బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను కాలేజీ స్థాయికి పెంపు | increse scholl satate to college | Sakshi
Sakshi News home page

బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను కాలేజీ స్థాయికి పెంపు

Published Thu, Jul 28 2016 1:04 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

రాష్ట్రంలో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ఇంటర్మీడియట్‌ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది

నల్లగొండ: రాష్ట్రంలో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ఇంటర్మీడియట్‌ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 రెసిడెన్షియల్‌ పాఠశాలలు  ఉండగా జిల్లాలో నాగార్జునసాగర్‌ (బాలురు), మూసీ ప్రాజెక్టు (బాలురు) వద్ద రెండు స్కూల్స్‌ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే రెసెడిన్షియల్‌ స్కూల్స్‌లో ఇంటర్‌ అడ్మిషన్‌లు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ప్రవేశపెట్టారు. అందుకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement