ప్రవీణ్కు అవార్డు
కందుకూరు: బాచుపల్లికి చెందిన హెచ్సీయూ ఎంఫిల్ విద్యార్థి యాలాల ప్రవీణ్ కుమార్ ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ 2015-16 అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా వర్సిటీ సమీప గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, హెచ్ఐవీ, పల్స్ పోలియో, అక్షరాస్యత, యాంటీ డ్రగ్స, నేషనల్ ఓటర్స్ డే తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు గుర్తింపుగా ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈ నెల 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రవీణ్ను అభినందించారు.