జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు | complaint to jc | Sakshi
Sakshi News home page

జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు

Sep 9 2016 12:41 AM | Updated on Sep 4 2017 12:41 PM

దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చి జేసీ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.

హన్మకొండ అర్బన్‌ : దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చి జేసీ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.
 
గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఆర్డీఓపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో జేసీ, ఎమ్మెల్యే  కలుగజేసుకుని శాంతిం పజేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. గ్రామంలో 33 ఎకరాలు కొనుగోలు చేసి ఎలాంటి తీర్మానం లేకుండా 11 మందికి కేటాయించారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement