Rayadurgam
-
మహిళాశక్తి శిక్షణ : సత్తా చాటిన మహిళలు
చికెన్ బిర్యాని, సాధారణ బిర్యాని, బేసిక్ గ్రేవీస్, తెలంగాణ స్నాక్స్, రైతా, వెజ్ దమ్ బిర్యాని, చికెన్ కర్రీ, మిర్చి మసాల, రకరకాల అన్నం తయారీ, టీ, విభిన్న రకాల కాఫీ, సావరీ, వంటి వివిధ మెనూలను అదరగొట్టారు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వాహకులు. చెఫ్లు మహేష్ నిథమ్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, ప్రముఖ చెఫ్ డాక్టర్ ఎంకె గణేష్, ప్లేస్మెంట్ ఆఫీసర్ మిసెల్లీ జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో ఐదో బ్యాచ్లో 28 మంది మహిళలకు వంటల తయారీ, క్యాంటీన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. -రాయదుర్గం పరిశుభ్రమైన వాతావరణంలో, స్వచ్ఛమైన, నాణ్యమైన వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి అందించేలా ఏర్పాట్లు చేయడం, దీనిపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషమని శిక్షణలో పాల్గొన్న మహిళలు అన్నారు. పదిరోజుల పాటు అందించిన శిక్షణలో భాగంగా చివరి రోజైన సోమవారం మహిళలు నేర్చుకున్న వంటకాలన్నీ స్వయంగా తయారుచేసిన ప్రదర్శించారు. ఈ వంటకాలను నిథమ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (ఎస్ఈఆర్పీ), పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం ఎస్ఈఆర్పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్, నిథమ్ అధికారులు శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికే క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎస్ఈఆర్పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్ తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ క్యాంటిన్ల నిర్వహణ ద్వారా వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నారని గుర్తు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ప్రత్యేక శిక్షణలో నిథమ్కు మంచి గుర్తింపు ఉందని, నిర్వాహకులకు ఐదు విడతల వారిగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సెర్ప్ సీఈఓ డీ దివ్య, పర్యాటక శాఖ, నిథమ్ డైరెక్టర్ జెడ్, హన్మంత్ ఎప్పటికప్పుడు శిక్షణను పర్యవేక్షించారని గుర్తుచేశారు. సెర్ప్, నిథమ్, పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్టూడెంట్స్తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్ -
HYD: బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీ
సాక్షి,హైదరాబాద్: ఐటీ కారిడార్లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్టాప్ను దుండగులు దోచుకెళ్లారు.దోపిిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్కు పాల్పడిన 15 మంది, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రేస్కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
HYD: స్కూల్కు వెళ్లిన బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్కు గురైంది. బుధవారం స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
గోల్డ్మ్యాన్ దుర్గం శ్రవణ్..
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్మ్యాన్గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం -
రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు
-
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
బైక్ రేసర్ల హల్ చల్
-
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళపై టీడీపీ నేత అకృత్యం
రాయదుర్గం : టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురుబ కావేరి (26) అనే వివాహితపై లోకేశ్ అనే టీడీపీ నేత కన్నేశాడు. మార్చి 31 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నంలో భర్త గోనప్ప కాలు తొక్కాడు. దీంతో మేల్కొన్న గోనప్ప లైటువేసి టీడీపీ నేతను పట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో లోకేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 1న కావేరి దంపతులు డి.హీరేహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ నేత లోకేశ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్నాళ్లు నాటకం ఆడాడు. కాగా.. గురువారం గ్రామంలోకి వచ్చి తిరుగుతూ కనిపించాడు. దీనిని అవమానంగా భావించిన కావేరి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. తన భార్య చావుకు లోకేశ్ కారణమని ఆమె భర్త గోనప్ప, తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్! -
రాయదుర్గంలో విజయ యాత్ర
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు విజయయాత్ర చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో రాయదుర్గం కళకళలాడింది. వీధివీధిలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముందుగా శాంతినగర్లోని వైఎస్ విగ్రహానికి మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి వేలాది మందితో ప్రారంభమైన బస్సు యాత్ర తేరుబజారులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంది. అప్పటికే వేలాది మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. వారికి యాత్రలో వచ్చిన ప్రజలు కలిసి ఆ ప్రాంతమంతా జనసంద్రంలా కనిపించింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమైంది. మనకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం: మంత్రి ఉషశ్రీచరణ్ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలిచి, అనేక కార్యక్రమాలతో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తేనే పేదలకు పథకాలు అందేవని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్కు అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న స్కీమ్ల ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు స్కామ్ల సీఎం అని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో సీఎం జగనన్నపై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరీ ఎక్కువవుతుందని, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుడూ సైనికుడిలా దానిని తిప్పికొట్టాలని అన్నారు. తలరాతలు మార్చిన బ్రహ్మ సీఎం జగన్: మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తలరాతలు మార్చిన బ్రహ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. అట్టడుగు వర్గాలను నవరత్నాల పథకాలతో ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఏకంగా రూ.2.50 లక్షల కోట్లు వారికి పంచిపెట్టారని అన్నారు. 2019లో ఒక ఓటు వేసినందుకే ఇన్ని కోట్లు పేదలకు పంచిపెట్టారని, 2024లో మళ్లీ సీఎం అయితే మన జీవితాలు మరింత బాగుపడతాయని వివరించారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏరోజైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది చోట్లా డిపాజిట్లు కూడా రాని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమి ఉద్దరిస్తారని నిలదీశారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వలేని పవన్ ఇక ప్రజలకు ఏమి గ్యారంటీ ఇస్తారని అన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బీసీ కాదని, కే బ్రాండ్ బీసీ అని వ్యాఖ్యానించారు. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో వైరల్గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరగాల్సిన సభను రద్దు చేశారు. ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
అభినందన మరచి అభాండమా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు తీరుపై విమర్శలు
సాక్షి, అనంతపురం: రాజకీయాలు ఎప్పుడూ హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు, వ్యవస్థల పనితీరుకు దోహదపడాలి. నేతలు హుందాగా వ్యవహరించినప్పుడే అది సాధ్యపడుతుంది. కానీ ప్రతిపక్ష నేతలు రాజకీయ కట్టుబాట్లు పాటించడం లేదు. మరీ ముఖ్యంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యవహారశైలి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటోంది. నిక్కచ్చిగా పనిచేస్తూ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులను అభినందించాల్సింది పోయి..వారికి రాజకీయ దురుద్దేశాలను అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల సరఫరా ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే. దేశవ్యాప్త నెట్వర్క్ కల్గిన ఈ ముఠా ఆట కట్టించడానికి పోలీసులు ఎంతగానో శ్రమించారు. కానీ వారి శ్రమను వృథా చేసేలా కాలవ వ్యాఖ్యలు చేశారు. ముఠా సభ్యుల్లో ఒకరితో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కేసు దర్యాప్తులో పోలీసులకు ఆటంకాలు సృష్టించేలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలను పోలీసు అధికారులు నేరుగా ఖండించాల్సిన పరిస్థితులను కల్పించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి..రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సమర్థతకు నిదర్శనాలెన్నో.. జిల్లా పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. ‘చాట్బాట్’ సేవల ద్వారా గతే ఏడాది ఆఖరు వరకు సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 4,294 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 2021–22 మధ్యకాలంలో మత్తుపదార్థాలు, పేకాట, మట్కా, గుట్కా, బెట్టింగ్ తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఒక్క జూదాలపైనే 5,236 కేసులు నమోదు చేశారంటే పోలీసు వ్యవస్థ సమర్థతను అర్థం చేసుకోవచ్చు. నకిలీ ఎన్ఓసీలు, ఆధార్కార్డుల మార్ఫింగ్, రియల్ ఎస్టేట్ దందాల ముఠాల ఆట కట్టించారు. ఈ కేసుల్లో పలువుర్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. డీజీపీ నుంచి ప్రశంసలు ఆయుధాల సరఫరా ముఠా అరెస్టులో ‘అనంత’ పోలీసులు చూపిన తెగువను స్వయాన డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ప్రశంసించారు. ఈ ముఠా సభ్యులకు నకిలీనోట్ల చెలామణి మొదలుకుని..గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, కిరాయి హత్యలు తదితర వాటితో సంబంధాలు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను గత డిసెంబరులో అరెస్టు చేసిన జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి ఆయుధ నెట్వర్క్ మూలాలను గుర్తించారు. ముఠా సభ్యుల్లో కీలకమైన మధ్యప్రదేశ్కు చెందిన రాజ్పాల్సింగ్ ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆయుధాల తయారీ కేంద్రాలపైనా దాడులు నిర్వహించారు. కొత్త ప్రాంతాల్లో, అది కూడా ఆయుధ ముఠా కేంద్రాలపై దాడులు చేయడమంటే ఆషామాషీ కాదు. అయినప్పటికీ జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి దాడులు చేసి..ఆయుధాలను, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించిన పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించగా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మాత్రం వారి శ్రమను తక్కువ చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు పోలీసు వర్గాలను విస్మయానికి, వేదనకు గురి చేశాయి. కాలవ తీరు హేయం జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి ఆయుధ ముఠాను పట్టుకున్నారు. వారి శ్రమను గుర్తించాల్సింది పోయి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభాండాలు వేయడం హేయమైన చర్య. స్వార్థ రాజకీయాల కోసం కేసునే తప్పుదారి పట్టించేలా మాట్లాడటం పద్ధతిగా లేదు. – బీటీపీ గోవిందు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎక్కడా రాజీ పడలేదు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఆట కట్టించడానికి డీజీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేశాం. ఈ ముఠాలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నా ధైర్యంగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తులో ఎక్కడా రాజీపడలేదు. ఈ కేసు విషయంలో అనవసరమైన ఆరోపణలు చేయడం తగదు. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ సంబంధం లేని అంశాలను తేవొద్దు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. ఆయుధ ముఠాను పట్టుకోవడంలో మన పోలీసులు చూపిన ప్రతిభ రాష్ట్రానికే తలమానికం. డీజీపీ నుంచి రివార్డు అందుకోవడం గర్వంగా ఉంది. దర్యాప్తుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం మంచిపద్ధతి కాదు. – బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం -
హైస్పీడ్లో మెట్రో పనులు.. రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మధ్య అలైన్మెంట్ ఖరారు!
సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యన అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులను వేగవంతం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మార్గంలో జరుగుతున్న సర్వే పనులను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు. దిశానిర్దేశం ఇలా.. - మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఈ కారిడార్ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ, శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఎనీ్వఎస్ రెడ్డి ఆదేశించారు. - ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్ను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఆకాశహరŠామ్యలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, స్కై వాక్ల నిర్మాణం ఉండాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. - రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు స్టేషన్ను పొడిగించనున్న నేపథ్యంలో.. నూతన టెరి్మనల్ స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానానికి మార్గాలను అన్వేíÙంచాలన్నారు. స్థలాభావం కారణంగా ఐకియా భవనం తర్వాత రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. - మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు. జేబీఎస్ స్టేషన్, అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు. ఈ రూట్లో ట్రాన్స్కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై ఓల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని సూచించారు. హై ఓల్టేజ్ అండర్గ్రౌండ్ కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా చూడాలి. సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్ను నిర్మించే సమయంలో.. ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండీ సూచించారు. నానక్రామ్గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్ను విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. ∙నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్కు ఆవల నుంచి వచ్చే ప్రయానికులను అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
మెట్రో.. మెట్రో: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోతో సమయం, డబ్బు, ట్రాఫిక్ లేకుండా రాకపోకలు సాగించే వీలుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. కొన్ని రోజులుగా మధురానగర్, ప్రశాంత్హిల్స్ కాలనీ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్య కాలనీ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ల్యాంకోహిల్స్, నానాక్రాంగూడ ప్రాంతాలలో మెట్రోపై అందరూ చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి డివిజన్ అనగానే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఉన్నత విద్యా, శిక్షణ సంస్థలకు నిలయం. అలాంటి ప్రాంతానికి మెరుగైన రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెట్రో రూటు ఇదే.. ►రాయదుర్గం సర్వే నంబర్–83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు విస్తరిస్తారు. ►ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్రాం గూడ ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి పక్కనే ఉన్న సరీ్వస్ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. ►ఈ మెట్రోతో గచి్చ»ౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్యకాలనీ, ల్యాంకోహిల్స్, నానక్రాంగూడ, పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది. ►ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోíÙస్తున్నారు. ►ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల లోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతోనే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతోనే గచ్చిబౌలి డివిజన్కు మెట్రో సౌకర్యం ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే లింకురోడ్లు, ఫ్లైఓవర్లతో చాలా వరకు తగ్గినా ఈ మెట్రోతో మా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం మరింతగా చేరువ కానుండడంపై అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది. –సాయిబాబా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ రైలు సౌకర్యం వస్తుందని అనుకోలే.. మా మధురానగర్, ఖాజాగూడ, నానక్రాంగూడ, పరిసరాలకు మెట్రో సౌకర్యం కలుగుతుందనే భావన ఎంతో సంతోషానిస్తోంది. ఇటీవల అపార్ట్మెంట్లు విపరీతంగా వెలిశాయి. దీనికితోడు ఐటీ సంస్థలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది చాలా వరకు తగ్గుతుంది. – రమేష్గౌడ్,మధురానగర్ మెట్రో రావడం చాలా సంతోషం.. మెట్రోతో ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. మియాపూర్, మాదాపూర్ వరకు వచి్చంది. మాకు కూడా వచి్చంటే బాగుండు అనుకున్నం. శంషాబాద్, నార్సింగి, గచ్చి»ౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు ఇతర చోట్లకు వెళ్ళేందుకు సమయం, డబ్బు ఆదాతోపాటు వేగంగా Ðð ళ్లేందుకు అవకాశం కలుగుతుంది. –పొన్నయ్య, ఖాజాగూడ -
టీహబ్–2లో 200 స్టార్టప్ల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్ నెలలో ఐటీ శాఖ ఈ హబ్ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. టీహబ్–2 ప్రత్యేకతలివే.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్–2 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్,నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నెలకొల్పారు. ► స్టారప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. ► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ స్ఫూర్తితో.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి. ఈ హబ్ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’) ఐటీ భూమ్..హైహై టీహబ్ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!) -
లిక్కర్ స్కామ్లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పొలిటికల్ హీట్ ఇంకా తగ్గలేదు. లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. దీంతో తెలంగాణలో ఊహించని విధంగా పొలిటికల్ టెన్షన్ చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ శుక్రవారం ఉదయం మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, హైదరాబాద్లో 25 ప్రాంతాల్లో 25 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లోని రాయదుర్గం, నానక్రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ దక్కించుకున్న కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్పై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ తెలంగాణలోనే చెబుతామన్నారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఇది కూడా చదవండి: సర్వే రిపోర్టులతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు ! -
కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని..
బెళుగుప్ప(అనంతపురం జిల్లా): దశాబ్దాలు వేగంగా మారుతున్నాయి.. సాంకేతిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి చావే లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కుల జాడ్యం మాత్రం మనుషుల మధ్య చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా కుల పట్టింపులకు ఓ ప్రేమ జంట బలైంది. తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో నిండు నూరేళ్లు కలసి బతకాల్సిన ఆ యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి రాయదుర్గం పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకన్య (20) స్థానిక నర్సరీలో పనిచేసేది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన బోయ ధనుంజయ (23) పట్టణంలోని ఓ సెల్ఫోన్ రిపేరీ షాపులో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలిపారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరువైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీకన్య, ధనుంజయ కలిసి బతకలేమని భావించారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలోని ఓ తోట వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషద్రావకం తాగారు. ఆ తర్వాత తమ స్నేహితులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని తెలిపారు. దీంతో వారు బెళుగుప్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ వెంటనే 108 వాహనం రావటంతో అందులో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకన్య గురువారం తెల్లవారుజామున, రాత్రి ధనుంజయ మృతి చెందారు. ఈ ఘటనపై యువతి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. -
అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల
సాక్షి, అనంతపురం (డి.హీరేహాళ్, రాయదుర్గం): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేన రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. స్వయాన ఆయన భార్య స్రవంతి మంగళవారం మీడియాకు ఆధారాలు అందజేశారు. ఆమె తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన స్రవంతికి డి.హీరేహాళ్ మండలంలోని మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేనతో 2008 సంవత్సరంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. ఈ క్రమంలో కొందరిని లొంగదీసుకుని రాసలీలలు సాగించాడు. మరోవైపు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నీవు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. తర్వాత అతని సెల్ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూసి ఆమె విస్తుపోయింది. పరాయి మహిళలతో రాసలీలల వ్యవహారంపై భర్తను నిలదీసింది. అయినా అతను పద్ధతులు మార్చుకోలేదు. పైగా భార్యను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసి ఆమె పిల్లల సహా రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత అతను స్రవంతికి మతిస్థిమితం లేదంటూ విడాకుల నోటీసు పంపించాడు. పెద్దమనుషుల సమక్షంలో ఘర్షణ విడాకుల నోటీసు విషయంపై మాట్లాడేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం మురడికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకుడు అనంతసేనను నిలదీశారు. అలాగే అతను ఇతర అమ్మాయిలను ముద్దు పెడుతూ అభ్యంతరకరంగా దిగిన ఫొటోలను పెద్ద మనుషుల సమక్షంలో చూపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. పోలీసులు, పెద్దలే తనకు న్యాయం చేయాలని స్రవంతి వేడుకున్నారు. అనంతరం ఆమె రాయదుర్గం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. -
Anantapur: కాలవా.. కంత్రీ వ్యవహారాలు మానుకో
సాక్షి, అనంతపురం: ‘రాయదుర్గం ప్రజల దీవెనలతో రాష్ట్రానికి మంత్రిగా చేశావ్. నీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. అదే మేము ప్రజలకు మంచి చేస్తుంటే సంతోషించాల్సింది పోయి కంత్రీలా వ్యవహరిస్తావా’ అంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన రాయదుర్గంలోని తన కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ ముస్తాక్, జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాలవ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో కూర్చొని చెంచాగాళ్లయిన కొందరికి డైరెక్షన్ ఇస్తూ తమను అడ్డుకోవాలని కుట్ర పన్నడం, దాన్ని ఏదో జరిగిపోయినట్టు ఎల్లోమీడియా చిత్రీకరించడం, ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. డి.కొండాపురంలో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో మూడు రేషన్కార్డులుంటే రూ.2.40 లక్షలు, వడ్రవన్నూరులోనూ టీడీపీ నాయకుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ప్రభుత్వ సహాయం అందిందని, అందుకు సంబంధించిన బ్రోచర్లను తాము అందించామని తెలిపారు. ఇలా లబ్ధి పొది కూడా పచ్చ నాయకులు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్) ఐటీ కట్టినోడికి అమ్మఒడి ఎలా ఇవ్వాలి? ‘రాయదుర్గం 8వ వార్డులో టీడీపీ సోషల్మీడియా కార్యకర్తకు గత రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినందున జాబితాలో పేరు రాలేదు. అంతమాత్రాన ఉద్యోగులు, వలంటీర్ పట్ల రౌడీలా ప్రవర్తిస్తాడా? ఇంటి వద్దకెళ్లిన నా పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడమని డైరెక్షన్ ఇస్తావా కాలవా? అతనిపై వలంటీర్ ఫిర్యాదిస్తే నీవు గుంపును వెంటేసుకుని రచ్చ చేస్తావా? కర్ణాటక రాష్ట్రం రాంపురంలో బిందెల కంపెనీ పెట్టి ఆ ప్రాంత ప్రజలతో చీపుర్లతో కొట్టించుకున్న వ్యక్తికి నీలాంటి ద్రోహులు అండగా నిలవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార’ని విప్ కాపు అన్నారు. ఇటీవల కణేకల్లులోనూ అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుడికి కాలవ అండగా నిలవడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కాలవ.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యభిచారిగా మారిన అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరమన్నారు. అప్పుడేం పీకావ్? ‘రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావ్? పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఎందుకివ్వలేదు? మీ అసమర్థత వల్లే ఈ రోజు మా ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాల్సి వచ్చింది. నీ హయాంలో టెంకాయ కొట్టిన రోడ్లను సైతం మేమే బాగుచేశాం. దమ్మూ ధైర్యముంటే మాతో పాటు గడప గడపకూ రా! నీవేం చేశావో.. మేమేం చేస్తున్నామో ప్రజలనే నేరుగా అడుగుదాం’ అని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నీవొక అడుగు ముందుకేస్తే..తాను పదడుగులు ముందుకేస్తానని, తగ్గేదేలేదని అన్నారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు దేవరాజు, పద్మ, శారద, గోవిందరాజులు, ఫకృద్దీన్, కృష్ణమూర్తి, పొరాళ్ల శివ, వైజాక్ రిబ్కా, గుమ్మఘట్ట మండల కన్వీనర్ బోయ మంజునాథ, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి గోవిందు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్యార్డు డైరెక్టర్ నారాయణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ మెట్రో కథ కంచికేనా..?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం లండన్.. మన దేశంలోని కోల్కతా తరహాలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్లక్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే. ఇదీ అండర్గ్రౌండ్ మెట్రో ప్లాన్.. రాయదుర్గం–శంషాబాద్ మార్గంలో 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లో కేవలం 3 కి.మీ. మార్గంలో... శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకుపడడంలేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా..? మొదటి దశ తరహాలో పబ్లిక్ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్ వీడడం లేదు. (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) ఎయిర్పోర్ట్ మెట్రో ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ వి మానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. ► కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ను డిజైన్ చేశారు. ► ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసింది. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు అవస్థలుండవు. ► ఈరూట్లో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ► స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ► మెట్రో స్టేషన్లను ఔటర్రింగ్రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్థలపరిశీలన కూడా పూర్తైంది. (క్లిక్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!) -
'అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత
సాక్షి, తాడిపత్రి: అదనపు కట్నం తీసుకురాలేదన్న కక్షతో భార్యను, కన్నబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడు. అనంతరం తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. రాత్రంగా చలిలోనే భర్త ఇంటి ఎదుట బిడ్డతో కలిసి బాధితురాలు నిరీక్షించింది. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు శ్రుతి వేదన ఆమె మాటల్లోనే.. ‘మాది రాయదుర్గం. నాన్న బి.భాస్కర్, అమ్మ శకుంతల. 2014లో నాకు తాడిపత్రిలోని సంజీవనగర్ మూడో రోడ్డుకు చెందిన డి.శ్రీకృష్ణ కిషోర్తో వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.2లక్షల కట్నంతో పాటు 18 తులాల బంగారు నగలను మా తల్లిదండ్రులు ఇచ్చారు. అప్పట్లో ఆయన శ్రీరామ్ చిట్ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్ని నెలలు మా జీవితం సాఫీగానే సాగింది. 2015లో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. అదే ఏడాది డిసెంబర్లో మాకు కుమార్తె శాన్విత జన్మించింది. ఉద్యోగం లేక ఖాళీగా ఇంటి పట్టునే ఉంటున్న నా భర్త, అతని తల్లి లక్ష్మీదేవి, చెల్లెలు అర్చన (2012లో కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహమై భర్తను వదిలి పుట్టింటిలోనే ఉంటోంది) నన్ను తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. రూ. 5లక్షలు తీసుకుని రావాలంటూ పుట్టింటికి పంపారు. అయితే అంత పెద్ద మొత్తం తామిచ్చుకోలేమని అల్లుడికి మా అమ్మ తెలిపింది. అయితే మీ కూతురిని మీ ఇంట్లోనే పెట్టుకోండి అంటూ పుట్టినింటిలోనే నన్ను వదిలేసి వచ్చేశారు. పెద్దల జోక్యంతో తిరిగి అత్తింటికి చేరుకున్నా.. అప్పటి నుంచి నాపై వేధింపులు ఎక్కువయ్యాయి. చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు) విడాకులకు దరఖాస్తు.. నాకు తెలియకుండానే మా ఆయన 2018లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించాను. దీంతో శనివారం రాత్రి నా భర్త కృష్ణకిషోర్తో పాటు వారి అమ్మ, చెల్లెలు నన్ను, పాపను కొట్టి ఇంట్లోనుంచి బయటకు గెంటేశారు. రాత్రి చలికి తట్టుకోలేకపోయాం. దిక్కుతోచని స్థితిలో 100కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చారు. నా భర్తకు నచ్చజేప్పేందుకు సీఐ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారు వినలేదు పైగా తన తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. శనివారం రాత్రంతా ఇలా ఇంటి బయటే ఉండిపోయా. నా భర్తకు నచ్చచెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి.’ అమ్మా నాన్నను కలపండి సారూ ‘మా డాడీ మా అమ్మను వదిలేసి పోతానంటున్నాడు. నాకేమో డాడీ, మమ్మీ ఇద్దరూ కావాలి. మా అమ్మ, నాన్నను కలపండి సారూ..’ – శాన్విత చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!) -
రాయదుర్గం పీఎస్ పరిధి టెలికంనగర్లో భారీ చోరీ
-
మా నీటిని తీసుకుంటే తప్పేంటి?
రైతు ఎక్కడున్నా రైతే. నీళ్లు ఎవరికైనా ప్రియమే. వాళ్లూ బతకాలి. మనం కూడా బతకాలి. కోటా మేరకు నీటిని వాడుకోవడంలో గొడవలు తగవు. నీటి విషయంలో రాజకీయాలు చూడలేకే మాట్లాడుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్ కానీ కోరుకుంటున్నది ఒక్కటే. ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు. పాలకుల మధ్య సఖ్యత ఉంటేనే అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉంటారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రైతు దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని విద్యార్థి పాఠశాలలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటి వరకు నీటి విషయం గురించి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారు. తెలంగాణకు చెందిన కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికీ, చంద్రబాబుకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా’ అంటూ వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక అని, దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీల కేటాయింపులకు సంబంధించి 2015 జూన్ 19వ తేదీన కేంద్రం, ఏపీ, తెలంగాణ.. ముగ్గురం సంతకాలు చేశామని చెప్పారు. ఇవాళ రాయలసీమ పరిస్థితిని గమనించాలని చెబుతున్నా. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తి స్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు పైగా నీళ్లు చేరాలన్నారు. బాగా వర్షాలు కురిసిన ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవన్నారు. మరి అలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే.. మరో వైపు పక్క రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణాకు ఉందన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగులలోపు వారు నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. మేము కూడా 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన వైఎస్సార్ రైతు దినోత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సభలో పాల్గొన్న ప్రజలు బూబూ ఆ రోజు మీరేం చేశారు? ‘అయ్యా.. చంద్రబాబూ.. ఇవాళ మీరు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. గతంలో మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పాలమూరు–రంగారెడ్డి, డిండి లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు కడుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారా?’ అని సీఎం జగన్ నిలదీశారు. అప్పుడు గాడిదలు కాసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు నీటి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిల్లో మనం కూడా ఇవాళ 800 అడుగుల్లో లిఫ్టు పెట్టి మనకు కేటాయించిన నీటిని మాత్రమే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరి నీటిని తీసుకోవడానికి ఈ లిఫ్ట్ పెట్టడం లేదని స్పష్టం చేశారు. తమకు ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా విభేదాలు వద్దని.. అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. అందువల్లే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టనని తెలిపారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పారు. దేవుడి దయతో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడాలని, రైతన్నలకు మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇది రైతు మేలు కోరే ప్రభుత్వం ► కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంలో రాష్ట్రమంతా అతలాకుతలమైన పరిస్థితులున్నా.. ఆదాయం పెను సవాలుగా మారినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కష్టాలతో పోలిస్తే రైతులు, అక్కచెల్లెమ్మలు, పేదల కష్టాలే ఎక్కువ అని భావించి ఎక్కడా రాజీ డకుండా పని చేశాం. ► ఈ రోజు గ్రామాల రూపురేఖలను మార్చేశాం. రైతుల కోసం ఇంతగా మనసు పెట్టి ఆలోచన చేసిన సందర్భం ఎప్పుడూ, ఎక్కడా లేదు. 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో రైతన్నల కష్టాలు చూశాను.. విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ మాట ఇచ్చాను. ఆ మేరకు ఈ రెండేళ్లలో చేసి చూపించగలిగాను. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ చేస్తూ వస్తున్నాం. రైతు విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్సార్ ► దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించినంత కాలం రైతుల గురించి ఆలోచించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచ, కర్మణా కోరుకున్నారు. ఈ రోజు ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ► ఆ రోజుల్లో ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వాలని అంటే, నాన్నగారికి ముందున్న పాలకులు కరెంటు తీగలు చూపించి బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడతాయని అపహాస్యం చేశారు. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి రాష్ట్రంలో రైతు విప్లవానికి నాంది పలికారు. ► ఇన్పుట్ సబ్సిడీ పెంపు, విత్తనాల ధరల తగ్గింపు, ఒక సంతకంతో కరెంటు బకాయిలు రద్దు.. ఇలా రైతుల కోసం ఎన్నో చేశారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేసిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెబుతున్నాను. అదే స్ఫూర్తితో ముందుకు అడుగులు ► దివంగత మహానేతను స్ఫూర్తిగా తీసుకుని ఈ రెండేళ్లూ మన పరిపాలన కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా సాగిందని సగర్వంగా పేర్కొంటున్నాను. అందుకే ఈ రెండేళ్లలో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా రూ.1,570 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ► ఎన్నికల ప్రణాళికలో రైతుల బాగోగుల కోసం పని చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా అన్నీ చేసుకుంటూ వచ్చాం. పంట వేసే సమయంలో రైతన్నకు పెట్టుబడి ఖర్చుల వల్ల, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల నేపథ్యంలో కష్టాలు వస్తాయి. ► పంట వేసిన తర్వాత, కరువు వల్లో, వర్షాల వల్లో పంట దెబ్బతిన్నప్పుడు రైతు తల్లిడిల్లుపోతున్న పరిస్థితి నా కళ్లారా చూశాను. వారి కష్టాలు తీర్చడంలో భాగంగా పెట్టుబడి సహాయంగా ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా రైతు భరోసా పథకం కింద రూ.13,500 చొప్పున మూడు విడతలుగా అందజేస్తున్నాం. దీనివల్ల దాదాపు 70 శాతం మంది రైతులకు పెట్టుబడి ఖర్చు ఇచ్చినట్లవుతుంది. ఈ రెండేళ్లలో 52.38 లక్షల మంది రైతన్నలకు రూ.17,029 కోట్లు ఇచ్చాం. ప్రతి అడుగులోనూ తోడుగా ఆర్బీకేలు ► రైతుల కోసం ఆలోచించాం కాబట్టి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి అమ్మకం వరకూ ప్రతి సందర్భంలోనూ రైతును చేయి పట్టుకుని సహాయ సహకారాలు అందిస్తూ ఈ కేంద్రాలు తోడుగా ఉంటున్నాయి. ► ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మంచి జరుగుతోంది. ఇక్కడ నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను 48 గంటల్లో అందించే పరిస్థితి ఉంది. ఇదే అనంతపురం జిల్లాలో 2.33 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం ఎవరికీ కష్టం లేకుండా సులభంగా పంపిణీ చేయగలిగాం. ► వేరుశనగ విత్తనాల కోసం గతంలో పడిగాపులు పడే పరిస్థితి. మండల కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ఇదే ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్ చేయిస్తున్నాం. ప్రతి పంట, విస్తీర్ణం సహా ఆర్బీకేల్లో నమోదు అవుతుంది. ఈ ఏడాది నుంచి ఫిజికల్గా రసీదులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం. ఈ–క్రాపింగ్ జరిగిన వెంటనే పంటల బీమా, వడ్డీలేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, చివరకు పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతోంది. ► ప్రతి ఊళ్లో క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఖరీఫ్లో నష్టం జరిగితే.. తర్వాత ఖరీఫ్కల్లా పరిహారం అందుతుంది. ఏ సీజన్లో నష్టం వస్తుందో, ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. గతంలో యూనిట్ రూ.3.84 ఉన్న కరెంటు రేటును రూ.1.50కే ఇచ్చి ఆక్వా రైతులకు కూడా అండగా నిలిచాం. ► ఆర్బీకేల పరిధిలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో కూడిన వ్యవసాయ బోర్డు, మండల స్థాయిలో మరో బోర్డు, జిల్లా స్థాయిలో ఇంకో బోర్డు, రాష్ట్ర స్థాయిలో మరో బోర్డు సమావేశాలు జరుపుతున్నాయి. పంటల ప్రణాళికపై సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభాలు వస్తాయని క్రాప్ ప్లానింగ్ చేస్తున్నాయి. ► ఆర్బీకే స్థాయిలోనే రైతన్నలకు తక్కువ అద్దెకే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా పనిముట్లను అందజేస్తున్నాం. రైతన్నలు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్బీకేలను సంప్రదించవచ్చు. లేదంటే సీఎం యాప్ ద్వారా సమాచారం పంపినా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర ధర ప్రకారం ఆ పంటను కొనుగోలు చేస్తారు. ఈ రెండేళ్లలో రూ.6,600 కోట్లకుపైగా (ధాన్యం, పత్తి కొనుగోళ్లు కాకుండా) ఖర్చు పెట్టాం. కంది, బొప్పాయి, చీనీ, వేరుశనగ, చివరకు పొగాకు కూడా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచాం. పాల విప్లవానికి నాంది ► కేవలం వ్యవసాయం మీదే ఆధారపడితే రైతుల ఆదాయాలు పెరగవని, అదనపు ఆదాయాలు కలిగినప్పుడే రైతులు బాగుపడతారని ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఇందులో భాగంగా చేయూత, ఆసరా పథకాలు తీసుకు వచ్చాం. పాడిపశువుల కొనుగోలును ప్రోత్సహించాం. ► అమూల్ను తీసుకు వచ్చాం. రేటు పెంచి కొనుగోలు చేసేలా కార్యాచరణ చేశాం. ప్రస్తుతం 2 వేల చోట్ల ఈ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం ద్వారా పాల విప్లవానికి నాంది పలకబోతున్నాం. ఇదంతా అభివృద్ధి కాదా? అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని నేను అంటే గిట్టనివాళ్లు అంటున్నారు. బటన్ నొక్కి డబ్బులు మాత్రం ఇస్తున్నాడని అంటున్నారు. గ్రామాలకు వెళ్లి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో కనిపిస్తుంది. శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను నాడు–నేడు ద్వారా పూర్తిగా మార్చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ సిలబస్తో బోధిస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశాం. అందులో అదే గ్రామం పిల్లలు 10–12 మంది పని చేస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ఏ సేవ అయినా నేరుగా ఇంటి వద్దకే చేరుస్తున్నారు. అదే గ్రామంలో రెండడుగులు వేస్తే ఆర్బీకేలు రైతులకు అన్ని విధాలా తోడుగా ఉన్నాయి. విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. 91 రకాల మందులు అందులో ఉంటాయి. 24 గంటలూ పని చేస్తాయి. సిబ్బందీ అక్కడే కాపురం ఉంటారు. మరో నాలుగు అడుగులు వేస్తే.. అంగన్వాడీ కేంద్రాలు ప్రీప్రైమరీగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో నాలుగు అడుగులు వేస్తే.. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ తీసుకువచ్చి డిజిటల్ లైబ్రరీ కూడా అక్కడే కనిపించే పరిస్థితి. ఇదంతా అభివృద్ధి కాదా? శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను, ఆస్పత్రులను మార్చడం అభివృద్ధి అంటారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్న రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ.. కష్టాల నుంచి బయట వేసేందుకు పని చేస్తున్న ఆర్బీకేలను అభివృద్ధి అంటారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రావడాన్ని లభివృద్ధి అంటారు. వివక్ష, అవినీతి లేకుండా.. నాకు ఓటు వేయని వారికి కూడా ఇవాళ మంచి జరుగుతోంది. నేనంటే గిట్టని వారందరికీ ఇదే చెబుతున్నా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మనది రైతుపక్షపాత ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
-
మీ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నాం.. సీఎం జగన్తో రైతులు
-
నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్
రాయదుర్గం: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్లో నీటి కేటాయింపులు జరిపియని సీఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు ఆనాడు ఏం చేశావ్? అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా ’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని సీఎం జగన్ నిలదీశారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని సీఎం అన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్ సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి వైస్సార్ గారు : కాపు రామచంద్ర రెడ్డి
-
మనది రైతుపక్షపాత ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్ఆర్ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పెట్టుబడిసాయం కింద రైతన్నలకు ఏటా రూ.13,500 ఇస్తున్నామని, రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, ప్రతి పంటకు ఈ-క్రాపింగ్ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నాం పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆర్బీకేలో అమ్ముకోవచ్చని, రైతులకు అడుగడుగునా ఆర్బీకేలు అండగా ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ సీజన్లోని ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే ఇస్తున్నామని, ఆర్బీకేల ద్వారా తక్కువ అద్దెకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్లో నీటి కేటాయింపులు జరిగాయని సీఎం జగన్ గుర్తుచేశారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవన్నారు. దీనికంటే ముందు రాయదుర్గం మార్కెట్ యార్డ్లో అగ్రి ల్యాబ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్ను సందర్శించారు. అనంతరం మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్.. కాసేపు రైతులతో ముచ్చటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాయదుర్గం మార్కెట్ యార్డ్ లో అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవం
-
మీ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నాం.. సీఎం జగన్తో రైతులు
సాక్షి, రాయదుర్గం: అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో సీఎం జగన్ మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్ను సందర్శించారు. రైతులతో ముచ్చటించిన సీఎం జగన్.. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ కాసేపు రైతులతో ముచ్చటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక తాము ఆనందంగా ఉన్నామని రైతులు అన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు అన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తోందని రైతులు తెలిపారు. రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.10 గంటలకు వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బస చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాయదుర్గంలో రేపు సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్లో అగ్రి ల్యాబ్ను సీఎం ప్రారంభించనున్నారు. రూ.1506 కోట్ల అగ్రి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో నిర్మించిన 1,898 ఆర్బీకేలు.. రూ.80 కోట్లతో నిర్మించిన 100 అగ్రికల్చర్, ఆక్వా ల్యాబ్లు.. రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 వెటర్నరీ ఆస్పత్రులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో నిర్మించనున్న 1262 వ్యవసాయ గోదాంలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.200 కోట్లతో పోస్ట్ హార్వెస్టింగ్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.212 కోట్లతో మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.96.64 కోట్లతో రైతుల కోసం ఏర్పాటు చేసిన 611 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఏపీలో 45 కొత్త రైతుబజార్లకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
Hyderabad: ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లో తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
-
ఐటీ కారిడార్లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసుకురాగా, కొత్తగా మరో నాలుగు రోడ్లు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె. తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాందీతో కలిసి ప్రారంభించారు. రూ.23.43 కోట్ల వ్యయంతో హెచ్ఆర్డీసీఎల్ సంస్థ నాలుగు లింకురోడ్లను నిర్మించింది. నాలుగు లేన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో తీర్చిదిద్దారు. ఈ నాలుగు లింకురోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. నగర అభివృద్ధికి రహాదారులు చాలా ముఖ్యమని, ఇప్పటికే 16 లింక్ రోడ్లు పూర్తి చేశామని వెల్లడించారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్ను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారని పేర్కొన్నన్నా. దశల వారీగా 133 లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లిలో జనసాంద్రత ఎక్కువని, అందుకే ఇక్కడ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. ► రూ.5.58 కోట్లతో నిర్మించిన 0.600 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు. ►రూ.2.87 కోట్లతో నిర్మించిన 0.460 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్బండ జంక్షన్ వరకు. ►రూ.7.41 కోట్లతో 0.750 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు – వసంతసిటీ నుంచి న్యాక్ వరకు. ►రూ.7.57 కోట్లతో 1.010 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్. తగ్గనున్న దూరం... ► కొత్తగా అందుబాటులోకి వచ్చే రోడ్లతో దూరభారం తగ్గనుంది. ► కొత్త లింకురోడ్డులన్నీ నాలుగులేన్ల, మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో ఉండడంతో గతంలో కన్నా విశాలంగా రోడ్లు మారడం, లింకు కలుపడంతో చాలా వరకు ప్రధాన రోడ్లకు కనెక్టివిటీ పెరగనుంది. ►ట్రాఫిక్ సమస్యతోపాటు, వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం కలుగుతుంది. ►నోవాటెల్–ఆర్టీఏ ఆఫీస్ లింకురోడ్డుతో హఫీజ్పేట్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వాసులకు హైటెక్సిటీ ఎంఎటీఎస్ స్టేషన్, హైటెక్స్, నోవాటెల్ను తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ►అంతేకాకుండా మూడు లింకురోడ్లతో మియాపూ ర్, సర్దార్పటేల్నగర్, వసంతనగర్, కేపీహెచ్బీ, 6,9 ఫేజ్ నుంచి హైటెక్సిటీ ప్రాంతానికి మరింత దగ్గరవుతుంది. ►జాతీయ రహదారి నుంచి ప్రారంభమయ్యే లింకురోడ్డు ద్వారా డైమండ్హిల్స్ కాలనీ, ఐడీపీఎల్ ఎంప్లాయీస్కాలనీ, శిల్పాఎవెన్యూ కాలనీ, నోవాటెల్ హోటల్ రోడ్డు సర్కిల్ నుంచి కొండాపూర్ మజీదుబండ జంక్షన్ వరకు సులువగా చేరుకోవచ్చు. ►జేవీహిల్స్ పార్కు నుంచి మసీద్బండ రోడ్డు నిర్మాణంలో మాధవహిల్స్ ఎస్టేట్, ప్రభుపాద లేఅవుట్, మారుతీనగర్కాలనీ వారికి నేరుగా గచి్చ»ౌలికి వయా మసీదుబండ రోడ్డు ద్వారా వెళ్లే అవకాశం కలుగుతుంది. -
రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిథిలో రోడ్డు ప్రమాదం
-
రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం
-
ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టిన వాళ్లపై తాను కూడా తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో, అమర్పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. మణికొండలో బొటిక్ నడుపుతున్న శ్రీవిద్య, రష్మీదీప్ అనే యువతులు అభిప్రాయ భేదాలతో దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీవిద్య ఒక్కరే బొటిక్ నడుపుతున్నారు.(చదవండి: మదనపల్లి మధుకర్కు 12 ఏళ్ల జైలు) దీంతో తమకు సంబంధించిన రూ. 5 వేల విలువ గల కుట్టుమిషన్ను షాపులో వదిలివేశామని, దానిని తిరిగి ఇవ్వాలంటూ రష్మి స్నేహితులైన స్వాతి, తేజ, అమర్, హర్ష అడిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అమర్పై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం గురించి బుధవారం మీడియాతో మాట్లాడిన అమర్.. ‘‘ఆ రోజు నేను తాగి వెళ్లలేదు. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నెగెటివ్గానే వచ్చాయి. నిజానికి, కావాలనే నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ రోజు గొడవ పడిన వీడియో లో కేవలం 2 నిమిషాలు మాత్రమే బయటికి రిలీజ్ చేశారు. అందులో ఉన్న వాళ్లందరూ మా స్నేహితులే. ఎఫ్ఐఆర్ కాపీలో సైతం నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదనే ఉంది. నా గురించి అసత్యాలు ప్రచారం చేసిన వారిపై నేను కూడా కేసు పెడతాను. నేను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది. మీడియాలో కూడా నేను గొడవ పడుతున్నట్టు చూపించారు. అంతకు ముందు నుంచే గొడవ జరిగింది దాన్ని మాత్రం చూపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘కోయిలమ్మ’నటుడు అమర్పై కేసు) -
మామ చేతిలో అల్లుడు దారుణహత్య
హైదరాబాద్: పిల్లనిచ్చిన మామ చేతిలో అల్లుడు దారుణహత్యకు గురైన ఘటన ఆదివారం రాయదుర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. టోలిచౌకీకి చెందిన షేక్ సల్మాన్(20) మణికొండలో బ్లాక్బర్డ్ బ్యూటీ పేరుతో టైలర్ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా గోల్కొండలోని అక్బర్పురలో నివసిస్తున్న ఫరహాన అనే మహిళతో 2019లో షేక్ సల్మాన్కు వివాహమైంది. కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నా.. గత 7 నెలల నుంచి సల్మాన్ భార్యను శారీరకంగా హింసకు గురి చేయడమేగాక తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఫరహాన తండ్రికి విషయం చెప్పడంతో సల్మాన్కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే సల్మాన్ వారి మాటలను పట్టించుకోకుండా ఫరహానను మరింతగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో సల్మాన్ను అంతమొందించాలని భావించిన అతని మామ తన బంధువులతో కలిసి మణికొండ ఏరియాలోని అతని టైలర్ షాపు వద్దే కిడ్నాప్ చేశాడు. మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని నక్కలపల్లి చెరువు వద్దకు తీసుకెళ్లి సల్మాన్ గొంతుకు వైరు బిగించి.. తలపై బండరాయితో మోది హత్యకు పాల్పడ్డాడు. కాగా షేక్ సల్మాన్ కనిపించడం లేదని అతని తరపు బంధువులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నక్కలపల్లి చెరువు వద్ద శవంగా కనిపించిన వ్యక్తి సల్మానే అని నిర్థారణకు వచ్చి బంధువులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కసితీరా పొడిచి చంపేశాడు
సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను పాశవికంగా హత్యచేశాడో వ్యక్తి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదనే అనుమానంతో ఆమెను హతమార్చాడు. వివరాలు.. మృతురాలికి గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. అయితే వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన సదరు మహిళ, తన ముగ్గురు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేది. అప్పుడప్పుడూ కర్నాటకకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మహ్మద్ మోసిన్ఖాన్(కిరోసిన్ డీలర్) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.(చదవండి: భర్తను చంపి అడవిలో పాతి పెట్టింది) ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న వీరు అంజయ్యనగర్లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్ల తర్వాత మహ్మద్, అతడి భార్య మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అతడు అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్యను కసితీరా పొడిచేశాడు మహ్మద్. దీంతో పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యి ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మరణించడంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
‘కాలవ’ డైరెక్షన్.. ఖాకీ దందా
డీ.హీరేహాళ్ మండలంలోని కూడ్లూరు గ్రామ సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ పోలీసు అధికారి.. పక్కనే ఉన్న మరో 20 సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నాడు. తన మామ, టీడీపీ నాయకుడి అండతో బినామీ హరిజన హనుమంతప్ప పేరిట 3.79 ఎకరాలకు పట్టా చేయించుకున్నాడు. ఈ భూమిలో ఇసుక లేకపోయినా రీచ్కు అనుమతి పొంది.. పక్కనే ఉన్న దళితుల శ్మశానం, వంక పరంబోకులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. సదరు పోలీసు అధికారి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ దందా వెనుక ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం. సాక్షి, రాయదుర్గం: సహజ వనరులను దోచుకోవడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రూ.కోట్లు సంపాదించిన నేతలు.. ఇప్పుడూ అదేబాటలో వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు దళితులను అడ్డుపెట్టుకుని ఇసుక దందా సాగిస్తున్నారు. అక్రమం బయటపడితే తమ చేతికి మట్టి అంటుకోకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలో ఇసుక రీచ్కు అనుమతి పొంది సమీప ప్రాంతాల్లోని వంక పరంబోకును తోడేస్తున్నారు. ఈ దందా బయటపడటంతో టీడీపీ నేతలు దళిత రైతును ముందు పెట్టి నాటకం ఆడించడం విమర్శలకు తావిస్తోంది. (మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!) ఖాకీ అల్లుడు.. బినామీల పర్వం రాయదుర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకున్న ఓ పోలీసు అధికారి తన మామ పలుకుబడి ఉపయోగించి డీ.హీరేహాళ్లో పోస్టింగ్ వేయించుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు ఇక్కడే పనిచేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా.. తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి ఆశీస్సులు పొంది భారీగా సంపాదించాడు. అనతి కాలంలోనే సుమారు 80 ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేసి బినామీల పేరిట పట్టాలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి అండతో తన భూముల పక్కనే ఉన్న అసైన్డ్ భూములను కూడా కలిపేసుకుని పట్టాలు పొందాడు. ఇలా డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమిని ఇతరుల ద్వారా కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న మరో 20 సెంట్ల అసైన్డ్ భూమిని ఆక్రమించి మొత్తంగా 3.79 ఎకరాలకు తన మామ నమ్మిన బంటుగా ఉన్న హరిజన హనుమంతప్ప పేరిట పట్టా చేయించాడు. ఇసుక లేకపోయినా రీచ్కు అనుమతి తన బినామీ హరిజన హనుమంతప్ప పేరిట చేయించిన భూమిలో ఇసుక లేకపోయినప్పటికీ సదరు పోలీసు అధికారి, ఆయన మామ రీచ్ కోసం మంత్రాంగం నడిపించారు. కొందరు అధికారుల అండతో ఇసుక రీచ్కు అనుమతులు పొందారు. టన్ను ఇసుకకు రూ.60 చెల్లించేలా తొలుత అధికారులతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని సాకుగా చూపి టన్ను ఇసుకకు రూ.100 ఇచ్చేలా అనుమతి పొందారు. అలాగే ఇసుక రవాణా కాంట్రాక్టర్ను సైతం తమ వారినే నియమించుకుని ఇసుక దందా ప్రారంభించారు. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) శ్మశానంలో తవ్వకాలు.. పట్టాభూమిలో ఇసుక లేకపోవడంతో పక్కనే ఉన్న దళితుల శ్మశానం, ఆ పక్కనే ఉన్న చిన్న హగరిలోని పరీవాహకంలోని 14 ఎకరాల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేసి విక్రయించుకున్నారు. ఈ క్రమంలో 4 అస్థిపంజరాలు బయట పడినా గుట్టుగా వేరే ప్రాంతంలో పూడ్చినట్లు గ్రామానికి చెందిన దళితులు చెబుతున్నారు. ఇసుక రవాణా కాంట్రాక్టర్ కూడా తమవాడే కావడంతో ఇసుక అక్రమ దందాను నిరాటంకంగా కొనసాగించారు. అక్రమం బయట పడటంతో కాలవ ఎదురుదాడి డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు ఇసుక రీచ్ అక్రమాలు బయటపడటంతో కాలవ బయటకొచ్చారు. ఈ దందా వెనుక ఉన్న తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధిపై ఎదురుదాడికి దిగారు. తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, అతని అల్లుడు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే విప్ కాపు రామచంద్రారెడ్డి దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు తీగలాగుతున్నారు. -
వివాహితపై కన్నేసిన టీడీపీ నేతపై ‘దిశ’ కేసు
సాక్షి, డి.హీరేహాళ్ (రాయదుర్గం): వివాహితపై అసభ్యంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దిశ చట్టం కింద కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డి.హీరేహాళ్ మండలం దొడగట్టకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రౌడీషీటర్. ఇతను ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. (యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు) ఈ క్రమంలోనే శ్రీనివాసులు గ్రామంలోని ఓ వివాహితపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. బుధవారం రాత్రి భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలిచేష్టలు చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు విషయం తెలిపింది. ఎవరక్కడ అని అరిచేసరికి అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. గురువారం బాధితురాలు తన భర్తతో కలిసి స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. క్రైం నంబర్ 358 అండర్ సెక్షన్ 534డి, 509 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని ఎస్ఐ వలిబాషా తెలిపారు. (భార్య, కూతురుపై కన్ను.. వ్యక్తి దారుణ హత్య) -
మళ్లీ మెట్రో పరుగు
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలల విరామం తరవాత మెట్రో రైళ్లు నగరంలో సోమ వారం మళ్లీ పరుగుపెట్టాయి. మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ తొలిరోజు నగరవాసులు మెట్రో జర్నీ చేశారు. ఉదయం 7 నుంచి 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రతి 8 నిమిషాలకో రైలు నడిచింది. ఒక్కో రైలులో తొలిరోజు 300 మంది మాత్రమే ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లలో సోమవారం రద్దీ అంతగా కనిపించలేదు. ప్రయాణి కులు స్టేషన్లలోకి వెళ్లే ముందే మెట్రో సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శానిటైజర్ అందుబాటులో ఉంచారు. స్మార్ట్కార్డ్, క్యూఆర్ కోడ్ కూపన్ల ఆధారంగానే ప్రయాణాలు సాగాయి. బోగీల్లో కూర్చునేటప్పుడు, నిల్చునేట ప్పుడు భౌతికదూరం ఉండేలా ప్రయాణి కులు జాగ్రత్తపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో 120 ట్రిప్పులు తిరగగా, 19 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. నేడు నాగోల్–రాయదుర్గం రూట్లో.. మంగళవారం నాగోల్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటా యి. బుధవారం నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ రూటు సహా 3 మార్గాల్లోనూ మెట్రో రైలు సర్వీసులు అందు బాటులోకి వస్తాయి. ఈ నెలాఖరుకు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయ దుర్గం మార్గాల్లో రోజూ 2 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని మెట్రో వర్గాల అంచనా. -
మిడతల దండుపై ఆందోళనొద్దు
సాక్షి, అనంతపురం: మిడతల దండుపై ఆందోళన వద్దు అని తిరుపతిలోని ఉద్యానశాఖ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వ్యవసాయశాఖ జేడీ ఎస్కే హబీబ్బాషా, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహారాష్ట్రలో ఎడారి మిడతల దండు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గాలివేగం, గమనాన్ని బట్టి వాటి పయనం ఉంటుందన్నారు. ఒకవేళ మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికొస్తే.. అక్కడి నుంచి సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మంలోకి ప్రవేశించొచ్చన్నారు. అటు నుంచి రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. ఇప్పటికైతే ఉభయ రాష్ట్రాల్లో వాడి జాడ లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనంత జిల్లాలోని రాయదుర్గం ప్రాంతానికి చేరుకున్నట్లు, పంటలను దెబ్బతీస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనన్నారు. అవి పదులు, వందల సంఖ్యలో రావన్నారు. వచ్చాయంటే లక్షలు, కోట్లలో వాటి సంఖ్య ఉంటుందన్నారు. జిల్లాలో కనిపిస్తున్న మిడతలు సాధారణంగా సహజంగా ఉన్నవేనన్నారు. చదవండి: మిడతల దండుపై దండయాత్ర జీవితకాలం 12 వారాలు వాటి జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే 12 వారాలు (84 రోజులు) జీవిస్తాయన్నారు. అందులో గ్రుడ్ల నుంచి లార్వా దశలో 2 వారాలు, చిన్న పురుగుల దశ ఆరు వారాలు, రెక్కల పురుగు దశ నాలుగు వారాలు ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెక్కల పురుగు దశ కీలకమైందన్నారు. ఎడారిలో వీటి ప్రభావం ఎక్కువ మిడతల దండు అనేది కొత్త విషయం కాదని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తరచూ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కనిపిస్తాయన్నారు. అయితే అవి ఎడాది ప్రాంతాన్ని వదిలేసి జనావాసాలు, పంట పొలాలకు వ్యాపించడం అనేది కొత్తగా చూస్తున్నందున ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. దండు ప్రవేశిస్తే పచ్చదనం లేకుండా నాశనం చేసేస్తాయన్నారు. దీనిపై ఒరిస్సా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులను అప్రమత్తం చేశాయన్నారు. మామిడి సీజన్ కావడంతో సాధ్యమైనంత మేరకు కోతలు పూర్తి చేయాలని తెలిపారు. వాతావరణం, పర్యావరణానికి హాని జరగకుండా వేప సంబంధిత మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు వాటి జాడ లేనందున జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. -
రాయదుర్గం చేరిన మిడతల దండు
-
ఆదిలాబాద్కు చేరుకోనున్న మిడతలు!
సాక్షి, ఆదిలాబాద్: పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడతలు మరో రెండు రోజుల్లో ఆదిలాబాద్కు చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు మిడతల దండును ఎదుర్కొనేందుకు అప్రమత్తమవుతున్నట్లు పేర్కొన్నారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?) (పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు) ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడతలు పంటకు నష్టం కలిగించాయి. ఈ క్రమంలో గురువారం మిడతలు ఆంధ్రప్రదేశ్ అనంతపుర్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో రాయదుర్గంలో వందల సంఖ్యల్లో ఈ రాకాసి మిడతలు క్షణాల్లో జిల్లేడి చెట్టు ఆకులను తినేయడం చూసి స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..) -
‘కాల్వ’ వీరంగం.. రాయదుర్గంలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఎన్నికల అధికారులపై రౌడీయిజం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లలు కలిగిన అభ్యర్థులతో ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేయించారు. అయితే ఎన్నికల అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో తన అనుచరుల నామినేషన్ను ఆమోదించాలంటూ రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి.. కాలువ శ్రీనివాస్ ఎన్నికల అధికారులపై వీరంగం సృష్టించారు. అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆయన దౌర్జన్యాలపై అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాలువ శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ పులనాగరాజుతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాలువ శ్రీనివాస్ గూండాగిరిపై కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ చెప్పారు. -
‘ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం’
రాయదుర్గం: ఎన్నికల్లో వ్యయం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని, దీన్ని పూర్తిగా తగ్గిస్తేనే ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయవంతమవుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ వార్షిక సదస్సుల సిరీస్లో భాగంగా ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’అనే అంశంపై 2 రోజుల చర్చా కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ డిస్కషన్లో ‘ఆర్గనైజేషనల్ బర్డన్ ఆన్ పొలిటికల్ పార్టీస్’అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్సభలో అత్యధికంగా కోటీశ్వర్లు ఉన్నట్లు పత్రికల్లోనే వస్తున్నాయని అన్నారు. అయిదేళ్ల పదవీకాలం తర్వాత కొందరి ఆస్తులు 500 రెట్లు పెరిగాయని మనం వింటున్నామని తెలిపారు. ఢిల్లీలో తాను పాల్గొన్న ఓ సమావేశంలో మాజీ ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఎన్నికల్లో రూ.50 కోట్లు వ్యయం చేశారని, ఒక మహిళ కూడా రూ.50 కోట్ల వరకు వ్యయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రముఖులు ఎవరేమన్నారు.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే అంశంపై అంతటా చర్చ జరగాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2018, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్బు, మద్యం గణనీయంగా పట్టుబడిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి వాటిని సులభంగా అరికట్టవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ఇచ్చే నిధులపై నిషేధం విధించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని, కేడర్పై చేసే వ్యయం ఏమాత్రం భారం కాబోదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను నడపడం వ్యయంతో కూడుకున్న ప్రక్రియగా మారిందని ఎంపీ రాజీవ్గౌడ తెలిపారు. స్థానిక సంస్థలకు పార్టీయేతర ఎన్నికలు పెడితే గ్రామీణ స్థాయిలో డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గే అవకా«శం ఉందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె మాధవరావు అభిప్రాయపడ్డారు. సమావేశంలో లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దడ పుట్టిస్తున్న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్
సాక్షి, హైదరాబాద్: ఒక చోట కుడి వైపు, మరో చోట ఎడమ వైపు ప్రమాదకరంగా ఉన్న మలుపులతో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ అంటేనే ప్రయాణికుల్లో దడ అని చెప్పాలి. రెండో ప్రమాదంతో నవంబర్ 23న జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్ను మూసి వేశారు. నెల రోజులు దాటినా ఇప్పటి వరకు వాహనాల రాకపోకలు పునరుద్ధరించలేదు. ఇంకా భద్రతా చర్యల పేరిట దిద్దుబాటు పనులు చేపడుతున్నారు. నిపుణుల కమిటీ అధ్యయనం, నివేదికతో దిద్దుబాటు చర్యల్లో కొంత జాప్యం జరిగింది. సరిగ్గా నెల రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఐటీ కారిడార్, ఆ ఘటన ఇంకా అక్కడి ప్రయాణికుల కళ్లలో మెదులుతూనే ఉంది. ప్రారంభమైన వారానికే ప్రమాదం... రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ నవంబర్ 4న ప్రాంభించారు. సరిగ్గా వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్థరాత్రి ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగుతుండగా ఐ20 కారు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ప్రవీణ్(22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 రోజులకు అంటే నవంబర్ 23న వోక్స్ వ్యాగన్ కారు 105.8 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఫ్లైఓవర్పై నుంచి పల్టీలు కొడుతూ కిందపడటంతో పసల సత్యవేణి(56) మృతి చెందగా మరో నలుగురికి గాయలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్ను మూసివేశారు. 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్... బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలుగా చిన్నవి వెయ్యికి పైగా ఉన్నాయి. అడ్డం ఫ్లై ఓవర్ పొడవునా 12 చోట్ల స్పీడ్ బ్రేకర్లుగా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. ఫ్లై ఓవర్ పొడవునా నాలుగు వరుసలుగా తెల్ల రంగు, ఎరుపు రంగు క్యాట్ ఐస్ను ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ మధ్యలో ఎడమ వైపు సైడ్ వాల్పై రేలింగ్ ఏర్పాటు చేశారు. బయట ఉంచి ఏమి కనిపించ కుండా రేలింగ్కు సైనేజీ బోరుల్డను ఏర్పాటు చేయనున్నారు. వంద మీటర్ల పొడవునా రేలింగ్ ఏర్పాటు చేసి సైనేజీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. రాయదుర్గం వైపు నుంచి వాహనదారులకు ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద ఎడమ వైపు వ్యూ కనిపించదు. దీంతో వాహనాలను నెమ్మదిగా నడిపే వీలుంటుంది. స్పీడ్ లిమిట్, మూల మలుపులు, ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులను ఫ్లై ఓవర్ పొడవునా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంచారు. అంతే కాకుండా ప్రత్యేక మెటీరియల్తో ఫ్లైఓవర్పై స్పీడ్లిమిట్ 40 కి. మీ. అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. అవసర మైన చోట రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అమర్చనున్నారు. రోడ్డు దాటాలంటే నరకం... బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లే వాహనాలు ఐకియా వైపు వేగంగా వెళుతుంటాయి.ఫ్లై ఓవర్ ఎండ్ కాగానే 200 మీటర్ల దూరంలో అనేక మంది వలస కూలీలు రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ నుంచి రోడ్డుపైకి వచ్చే వాహనాల వేగం ఎక్కువగా ఉండడంతో రోడ్డు దాటే పాదాచారులు ప్రమాదాల బారీన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు కూలీలు మృతి చెందారు. గత నవంబర్ 18న రాత్రి 12 గంటల సమయంలో మై హోం భూజకు వెళ్లేందుకు హౌస్ కీపింగ్ పనులు చేసే నవల్ రాయ్(49), భాగేలు మహతో(56)లు రోడ్డు దాటుతుండగా ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వచ్చిన ఎక్స్యూవీ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని బహుళ అంతస్తుల నిర్మాణ పనుల్లో వేలాది మంది కూలీలు పని చేస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ పై నుంచి వచ్చే వాహనాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్.. కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై హైస్పీడ్తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్ డిజైన్లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇటీవల ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు. చదవండి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై దిద్దుబాటు చర్యలు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరం -
హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు మరో మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు మరో కొత్త మార్గంలో పరుగులు పెట్టింది. ఒకటిన్నర కిలోమీటర్ల హైటెక్సిటీ– రాయదుర్గం మెట్రో కారిడార్లో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో మెట్రో రైలును ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మెట్రో రైల్లో మైండ్ స్పేస్ ముందున్న రాయదుర్గం స్టేషన్ వరకు ప్రయాణం చేస్తారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు వెళ్లి అక్కడ బుల్ స్టాట్యూ ప్రారంభిస్తారు. మెట్రో రైల్ ఎం.డి.ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జొషీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగులకు వెసులుబాటు హైటెక్సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో మైండ్ స్పేస్ వరకు మెట్రో రైల్ రాకతో ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యం లభించనుంది. హైటెక్సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఆటోలు, క్యాబ్లలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. దీంతో ఐటీ ఉద్యోగులు నడుచుకుంటూనే కె.రహేజ, ఫేజ్–2లో ఉన్న కంపెనీలకు వెళ్తారు. మెట్రో రాక వల్ల రాయదుర్గం మెట్రో స్టేషన్లో దిగి రహేజతో పాటు, ఫేజ్–2 కంపెనీలు, ఇనార్బిట్ మాల్ రోడ్డులో ఉన్న ఐటీ కంపెనీలకు కాలినడకన వెళ్లవచ్చు. ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు అక్కడి నుంచి హైటెక్సిటీ వరకు , ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది.ప్రతి రోజు సుమారు 4 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. శుక్రవారం హైటెక్సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులోకి రావడం వల్ల మరో లక్ష మందికి అదనపు ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం ట్రయల్రన్స్ కొనసాగుతున్న జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో సైతం మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావడం వల్ల లక్ష మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. మైండ్స్పేస్ ముందు రాయదుర్గం మెట్రో స్టేషన్ రెండేళ్లలో 12.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్ మెట్రో రైల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు. రెండేళ్ల క్రితం నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12.5 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం రోజుకు 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండేళ్లలో మెట్రో రైళ్లు 86 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు ప్రయాణించనుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మె ట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం ఈ మార్గం లో హైటెక్ సిటీ వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కి.మీ మేర అన్ని పనుల పూర్తితో పాటు రైల్వే సేఫ్టీ అనుమతులు రావడంతో 29న రైలు చివరి పాయింట్ వరకు చేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26, 27 తేదీల్లో మెట్రోరైల్ సేఫ్టీ అధికారి జనక్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి రైళ్లను పరిశీలించి 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. భార్యతో కలిసి మంత్రి మెట్రో జర్నీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఎర్రమంజిల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. బంధువు ల వివాహానికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లా డి సౌకర్యాల గురించి వాకబు చేశారు. అనంతరం ఎన్వీఎస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ.. సమ యం ఆదాతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న మెట్రో సిబ్బందిని అభినందించారు. -
గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రిలీఫ్
సాక్షి, హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. బల్దియా పరిధిలో ఎస్ఆర్డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్ ఫ్లైఓవర్ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మరోవైపు గచ్చిబౌలి వద్ద రెండు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ను రూ. 330 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. MA&UD Minister @KTRTRS laid foundation stones for two flyovers and an underpass in Gachibowli today. At an estimated cost of Rs 330 crore, @GHMCOnline will construct these projects under the Strategic Road Development Programme (SRDP). pic.twitter.com/tdDx5EC9fF — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 4, 2019 ఎస్ఆర్డీపీలో భాగం గా 69.47 కోట్ల రూపాయల వ్యయంతో 900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా జీహెచ్ఎంసీ నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నగరంలో ఇప్పటికే 3 ఫ్లై ఓవర్లు , 4 అండర్ పాసులు అందుబాటులోకి రావడంతో ఆ రూట్లో తగ్గిన ట్రాఫిక్ కష్టాలు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్తో మోహిదీపపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్ళవచ్చు ఈ ఫ్లైఓవర్ మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసిరావడంతో పాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. బయో డైవర్సిటీ, మంత్రి కేటీఆర్, ఫ్లై ఓవర్, రాయదుర్గం, ట్రాఫిక్ ఫ్రీ -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ పాదరస శివలింగం
సాక్షి, రాయదుర్గం:(అనంతపురం): పాదరసం ఒక రసాయన మూలకము. దీనిని క్విక్ సిల్వర్ అని కూడా అంటారు. సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం ఇదే. అత్యంత విషతుల్యమైన ఈ లోహం తామరాకుపై నీటిబొట్టులా తేలియాడుతూ ఉంటుంది. అయితే ఈ ద్రవరూప లోహంతో ఘన పదార్థాలను సృష్టించడం అసాధ్యమని అంటారు. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మన పూర్వీకులకే దక్కింది. ఆ శాస్త్రీయతనే అనుసరిస్తూ.. 1974లో రాయదుర్గంలోని శ్రీరాజవిద్యాశ్రమంలో అప్పటి పీఠాధిపతి జీవన్ముక్త స్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వామీజీ అపురూపమైన పాదరస లింగాన్ని ప్రతిష్టించారు. దేశంలో మొట్టమొదటి పాదరస లింగం ఇదే. రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు శ్రమించి, రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింపజేసి లింగాకృతిగా మార్చారు. 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలతతో చూడముచ్చటగా ఉన్న ఈ లింగాన్ని నల్లరాతితో చేసిన పాణిపట్టంపై ప్రతిష్టించారు. -
అనంతపురం తాజ్మహల్
సాక్షి, రాయదుర్గం(అనంతపురం) : తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. ఈ కట్టడ నిర్మాణం 1632లో మొదలై 1653లో పూర్తయింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న గిరిజన యువతి భాగ్యమతి కోసం ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడు షాహీ సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుందరమైన ఈ నగరం 1590లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఇలాంటి చారిత్రక ఆధారమే జిల్లాలోనూ ఉంది. క్రీ.శ 18వ శతాబ్దంలో రాయదుర్గంలో సతీసహగమనంలో భాగంగా కోనేటి నాయకుని భార్య వెంకటలక్షుమమ్మ ఆత్మార్పణం చేసుకుంది. ఆమె జ్ఞాపకార్థం ఓ సమాధి నిర్మించారు. ప్రస్తుతం అది రాయదుర్గంలోని మధు టాకీస్ సమీపంలో ఉన్న ఓ తోటలో ఉంది. ఇది చదవండి : పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం -
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్ఎల్ని ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు ఉంటే.. 2019లో లక్షా 9 వేల కోట్లకి చేరిందని అన్నారు. నగరంలో మౌలికవసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచినీటి కొరత తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలో లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చి నగరంలోని తూర్పుప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తామన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును హైదరాబాద్లో కేవలం 36 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. -
టీవీ నటుడి భార్య ఆత్మహత్య
హైదరాబాద్: టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి ఆత్మహత్యపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి తిరుమల మాట్లాడుతూ..‘మధు ప్రకాష్ నా కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి మధు ప్రకాష్కు నా కూతురును నిర్లక్ష్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా భారతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేశాం. అయితే మధు ప్రకాష్ మాత్రం మా మాటలు పట్టించుకోలేదు. రూ.15 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాం. చివరికి నా కూతురు చావుకు కారణం అయ్యాడు. మధు ప్రకాష్ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా మణికొండ పంచవటి కాలనీకి చెందిన టీవీ నటుడు మధుప్రకాశ్తో గుంటూరుకు చెందిన భారతికి 2015లో వివాహమైంది. ఆమె ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగికి పనిచేస్తోంది. అయితే తనను పట్టించుకోవడం లేదని, షూటింగ్ల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడంటూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన మంగళవారం రాత్రి భారతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
బిగ్బాస్-3 షోపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-3 రియాలిటీ షోపై కేసు నమోదయింది. రాయదుర్గం పోలీసు స్టేషన్ గాయత్రి గుప్తా అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ ఫిర్యాదు చేశారు. రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు ఇటీవల తనను కలిసి బిగ్బాస్ షోలో పాల్గొనాలని అడిగారని ఆమె తెలిపారు. అనంతరం వారు షో గురించి మాట్లాడుతూ.. తనతో అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్బాస్3కి సంబంధించి తనతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని, అనంతరం బిగ్బాస్ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తిరిగి కొన్ని రోజుల తర్వాత షోలో అవకాశం లేదన్నారని తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
కొండలు పిండి చేస్తున్న ‘నితిన్ సాయి’
టీడీపీ నేతలు.. అక్రమార్జనకు అలవాటుపడ్డారు. ఇన్నాళ్లూ అధికార అండతో సహజ సంపదను దోచుకున్నారు. కొండలపై కన్నేసి వాటిని పిండి చేశారు. అక్రమంగా క్వారీ, క్రషర్లు నిర్వహిస్తూ రూ.కోట్లకు పడగలెత్తారు. కంకర కోసం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న క్వారీల దందాతో నిరుపేదల ఇళ్లు బీటలువారగా.. సమీపంలోని పచ్చని పొలాలన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. – రాయదుర్గం/ రాయదుర్గం రూరల్ క్వారీ, క్రషర్ నిర్వహించాలంటే రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖ అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి. అనుమతులన్నీ వచ్చినా.. క్రషర్, క్వారీ ఏర్పాటు చేయకముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ టీడీపీ నేతలు ఇవేమీ పాటించలేదు. అధికారం అండతో అధికారులను మచ్చికచేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలో ఇష్టానుసారం క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. అయితే సమీపంలోనే ఓ టీడీపీ నాయకుడు క్వారీ ఏర్పాటు చేసి ఇష్టానుసారం బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీంతో కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. క్రషర్, క్వారీ నుంచి వస్తున్న దుమ్ము, ధూళి ఇళ్లలోకి రావడం.. బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారీ భూమి కంపిస్తుండడంతో భయాందోళన చెందిన నిరుపేదలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక క్వారీ దుమ్ము సమీపంలోని పొలాలపై దుమ్ముధూళి పడటంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి బీటలు వారిన ఇందిరమ్మ ఇల్లు నిబంధనలకు నీళ్లు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రమే బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో పేలుళ్లు జరుపుతున్నారు. ఇక క్వారీ సమీపంలో చెట్లును పెంచి వాటిని సంరక్షించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా ఒక్క మొక్కను కూడా నాటలేదు. బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే మందుసామగ్రిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. లైసెన్స్ ఉన్న వారితో మెటీరియల్ను కొనుగోలు చేయాలి. ఇందులో ఏ ఒక్కటీ పాటించడం లేదు. ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్ క్వారీ, క్రషర్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై మల్లాపురం వాసులు మూకుమ్మడిగా రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులిచ్చే మామూళ్లు తీసుకుని వారికే వంతుపాడారు. పైగా మంత్రి కాలవ జోక్యం చేసుకోవడంతో క్వారీలపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులపైనే కేసులు పెట్టించారు. కాలవ అండదండలతోనే... క్వారీల నిర్వాహకులకు అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని మరింత రెచ్చిపోయారు. కొందరైతే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్రషర్లు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గతంలో విజిలెన్స్, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి సుమారు రూ. కోటి వరకు జరిమానా విధించారు. క్రషర్ను సీజ్ చేయాలని ప్రయత్నించగా... అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి క్రషర్ సీజ్ చేయకుండా చూశారు. ఇక జరిమానా కూడా సగానికి పైగా తగ్గించేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున కంకరను నిల్వచేసిన క్వారీ, క్రషర్ నిర్వాహకులు ఖజానాకు భారీ గండి క్వారీ, క్రషర్ల నిర్వాహకులు రాయల్టీ సైతం చెల్లించకుండా ఖజానాకు భారీ గండి కొట్టారు. ఒకటి, రెండు పర్మిట్లు తెచ్చుకుని వాటిపై తేదీలు వేయకుండా వాటితోనే వందల ట్రిప్పులు కంకరను తరలిస్తున్నారు. ఇక రాత్రిపగలు తేడా లేకుండా మిషన్లు నడిపిస్తూ అనుమతులకు మించి బ్లాస్టింగ్లు చేస్తూ సంవత్సరంలో తరలించే కంకరను మూడు నెలల్లోనే రవాణా చేసుకుంటున్నారు. అంతేకాకుండా రెండు మొబైల్క్రషర్ యూనిట్ల సాయంతో కంకరను తీసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. ‘నితిన్ సాయి’ నిర్వాకం అనంతపురం నుంచి 56 కిలోమీటర్ నుంచి 106 కిలోమీటర్ మొళకాల్మూరు రోడ్డు వరకు 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్సాయి, టీడీపీ నాయకులు పురుషోత్తంనాయుడుకు చెందిన లేఖాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. ఈ రోడ్డుకు కావాల్సిన కంకర కోసం ఈ రెండు కంపెనీలు రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో సర్వేనంబర్ 132లోని 11.70 ఎకరాల విస్తీర్ణంలో (దొణగుడ్డం)డోలగుట్ట కొండను లీజుకివ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అధికారులు అనుమతులు ఇవ్వకుండానే కొండను పిండి చేస్తూ కంకరను తరలిస్తున్నాయి. ఇక వేపరాల క్రాస్ సమీపం సర్వేనంబర్ 270జీ, ఎఫ్లలో ఇద్దరు నిరుపేద రైతులకు చెందిన డీ పట్టాభూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంసీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీ పట్టాభూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, కార్యాలయం కోసం గది ఏర్పాటు చేసుకుని కార్మికులకు కూడా ఇక్కడే తాత్కాలిక ఇళ్లను నిర్మించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మేల్కొని కంకర క్వారీ, క్రషర్ యూనిట్లో అక్రమాల నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం క్వారీ, క్రషర్పై దాడులు నిర్వహిస్తాం. అనుతులు ఉన్నాయో లేదో చూస్తాం. త్వరలోనే విచారణాధికారిని నియమించి నిబంధలను పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నుడుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటరమేష్బాబు, తహసీల్దార్, రాయదుర్గం -
ప్రభుత్వ విప్గా.. కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని విప్గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇక జిల్లాలోని వీరశైవులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్రెడ్డి విశ్వసనీయకు పట్టం కట్టారని కొనియాడారు. నిరుపేదకుటుంబం నుంచీ... కాపు రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కాపు..కష్టపడి చదువుకున్నారు. రాయదుర్గం మండలం ఆర్బీ వంక గ్రామానికి చెందిన భారతిని వివాహమాడారు. కాపు రామచంద్రారెడ్డి తొలుత హాస్టల్ వార్డెన్, టీచర్, లైబ్రేరియన్గా పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం బళ్లారిలోని ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్గా కూడా పనిచేశారు. రాజకీయ అరంగేట్రం వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ఇష్టపడే కాపు రామచంద్రారెడ్డి...ఆ మహానేత స్ఫూర్తితోనే 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 14,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిచే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈక్రమంలోనే 2012 జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్రెడ్డిపై 32,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాయదుర్గం నియోజకవర్గలోనే చరిత్ర సృష్టించారు. 2014లో స్వల్పఓట్ల తేడాతో పరాజయం చవిచూసినా...నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుపై 14,049 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. మూడు సార్లు రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డి తాజాగా బుధవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. సేవాతత్పరుడు కాపు రామచంద్రారెడ్డి సామాజిక బాధ్యతగా తన సొంత నిధులతో సుమారు 8 వేల జంటలకుపైగా ఉచిత వివాహాలు, 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. వందలాది మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. దేవాలయాలకు విరాళాలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, కంప్యూటర్ల వితరణ, కణేకల్లు జూనియర్ కళాశాలకు కార్పస్ఫండ్ ఇచ్చి తనవంతు తోడ్పాటు అందించారు. బయోడేటా పేరు : కాపు రామచంద్రారెడ్డి తండ్రి పేరు : కాపు చిన్న తిమ్మప్ప తల్లిపేరు : కాపు గంగమ్మ పుట్టిన తేదీ : 06.10.1963 అడ్రస్ : డోర్ నెం: 10–1–33, లక్ష్మీబజార్ , రాయదుర్గం , అనంతపురం జిల్లా విద్యార్హత : ఎంకాం (కర్ణాటక యూనివర్సిటీ) బీఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఎల్బీ (స్పెషల్) ( గుల్బర్గా యూనివర్సిటీ), భాషా విశారద ఇన్ తెలుగు లిటరేచర్ వృత్తి : న్యాయవాది కుటుంబం : కాపు భారతి (భార్య), ప్రవీణ్కుమార్ రెడ్డి (కుమారుడు) అలేఖ్య రెడ్డి ( కోడలు), స్రవంతి రెడ్డి (కూతురు), మంజునాథరెడ్డి (అల్లుడు) -
వైఎస్సార్ సీపీ ఏజెంట్పై కక్ష సాధింపు
-
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు
-
టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం, వీడియో కలకలం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఓటర్లను ప్రభావితం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఏకంగా మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లను బలవంతంగా టీడీపీకి వేయించినట్లు బయటపడుతోంది. బాధిత మహిళల వీడియో టేపులు ప్రస్తుతం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో మొత్తం ముగ్గురు అధికారుల ప్రమేయమున్నా కేవలం ఓ హెడ్ కానిస్టేబుల్ను వీఆర్కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం పోలీసుశాఖలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల మహిళా పోలీసు వాలంటీర్లను ఎంపిక చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి సేవలను కూడా వినియోగించారు. విధుల్లో ఉండటంతో వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అయితే రాయదుర్గం నియోజకవర్గంలో మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లన్నీ ఏకపక్షంగా టీడీపీకి పడేలా పోలీసులు వ్యూహం రచించినట్లు తెలిసింది. రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓబుళపతి అనే హెడ్ కానిస్టేబుల్ అంతా తానై వ్యవహరించిన విషయం బయటపడింది. దీంతో ఇతనిపై రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. అతన్ని వీఆర్కు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయడమే కాకుండా రూ.లక్షలు ముడుపులు తీసుకొని మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బలవంతంగా టీడీపీకి వేయించారని తెలుస్తోంది. పలువురు బాధిత మహిళా వాలంటీర్లు కూడా ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో టేపులు బయటకు పొక్కడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒక్కో వలంటీర్కు రూ. వెయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి లక్షల్లో పోలీసు స్టేషన్కు ముడుపులు వచ్చాయని, అయితే ఒక్కో మహిళా వలంటీర్కు పోస్టల్ బ్యాలెట్ వేయాలని రూ.1000 చొప్పున ఇచ్చినట్లు వీడియో టేపుల్లో పేర్కొన్నారు. కొంతమంది ఎదురు ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరించినట్లు వాపోయారు. ఈ వ్యవహారంలో హెడ్కానిస్టేబుల్తో పాటు మరో మహిళా కానిస్టేబుల్, ఓ ఎస్ఐ ఉన్నట్లు వీడియో టేపుల్లో బయటపడింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఏజెంట్పై కక్ష సాధింపు మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్ను సీజ్ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్సార్ సీపీ ఏజెంట్పై కక్ష సాధింపు -
వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపు
-
వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: అధికార టీడీపీ రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కలేకుర్తి జయరామిరెడ్డిపై కణేకల్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో కలేకుర్తి జయరామిరెడ్డిపై బంధువుల మాట్లాడుతూ.. మంత్రి కాలువ శ్రీనివాస్ ఒత్తిడితోనే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేత సంజీవరాయుడిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తనపై అక్రమ కేసు పెట్టారంటూ జయరామిరెడ్డి ఆందోళనకు గురవడంతో.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాయదుర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆయనను పరామర్శించారు. -
గోరంతను కొండంత చేసి..
ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు శాంతికాముకులనడంలో సందేహం లేదు. అయితే మంత్రి కాలవ శ్రీనివాసులు మాత్రం ఇక్కడి ప్రజలను ఇంకో విధంగా భావిస్తున్నాడు. ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించరు.. ఏమి చెప్పినా వెర్రివెంగళప్పల్లా నమ్ముతారు అని అనుకున్నాడు. అందుకే పట్టణంలో నాలుగు కి.మీ రోడ్డు విస్తరణకు గాను 1.2 కి.మీ, మాత్రం అదీ అసంపూర్తిగా పనులు చేసి, ప్రచారంలో మాత్రం రాయదుర్గం రోడ్లు వెలిగిపోతున్నాయి అని గొప్పలు చెబుతున్నాడు. మాటలకు, పనులకు పొంతన లేకుండా పోతోంది. సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో నాలుగు వరుసల రోడ్ల విస్తరణ, విద్యుత్ దీపాల అమరిక కోసం 2014లో నిధులు మంజూరయ్యాయి. పాలశీతలీకరణ కేంద్రం నుంచి మొలకాల్మూరు రోడ్డు బైపాస్ రోడ్డుకు లింక్ కలిపే 4 కి.మీ రోడ్డు పనులు 2015లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లు గడిచినా మంత్రి నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాల్టీలో 4 కి.మీ రోడ్డు కూడా వేయని దుస్థితి. నాలుగేళ్లుగా ముక్కి, మూలిగి 1.2 కి.మీ సీసీ రోడ్డు, వంద మీటర్ల బీటీ రోడ్డు మాత్రం వేశారు. వినాయక సర్కిల్లో కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రధానంగా ప్రమాదాలు జరిగే తేరు మలుపు వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. అలాగే వేసిన 1.2 కి.మీ. ప్రధాన సీసీ రోడ్డు నుంచి వీధుల్లోకి వెళ్లే రోడ్లకు కూడా లింక్ కలుపకుండా పనులు ఆగిపోయినా మంత్రికి మాత్రం ఇలాంటివి అగుపడవు. ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు అసలు కనబడవు. వీటి గురించి మంత్రి గాని, ఆయన అనుచరగణం గాని కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. 2 కణేకల్లు రోడ్డును ఫారెస్ట్లో 3 కి.మీలు, పూలచెర్ల రోడ్డు నుండి నల్లంపల్లి సమీపం వరకు 1 కి.మీ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోలయ్య తోట నుంచి క్రాసింగ్ వరకు 2 కి.మీలు అక్కడి నుంచి కణేకల్లు వరకు 8 కి.మీ డబుల్ రోడ్డు చేయించలేని అసమర్థుడు మంత్రి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవి లేని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలే నయమని, పూర్తి స్థాయిలో ఆయా పట్టణాల్లో రోడ్లు వేశారని దుర్గం ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రిగా ఉంటూ తన అభివృద్ధి మాత్రమే చూసుకున్న కాలవ ‘దుర్గం’ అభివృద్దికి ఏమాత్రం చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణలో రోడ్డు మధ్య అమర్చిన వీధి దీపాలు కూడా ఒకరోజు వెలిగితే రెండురోజులు వెలగని పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
రాయదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం
-
20 రోజులు ఓపిక పడితె మన ప్రభుత్వం వస్తుందని చెప్పండి
-
వైఎస్సార్సీపీతోనే సంక్షేమ రాజ్యం
సాక్షి, రాయదుర్గంటౌన్: సంక్షేమ రాజ్యం కోసం వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, కుమార్తె స్రవంతి ఓటర్లకు కోరారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని 31వ వార్డులో ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. 14 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను జగన్ ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. ప్రతి పేదవాడి కష్టం తీర్చాలని, అక్క చెల్లమ్మల బాధలు తొలగించాలని, అన్న, తమ్ముళ్లుకు తోడుగా ఉండాలనే మహా సంకల్పంతో ప్రతి కుటుంబాన్నీ ఆదుకునేందుకు నవరత్నాల్లాంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ప్రజలను అడుగడుగునా మోసాలు, కుట్రలు చేస్తూ చివరకు వ్యక్తిగత సమాచారాలను సైతం దొంగిలించారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలను మోసం చేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం అని యువతను మోసం చేశారన్నారు. రైతులు, కార్మికులు, ప్రతి వర్గాన్నీ మోసం చేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తాడూరు గోపి, సత్యనారాయణ, గోవిందరాజులు, ముస్తాక్, పలువురి రాము, భీమనపల్లి దివాకర్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. బన్నీ మహంకాళి ఆలయంలో పూజలు ప్రచారానికి ముందు పట్టణంలోని 31వ వార్డులోని బన్నీ మహంకాళి ఆలయంలో కాపు భారతి, పార్టీ నాయకులు పూజలు చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు చెక్పెట్టి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే మెట్టు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మెట్టు గోవింద రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్పాండ్లో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న 30 మంది ఎమ్మెల్యేల్లో తానూ ఒకడినని, ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా టీడీపీని కాపాడుకున్నామని, కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కలేదని వాపోయారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంచార్జిగా ఉండి రాయదుర్గం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడతానని చెప్పారు. జగన్ మీద నమ్మకంతోనే: కాపు ఎలాంటి షరతులు లేకుండా గోవింద రెడ్డి పార్టీలో చేరడం శుభాపరిణామమని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉద్దేశ్యంతోనే గోవిందరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారని రాయదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసారి వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలు, మతాలకు అతీతంగా వైఎస్ జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు. -
రాయదుర్గంలో పాలిట్రిక్స్
రాయదుర్గం టీడీపీ నేతల్లో అభద్రతాభావం నెలకొంది. వారిలో కొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో పావులు కదుపుతున్నారు. వైఎస్సార్సీపీకి పట్టున్న గ్రామాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారి పాచికలు పారనిచోట ఓట్లు తొలగించే కుటిలయత్నం చేస్తున్నారు. ఆ దిశగా శనివారం రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామంలో వివరాలు సేకరిస్తున్న కొందరు మహిళలను గ్రామస్తులు నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం రూరల్: టీడీపీ నాయకులు అనంతపురానికి చెందిన ఆరుగురు మహిళలను తీసుకొచ్చి రాయదుర్గం మండలంలోని కెంచానపల్లి, కాశీపురం, వేపరాల గ్రామాల్లో సర్వే చేయించాలని ఆదేశించారు. ఆ మేరకు వారు కాశీపురంలో ఇంటింటికీ వెళ్లి ఏ పార్టీకి ఓటు వేస్తారు? అని అడుగుతూ ఆధార్కార్డులు, రేషన్కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డులు తీసుకుని ఓటర్ల జాబితాలో ఏదో రాసుకుంటూ పోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు సత్యనారాయణ సర్వే చేస్తున్న మహిళల వద్దకెళ్లి ‘మీరు ఏ డిపార్ట్మెంట్ వారు? మిమ్మల్ని ఎవరు, ఎందుకు పంపించారు?, రేషన్కార్డులు, ఆధార్కార్డులతో మీకేం పని?’ అంటూ ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులకు కూడా అనుమానం వచ్చి ‘ఓటరు కార్డు తీసుకుని మీరేం చేస్తున్నారు? అని నిలదీశారు. దీంతో నోరు విప్పిన మహిళలు చంద్ర అనే వ్యక్తి చెప్పడంతో ఈ సర్వే చేస్తున్నామన్నారు. తాము కేవలం డోర్ నెంబర్ మాత్రమే తీసుకుని ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారా, లేదా అని పరిశీలిస్తున్నామని, కొందరు తెలియక గుర్తింపుకార్డులు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. వారి వైఖరి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు గుమికూడారు. రాజకీయ పార్టీలపై సర్వే చేస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున మండల ప్రధాన కార్యదర్శి కొండాపురం రామన్న, శివారెడ్డి, వడ్డే హనుమంత, తిప్పేస్వామి తదితరులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సర్వే చేయరాదని మహిళలకు సూచించారు. సర్వే విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. ఒక జాతీయ ఛానల్ రాజకీయ పార్టీలపై సర్వే చేయాలని కోరడంతో ఏ పార్టీకి ఓటు వేస్తారనే విషయం మాత్రమే అడగాలని మహిళలకు సూచించామని, ఆధార్, రేషన్, ఓటరు కార్డులు తీసుకోవాలని చెప్పలేదని టీడీపీ నాయకుడు చంద్ర చెప్పుకొచ్చారు. ఓటు తొలగిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? పూర్తి వివరాలు సేకరించాక ఓటర్ల జాబితాలో మా పేర్లను తొలగిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు ఎలా చేస్తారు. మాకు చదువు లేదూ.. సంధ్యా లేదు. ఎవరు ఎందుకు వస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. – కృష్ణవేణి, కాశీపురం అధికారులు అవగాహన కల్పించాలి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అధికారులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి.ఎవరైనా మీ వద్దకొచ్చి రేషన్కార్డులు, ఆధార్కార్డులు, ఓటరుకార్డులు కాని అడిగితే ఇవ్వరాదని అధికారులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ఎవరైనా సర్వేకు వస్తే వారి వివరాలను తమకు అందించాలని తెలియజేయాలి. – యశోదమ్మ, కాశీపురం గ్రామం వారికి అనుకూలంగా రాసుకోవడానికి ఏదోకటి రాసుకెళ్లి టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయించుకుని వైఎస్సార్సీపీ ఓటర్లను తికమక పెట్టేందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నట్టున్నారు. గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? – నాగలక్ష్మీ, కాశీపురం -
బొమ్మ తుపాకీతో బ్యాంక్ లూటీకి ప్లాన్
సాక్షి, అనంతపురం : ఓ వ్యక్తి బొమ్మ తుపాకీని చూపించి బ్యాంకులో దోపిడీకి యత్నించాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరూర్ వైశ్య బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న వారు అప్రమత్తమై దోపిడీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. తీరా అతని చేతిలో ఉంది బొమ్మతుపాకీ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. బొమ్మతుపాకీ కొనుక్కొచ్చి దోపిడీకి స్కెచ్ వేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. దుండగుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. -
సాకులు చెప్పి తప్పించుకోకు
రాయదుర్గం : మంత్రి కాలవ శ్రీనివాసులు కుంటిసాకులు వీడి.. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. రాయదుర్గంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడారు. ‘పరిమిత సంఖ్యలో రావాలని నోటీసులతో పోలీసులను మంత్రి కాలవ గురువారం రాత్రి మా ఇంటికి పంపారు. పరిమిత సంఖ్య అయితే అది బహిరంగ చర్చ ఎలా అవుతుందని’ కాపు ప్రశ్నించారు. తేదీ ఖరారు చేసిన మంత్రి కాలవ.. డీఎస్పీకి అనుమతి కోరిన లేఖలో ఇరువైపులా పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని, తన తరఫున శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకోవాలని రాయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బహిరంగ చర్చ అంటే అభివృద్ధిపైన గానీ అవినీతిపైన గానీ ఒక్కో అంశంపై ప్రజల సమక్షంలో చర్చించడమే బహిరంగ చర్చ అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు ప్రజలను తరలించడానికి సామర్థ్యం లేదని మంత్రి చెప్పడం సరికాదని, ప్రజలను తరలించాల్సి న అవసరం లేదని, ప్రజలే ఆసక్తిగా తరలివస్తారని సూ చించారు. రాయదుర్గం ప్రజలు శాంతికాముకులు అనే విషయం నీకు తెలియదా? అని కాపు ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా.. మంత్రి కాలవ శ్రీనివాసులు గత ఎన్నికలకు 15 రోజుల ముందు దుస్తులు సర్దుకొని రాయదుర్గం వస్తే .. ఆయన అందం చూసి ప్రజలు ఓటువేసి గెలిపించలేదని కాపు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను నమ్మారని, ఈయన కూడా ప్రచారం చేయడంతోనే గెలిపించారన్నారు. అవే అంశాలపై చర్చించడానికి ఒప్పుకోకపోవడం ఎంత వరకు సబబన్నారు. కాలవ ఎంపీగా వున్న సమయంలో దుర్గం అభివృద్ధికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. 2002లో హెచ్చెల్సీ నీటి కోసం జరిగిన ఉద్యమంలో రైతులపై కేసులు పెడితే, ఇటు వైపు తిరిగి చూడని నీవు రైతులకు ఏమిలబ్ధి చేకూర్చావని నిలదీశారు. సమయంలేదు మిత్ర మా... పోలీసులతో అనుమతి తీసుకో... చర్చించడానికి మేము వస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా అధికార ప్రతి నిధి మాధవరెడ్డి, మండల కన్వీనర్లు మలి ్లకార్జున, కాంతారెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ గోనబావి శర్మస్, పట్టణ ప్రచార కార్యదర్శులు పైతోట సంజీవ, హనుమంతు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, సీతారం, బాబు, గిడ్డరాము, నాయకులు ముల్లంగి నారాయణ స్వామి, ఎంసీహెచ్ రాజ్కుమార్ , కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, లక్ష్మిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బేలోడు రామాంజనేయులు, తిమ్మప్ప, సత్తి పాల్గొన్నారు. పోలీసుల అదుపులో కాపు డి.హీరేహాళ్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం వస్తున్న కాపు రామచంద్రారెడ్డిని మల్లాపురం రోడ్డు సమీపాన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడమేంటని కాపు ప్రశ్నించారు. అవసరమైతే గృహనిర్బంధం చేసుకోండి.. ఇలా నియోజకవర్గం దాటించాలని చూస్తే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారన్నారు. అయితే పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. పరిమిత సభ్యుల మధ్య చర్చిద్దాం: మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం : 2014 నుంచి ఇప్పటి వరకు దుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి , అవినీతిపై బహిరంగంగా చర్చిద్దామని చెప్పిన మాట వాస్తవమే.. వేలాది మంది ప్రజల మధ్య చర్చ పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్తున్నారని, పరిమిత సభ్యులతో చర్చించడానికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావాలని మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధితో పాటు టీడీపీ మేనిఫెస్టోపై చర్చిద్దామని చెప్పడం భావ్యం కాదన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా వున్న 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు నా హయాంలో జరిగిన అబివృద్ధిపై మాత్రమే చర్చిద్దామన్నారు. ఇది రాజకీయ చర్చ కాదని ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అన్నారు. మా మధ్యలో సంధానకర్తగా మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ఉంటారని తెలిపారు. పరిమిత సంఖ్యలో అర్థవంతమైన చర్చ చేయడానికి రామచంద్రారెడ్డి రావాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశులు, మురడి ఆనంద్రెడ్డి, మల్లికార్జున, నాగళ్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మెట్రోరైల్ రెండో ఫేజ్కు అంతా సిద్ధం
-
మట్టి దందా
డి.హీరేహాళ్(రాయదుర్గం): రాయదుర్గం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. అసైన్డ్,చుక్కల భూములు, వంకపోరంబోకు భూములను ఎంచుకుని ఇష్టానుసారంగా తవ్వి మట్టిని మెక్కేస్తున్నారు. ఈ అక్రమార్కులకు మంత్రి కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తుండటంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పది మందితో గ్యాంగ్ డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం ఐరన్ ఓర్కు దేశంలోనే పేరుగాంచింది. గత సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన వెంకటేశులు విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కూడా ఆ పార్టీలో చేరాడు. గ్రామ ప్రథమ పౌరుడిగా, పెద్దమనిషిగా ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఆదాయం కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. చిదానందస్వామి, బసవరాజు, రాజ, రామి, తిప్పేస్వామి, మాజీ సర్పంచ్ తిమ్మప్ప తదితర పది మంది సభ్యులతో గ్యాంగ్ (ముఠా)ను ఏర్పాటు చేసుకుని మట్టి దందాకు తెరలేపాడు. రోజుకు 50–80 ట్రిప్పుల మట్టి తరలింపు ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ పక్కన, కొత్త సుగ్గులమ్మ దేవాలయ సమీపాన సర్వే నంబర్ 124ఏ లో ఉన్న నాలుగెకరాల వంకపోరంబోకు భూమిని ఎంచుకున్నాడు. నిరంతరం తన గ్యాంగ్తో నలువైపులా నిఘా పెట్టించాడు. రాత్రి 9 నుంచి తెల్లవారుఝామున 4.30 గంటల వరకు హిటాచీతో ఇష్టారాజ్యంగా మట్టితవ్వకాలు చేయిస్తున్నాడు. రోజుకు 50 నుంచి 80 ట్రిప్పుల వరకు మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదే ప్రదేశంలో గతంలో నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా మట్టి తవ్వకం పనులు చేసినట్లు చూపి వెంకటేశులు రూ.20 లక్షలు నొక్కేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజు ఆదాయం లక్ష పైమాటే కర్ణాటకకు చెందిన వ్యాపారులతో టిప్పర్ మట్టిని రూ.1,500 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అలా రోజుకు రూ.75 వేల నుంచి లక్షకు పైబడి అక్రమార్జన చేస్తున్నాడు.ఈ తతంగం గత సంవత్సర కాలంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎవరితోనైనా చెప్పుకోండి.. మట్టి దందా విషయం ఎవరైనా మాట్లాడితే ‘రెవెన్యూ గానీ, పోలీస్ అధికారులు గానీ ఎవరూ ఏమీ చేసుకోలేరు’ అంటూ మాజీ సర్పంచ్ వెంకటేశులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అంతే కాదు ‘మంత్రి అండగా ఉన్నాడు. ఎవరితోనైనా చెప్పుకోండి’ అంటూ రెచ్చిపోతున్నాడు. ఈ మట్టి దందాలో టీడీపీ నాయకులతో పాటు మంత్రికి కూడా వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ అక్కడకు వెళితే అంతే.. మట్టి తవ్వకాలు జరిపే ప్రదేశానికి ఎవరైనా వెళితే టిప్పర్లతో ఢీకొట్టించి మట్టుపెట్టే యత్నాలు కూడా గతంలో జరిగాయని బాధితులు వాపోతున్నారు. టిప్పర్ లైట్లు బంద్ చేసి వెనుక నుంచి వచ్చి గుద్ది చంపేందుకు కూడా వెనుకాడబోరని చెబుతున్నారు. అలా కొంతమంది తప్పించుకు వచ్చినట్లు తెలిపారు. మట్టిమాఫియా రెచ్చిపోవడానికి మంత్రి కాలవ శ్రీనివాసులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటివారైనా ఉపేక్షించం ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ వద్ద వంక పొరంబోకు భూమిలో మట్టిని తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. మా సిబ్బందితో నిఘా పెట్టించాం. తాజామాజీ సర్పంచ్ వెంకటేశులు మట్టి దందాకు పాల్పడినట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – ఖతిజిన్కుఫ్రా, తహసీల్దార్, డి.హీరేహాళ్ -
ఏయ్.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు
సాక్షి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు. ఇక నుంచి తన కార్యక్రమాలకు రావద్దంటూ హూకుం జారీ చేశారు. వివరాల్లోకవి వెళితే..రాయదుర్గం పట్టణంలోని జర్నలిస్టులకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కణేకల్లు రోడ్డులో ఇళ్లస్థలాలు ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక..పాత పట్టాలు రద్దుచేసి, కొత్తపట్టాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ లేఅవుట్లో కొంతమంది విలేకరులకు ‘హౌస్ఫర్ ఆల్’ పథకంకింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ లేఅవుట్లో సౌకర్యాలను పరిశీలించేందుకు మంత్రి కాలవ ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న సమీపంలోనే ఉన్న ఎంసీఏ లేఅవుట్ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో మంత్రి వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డగించి.. వలి అనే వ్యక్తితో పాటు ఓ మహిళను మంత్రి వద్దకు పంపించారు. ‘ఏంటయ్యా ఖాళీ బిందెలతో వచ్చారు.. సమస్య చెప్పేందుకు ఒకరిద్దరు రావాలి గానీ ఖాళీ బిందెలతో వస్తావా..? ఆడవాళ్లతో నన్నే అడ్డుకోవాలని చూస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు చిత్రీకరిస్తుండగా మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ‘ఏయ్ .. ఎందుకు తీస్తున్నావ్’ అని గదమాయించారు. సార్ నీటి సమస్య చెబుతున్న విషయాన్ని తీస్తున్నా అని చెబితే ‘తీయొద్దు, ఇక కార్యక్రమాలకు సాక్షి విలేకరులు రావద్దు’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ‘లేనిపోనివి సృష్టిస్తున్నారు, పనికిమాలిన లం.కొ..లు మీడియాలో చేరి జర్నలిజం విలువలు తీస్తున్నారు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వాడికి ఎవడైనా సపోర్ట్ చేస్తే వారి అంతు కూడా చూస్తా..ఏమనుకున్నారో ఏమో? అంటూ అక్కడే ఉన్న జర్నలిస్టులనూ హెచ్చరించారు. -
ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణోత్సవం
సాక్షి, రాయదుర్గం టౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన ప్రసిద్ధ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దాదాపు 50 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా స్వామికి ఎనిమిదేళ్ల బాలికతో వివాహం జరిపించారు. ఇలా చేయడం వల్ల ఆ బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది భక్తుల నమ్మకం. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది రాయదుర్గానికి చెందిన అరవా ప్రకాష్, యశోద దంపతుల కుమార్తె రేఖతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరపున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (రేఖ) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.