ముగిసిన జకినీ మాత ఉత్సవాలు | jakini matha uthsavas end | Sakshi
Sakshi News home page

ముగిసిన జకినీ మాత ఉత్సవాలు

Published Fri, Feb 10 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

jakini matha uthsavas end

గుత్తి : ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. వేకువజాము నుంచే అమ్మవారికి పలు పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో జకినీ మాత, మల్కూమ జకినీ మాత విగ్రహాలకు గంగాస్నానం చేయించారు. అనంతరం ఎరుపు దుస్తులు ధరించిన 108 మంది కన్యలు, ముత్తైదువులు పూర్ణ  కుంభాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారి విగ్రహాలను జకినీ మాత ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం పది, ఇంటర్‌, డిగ్రీల్లో ప్రతిభ కనబరిచిన ఆరె కటికల పిల్లలకు బహుమతులు అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement