వెంకన్న, సువెన్ యూనిట్ హెడ్ వి.ఎస్ఎన్ మూర్తి, డీజీఎం బి.లక్ష్మణమూర్తి, ఏజీఎంలు సి.హెచ్ వీరయ్య, ఎం.కృష్ణారావు, పి.జగపతిరాయుడు, చంద్రహాస, రసూల్మదీన, ఎం.వెంకటరమణ, మేనేజర్లు డి.సుధాకర్, డి.వి శేషగిరిరావు, పి.వెంకటరమణ, పీఆర్ఓ బూర రాములుగౌడ్, పాఠశాలల హెచ్ఎంలు సురేష్, కట్కూరి రవీందర్రెడ్డి, నాగార్జున్రెడ్డి, నీరజ, మంగతాయారు పాల్గొన్నారు. -
ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి
సూర్యాపేట : ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ జిల్లా కిలాషాపురంలో ప్రారంభమైన బస్సుయాత్ర నల్గొండ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు తిరుగుతూ సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీపార్కులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పి మీరా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఆగస్టు 18 వరకు ప్రభుత్వం గీత కార్మికులు పెట్టిన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులను కదిలించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి గౌడకులస్తులు, మోకుముస్తాదులతో, తాటిమట్టలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు గోపగాని వెంకట్నారాయణగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్, ఎల్గూరి గోవింద్, వర్ధెల్లి బుచ్చిరాములు, జలగం శ్రీనివాస్, బూడిద గోపి, ఉయ్యాల నగేష్, జ్యోతి, లక్ష్మణ్గౌడ్, బైరు వెంకన్నగౌడ్, కసగాని లక్ష్మి, బైరు శైలేందర్గౌడ్, పొలగాని బాలుగౌడ్, జెర్రిపోతుల కృష్ణ, మడ్డి అంజిబాబు, కృష్ణ, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. -
‘కేఎస్రెడ్డి’ పాఠశాలలో బోనాల పండుగ
సూర్యాపేటమున్సిపాలిటీ : పట్టణంలోని విద్యానగర్లో గల కేఎస్రెడ్డి మోడల్ స్కూల్లో సోమవారం విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి పాఠశాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. -
‘ హరితహారం ’ దేశానికే ఆదర్శం
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం బాలరాజు గురువు అయిన నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజరత్నం పదవీ విరమణ సందర్భంగా ఆయన నివాసానికి చేరుకొని వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటే రోజు 155 కిలోమీటర్ల మేర లక్షా 50 వేల మందితో ఒకేసారి మొక్కలు నాటించడం అద్భుతమన్నారు. బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రమే మొక్కలు నాటడంలో నిలిచిందన్నారు. హైవేకు రెండు వైపులా మొక్కలు నాటి ఉండడం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని మిషన్ భగీరథ, కాకతీయ, వసతిగృహాలకు సన్న బియ్యం పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. గురువులు నేర్పిన సామాజిక స్పృహలతోనే నేడు ఈ రోజు రాజకీయంగా ఎదగలిగామన్నారు. తల్లిదండ్రుల పాత్ర కంటే గురువు పాత్ర గొప్పదన్నారు.అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజరత్నం కుటుంబ సభ్యులు గువ్వల బాలరాజును గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్యాంసుందర్రెడ్డి, మధుసూదన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పేట’ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం కరీంనగర్లో నిర్వహించిన స్టేట్ లెవల్ కాన్ఫరెన్స్లో అభినందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, కమిషనర్ వడ్డె సురేందర్లు కార్యక్రమంలో ప్రసంగిస్తూ పేటలో చేపట్టి అమలు చేస్తున్న ఉండమ్మా బొట్టుపెడతా, మన వార్డుకు మంచి రోజులు, మన విధి–మన వీధి, రెవెన్యూ సదస్సులు తదితర కార్యక్రమాలను వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ చైర్పర్సన్, కమిషనర్లను అభినందించి.. కాన్ఫరెన్స్లో సూర్యాపేట మున్సిపాలిటీలో చేపట్టిన పనులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్లో జరిగిన కాన్ఫరెన్స్లో వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మితో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
సూర్యాపేట టౌన్ : ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ధర్మభిక్షం భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎంసెట్ –2 పేపర్ లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. సంబంధిత అధికారులు, వ్యక్తులపై సీబీఐతో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని, విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎంసెట్–2 లీకేజీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని, సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించాలన్నారు. వర్షాకాలంలో ప్రబలుతున్న అంటువ్యాధులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎల్, పట్టణ కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ అనంతుల మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలో విఫలమైందని బీజేపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జీవీవీ గార్డెన్స్లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. ఈనెల 7న హైదరాబాద్లో ప్రధానమంత్రి మోడీ మహాసమ్మేళనం జరగనున్న నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేరడమే మోడీ లక్ష్యమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలైన దాఖలాలు కన్పించడం లేదని విమర్శించారు. ఎంసెట్–2 లీకేజీకి కారకులైన కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అ«ధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్ర వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్రావు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, నగిరి మనోహర్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, దాసరి మల్లేశం, ఓరుగంటి రాములు, నల్లగుంట్ల అయోధ్య, అబిద్, లక్ష్మణ్రావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్–2 పేపర్ లీకేజీ చేసిన వారిని శిక్షించాలి : సంకినేని
సూర్యాపేట : ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్లో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలన్నారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు నలగుంట్ల అయోధ్య, హబీద్, చల్లమల్ల నర్సింహ, కొండేటి ఏడుకొండల్, బండపల్లి పాండురంగాచారి, జీడి భిక్షం, పొదిల రాంబాబు, వెంకట్రెడ్డి, అనంతుల యాదగిరి, జనార్దన్, కిరణ్, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలోకి రావడమే లక్ష్యం
సూర్యాపేట: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా సంకినేని వెంకటేశ్వర్రావుకు సోమవారం పట్టణంలోని హైమాగార్డెన్లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తనకు ఏనాడూ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశ లేదని, రాష్ట్ర నాయకత్వం అప్పగించడంతోనే స్వీకరించానని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బంగారు తెలంగాణ అని చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి రాజకీయం చేసే వ్యక్తి సంకినేని అనిఅన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. పట్టణ అధ్యక్షుడు హబీద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మధుసూదన్రెడ్డి, మల్లేశం, సులోచన, ఓరుగంటి రాములు, సాంబయ్య, గోలి ప్రభాకర్, కూతురు శ్రీనివాస్రెడ్డి, నాయకులు లింగయ్య, రాములు, కొణతం సత్యనారాయణరెడ్డి, పాండురంగాచారి, నల్లగుంట్ల అయోద్య, రుక్మారావు, సుజాత, కాసోజు సుమలత, కొండేటి ఏడుకొండల్, రంగినేని ఉమాలక్ష్మణ్రావు, చల్లమల్ల నర్సింహ్మ, కిషన్, వెంకట్రెడ్డి, రామగిరి నగేష్, భాస్కర్, నర్సింహ్మరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, జీడి భిక్షం, గార్లపాటి మమతారెడ్డి, రాణి, వీరేంద్ర, కిరణ్, ఫణినాయుడు, నరేష్, అనంతుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలోకి రావడమే లక్ష్యం
సూర్యాపేట: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా సంకినేని వెంకటేశ్వర్రావుకు సోమవారం పట్టణంలోని హైమాగార్డెన్లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తనకు ఏనాడూ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశ లేదని, రాష్ట్ర నాయకత్వం అప్పగించడంతోనే స్వీకరించానని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బంగారు తెలంగాణ అని చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి రాజకీయం చేసే వ్యక్తి సంకినేని అనిఅన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. పట్టణ అధ్యక్షుడు హబీద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మధుసూదన్రెడ్డి, మల్లేశం, సులోచన, ఓరుగంటి రాములు, సాంబయ్య, గోలి ప్రభాకర్, కూతురు శ్రీనివాస్రెడ్డి, నాయకులు లింగయ్య, రాములు, కొణతం సత్యనారాయణరెడ్డి, పాండురంగాచారి, నల్లగుంట్ల అయోద్య, రుక్మారావు, సుజాత, కాసోజు సుమలత, కొండేటి ఏడుకొండల్, రంగినేని ఉమాలక్ష్మణ్రావు, చల్లమల్ల నర్సింహ్మ, కిషన్, వెంకట్రెడ్డి, రామగిరి నగేష్, భాస్కర్, నర్సింహ్మరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, జీడి భిక్షం, గార్లపాటి మమతారెడ్డి, రాణి, వీరేంద్ర, కిరణ్, ఫణినాయుడు, నరేష్, అనంతుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొన్న కావ్య.. నిన్న లోకేశ్..
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఇష్టారాజ్యం..అధికారుల ఉదాసీన వైఖరి వెరసి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. నిబంధనలు పాటించడాకుండానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సులను తిప్పుతూ చిరుప్రాయాల ప్రాణాలను బలిగొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే మొన్న కావ్య.. నిన్న లోకేశ్ స్కూల్ వాహన చక్రాల కింద నలిగిపోయారన్నది కఠోర వాస్తవం. తుర్కపల్లి/సూర్యాపేట మున్సిపాలిటీ: తుర్కపల్లి మండలం నాగపల్లి తండాకు చెందిన ధారవత్ నర్సింహ, శారద దంపతులకు ఐదుగురు సంతానం. కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తెలు సుమిత్ర (రెండో తరగతి), సంధ్య (ఒకటవ తరగతి) నిఖిత (నర్సరీ)లు మండల కేంద్రంలోని పడాల మెమోరియల్ స్కూల్లో చదువుతున్నారు. వీరిని ప్రతి రోజు పాఠశాలకు చెందిన బస్సే వచ్చి తీసుకెళ్లి విడిచిపెడుతుంది. కూతుళ్లను బస్సు ఎక్కించేందుకు వచ్చి.. పడాల మెమోరియల్ స్కూల్లో నాగపల్లి తండాకు చెందిన విద్యార్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు కూడా చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు మొత్తంగా మూడు బస్సులు, ఒక ఆటో ద్వారా విద్యార్థులను పాఠశాలకు చేరవేస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 7:30 గంటలకు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ బన్సీలాల్ స్కూల్బస్సును తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. అదే క్రమంలో తన కూతుళ్లను బస్సులో ఎక్కించేందుకు నర్సింహ కుమారుడు లోకేశ్(2)ను ఎత్తుకుని అక్కడికి వచ్చాడు. డ్రైవర్ గమనించకుండానే.. నిత్యం నిలిపే చోటు వద్దకు స్కూల్ బస్సు రాగానే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా అందులోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో నర్సింహ కూడా సంకలోని కుమారుడిని కిందకు దించి కూతుళ్లను అందులోకి ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న కూతురు నిఖిత ఎక్కకుండానే బస్సు డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. గమనించిన తండ్రి నర్సింహ అరుస్తుండగా వాహనం ముందుకు కదులుతుండగా లోకేశ్కు వాహనం తగిలి చక్కాలు అతడి తలపైకి ఎక్కింది. దీంతో తలపగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కళ్లముందే ఘోరాన్ని చూసి.. అప్పటి వరకు తన సంకలో ఉన్న బాలుడు కళ్లముందే చక్రాల కింద నలిగిపోవడాన్ని చూసిన ఆ తండ్రి గుండెలవిసేలా రోదించి అక్కడే స్పృహకోల్పోయాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చి స్కూల్ బస్సు వాహనాలను ధ్వంసం చేశారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ బన్సీలాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మసీయోద్దీన్ తెలిపారు. హెల్పర్ లేకుండానే.. తుర్కపల్లి మండలం నాగపల్లితండాల్లో, మేళ్లచెరువు మండలం కందిబడలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనల్లో లోకేశ్, కావ్యల మృతికి స్కూల్ బస్సుడ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని మెజార్టీ పాఠశాలలు హెల్పర్లు లేకుండానే విద్యార్థులను తమ బస్సులు, వాహనాలలో చేరవేస్తున్నారు. రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే కందిబండలో విద్యార్థులు సక్రమంగా సీట్లలో కూర్చున్నారో లేదో అని డ్రైవర్ వెనుకకు చూస్తూ వాహనాన్ని డ్రైవ్ చేయడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కావ్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఇక నాగపల్లి తండాలో సైతం పిల్లలు అందరూ ఎక్కారో లేదో చూసుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే సంబంధిత పాఠశాల యాజమన్యాలు ఆ వాహనాల్లో డ్రైవర్లతో పాటు హెల్పర్లను కూడా నియమిస్తే ఈ ఘటనలు చోటు చేసుకునేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల ప్రారంభంలో హడావుడి చేసే సంబంధిత అధికార యంత్రాంగం నిత్యం కాసింత దృష్టిపెడితే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం: ఎం. చంద్రశేఖర్గౌడ్, డీటీసీ విద్యాసంస్థల బస్సుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. హెల్పర్ లేకుండా బస్సులు నడపడానికి వీల్లేదు. ఫిట్¯ð స్ సర్టిఫికెట్ పొందని బస్సులు రోడ్డు మీద రాకపోకలు సాగించినట్లయితే చట్ట పరంగా మరింత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి బస్సులో హెల్పర్ తప్పనిసరి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. -
ఆస్పత్రి ఎదుట ఆందోళన
సూర్యాపేటమున్సిపాలిటీ శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు..పట్టణంలోని చర్చికాంపౌండ్కు చెందిన రాంశెట్టి హైమావతికి పురిటినొప్పులు రావడంతో ఆదివారం పట్టణంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైమావతిని పరిశీలించిన వైద్యులు అదే రోజు రాత్రి ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును అదే ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో వైద్యులు పరిశీలించి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపినట్టు బంధువులు చెప్పారు. అయితే సోమవారం ఒక్కసారిగా సీరియస్గా ఉందని వైద్యులు చెప్పిన గంట వ్యవధిలోనే శిశువు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆందోళనకు దిగారు. హైమావతి భర్త వినయ్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడమేమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాసిత్ సిబ్బందితో సదరు ఆస్పత్రి వద్దకు చేరుకొని బంధువులు, వైద్యులను పిలిపించి మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
సూర్యాపేటమున్సిపాలిటీ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన ఆదివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం యల్లమ్మగూడెం గ్రామానికి చెందిన శ్రావణిని అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి చెందిన లింగయ్యకు 2015లో ఇచ్చి వివాహం చేశారు. లింగయ్య, శ్రావణి దంపతులు సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లింగయ్య పట్టణంలోని ఓ దుకాణంలో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రావణిని కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగుతున్నాడు. శ్రావణి ఇంటి వద్ద పరిస్థితి బాగా లేకపోవడంతో చేసేది ఏమి లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి మృతదేహానికి సోమవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో బంధువులు లింగయ్యపై దాడికి దిగారు. శ్రావణి బంధువుల ఫిర్యాదు మేరకు లింగయ్యపై వరకట్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
సూర్యాపేటమున్సిపాలిటీ : అంతర్రాష్ట్ర దొంగను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ వెల్లడించారు. కేతేపల్లి మండలం పొర్లపహాడ్ గ్రామానికి చెందిన చిలుకూరి శంకర్ తెల్లవారుజామున సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకర్ను విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్టు తెలిపారు. శంకర్పై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు స్టేషన్లో దొంగతనం కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొంగిలించిన వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడని చెప్పారు. శంకర్ వద్ద నుంచి 12సెల్ఫోన్లు, 1 ల్యాప్టాబ్, రెండు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శంకర్పై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ వై.మొగలయ్య, ఎస్ఐలు క్రాంతికుమార్, బాసిత్, ఐడీ పార్టీ పోలీసులు గోదేషి కరుణాకర్, శనగాని వెంకన్నగౌడ్, గొర్ల కృష్ణ, చామకూరి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
గీతకార్మికుల సంక్షేమానికి ఎక్సైజ్ శాఖ కృషి
సూర్యాపేటరూరల్ : గీతకార్మికుల సంక్షేమానికి ఎక్సైజ్శాఖ నిరంతరం కృషి చేస్తుందని సూర్యాపేట ఎక్సైజ్ సీఐ శ్రీధర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంతో పాటు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గతంలో గాయపడిన గీతకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను బాధిత కుటీంబికులకు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతకార్మికులు వృత్తిరీత్యా తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలైన వారికి, మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా మంజూరు చేసిందన్నారు. ఈ సందర్బంగా మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన రాములు ఇటీవల మృతి చెందగా ఆయన భార్య వీరమ్మకు రెండు లక్షల చెక్కును, గాయాలపాలైన పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామానికి చెందిన పుట్టా భిక్షంకు రూ.10వేలు, పొట్లపహాడ్కు చెందిన రామచంద్రుకు రూ.10వేలు, సూర్యాపేటకు చెందిన రాఘవులుకు రూ.50వేలు, అక్కలదేవిగూడేనికి చెందిన గురుస్వామికి రూ.10వేలు, కూడలికి చెందిన వెంకన్నకు రూ.50వేలు, నెమ్మికల్లుకు చెందిన బెల్లంకొండ రాములకు రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సాజిత్ఆహ్మద్, సిబ్బంది బాలాజీ, విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
దళిత వాడలను అభివృద్ది చేయాలి : మట్టిపల్లి
సూర్యాపేటరూరల్ : దళిత వాడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్రకమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శుక్రవారం రాయినిగూడెం, కేసారం, కాసరబాద, ఇమాంపేట, దాసాయిగూడెం గ్రామాల్లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో ఆయన మాట్లాడారు. చాలా వరకు గ్రామాల్లో దళితులు చనిపోతే బొంద పెట్టడానికి శ్మశానస్థలం లేక నేటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నల్లమేకల అంజయ్య, నాయకులు రణపంగ జయబాబు, చింత భిక్షం, కామళ్ల లింగయ్య, బొస్క సోమయ్య, దైద దానేలు, పాముల కృష్ణ, పాముల ఉపేందర్, నకిరేకంటి రాములు, మామిడి సైదులు, బోయిళ్ల వెంకటయ్య, బండారు వెంకటయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు. -
దీక్షలను విజయవంతం చేయాలి
సూర్యాపేటమున్సిపాలిటీ : ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 11న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే ఉపవాస దీక్షలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేజే ఉదయ్బాబు అన్నారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. బిల్లు ప్రవేశపెట్టి దళితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రసాద్, ఎస్.వెంకటేశ్, నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి ప్రశాంత్, గంట జీవన్కుమార్, కీసర అరవింద్రెడ్డి, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం షార్ట్ ఫిల్మ్ సీడీ ఆవిష్కరణ
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని కేఎస్ రెడ్డి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో హరితాహారంపై నిర్మించిన షార్ట్ఫిల్మ్ సీడీని మంగళవారం పట్టణంలోని పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంపై చిన్నారులతో షార్ట్ఫిల్మ్ తీయడం అభినందనీయమన్నారు. షార్ట్ఫిల్మ్లో మొక్కల ప్రాధాన్యం గురించి చక్కగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్లెపల్లి మహేశ్వరి, పాఠశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్రెడ్డి, కె.నిర్మల, దశరథ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్కో డీఈకి ఘన సన్మానం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డు తీసుకున్న ట్రాన్స్ కో డీఈ ఎ.శ్రీనివాసులును సూర్యాపేట పట్టణ ముదిరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ 25ఏళ్ల నుంచి డిపార్ట్మెంట్లో చేసిన కృషి ఫలితమే తనకు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరబోయిన స్వామి ముదిరాజ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశలు హాజరై మాట్లాడారు. పతాని నర్సయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెలుగు సంతోషి, నారబోయిన విజయ్, నక్క రవి, నక్క రాంభానేష్, సారగండ్ల రాములు, అర్వపల్లి లింగయ్య, మాణిక్యమ్మ, వెలుగు వెంకన్న, చందనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘పేట’ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని పునర్నిర్మించాలి
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ కళాశాలలో చదువుతున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి స్పందించి వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. కళాశాలలో తాగునీటి సౌకర్యం, ప్రహరీ, మూత్రశాలలు కూడా సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు నామ నాగయ్య, గుండ్ల పురుషోత్తం, భాస్కర్, ఎల్క సైదులు, ఎ.శశిధర్, నాగరాజు, అనీస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులను చితకబాదిన ఎస్ఐ
సూర్యాపేట : అతను పదుగురికి రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.. అవసాన దశలో తల్లిదండ్రి ఆలనా, పాలనా చూస్తూ అండగా నిలవాల్సిన అతనే కర్కోటకుడుగా మారాడు.. వృద్ధులనే కనికరం కూడా లేకుండా చావబాదాడు.. గూడు కూడా లేదంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.. కాటికి కాలుచాపిన వయసులో ఆ వృద్ధ దంపతులు మంగళవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరుల ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన మేకల ఇసాక్, మేరమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు మేకల ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ కొంత కా లంగా ఆస్తిని పంచాలంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమను బెల్టుతో చితకబాది ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని తల్లిదండ్రి వాపోయారు. ఉన్నతాధికారులు కల్పించుకుని తమ కు న్యాయం చేయాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. -
డీఎస్పీ కార్యాలయంలో మహిళ మృతి
నల్గొండ: భర్త పెట్టే బాధలు పోలీసులకు వివరించడానికి వచ్చిన మహిళ డీఎస్పీ కార్యాలయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇదే జిల్లా మేళ్లచెరువుకు చెందిన అరుణ(38)కు హైదరాబాద్లో లెక్చరర్గా జీవనం సాగిస్తున్న ముసినివెంకటేశ్వర్లు(42) అనే వ్యక్తితో పదిహేనేళ్ల కిందటే వివాహమైంది. వీరు హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటినుంచి భర్త మానసికంగా, శారీరకంగా వేదించడంతో విసుగు చెందిన అరుణ వారం రోజుల కిందట తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో భర్త పెట్టె వేదింపులకు సంబంధించి సూర్యపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే కార్యాలయంలోనే కుప్పకూలిపోయింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అరుణ మృతిచెందిందని వైద్యులు నిర్థరించారు. మృతురాలికి శివ, సందీప్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. ఐదేళ్ల కిందటే తండ్రి వేదింపులు తాళలేక అరుణ పెద్దకుమారుడు శివ ఇంట్లోంచి పారిపోయాడని తెలిసింది. పోలీసులు అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పునర్విభజన తర్వాతే!
కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చిన సీఎం కేసీఆర్ సాక్షిప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న అంశం ఊరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బహిరంగసభలో ‘జగదీష్రెడ్డిని మీరు గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతా’ అని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ మాట నిలబె ట్టుకున్నారు. సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా మారుస్తానన్న హామీ కూడా ఇచ్చిన ఆయన ఆ మేరకు ప్రక్రియ మొదలుపెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వివరాలు అందించాలని రెవెన్యూ శాఖను సీఎం కోరారని వెలువడిన వార్తల నేపథ్యంలో, కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా చర్చజరిగింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతలు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వం వద్ద బ్లూప్రింట్ కూడా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. పార్టీ అంచనాకు తోడు, అధికారిక సమాచారంతో సాధ్యాసాధ్యాలు, సాధకబాధకాలు చూసుకుని కానీ ముందడుగు వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని శుక్రవారం సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో కొంత గందరగోళం తొలగిపోయింది. రెవెన్యూ డివిజన్ పరిధి ఎలా...? ఇక, రెవిన్యూ డివిజన్ల పరిధిని పరిశీలించినా, కొంత గందరగోళమే కనిపిస్తున్నది. నాగార్జునసాగర్ నియోజకర్గ పరిధిలోని గుర్రంపోడు మండలం దేవరకొండ డివిజన్లో, మిగిలిన నాలుగు మండలాలు మిర్యాలగూడ డివిజన్లో ఉన్నాయి. నల్లగొండ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాలు కొత్తగా ఏర్పాటు కాబోయే సూర్యాపేట జిల్లా పరిధిలోకి మార్చాలన్న అభిప్రాయం ఉంది. రెవెన్యూ డివిజన్ల మేరకు చూసినా, ఏకరూపం వచ్చేలా లేదు. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచాలన్న ప్రతిపాదన ముందునుంచీ ఉంది. ఒకవేళ కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటు వ్యవహారం ఓ కొలిక్కివస్తే.. ఆ నియోజకవర్గాలు ఏ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళతాయన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. ఏరకంగా చూసినా, సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పాటు అనేక సందేహాలు, శషబిషలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా విభజనను అంతా ఆహ్వానిస్తున్నా, తమ సందేహాలకు సరైన సమాధానం చెప్పే వారు మాత్రం లేరన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే భూముల ధరలు పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఏర్పాటు వార్తలు ఇదే తరహాలో వెలువడితే, సామాన్యులు ఎవరూ ఈ ప్రాంతంలో కనీసం ఇంటిజాగా కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని ఓ రెవెన్యూ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవీ.. సందేహాలు * ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఇదంత సులభం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. * సూర్యాపేటను జిల్లాగా మార్చాలంటే ముందుగా పార్లమెంటు నియోజకవ ర్గాల స్వరూపాలే మారిపోవాలి. జిల్లాకేంద్రంగా ఏర్పాటు కావాల్సిన సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. * సూర్యాపేట జిల్లాలో కలపాలనుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. * భువనగిరి పార్లమెంటు నియోజకవర్గపరిధిలోనే వరంగల్ జిల్లాకు చెందిన జనగామ, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. * మరోవైపు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంటును కూడా సూర్యాపేట జిల్లాలో చేర్చే వీలుందని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గం సైతం నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఇన్ని సెగ్మెంట్లను అటుఇటు మార్చి పూర్తిగా ఒక పార్లమెంటు నియోజకవర్గ స్వరూపాన్ని మార్చడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశమని పేర్కొంటున్నారు. -
రాజన్న రాజ్యం స్థాపిద్దాం
సూర్యాపేట, న్యూస్లైన్, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిద్దామని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బీరవోలు సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొడ్రాయి బజార్, అలంకార్రోడ్డు, ఈద్గా రోడ్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీరవోలు మాట్లాడుతూ సూర్యాపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీలను నెరవేరుస్తామన్నారు. మీరు కోరుకున్న పాలనను మీకివ్వడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చూపిస్తున్న స్పందనను చూస్తే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీరవోలు విక్రంరెడ్డి, కడియం సురేందర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఎజాస్, గోరెంట్ల సంజీవ, పొన్నం పాండుగౌడ్, దండ అరవిందరెడ్డి, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కట్టా జ్ఞానయ్య, యశోద, ప్రమీల, సతీష్, నాగు, నెహ్రూ, రఘు, రాజేష్, మహేష్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు. -
85.86% తొలి విడత పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం నల్లగొండ, న్యూస్లైన్, ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 11,94,075 ఓట్లు కాగా, 10,25,195 ఓట్లు పోల య్యాయి. 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మూడు డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ 459 స్థానాలు, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులకు సరిసమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మండలాల నుంచి పోలైన ఓట్లకు సంబంధించి వివరాలు విడివిడిగా రావడం ఆలస్యం కావడంతో అధికారులు ఆమేరకు పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్యను నిర్ధారించలేకపోయారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా తుంగతుర్తి, వేములపల్లి, చందంపేట, మిర్యాలగూడ మండలాల పరిధిలో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల తంతు ఆలస్యంగా ముగిసింది. తుంగతుర్తిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడం వల్ల పోలింగ్ మరింత జాప్యమైంది. రికార్డు స్థాయిలో పోలింగ్... ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ 12 శాతం నమోదు కాగా, ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటలకు 31 శాతంగా నమోదైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55 శాతానికి పెరిగింది. దాదాపు మొత్తం పోలింగ్ శాతం సగానికి పూర్తయ్యింది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు 31 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 16.85 శాతంతో పూర్తయింది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరడంతో పోలీసులు, పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు... పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల సాయంతో బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలనకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపు మే నెలకు వాయిదా వేయాలని ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ ఈ మార్పు చేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు కూడా డివిజన్ కేంద్రాల్లోనే నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.దామోదర్రెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. తాగునీరూ కరువే.... పోలింగ్ కేంద్రాలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. కనీసం గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు సమకూర్చిన పాపాన పోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయలేదు. దీంతో ఓటర్లు ఎర్రటి ఎండలోనే గంటల తరబడి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది. అర్వపల్లిలోని 24వ పోలింగ్ బూతు వద్ద ఎండలోనే గంటల కొద్దీ ఓటర్లు బారులు తీరారు. అయినా క్యూ ముందుకు వెళ్లకపోవడంతో మహిళా ఓటర్లు ఒక్కసారిగా కేంద్రంలోకి చొచ్చుకపోయారు. అధికారుల తప్పిదం... ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపించింది. వేములపల్లి -1 ఎంపీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రం 36 (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో చెట్లచెన్నారం గ్రామానికి సంబంధించిన రెండు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ఓటర్లు గుర్తించేంత వరకుగానీ అధికారులు మేల్కోలేదు. ఓటర్లు అభ్యంతరం చెప్పడంతో చివరకు పరిశీలించారు. దీంతో 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్దాక పోలింగ్ను కొనసాగించారు. -
కూత పెట్టేనా..?
రైల్వే బడ్జెట్ వచ్చేస్తోంది.. జిల్లాకు ఏమైనా మోసుకొస్తుందా అన్న ఉత్కంఠ జిల్లావాసుల్లో నెలకొంది. ప్రతి ఏడాదీ బడ్జెట్కు ముందు ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం.. వాటిని పట్టించుకోకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిసారీ కొత్త రైళ్లు, కొత్త మార్గాలు వస్తాయని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురవుతోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి గుండా కొత్త రైలుమార్గం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా మంత్రి మల్లికార్జున్ ఖర్గే జిల్లా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతారో.. లేదో.. వేచి చూడాల్సిందే... - న్యూస్లైన్, భువనగిరి/ మిర్యాలగూడ/సూర్యాపేట సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట, బీబీనగర్-నడికుడి మార్గాల్లో జిల్లాలో రైళ్లలో వేలాది మంది నిత్యం ప్రయా ణం చేస్తుంటారు. ప్రస్తుతం రెండు లైన్లు ఉన్న ఉన్న సికింద్రాబాద్-భువనగిరి మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడోలైన్ నిర్మాణం చేపట్టాలని చేసిన ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయింది. బీబీనగర్-నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం బడ్జెట్లో డబ్లింగ్ పనులకు నిధులు మంజూరు చేశారు. కానీ పనులు ప్రారంభంకాలేదు. సూర్యాపేట : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణానికి రైల్వేలైను ఏర్పాటవుతుందని ఈ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా కల కంటున్నారు. కానీ ప్రతి యేడు రైల్వే బడ్జెట్ సమయంలో మొండిచేయి చూపిస్తున్నారు. గతంలో హైదరాబాద్ - సూర్యాపేట - విజయవాడ, జనగాం - సూర్యాపేట - మిర్యాలగూడ, మిర్యాలగూడ - వరంగల్ లైన్లు ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు కొత్త రైలు మార్గం మంజూరైంది. సూర్యాపేట మీదుగా వరంగల్ జిల్లా డోర్నకల్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి ప్రతిపాదించారు. దీంతో తమకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న సూర్యాపేట వాసులు సంతోషం వ్యక్తం చేశారు. 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి సూదిని జైపాల్రెడ్డి సూర్యాపేట మీదుగా రైల్వే లైను వేయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నూతన రైల్వే లైను ప్రతిపాదనలు చేయవద్దని విధాన నిర్ణయం ప్రకటించడంతో ఆయన హామీ నెరవేరలేదు. కాగా మిర్యాలగూడ నుంచి సూర్యాపేట సమీపంలోని కాసరబాద, పుల్లారెడ్డి చెరువు కింది నుంచి ఎఫ్సీఐ, సీడబ్ల్యూసీ గోడాంల పక్క నుంచి డోర్నకల్కు గతంలోనే పట్టణానికి చెందిన పారిశ్రామిక వేత్త మీలా సత్యనారాయణ సర్వే చేయించినట్టు సమాచారం. రైల్వే లైను వస్తే ఇప్పటికే జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భువనగిరి వరకు మూడోలైన్ ఎప్పుడో సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గంలో భువనగిరి వరకు మూడో రైల్వేలైన్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు అధిగమించవచ్చునని ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పదేళ్ల క్రితం అందజేశారు. దీని వల్ల బీబీనగర్-నడికుడి మార్గంలో, కాజిపేట-సికింద్రాబాద్ మార్గంలో నడిచే రైళ్లు ఏ విధమైన క్రాసింగ్లు లేకుండా నిరంతరాయంగా భువనగిరి ప్రాంతం నుంచి ప్రయాణం చేయవచ్చు. లేదంటే ప్రస్తుతం బీబీనగర్ మండలం పగిడిపల్లి వద్ద రోజూ క్రాసింగ్ల పేరుతో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వీటి కోసం ఎదురు చూపు బీబీనగర్ - నల్లపాడు వరకు డబ్లింగ్, విద్యుద్దీకరణ మిర్యాలగూడ- జగ్గయ్యపేట, మిర్యాలగూడ - జగదర్పూర్, కాచిగూడ - చిట్యాల వరకు రెండో లైన్ ఏర్పాటు నల్లగొండ రైల్వేస్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు గద్వాల-దేవరకొండ-నాగార్జునసాగర్-మాచర్ల రైల్వేలైన్ ఏర్పాటు మిర్యాలగూడ రైల్వేస్టేషన్ను ఆదర్శ రైల్వేస్టేషన్గా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు జనగాం-సూర్యాపేట-నాగార్జునసాగర్-మాచర్లవరకు రైల్వేలైన్ ఏర్పాటు మేళ్లచెర్వు-జాన్పహడ్ మధ్య లింకింగ్ లైన్ మంజూరుకు ఎదురుచూపు వరంగల్ జిల్లా డోర్నకల్-మిర్యాలగూడ వరకు కొత్త లైన్కు నిధుల విడుదల ఈ రైళ్లకు హాల్టింగ్ ఇప్పించాలి సికింద్రాబాద్-ఖాజీపేట సెక్షన్లో భువనగిరి, ఆలేరు రైల్వేస్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ఎంతోకాలంగా కోరుతున్నారు. డివిజన్ కేంద్రమైన భువనగిరితోపాటు, ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన కొలనుపాక జైనదేవాలయానికి వచ్చిపోయే భక్తుల కోసం రైళ్లు నిలపాలని కోరుతున్నారు. భువనగిరిలో తిరుపతి వెళ్లే పద్మావ తి, ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్, బాసర మీదుగా వెళ్లే షిర్డీ ఎక్స్ప్రెస్ రైళ్లను నిమిషమైనా ఆపాలన్న డిమా ండ్ ఉంది. బీబీనగర్లో జన్మభూమి, కృష్ణా, ఎక్స్ప్రెస్ రై ళ్లనుఆపాలని కోరుతున్నారు. ఉదయం భువనగిరి నుంచి ఫలక్నుమా వెళ్లే డెమో రైలును జనగాం వరకు పొడిగిం చాలని ఆలేరు ప్రాంత ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ఎప్పుడో.. ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలని ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్లో ఎంఎంటీఎస్ రైళ్లను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వరకే పొడిగిస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు. ఘట్కేసర్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వైద్య, విద్యా సౌకర్యాలు.. నిత్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్ల అవసరం ఎంతో పెరిగింది. భువనగిరి డివిజన్ ప్రాంతంలో వేలాది మంది పలురకాల ప్రయాణికులు నిత్యం రైల్వేప్రయాణం చేస్తుంటారు. దీంతోపాటు ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలోని ప్రధాన పట్టణాలకు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే జంక్షన్లకు అనుసంధానంగా వందలాది రైళ్లు నడుస్తుంటాయి. పెరిగిన రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు రైల్వే శాఖ నూతన లైన్ల నిర్మాణం చేపట్టడంలో జాప్యం చేస్తుందని ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. బీబీనగర్ - నల్లపాడు డబ్లింగ్ పనులకు నిధులు మంజూరయ్యేనా? గుంటూరు రైల్వే డివిజన్ పరి ధిలోకి వచ్చే 239 కిలోమీటర్ల నల్లపాడు-పగిడిపల్లి సింగిల్ లైన్ పనులను డబుల్ లైన్లుగా మార్చడానికి గత బడ్జెట్లో అప్పటి రైల్వే మంత్రి మమ తా బెనర్జీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. 1998-99లో ఇందుకోసం సర్వే కూడా చేసిన ప్రభుత్వం మరోమారు ఈ బడ్జెట్లో సర్వేను చేపట్టారు. అయితే గుంటూరు-సికింద్రాబాద్ మధ్య దూరం తగ్గడానికి 1974లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బీబీనగర్-నడికుడి మార్గానికి శంకుస్థాపన చేయగా రైల్వేశాఖ 1989లో ఈ మార్గాన్ని పూర్తి చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు సింగిల్లైన్తోనే ప్రయాణం సాగుతోంది. దీంతో రైళ్ల క్రాసింగ్ ఎక్కువైపోయింది. అయితే డబుల్ లైన్ చేయడంతోపాటు విద్యుద్దీకరణ చేస్తే గంటల తరబడి క్రాసింగ్లు పెట్టే పరిస్థితి నుంచి రైలు ప్రయాణికులకు విముక్తి లభిస్తుంది. దాంతో పాటు 2013-14 బడ్జెట్లో ప్రతిపాదించిన డోర్నకల్ - మిర్యాలగూడ కొత్త లైన్కు నిధులు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. భువనగిరిలో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలి బీబీనగర్- నడికుడి మార్గంలోని భువనగిరి శివారులో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. భువనగిరి ప్రాంత ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే బీబీనగర్, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవ చూపి రైల్వేశాఖ దృష్టికి తీసుకువస్తే భువనగిరిలో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయవచ్చు. -
ట్రాన్స్కో నిర్లక్ష్యంపై రైతుల రాస్తారోకో
దొండవారిగూడెం(మిర్యాలగూడ రూరల్), న్యూస్లైన్: దొండవారిగూడెం పరిధిలోని పచ్చారుగడ్డ గ్రామ రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ బుధవారం భీమారం-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో తడకమళ్ల 33/11 కేవీవిద్యుత్ సబ్స్టేషన్ నుంచి దొండవారిగూడెం గ్రామానికి సరఫరా అయ్యే త్రీఫేజ్ విద్యుత్ను నిలిపివేశారని, దీంతో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లుల విషయమై రైతులకు సమాచారం ఇవ్వకుండానే సరఫరా నిలిపివేయడమేంటని రైతులు ప్రశ్నించారు. వేములపల్లి ఎస్ఐ యాదగిరి రాస్తారోకో వద్దకు చేరుకొని ట్రాన్స్కో అధికారులతో మా ట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోలో వైఎస్సార్ సీపీ నాయకులు నామిరెడ్డి విజయేందర్రెడ్డి, పరికల సైదులు, సీపీఎం నాయకులు చిరుమళ్ల భిక్షం, గోపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీను, అంజయ్య, సైదులు పాల్గొన్నారు. -
సూర్యాపేట బస్టాండ్లో భారీ చోరీ
సూర్యాపేట, న్యూస్లైన్: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం అర్ధరాత్రి సినీఫక్కీలో భారీ చోరీ జరి గింది. పట్టణంలోని హైటెక్ బస్టాండ్లో నిలిచిన బస్సులోనుంచి సుమారు 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఆభరణాల విలువ రూ.6కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీయాష్ జువెల్లర్స్ దుకాణంలో దినేష్ప్రసాద్, రామేందర్ మురళీ మోహన్లు సేల్స్ రిప్రజెంటేటివ్లుగా పనిచేస్తున్నారు. ఈనెల 21న ఈ ఇద్దరు దుకాణం నుంచి సుమారు 20 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని విక్రయించేం దుకు విజయవాడ వెళ్లారు. అక్కడ బాంబే జువెల్లర్స్ దుకాణంలో సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలను విక్రయించారు. ఆ దుకాణ యజమాని వద్ద అందుకు గాను కొంత బిస్కెట్ బంగారం, సుమారు రూ.4లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్కు వెళ్లేందుకు విజయవాడ బస్టాండ్లో ఆటోనగర్ డిపో సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. బస్సులో మొత్తం 28మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కోదాడకు రాగానే నలుగురు ప్రయాణికులు దిగారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్కు బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వచ్చి నిలిచింది. ఆ సమయంలో బస్సులోనుంచి ముందుగా మురళీమనోహర్ మూత్ర విసర్జన కోసం వెళ్లగా లోపల దినేష్ప్రసాద్ ఉన్నాడు. మురళీమనోహర్ రాగానే దినేష్ కిందికి దిగాడు. ఆ సమయంలో మురళీమనోహర్ బస్సు మెట్ల భాగంలో నిలబడి ఉన్నాడు. కాసేపటికి బస్సులోకి వెళ్లి చూసేసరికి ఆభరణాల బ్యాగు కనిపించలేదు. బస్సులో వెతికినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆభరణాలు చోరీకి గురయ్యాయని గ్రహించి పోలీసులకు సమాచారం అందించగా ప్రయాణికులను తనిఖీ చేశారు. కాగా, బస్సు బస్టాం డ్లో ఆగగానే ఇద్దరు ప్రయాణికులు వెంటనే కనిపించకుండా పోయారని చెబుతున్నారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు.. సమాచారం అందుకున్న శ్రీయాష్ జువెల్లర్స్ దుకాణ యజమాని ఆనంద్కుమార్ అగర్వాల్ హుటాహుటిన సూర్యాపేటకు వచ్చాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు రెండున్నర కిలోలు మాత్రమేనని, సుమారు రూ.80 లక్షల విలువ ఉంటుందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్పీ టి.ప్రభాకర్రావు కూడా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విలువైన బంగారు ఆభరణాలు బస్సులో ఉండగా ఆ వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే చోరీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో వారి ప్రవర్తనపై కొంత అనుమానం ఉందని, ఆ కోణంలోనూ దర్యాప్తు సాగుతుందని చెప్పారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట మండలం రామన్నపేట స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనం పైనుంచి పడి ఒక్కరు దుర్మరణం చెందగా.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో బైక్ ఢీకొని మరొకరు చనిపోయారు. సూర్యాపేట రూరల్, న్యూస్లైన్: ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని రామన్నగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన మర్రిపెల్లి అంతయ్య సొంత పనినిమిత్తం యర్కారం గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రామన్నగూడెం స్టేజీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అంతయ్యను స్థానికులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని... యాద్గార్పల్లి(మిర్యాలగూడ క్రైం): మండలంలోని యాద్గార్పల్లిలో తడకమళ్ల రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్లకు చెందిన పంగ చంద్రయ్య(50 ) అంతిరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టరుపై డ్రైవరుగా పని చేస్తున్నాడు. యాద్గార్పల్లిలో పనులు ముగిసిన అనంతరం ట్రాక్టరును అక్కడే ఉంచి స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఇదే సమయంలో యద్గార్పల్లికి చెందిన మహేష్ ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు చంద్రయ్యను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతున్న వృద్ధురాలి మృతి
నకిరేకల్, న్యూస్లైన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఎముకల వైద్యుడు గత 20 ఏళ్లుగా పట్టణంలోని రఘురామ థియేటర్ పక్కన ఆస్పత్రి నిర్వహిస్తున్నా డు. పతి ఆదివారం ఇక్కడి వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేసి వెళ్తుంటాడు. కాగా తిప్పర్తి మండలంలోని చిన్నాయిగూడెంకు చెందిన బైరగోని పెంట మ్మ(62) మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆది వారం ఆస్పత్రికి రాగా డాక్టర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం డాక్టర్ ఆదేశాల మేరకు కంపౌండర్ పెన్సిలిన్ ఇం జక్షన్ ఇచ్చాడు. ఆ తరువాత పెంటమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేరే ఆస్పత్రికి తరలించేం దుకు 108 అంబులెన్స్ను ఏర్పాటు చేస్తుండగానే పెంటమ్మ మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట ఆందోళన పెంటమ్మ మృతిపట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. వైద్యం వికటించడం వల్లే పెంటమ్మ మృతి చెందిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్, మందులను ధ్వం సం చేశారు. డాక్టర్ను నిలదీశారు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబీకులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. వైద్యం వికటించడం వల్లే తమ తల్లి మృతి చెందిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తూ, మందులు విక్రయిస్తున్న డాక్టర్పై చర్య తీసుకోవాలని కుమారులు జానయ్య, శ్రీనువాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ వివరణ పెంటమ్మ మృతిపై డాక్టర్ను వివరణ కోరాగా తా ను వైద్యం చేసిన విషయం వాస్తవమేనన్నారు. అ యితే ఒక ఫ్లూయిడ్స్ పెట్టి, ఇంజక్షన్ తన సిబ్బంది తో వేయించానని చెప్పారు. దీంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయని అంటూనే మృతి చెందిందని తెలిపా రు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించారు. -
ఉమ్మడి సదస్సును విజయవంతం చేయాలి
భానుపురి, న్యూస్లైన్: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1వ తేదీన సరిహద్దులు తాత్కాలికం..ఆత్మీయతలు శాశ్వతం అనే నినాదంతో మూడు ప్రాంతాల ఉద్యమనేతలతో నిర్వహించే ఉమ్మడి సదస్సును జయప్రదం చేయాలని జనచైతన్య వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పశ్య ఇంద్రసేనారెడ్డి, బద్దం అశోక్రెడ్డిలు కోరారు. బుధవారం పట్టణంలోని డాక్టర్ ఎ.రామయ్య నివాసంలో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలను.. ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకొని ప్రజల మధ్యన ఐక్యతను సాధించడం కోసం జనచైతన్య వేదిక పాటుపడుతుందన్నారు. అం దుకోసం మూడు ప్రాంతాలకు చెం దిన ఉద్యమ నేతలతో ఉమ్మడి చర్చావేదికను నిర్వహించి ఆయా ప్రాం తాల ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేం దుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సదస్సుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ కేంద్ర జలవనరుల సంఘం సభ్యులు ఆర్.విద్యాసాగర్రావు, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు వసంతనాగేశ్వరరావు, బహుజన ఆంధ్ర జేఏసీ కన్వీనర్ పల్నాటి శ్రీరాములు, రాయలసీమ జేఏసీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, రాయల సీమ అధ్యయనాల వేదిక అధ్యక్షుడు డాక్టర్ భూమన్లు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనచైతన్యవేదిక సభ్యులు డాక్టర్ ఎ.రామయ్య, కుంట్ల ధర్మార్జున్, పెద్దిరెడ్డి గణేష్, డాక్టర్ సంపత్కుమార్, చింతలపాటి చినశ్రీరాములు, దామెర శ్రీనివాస్, పుప్పాల రవికుమార్, హనుమంతరావు, మంచాల రంగయ్య పాల్గొన్నారు.