వైభవంగా దొణగంగమ్మ జాతర | gangamma vesival | Sakshi
Sakshi News home page

వైభవంగా దొణగంగమ్మ జాతర

Published Tue, Aug 30 2016 1:18 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వైభవంగా దొణగంగమ్మ జాతర - Sakshi

వైభవంగా దొణగంగమ్మ జాతర

రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో  శ్రావణమాస చివరి సోమవారం దొణగంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని రంగు రంగుల పుషా్షలతో అలంకరించిన రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష భక్తులు దొణ నీటిలో స్నానమాచరించారు అనంతరం కోర్కెలు తీర్చాలని దొణచుట్టూ ప్రదక్షణలు చేశారు. అమ్మవారికి పూజలు చేసి, నైవేద్యం సమర్పించి వెంట తెచ్చుకున్న తీపి వంటలను అక్కడే ఆరగించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, ఎంపీపీ హŸన్నే భారతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్‌ మల్లికార్జున, ఐనాపురం మంజునాథ, ధనుంజయరెడ్డి, కొంతానపల్లి ఆంజనేయులు, పవన్, ఉమేష్‌ పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement