Published
Sun, Oct 9 2016 10:27 PM
| Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
డీఎంహెచ్ఓ కార్యాలయ పనుల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్నాయక్ ఆదివారం సందర్శించారు. దసరా రోజు నుంచి ఇక్కడి నుంచే పాలన కొనసాగనున్న దృష్ట్యా పనులను సూచించారు. కాంట్రాక్టర్ దగ్గర ఉండి పనులు చేయించాలన్నారు. ఆయన వెంట ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, కోటాచలం, సముద్రాల సూరి తదితరులు ఉన్నారు.