జిల్లాలో వివిధ వయో విభాగాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నడుంబిగించింది. ఈ నెల 24, 25 తేదీల్లో నాలుగు విభాగాల్లో టాలెంట్ సెర్చ్ పేరిట ఎంపిక పోటీలు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. గతంలో ఆడినవారికి పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు. కొత్తవారు మాత్రమే ఆర్ట్స్కళాశాల మైదానంలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని ఏసీఏ అధికారులు కోరారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో వివిధ వయో విభాగాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నడుంబిగించింది. ఈ నెల 24, 25 తేదీల్లో నాలుగు విభాగాల్లో టాలెంట్ సెర్చ్ పేరిట ఎంపిక పోటీలు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. గతంలో ఆడినవారికి పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు. కొత్తవారు మాత్రమే ఆర్ట్స్కళాశాల మైదానంలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని ఏసీఏ అధికారులు కోరారు.
నాలుగు వయో విభాగాల్లో ఎంపికలు..
అండర్–14, 16, 19, 23 వయో విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. 24వ తేదీన అండర్–16, అండర్–19 ఎంపికపోటీలు నిర్వహిస్తుండగా, 25న అండర్–14, అండర్–23 ఎంపిక పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో (అండర్–14కు మినహా) జిల్లా, అంతర్ జోనల్, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రవేశం లేదని నార్తజోన్ క్రికెట్ కార్యదర్శి జీ.వి.సన్యాసిరాజు స్పష్టం చేశారు.
ఈ వయసువారే అర్హులు..
అండర్–14 ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు సెప్టెంబర్ 1, 2002 తర్వాత జన్మించి ఉండాలి. అండర్–16కు సెప్టెంబర్ 1, 2000 తర్వాత, అండర్–19కు సెప్టెంబర్ 1, 1997 తర్వాత, అండర్–23కు సెప్టెంబర్ 1, 1993 తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే అర్హులని నిర్వాహకులు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సన్యాసిరాజు కోరారు. ఎంపికైన వారికి క్రికెట్లో ప్రత్యేక తర్ఫీదునిస్తామని, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతామన్నారు.