visited
-
పాలవలస కుటుంబానికి జగన్ పరామర్శ (ఫోటోలు)
-
శ్రీ ముకాంబిక ఆలయంలో జైలర్ విలన్ వినాయకన్, నటుడు జయసూర్య (ఫోటోలు)
-
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
తిరుమలలో సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ, క్రీడా ప్రముఖులు (ఫోటోలు)
-
తిరుమల సన్నిధిలో తెలుగు టాప్ కమెడియన్స్ (ఫోటోలు)
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
ఏకంగా ప్రధానిని పెళ్లికి ఆహ్వానించిన నటి వరలక్ష్మి (ఫొటోలు)
-
తిరుమల స్వామివారి సేవలో సినీతారలు (ఫోటోలు)
-
‘సీమా హైదర్ చాలా డేంజర్’
ప్రియుని కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నాడు.సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్తో టచ్లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్ పేర్కొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (ఫొటోలు)
-
Geethanjali Malli Vachindi : శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీమ్ (ఫోటోలు)
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు (ఫొటోలు)
-
‘సాగర్’ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్ఎంబీ అధికారులు గురువారం సాగర్డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు. డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్ఎంబీ అధికారులు సాగర్డ్యామ్తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్డ్యామ్పై పర్యటించిన వారిలో కేఆర్ఎంబీ ఎస్ఈ వరలక్ష్మి, సాగర్డ్యామ్ ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు. -
దాడులు చేస్తే..: తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆర్డీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మొన్నీమధ్య ఫరూక్నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన. ‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా ఫరూక్నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్కి గాయాలయ్యాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. -
Ayodhya: బాల రాముడి దర్శనం.. పులకించిన భక్తులు
అయోధ్య: అయోధ్యలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. మరో అయిదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా బుధవారం తొలిసారిగా బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. Uttar Pradesh | Ramlalla's representative idol was carried across the Ram Temple premises in Ayodhya earlier today. (Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/4M07BjV1yc — ANI (@ANI) January 17, 2024 గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 5 ఏళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు. ఇదీచదవండి.. ప్రధాని మోదీ రామ ప్రతిజ్ఞ నెరవేరింది -
2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు. మే 19.. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. జూన్ 20.. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్ను సందర్శించారు. జూన్ 22.. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు. జూలై 13.. బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో చర్చలు జరిపారు. ఆగస్టు 22.. జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన. సెప్టెంబర్ 6.. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు. నవంబర్ 30.. ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ... -
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ప్రధానికి సాదర వీడ్కోలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు. -
కొత్త ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. గ్రీన్ ఛానెల్తో హైదరాబాద్కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం -
Governor Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు (ఫొటోలు)
-
నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్లో సందడి చేసిన పాయల్ రాజ్పుత్ (ఫొటోస్)
-
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు
లాలాపేట (హైదరాబాద్): హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులంతా పలు సమ స్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు కిషన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడు తూ... హైదరాబాద్ నగరంలోని బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ మొత్తం సింగపూర్, డల్లాస్ అయినట్లు బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, బంధులు వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మాణంలో ఉందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తు న్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 కోట్లతో మంజూరు చేశామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రూ.450 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీని మంజూరు చేశామని కానీ దాని కోసం 25 ఎకరాల స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ కార్యాలయాలకు తప్ప ఇప్పటివరకు సైన్స్ సిటీకి స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బీజేపీ నేతలు బండ చంద్రారెడ్డి, రాము వర్మ పాల్గొన్నారు. -
Kiran Abbavaram: తిరుమల శ్రీవారి సేవలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (ఫోటోలు)
-
చంద్రబాబూ ఆత్మవిమర్శ చేసుకో
ఖైరతాబాద్(హైదరాబాద్): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. 74 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ను అవమానాలకు గురిచేసి, చివరకు ఆయన చనిపోయేలా చేశావో, అదే 74వ ఏట మీరు చేసిన పాపాలు పండి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన ఈ ఉద్వేగభరిత క్షణాల్ని నా భర్త సమాధితో పంచుకోవాలని ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించినట్టు చెప్పారు. చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేడని ఎన్టీఆర్ ఆనాడు చెప్పిన మాటల్ని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇంతకాలం బతికున్నానని, నా ఆశయం నా భర్త నిర్దేశించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడు. ప్రజల సొమ్ము దోచుకొని, అవినీతి కేసుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థలను కొనుక్కోవడం చేస్తూ వచ్చాడని, చివరికి అదే వ్యవస్థలో చిక్కుకుపోయి జైలు పాలయ్యాడని, ఇప్పుడు నా కోపం అంతా తీరిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఆలోచించాలని, చంద్రబాబు అక్రమాలను మీరు సహిస్తారా... ప్రజాధనం లూటీ చేస్తూ దొరికిపోయాడు, ఆలోచించండన్నారు. నిప్పులాగా బతికిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎక్కడ, అధికారం కోసం తడిగుడ్డతో గొంతులు కోసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గురించి తెలుసుకోవాలన్నారు. -
Sai Dharam Tej Photos: శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించిన సాయిధరమ్ తేజ్ (ఫోటోలు)
-
దుబాయ్లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
లండన్లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
దేశ పర్యాటకానికి కేరళ ఎంతో కీలకం: మోదీ
-
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను విజిట్ చేసిన హీరో నాగార్జున
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్
-
కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
ప్రముఖ ఆలయంలో సమంత పూజలు
-
మెరుగవుతోన్న తారకరత్న ఆరోగ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపారు. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్ -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: సుమారు వారం రోజులు సాగిన ఆటో ఎక్స్పో బుధవారంతో ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 6,36,743 మంది షోను సందర్శించినట్లు దేశీ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. రెండేళ్లకోసారి జరిగే ఆటో షోను వాస్తవానికి 2022లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 కారణంగా 2023కి వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమై 18తో ముగిసింది. తొలి రెండు రోజులు (11,12) మీడియా కోసం కేటాయించగా, 13–18 వరకు సందర్శకులను అనుమతించారు. ఆటో కంపెనీలు ఇందులో 75 పైచిలుకు వాహనాలను ఆవిష్కరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా వంటివి పాల్గొనగా మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు దూరంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ అయిదు డోర్ల జిమ్నీ వెర్షన్ను, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా అయానిక్ 5ని, కియా ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీ9 మొదలైన వాహనాలను ఆవిష్కరించాయి. గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా బుధవారం టయోటా పెవీలియన్లో సందర్శకులు -
సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
గిరిజనులకు అండగా.. విశాఖ శ్రీ శారదా పీఠం
-
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
కొత్త సెక్రటేరియట్ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
-
RFCL ప్లాంట్ ను సందర్శించిన ప్రధాని మోదీ
-
గుజరాత్ లోని మోర్బీ లో ప్రధాని మోడీ పర్యటన
-
కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
-
సింహాచల లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
కొత్త సచివాలయం పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన పర్యటన
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన
-
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల
-
దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఛైర్మన్, ఈవో అందజేశారు. -
పులిచింతల ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రి అనిల్
-
ఇంటికో ఉద్యోగం ఏమైంది? : వైఎస్ షర్మిల
మెదక్ జోన్/వెల్దుర్తి/తూప్రాన్ (మెదక్): పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్ (23) కుటుంబాన్ని ఆమె బుధవారం పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లి వెంకటేశ్లాంటి నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని షర్మిల అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రైతుల సమస్యల సాధనలకు కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం పాటుపడదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, రాంరెడ్డి, ఇందిరా శోభన్, రాజగోపాల్ పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
-
15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. జపాన్ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్లో ప్యానల్ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగల భద్రతే ముఖ్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్రావు అన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్ యూనిట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరో యూనిట్ సీజ్ శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్కో సబ్స్టేషన్ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్ను సీజ్ చేశారు. విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్రావు, సురేష్, టెక్ని కల్ ఎస్ఈ హనుమాన్ పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, అడ్డగోలు బిల్లులు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇం దుకోసం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీ టింగ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలన్నారు. గాంధీ, ఫీవర్, కింగ్కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. గాంధీలో 200 వెంటిలేటర్లు ఉన్నా అందులో చేరేందుకు ప్రజలు ఎందుకు భయ పడుతున్నారో, ఎందుకు వెనుకడుగు వే స్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తాను గాంధీ ఆసుపత్రిని సందర్శించానని, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. అక్కడ పని చేసే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 50 లక్షల బీమా కవరేజి తప్పితే ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కరోనా ఆసుపత్రుల్లో ఖర్చుల కోసమే కేంద్ర ప్రభుత్వం రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి 1,220 వెంటిలేటర్లకు గాను 888 కేంద్రం పంపించిందన్నారు. అందులో 10 శాతం కూడా వినియోగించడం లేదన్నారు. రాష్ట్రానికి 7,44,000 మాస్క్లు, 2,41,000 పీపీఈ కిట్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబెట్లు పంపించిందన్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం 1,23,000 యాంటిజెన్ కిట్లను, 1,02,407 ఆర్టీపీసీఆర్, 52 వేల వీటీఏ కిట్లు పంపించిందన్నారు. టెస్టులు సరిగా చేయడం లేదని, వాటిని చేయాలని కేంద్ర బృందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాయన్నారు. వసతులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో తాను మాట్లాడుతున్నానని, తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉన్నందునే టిమ్స్ను ప్రారంభించలేదని చెప్పారన్నారు. తన చొరవతోనే రైల్వే ఆసుపత్రిని, సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో రెండు బ్లాకులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారన్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యం, పప్పు దినుసులు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ఇందుకోసమే రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. బియ్య పథకం కింద ప్రతి కిలోకు రూ. 31 కేంద్రం ఇస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలిచ్చేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో వాటి అమలును బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించానన్నారు.వరవరరావు విషయంలో చట్టప్రకారం ఏం చేయాలో ప్రభుత్వం అలాగే చేస్తుందన్నారు. గాంధీ ఆస్పత్రి సందర్శన గాంధీ ఆస్పత్రి: కరోనా సోకిన ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ఆయన ఆదివారం సందర్శించారు. డీఎంఈ రమేష్రెడ్డి, గాంధీ సూపరిం టెండెంట్ రాజారావు.. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలను ఆయనకు వివరించారు. -
సంక్షోభంలోనూ సంక్షేమం
సిరిసిల్ల: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ఆపలేదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో పర్యటించారు. నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, రైతు వేదిక నిర్మాణా లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల రాష్ట్రం లో 95 శాతం ప్రభుత్వ ఆదాయం తగ్గినా సం క్షేమ పథకాల అమలును ఎక్కడా ఆపలేదన్నారు. తొలివిడతగా 5.5 లక్షల మంది రైతుల పంటల రుణాలను రూ.1,200 కోట్లమేర మాఫీ చేశామన్నారు. ఏ ప్రధానీ చేయని విధంగా రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు అందించామని, రూ.1,400 కోట్లతో రైతుబీమా అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు సాగునీటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి నిరంతరం నీరందిస్తామని పేర్కొన్నారు. అక్కరకు రాని, మద్దతు ధరలేని పంటలు వేయొద్దని రైతులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రైతులకు మేలు చేయడం తప్ప సీఎం కేసీఆర్కు వేరే ఎజెండా లేదన్నారు. అనేక మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. బీడు భూములకు నీళ్లు వచ్చి పల్లెలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని, రాష్ట్రంలో ప్రతీ రైతుకు రైతుబంధు ఇస్తుంటే మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. రైతులను సంఘటితం చేయడమే రైతు వేదిక లక్ష్యమన్నారు. రైతు వేదికలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. సేద్య ఆలయాలుగా రైతు వేదికలు: రాష్ట్రంలో రైతు వేదికలు సేద్యానికి ఆలయాలుగా ఉంటాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, వేములవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2,602 క్లస్టర్లు ఉన్నాయ ని, ప్రతీ క్లస్టర్లో రైతు వేదికలు నిర్మిస్తామని తెలిపారు. రైతుల కు నీళ్లు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ.. రైతు బీమా కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు లాభసాటిగా ఉండే పంటలనే ప్రభుత్వం సూచిస్తుందన్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని, అవి ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రైతులను సీఎం కేసీఆర్ నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారన్నారు. బడ్జెట్లో ఏ టా రూ.60 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయం బాగుంటేనే అన్నీ బాగుంటా యని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారన్నారు. రైతు వేదికల ఏర్పాటు ద్వారా పంట మార్పులతో తెలంగాణ రైతులు దేశ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉంటారన్నా రు. పంట మార్పిడి విధానం పాటించాలని, శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదించే ఏయే పంటలు వేయాలో నిర్ణయిస్తామన్నారు. చాలామంది రైతులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల గురించి సీఎం కేసీఆర్ కంటే ఎక్కువగా ఆలోచించే మొనగాడు ఉన్నాడా.. అని మంత్రి ప్రశ్నిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదావరి జలాలను చూసి సంతోషం అనిపించిందని నిరంజన్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ తం డ్రికి తగిన తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని మంత్రి కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సొంత ఖర్చులతో 6 రైతు వేదికలు జిల్లాలో తాను సొంత ఖర్చులతో ఆరు రైతు వేదికలను నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండ లాలతోపాటు తమ అమ్మమ్మ ఊరు అయిన బోయినపల్లిలో వీటిని నిర్మిస్తానని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ వేదికలను అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేదికలు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతాయని మంత్రి స్పష్టం చేశారు. -
సమర్థ అధికారుల వల్లే.. ప్రజలకు అభివృద్ధిఫలాలు
సాక్షి, హైదరాబాద్: భారత్లో మానవ వనరులకు, ప్రతిభకు కొరతలేదని.. వీటికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ విధివి ధానాలను సమర్థవంతంగా అమలుచేసేలా అధికారులు పని చేసినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆస్కి’(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో శనివారం సంస్థ చైర్మన్, డైరెక్టర్ బోర్డు సభ్యులు, సెక్రటరీ జనరల్, బోధనా సిబ్బందితో జరిగిన చర్చాగోష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల,మత, లింగ వివక్ష వంటి అడ్డంకులను దాటుకుని ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని అభిప్రాయపడ్డారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను నేర్చుకుని అమలుచేసేందు కు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అధికారులకు శిక్ష ణనిచ్చి ప్రజాసేవల వ్యవస్థను పకడ్బందీగా మార్చడంలో ‘ఆస్కి’వంటి సంస్థలు కృషిచేయాలన్నారు. స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పడావో–బేటీ బడావ్, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమా లు విజయవంతం కావడానికి అవి ప్రజా ఉద్యమాలుగా మారడ మే కారణమన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ‘ఆస్కి’లోని వివిధ విభాగాలను సందర్శించారు. శిక్షణార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చైర్మన్ పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన సమా వేశంలో వివిధ విభాగాల అధిపతులు తమ విభాగాల ద్వారా జరుగుతున్న అధ్యయనాలు, శిక్షణలను ఉపరాష్ట్రపతికి వివరించా రు. ఈ సందర్భంగా ‘ఆస్కి’పనితీరును, శిక్షణ సామర్థ్యాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆస్కిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రాజెక్టు వర్క్ గురించి వివరిస్తున్న ప్రొఫెసర్లు -
దేశ భవితకు ఆవిష్కరణలు అవసరం
సాక్షి, సంగారెడ్డి: సామాజిక అవసరాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏ వ్యక్తికైనా దేశం, ప్రజలే ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెలగాలని సూచించారు. ఫస్ట్ నేషన్.. నెక్ట్స్ ఫ్యామిలీయని, అదేవిధంగా జాతి మొదటి దని, స్వార్థం చివరిది అనే భావన ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఏర్పడుతుందన్నారు. ఐ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగి స్తోందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, ఇందుకు ని రంతరం యోగా సాధన చేయాలన్నారు. టిబెట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: ఐఐటీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాల కోసం యాచించవద్దని, వారే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని బండారు దత్తాత్రేయ సూచించారు. 2030 నాటికి భారతదేశంలో 65 శాతం యువత ఉంటోందని తెలిపారు. ఇది ప్ర పంచ దేశాలన్నింటిలోకి మన దేశం చేసుకున్న అదృష్టమన్నా రు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగాల కల్పన ఉంటే.. వీటిలో 1.5 కోట్ల ఉద్యోగాలు భారత్లోనే లభిస్తాయని చెప్పారు. తాను మొదటగా సామాజిక సేవా కార్యకర్తనని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడినని చెప్పారు. పలువురు విద్యార్థులు సీఏఏ, ఎన్పీఆర్, రాజకీయాలపై ప్రశ్నలు అడగగా.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందు వల్ల అవి మాట్లాడటం తగదని తిరస్కరించారు. సమావేశంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మన ఆధ్యాత్మికత ప్రపంచానికి బహుమతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వా లతో నిండిన ప్రపంచంలో రామ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్య తలు చాలా రెట్లు పెరిగాయని రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. కాన్హా శాంతివనం సంపూర్ణ జీవనానికి నమూనా వంటిదని ప్రశంసించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రదేశమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మిషన్ బలమైన ఆధ్యాత్మిక శక్తిగా మారిందని చెప్పారు. రామచంద్ర మిషన్ వ్యక్తిగత, సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజయోగ ధ్యానా నికి గల ప్రాచీన సంప్ర దాయాన్ని ఆధునిక ప్రపంచంలో మిషన్ ప్రోత్సహిస్తోందన్నారు. భారత ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదన్నారు. నంది గామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. వనం గ్లోబల్ హెడ్క్వార్టర్ని రాష్ట్రపతి ప్రారంభించారు. మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిర్వాహకులు 5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా చివరి మొక్కను రాష్ట్ర పతి నాటి కేంద్రాన్ని పరిశీలించారు. అనంత రం అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రయోజనాలకు చేపట్టిన కార్యకలాపాలు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలు ప్రశంసనీయమని, 5 లక్షల మొక్కలతో ఈ క్యాంపస్ ఆకు పచ్చని పరిసరాలతో అలరారుతోందన్నారు. సమున్నతులుగా తీర్చిదిద్దడానికి.. తమను తాము సమున్నతులుగా తీర్చిదిద్దు కోవాలన్న వారి కోరికను ఈ మిషన్ నెరవే ర్చుతుందని రాష్ట్రపతి తెలిపారు. మిషన్కు చెందిన అంతర్జాతీయ సమాజం భూమండ లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదని ఆకాంక్షించారు. సంతోషం, సంపూర్ణ సాను కూల శక్తియుక్తులతో అలరారే దిశగా మాన వాళిని పరివర్తన చెందించగలదన్న విశ్వా సాన్ని వెలిబుచ్చారు. ‘దాజీ వివరించిన ‘డిజై నింగ్ డెస్టినీ’లోని 5 సూత్రాలలో ఒకదాన్ని ఇక్కడ తప్పక నేను ప్రస్తావించాలి. మాన వత్వ గమ్యాన్ని రూపొందించాలి. ఇది మొదటగా మనతోనే ప్రారంభంకావాలి. ఆ తర్వాత ఇతరులకు విస్తరించాలి. అందరం కలిసి పనిచేస్తే మానవత్వ దిశను మార్చేం దుకు ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఇందుకు యువత సహకారం తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాల్లో వారిని నిమగ్నం చేయాలి’అని పిలుపు నిచ్చారు. శాంతివనం.. ఓర్పుకు నిదర్శనం కాన్హా శాంతివనం మానవ ఓర్పుకు నిదర్శ నమని గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ) అన్నారు. ఐదేళ్లలో శాంతివనంలో ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం నిర్మించడం వేలాది మంది అభ్యాసీకుల నిరంతర కృషి తోనే సాధ్యపడిందన్నారు. 1,400 ఎకరాల్లో శాంతి వనంలో నిర్మించిన ఐకానిక్ ధ్యాన కేంద్రం మానవాళి పరివర్తనకు కేంద్రంగా రూపాంతరం చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ధ్యాన శిబిరాలను గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి ఘన వీడ్కోలు.. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి కోవింద్కు బేగంపేట విమానాశ్రయంలో గవ ర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. -
కుటుంబసమేతంగా జోడేఘాట్కు కలెక్టర్
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురం భీం మ్యూజియం ఓ అద్భుతమని..గిరిజన సంప్రదాయాలు, సంస్కతికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. గురువారం చారిత్రక ప్రదేశమైన కెరిమెరి మండలం జోడేఘాట్లో ఏర్పాటు చేసిన కుమురం భీం మ్యూజియాన్ని కలెక్టర్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, గ్రామస్తులు వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. భీం సమాధిపై పూలు చల్లారు. వారికి మ్యూజియం క్యూరేటర్ మంగం విశ్వంభర్రావు భీం చరిత్రతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన హైమన్డార్ఫ్ చిత్రమాలిక, ఆదివాసీల ఫొటో ఫ్రేంలు పరిశీలించారు. స్మృతిచిహ్నం, మనిషి ఆకృతిలో ఉన్న బొటానికల్ గార్డెన్, ఆదివాసీ ఆభరణాలు, పర్దాన్, తోటి, గోండు, నాయకపోడ్, తదితర కులాలకు చెందిన దేవతా ప్రతిమలను తిలకించారు. అనంతరం గుస్సాడీల నృత్యాలు, తన సహచరులతో మాట్లాడుతున్నట్లు ఉన్న భీం ప్రతిమలను చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియానికి వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు వస్తారని.. మీరు కూడా వచ్చి సమస్యలు తెలుపవచ్చని స్థానికులకు సూచించారు. వారి వెంట తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఏటీడీవో భాస్కర్, ఎంపీపీ పెందోర్ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, నాయకులు పెందోర్ రాజేశ్వర్, మోహన్రావు, కోవ విజయ్, మడావి రఘు తదితరులు ఉన్నారు. -
విద్యాశాఖ మంత్రి తెలుసా?
ఎల్కతుర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదర్శ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను ఆరా తీసే క్రమంలో పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేరు ఏమిటని అడగగా విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక విద్యార్థి రాజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్న జనార్ధన్రెడ్డి ఆయన తండ్రికి ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. పిల్లలకు పనులు చెప్పకుండా రోజూ బడికి పంపించాలని సూచించారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించిన కేంద్రమంత్రి
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్కు ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఒఎండిసి) నుంచి ఐరన్ ఓర్ సరఫరా అవుతుందని.. తక్కువ రేటుకు వచ్చేలా చర్చలు జరుపుతామని వెల్లడించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు విషయంలో కృషి చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందాలంటే జాయింట్ వెంచర్ అవసరముందని అభిప్రాయ పడ్డారు. దేశంలో ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాలలో వున్న ఉక్కు పరిశ్రమలు కలిపి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తుందన్నారు. 2030 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం పెరిగేలా కృషి చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కార్మికుల కృషి ప్రధానమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , ఎమ్మెల్సీ మాధవ్, హరిబాబు, సిఎండి పికే రథ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
‘అనాలోచిత నిర్ణయాలతోనే వరద ముప్పు’
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి ఏజెన్సీలోని పోచమ్మ గండి, దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్ యాదవ్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు బాలరాజు, రాజా, ధనలక్ష్మి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పబ్లిసిటీకి చేసిన ఖర్చు నిర్వాసితుల పునరావాసానికి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. సోమవారం పోలవరం అంటూ ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. అనాలోచితంగా కాపర్ డ్యాం నిర్మించడం వల్లే దేవిపట్నం మండలంతో సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిందన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్ రూరల్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేధ్య పూజా సమయంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వామివారి మూలవిరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. -
దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక సీఎం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
రామయ్యను దర్శించుకున్న ఎంపీ వినోద్కుమార్
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వినోద్ కుటుంబసభ్యులు.. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయా రు అమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు చేశా రు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సియాచిన్లో కోవింద్
సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. ఇక్కడ పర్యటించిన రెండో రాష్ట్రపతి కోవిందే కావడం విశేషం. ఇంతకు ముందు 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులను ఉద్దేశించి కోవింద్ ప్రసంగిస్తూ..గత 34 ఏళ్లుగా సియాచిన్లో సేవలందిస్తున్న జవాన్ల అసమాన ధైర్య సాహసాలే మన సరిహద్దులు సురక్షితమన్న విశ్వాసాన్ని భారతీయుల్లో నింపాయని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న జవాన్లందరికీ ఆర్మీ సుప్రీం కమాండర్, రాష్ట్రపతి హోదాలో భారత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వీలు చిక్కినప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు రావాలని వారిని ఆహ్వానించారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్ను కూడా కోవింద్ సందర్శించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ డి. అన్బు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి. -
మహిళల సమాధానం.. సీఎం షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కి తన పర్యటనలో ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ స్వరాజ్ యోజన పథకాన్ని రాష్ట్రంలో 50,000 పంచాయతీల్లో విస్తరించాలనేది యోగి ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి యోగి గతకొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిత్యానాథ్ సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కందీపూర్, మధుపూర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో స్థానిక అధికారులు ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చాక అందరికీ మరుగుదొడ్లు నిర్మించిందా? లేదా? అని ప్రశ్నించగా... అక్కడున్న మహిళలంతా లేదు అని బిగ్గరగా అరవడంతో సీఎం షాక్తిన్నారు. ఈ ఘటనతో తీవ్ర అసహనానికి గురైన యోగి వెంటనే అక్కడున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలకు 24 గంటల్లో వారి ఖాతాలో నగదు జమచేసి, మరుగుదొడ్లు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం దళితవాడలో పర్యటించి, వారితో కలిసి భోజనం చేశారు. -
అమ్మవారిని దర్శించుకున్న ‘చాగంటి’
బాసర(ముథోల్): చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్రెడ్డి ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ చైర్మన్ శరత్పాఠక్, పాలకవర్గసభ్యులు ఉన్నారు. -
టెక్ 2017 సదస్సు సందర్శించిన ఎంపీ వరప్రసాద్
-
సింహపురిలో రాణి ది గ్రేట్
-
90 గంటలలో 108 శివాలయాల సందర్శన
విలేకరుల సమావేశంలో పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి నాలుగు దిక్కులలో నెలకొని ఉన్న 108 ప్రముఖ శివాలయాలను 90 గంటలలో సందర్శించడానికి భీమ సందర్శన రథ యాత్రను నిర్వహించనున్నట్టు శ్రీమహాలక్ష్మీసమేత చిన్నవేంకన్నబాబు స్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు తెలిపారు. బుధవారం సీతంపేటశాఖాగ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24వ తేదీ దేవీచౌక్ అమ్మవారిని దర్శించుకుని ద్రాక్షారామం చేరుకుంటామని, 25ఉదయం ఆరు గంటలకు ద్రాక్షారామం నుంచి యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. గత ఏడాది నవంబర్ 26న 108 గంటల్లో 108 శివాలయాలను సందర్శించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నామని, 82 గంటల్లో పూర్తి చేయగలిగామని తెలిపారు. ఈ ఏడాది 108 శివాలయాలను 90 గంటల్లోపు పూర్తి చేయాలనుకుంటున్నామని, ఆలయాలు తెరచి ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని ఆయన అన్నారు. ద్రాక్షారామభీమేశ్వరాలయం కేంద్రబిందువుగా నలుదిక్కులలో 108 ప్రముఖ శివాలయాలు ఉన్నాయని ద్రాక్షారామ ఆలయంలోని ఒకపురాతన పానవట్టం తెలియచెబుతోందని చిన్న వేంకన్నబాబు వివరించారు. జాతకరీత్యా 27నక్షత్రాలకు ఒకొక్కదానికి నాలుగు రాసుల చొప్పున ఉన్న 108 రాసులకు ఈ ఆలయాలు ప్రతీకలని వివరించారు. రాష్ట్ర అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కేవీఆర్ఎస్ఎన్ ఆచార్యులు, చవ్వాకుల శ్రీనివాస్, కల్లూరి సూర్యనారాయణ శర్మ, సీతంపేట శాఖాగ్రంథాలయాధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు, అర్చకులు పాల్గొన్నారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన ఎంపీ కవిత
-
డీఎంహెచ్ఓ కార్యాలయ పనుల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్నాయక్ ఆదివారం సందర్శించారు. దసరా రోజు నుంచి ఇక్కడి నుంచే పాలన కొనసాగనున్న దృష్ట్యా పనులను సూచించారు. కాంట్రాక్టర్ దగ్గర ఉండి పనులు చేయించాలన్నారు. ఆయన వెంట ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, కోటాచలం, సముద్రాల సూరి తదితరులు ఉన్నారు.