క్రీడాకారిణికి చేయూత
నిడదవోలు : అథ్లెటిక్ పోటీల్లో రాణిస్తున్న పేద క్రీడాకారిణి యాతం నాగాంజలికి చేయూత నందించేందుకు థింకర్స్ కార్నర్ అనే సంస్థ ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 26న ’సాక్షి’లో ‘పేదింట పరుగుల రాణి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. గురువారం బాలికల జూనియర్ కళాశాలలో నాగాంజలికి రూ.17,000 ఆర్థిక సహాయం అందించారు. ప్రిన్సిపల్ పి.సరళ, ఎ¯ŒS.సుజల, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.నాగరాజు పాల్గొన్నారు.