రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా | If proven i will exit from politics sayes Palle | Sakshi
Sakshi News home page

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Published Sat, Oct 22 2016 2:34 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా - Sakshi

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

మంత్రి పల్లె రఘునాథరెడ్డి

 సాక్షి, అమరావతి: తనపై వస్తున్న ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, త్వరలోనే తాను ఆస్తులు ప్రకటిస్తానని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఆస్తుల విషయంలో సాక్షి మీడియా కథనాల్లో వాస్తవాలు లేవని, తనపై ప్రచురించిన వార్తల విషయంలో సాక్షి మీడియాకు నోటీసులిస్తానని చెప్పారు.

ఆరోపణలు రుజువు చేయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను భూదందాలు, రౌడీయిజం చేయలేదన్నారు. విద్యా సంస్థలను నిర్వహించి సంపాదించుకున్నానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement