
రేపటితో అంత్యపుష్కరాల ముగింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్లో పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమం నిర్విహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు పుష్కరఘాట్లో నిర్వహించే హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఆయన తిలకిస్తారు.