HCU
-
హెచ్సీయూ ‘ఐఓఈ’కి ఐదేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 2019లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (Hyderabad Central University) అత్యుత్తమ హోదాను అందించింది. వర్సిటీకి ‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ (ఐఓఈ) హోదా లభించి అయిదేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి హెచ్సీయూ (HCU)లో మౌలిక వసతులు దశల వారీగా మెరుగుపడుతున్నా మరింత ఆధునికీకరించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించాల్సిన అవసరముంది.దేశంలో మూడు వర్సిటీలకే.. ‘ఐఓఈ’ హోదాను దేశంలో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకే కేంద్రం గుర్తింపు ఇచ్చింది. వీటిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది. మూడోది 2019లో హెచ్సీయూకి కల్పించడం విశేషం. దక్షిణ భారతంలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక యూనివర్సిటీగా హెచ్సీయూ గుర్తింపు పొందడం గమనార్హం. టాప్–500లో భాగమే లక్ష్యం.. జాతీయ అవసరాలు, ప్రపంచస్థాయి ప్రమాణాల అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి, విద్యా, ఆర్థిక, పరిపాలనాపరమైన మద్దతు ఇవ్వడమే ‘ఐఓఈ’ లక్ష్యం. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందడమే ఐఓఈ ధ్యేయంగా సిబ్బంది పని చేస్తున్నారు.ఇప్పటివరకు రూ.500 కోట్లతో.. మానవ వనరుల అభివృద్ది కేంద్రం, 50 గదుల ప్రత్యేక గెస్ట్ హౌస్, 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కో వసతి గృహం, కొత్త పరిపాలనా భవనం, నాంపల్లిలోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాన్ని పునరుద్ధరించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక స్థాయి ల్యాబ్లలో వినియోగించే పరికరాలు అందుబాటులో తెచ్చారు. 250 మందికిపైగా అధ్యాపకుల పరిశోధనలు, వృత్తిపరమైన అభివృద్దికి నిధులను సమకూర్చారు. 1,50,00 ఎస్ఎఫ్టీతో కూడిన ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, రీసెర్చ్ క్లస్టర్స్, కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్లు, ఒకొక్కటి 300 మంది కూర్చొనే సౌకర్యం కలిగిన 8 ఆడిటోరియాలను నిర్మించారు. వీటితో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. చదవండి: జేఈఈ మెయిన్ నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శలుఅంతర్జాతీయ గుర్తింపు తెస్తాం.. హెచ్సీయూకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడమే ఐఓఈ లక్ష్యంగా పని చేస్తున్నాం. గత అయిదేళ్లలో ఎన్నో నిర్మాణాలు, శిక్షణలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తెచ్చాం. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు, రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ పర్యవేక్షణలో ఐఓఈ బృందం హెచ్సీయూ రూపురేఖలను మార్చనుంది. – ప్రొఫెసర్ ఘనశ్యామ్కృష్ణ, హెచ్సీయూ ఐఓఈ డైరెక్టర్ -
సీఎం రేవంత్ను కలిసిన రోహిత్ వేముల తల్లి
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొడుకు ఆత్మహత్య కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కాగా సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.మరుసటి రోజే రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. విచారణ, దర్యాప్తు విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారుజతదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్!
రాయదుర్గం (హైదరాబాద్): 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు పొందడం ఖాయమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్(యూజీసీ) చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.జగదీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి లోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల తోపాటు గోల్డ్మెడల్స్, ఫ్యాకల్టికి చాన్స్లర్స్ అవార్డుల ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీలలో 70 నుంచి 80% ఫ్యాకల్టీ ఖాళీలు కొనసాగుతున్నాయని తెలుస్తోందని, వాటిని వెంటనే భర్తీ చేయా లని జగదీశ్కుమార్ సూచించారు. సెంట్రల్ వర్సిటీలలో భర్తీల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. యువత నోబెల్ బహుమతి సాధించాలి: గవర్నర్ తమిళిౖసై నేటి తరం యువత నోబెల్ బహుమతి సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానం–2020లో ఎన్నో సంస్కరణలకు దారి తీసిందని, దీన్ని అందరూ స్వాగతించాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్సీయూ చాన్స్లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు కూడా మాట్లాడారు. రిజి స్ట్రార్ డాక్టర్ దేవే‹Ùనిగమ్, పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు పాల్గొన్నారు. -
హెచ్సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్నగర్ నుంచి వర్చువల్గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
వరల్డ్ టాప్ వర్సిటీల్లోహెచ్సీయూ, ఐఐటీ–హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)–2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 యూనివర్సిటీలు టాప్ ర్యాంకుల్లో ఉండగా, తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్ 1,373వ ర్యాంకు సాధించాయి. గత ఏడాది ర్యాంకులతో పోలిస్తే హెచ్సీయూ 7 ర్యాంకులు కిందకు పడిపోగా, ఐఐటీ–హైదరాబాద్ మాత్రం 68 స్థానాలు పైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ–మద్రాస్ ఉన్నాయి. ఇక వరల్డ్ టాప్ వర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ నంబర్వన్గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. పరిశోధనల్లో వెనకబాటుతో పాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్ నివేదిక వెల్లడించింది. దేశంలో నాల్గోస్థానం రాయదుర్గం: దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలిచింది. ‘ది వీక్ హన్సా’పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో హెచ్సీయూ నాల్గోస్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో టాప్లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని వీసీ ప్రొఫెసర్ బీజేరావు తెలిపారు. -
హెచ్సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. హెచ్సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్లో గురువారం సాయంత్రం కశ్మీర్ ఫైల్స్ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. -
HCU: విదేశీ విద్యార్థినిపై లైంగికదాడియత్నం.. ప్రొఫెసర్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
హెచ్సీయూలో 29 వరకు ‘సుకూన్–2022’
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో శుక్రవారం నుంచి సందడి నెలకొననుంది. ప్రతిష్టాత్మకమైన ‘సుకూన్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్సీయూ క్యాంపస్లోని సుకూన్ గ్రౌండ్స్, కొమ్రమ్ భీమ్ ఓపెన్ డయాస్లో మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా కొలేజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, ఫేస్ పెయింటింగ్ పోటీలు, బైత్బాజీ కార్యక్రమం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, రంగోలి, ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. పోస్టర్ మేకింగ్ పోటీలు, మెహిందీ పోటీ, మొబైల్ ఫోటోగ్రఫీ, క్విజ్ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హెచ్సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్నందన్ మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో ‘సుకూన్–2022’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి రోజు డప్పు చందు కార్యక్రమం, ట్రైబల్ ఫోక్ షో, సూఫీ ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు ఆర్కెస్ట్రా, రాక్ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరిరోజైన మూడో రోజు డీజే నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీశాయి రాళ్ల వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతమంతా మేఘాలు కమ్ముకున్నాయి.గచ్చిబౌలి, హెచ్సీయూ, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బంజారాహిల్స్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్, హైదర్గూడ, అత్తాపూర్, గండిపేటతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు కొట్టుకు వచ్చాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వసం అవ్వగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఏరియాలో చాలా రోజుల తర్వాత కుండపోత వర్షం పడింది. చదవండి: Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం -
ప్రధాని హైదరాబాద్ పర్యటన: వ్యతిరేక ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగా ఆయన హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 12గం.50ని.కు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆపై ఒంటిగంట నుంచి పదిహేను నిమిషాల పాటు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆపై బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్లో హెచ్సీయూకి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో.. ఐఎస్బీకి వెళ్తారు. ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఆయన బేగంపేట్ చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. ఆయనకు స్వాగతం చెబుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అక్కడక్కడ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
ఇంటర్నెట్లో అండర్ వరల్డ్గా డార్క్ వెబ్!
...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో సగానికి పైగా డార్క్ నెట్ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్ బ్యాంక్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్లోనూ డార్క్ వెబ్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి హైదరాబాద్: మాదకద్రవ్యమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హెచ్–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేసి విక్రయించాడు. అదో ‘అక్రమ’లోకం డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్లైన్లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్వరల్డ్లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని డార్క్నెట్/వెబ్గా పిలిచే అండర్గ్రౌండ్ వెబ్లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారిపోయింది. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్లైన్లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారానే యాక్సస్ చేసే డార్క్ వెబ్ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు... డీప్ వెబ్లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్లైన్లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్కాయిన్స్ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్–న్యూకు చిక్కిన పెడ్లర్స్ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్ చేసిన డ్రగ్స్లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. (చదవండి: డీజే.. డ్రగ్స్ రిస్క్!) -
క్యాంపస్ ప్లేస్మెంట్స్.. వార్షిక వేతనాల్లో కోత
క్యాంపస్ ప్లేస్మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది ఇదే అధికం ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ విద్యార్థి సోమ్నాథ్పాల్ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్నాథ్కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది. రూ. 20 లక్షల తేడా కోవిడ్ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రేరణ తెలిపారు. ఈ కోర్సులకే ప్రాముఖ్యత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ! -
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు హెచ్సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది. -
హెచ్సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
రాయదుర్గం (హైదరాబాద్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్), ఎంపీఏ(మ్యూజిక్), పబ్లిషింగ్లో సర్టిఫికెట్ కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో నిమ్సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ–బీ తదితర పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్) కోర్సులో గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు -
డీఎన్ఏ వెలికితీతకు కొత్త కిట్
సాక్షి,హైదరాబాద్/రాయదుర్గం: మానవులతో పాటు జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల నుంచి డీఎన్ఏను సులువుగా వేరు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని అస్పైర్ బయోనెస్ట్లో పనిచేస్తున్న 30 ఎం జీనోమిక్స్ స్టార్టప్ కంపెనీ వినూత్నమైన కిట్ను అభివృద్ధి చేసింది. యాంప్రెడీ అని పిలుస్తున్న ఈ కొత్త కిట్.. ఇతర పరికరాలేవీ ఉపయోగించకుండానే 5సెకన్లలోనే డీఎన్ఏను వేరుచేయగలదు. డీఎన్ఏ ఆధారిత పరీక్షలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అతి తక్కువ నమూనా ద్వారానే డీఎన్ఏను వెలికితీయొచ్చని 30ఎం జీనోమిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థలు యాంప్రెడీ పనితీరును ధ్రువీకరించాయని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బెన్నెట్ దాస్, పీఎస్కేఎన్ పావని, యశ్వంత్రెడ్డి తెలిపారు. చదవండి: గవర్నర్ తమిళిసైకి ఇందిరా శోభన్ లేఖ -
మన తీరాన ‘మరో చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : మన భూపాలపల్లికి కంబోడియాతో ఉన్న సంబంధం ఏంటి? భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు ప్రపంచ ప్రఖ్యాత అంకోర్వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలో ఎలా ప్రత్యక్షమైంది? చారి త్రక ఆధారాలు ఇప్పటికీ వెలికితీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు ఉన్న లింకేమిటి?. కళింగరాజుల హయాంలో దంతపురంలో బౌద్ధస్తూపం నిర్మితమైంది. ఆ స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ దంతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవిలలో ఉంది. ఇక్కడి నుంచి అటెందుకు తరలింది? శ్రీకాకుళానికి శ్రీలంక దేశానికి మధ్య సంబంధం ఎలా కుదిరింది?.వేల కిలోమీటర్ల దూరంలోని దేశాల్లో తెలుగు వారు వందల ఏళ్లుగా ఎందుకుంటున్నారు? చరిత్రలో కచ్చితమైన సమాధానాల్లేని ప్రశ్నలెన్నో. కానీ వీటి వెనుక సహేతుక చారిత్రక కారణాలున్నాయి. వాటి తీగలాగితే మన దేశానికి–ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాల డొంక ఇప్పుడు కదులుతుంది. నాటి ఆధారాలు వెలికి తీస్తే ఇప్పుడు ఆయా దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేయొచ్చు. ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు. ఇప్పుడిలాంటి ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే సముద్ర మార్గం ఆధారంగా మన దేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది. దేశాలతో కొత్త బాంధవ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఓడరేవు బందరు నుంచి కాకతీయ రాజులు ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. దాన్ని రూఢీచేసే శాసనాలు వెలుగు చూశాయి. అందుకే కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. మన ప్రాంతాన్ని పాలించిన అన్ని సామ్రాజ్యాలు ఈ సంబంధాల్ని కొనసాగించాయి. వ్యాపార వాణిజ్యాలనే ప్రధాన లక్ష్యంతో మొదలైన ఈ సంబంధ బాంధవ్యాలు సంస్కృతీ సంప్రదాయాలతోనూ పెనవేసుకున్నాయి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి దీనికి నిదర్శనం. అప్పట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్లకు చేరింది. ఇప్పటికీ చాలా దేశాల్లో అక్కడ మన శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఇవి దేశాల మధ్య మైత్రికి దోహదం చేశాయి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. కానీ నాటి దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త వాణిజ్యానికి, స్నేహాలకు బాటలు ‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది సముద్ర మార్గం ద్వారా మన దేశంలోని ఏయే ప్రాంతాలు ఏయే దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండేవో వెలికితీయబోతోంది. వాటిని ప్రతిఫలించే నిర్మాణాలు, చారిత్రక స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాధాన్యం ఏంటి, దానితో ఏయే దేశాలు సంబంధం కలిగి ఉన్నాయి, ఆ స్నేహానికి కారణంగా అసలు రెండు ప్రాంతాల మధ్య జరిగిన రవాణా ఏంటి, నాటి వాణిజ్యం, ఆర్థిక అంశాలు తదితర అన్ని వివరాలూ ఈ అధ్యయనంలో తేలనున్నాయి. ఆయా వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం నమ్ముతోంది. యునెస్కో గుర్తింపునకు అవకాశం మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ వారసత్వ జాబితాలో మనదేశంలోని కట్టడాలకు చోటు తక్కువే. ఆ గుర్తింపు పొందదగిన చరిత్ర ఉండి కూడా కొన్ని మరుగునపడ్డాయి. ఇప్పుడు చేపట్టబోయే కొత్త అన్వేషణ దానికి ప్రాణం పోస్తుందన్న ఆలోచన కేంద్రం మదిలో ఉంది. ఇది గొప్ప అధ్యయనం ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించనున్న అధ్యయనం బృహత్తరమైంది. ఇది తీరప్రాంతాలతో గల విదేశీ సంబంధాల చరిత్రను వెలుగులోకి తెస్తుంది. మళ్లీ దేశాల మధ్య కొత్త సంబంధాలకు బాటలు వేయటమే కాక మన చరిత్ర యునెస్కో ముంగిట మెరిసేందుకు కారణం కానుంది. ఇందులో పాలుపంచుకునే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. – ప్రొఫెసర్ కె.పి.రావు -
హెచ్సీయూ దేశంలోనే 2వ అత్యుత్తమ వర్సిటీ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) మరో ఘనత సాధించింది. ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్ఏ) సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్ను ప్రకటించింది. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో హెచ్సీయూ ద్వితీయ స్థానం సంపాదించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను జనరల్ (ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్), సాంకేతిక, వైద్య, చట్టపరమైన నాలుగు విభాగాలుగా పరిశీలించారు. ఈ పరిశీలనలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 995 వర్సిటీలపై అధ్యయనం ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. అందులో 155 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో హెచ్సీయూకు ద్వితీయ స్థానం పొందింది. ఇండియా టుడే నాలెడ్జ్ పార్టనర్ ఎండీఆర్ఏ చేత అనేక మైలురాళ్లను నిర్దేశించింది. ఆబ్జెక్టివ్ ర్యాంకింగ్ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్ఏ 120 ప్లస్ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ పనితీరే సూచికలుగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్లెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకింగ్స్ను ప్రకటించారు. దేశంలోని 30 నగరాల్లో 300 మంది ప్రతినిధులు(32 మంది వైస్చాన్స్లర్లు, 75 మంది డైరెక్టర్లు, 193 మంది సీనియర్ ఫ్యాకల్టీ/ప్రొఫెసర్లు/హెడ్లతో వర్చువల్ సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్ను ప్రకటించింది. టాప్లో నిలవడం.. పనితీరుకు నిదర్శనం పనితీరు మెరుగుపడడం, పరిశోధన రచనలకు గుర్తింపుగా హెచ్సీయూ దేశంలో ద్వితీయ స్థానం సాధించింది. 2017లో 5వ స్థానం, 2018లో 3, 2019లో 2, 2020లో మరోసారి 2వ స్థానాన్ని హెచ్సీయూ దక్కించుకుంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. దీంతో ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్లోకి వెళ్లేలా సమష్టి కృషితో ముందుకు సాగుతాం. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్సీయూ వైస్ చాన్స్లర్ -
హెచ్సీయూ విద్యార్థికి గ్రేస్ హోపర్ స్కాలర్షిప్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంసీఏ విద్యార్థిని వాణిగుప్తాకు 2020 సంవత్స రానికి గ్రేస్ హోపర్ స్టూడెంట్ స్కాలర్షిప్ లభించింది.కాలిఫోర్నియాలోని అనితాబి డాట్ ఆర్గ్ ఈ స్కాలర్షిప్ను అందజేస్తుంది. ఇందులో భాగంగా 1200 డాలర్లు వార్షిక మొత్తంగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా వాణిగుప్తాను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
కరోనా కొమ్ముల్లోని కొద్దిభాగమే వ్యాధికి కారణం
రాయదుర్గం: శ్యాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని కల్గించండం కరోనా ప్రధాన లక్షణమని హెచ్సీయూ విభాగం ప్రొ. లలితా గురుప్రసాద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పరిశోధనలను బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకజాతికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్లకు కేంద్రస్థానాలని భావిస్తున్నామన్నారు. తరచుగా పొందుతున్న ఉత్పరివర్తనలతో ఈ వైరస్ ఇతర జంతువులకి వ్యాప్తిస్తోందన్నారు. కరోనా వైరస్ కొమ్ములాంటి ప్రోటీను నిర్మాణం ఉంటుందన్నారు. ఈ వైరస్ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్–2 గ్రాహకంగా మారుతోందన్నారు. అమెరికాలోని లాస్ ఆల్మాస్ జాతీయ ప్రయోగశాల పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయలనే వెలిబుచ్చారని గుర్తు చేశారు. -
హెచ్సీయూ అడ్మిషన్ల ప్రక్రియ షురూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 2020–21 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మిషన్ కోసం దరఖాస్తులను మే 3వ తేదీలోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. హెచ్సీయూలో 2,400 సీట్లు వివిధ కోర్సులలో ఉన్నాయి. మొత్తం 128 కోర్సులలో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పొస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 15 ఎంఫిల్,10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. గతేడాది మొత్తం 119 కోర్సులలో 2,170 సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులు...182 సీట్లు హెచ్సీయూలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 17 కోర్సులు ప్రారంభిస్తుండగా వాటిలో 182 సీట్లు ఏర్పాటు చేశారు. అందులో ఎంఈడీ ఎడ్యుకేషన్ లో 50 సీట్లు, ఎంఏ జెండర్స్టడీస్–20, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియాస్టడీస్) 25, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియా ప్రాక్టీస్)–25, ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైనింగ్–06, ఎంటెక్ మ్యానుఫాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–18, పీహెచ్డీ మైక్రోబయాలజీ–04 (పునః ప్రారంభిస్తున్నారు), ఎంఫిల్ కంప్యూటర్ లిటరేచర్–08, ఎంఫిల్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్ క్లూజన్ పాలసీ–04, ఎంఫిల్ రీజనల్ స్టడీస్–04, పీహెచ్డీ థియేటర్ ఆర్ట్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్లో నాలుగేసి సీట్లు, రీజినల్ స్టడీస్, కాంగ్ని టివ్సైన్స్లలో రెండేసి సీట్లు, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్ క్లూజివ్ పాలసీలో ఒక్కో సీటును కొత్తగా ఏర్పాటు చేశారు మరిన్ని కోర్సులలో అడ్మిషన్లు ఇలా.. ఎంసీఏలో అడ్మిషన్ను నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఐఎంసెట్ స్కోరు ద్వారా కేటాయిస్తారు. ఎంటెక్ కోర్సులో సీటును గేట్ ద్వారా సీసీఎంటీ లో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)లో సీటును సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (సీఎస్ఏబి) జేఈఈ ద్వారా కేటాయిస్తారు. ఎంబీఏ సీటును క్యాట్, ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీటును న్యూఢిల్లీ లోని జేఎన్ యూ ద్వారా నిర్వహించే సీఈఈబీలో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://acad.uohyd.ac.inను లాగిన్ కావాలి. -
ప్రసవ వేదన.. ప్రాణ తపన
రాయదుర్గం: ప్రసవవేదన వేళ ఓ జింకపై శునకాలు దాడి చేయడంతో గర్భస్థ జింక సహా తల్లి జింక మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఆదివారం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో వందలాది మూగజీవాలు జీవనం సాగిస్తున్నాయి. వాటికి అనువైన వాతావరణం కల్పించడంలోనూ హెచ్సీయూ పాలకవర్గం, విద్యార్థులు, వైల్డ్లెన్స్ గ్రూపు సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడడప్పుడు కుక్కలు, వేటగాళ్ల బారిన పడి మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్సీయూ క్యాంపస్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెచ్సీయూ సెక్యూరిటీ సిబ్బంది క్యాంపస్లోని నల్లగండ్ల చెరువు ఫెన్సింగ్ను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ మృత్యువాత పడిన జింక కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న వైల్డ్లెన్స్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. జింకను పరిశీలించగా.. అది ప్రసవ వేదన పడుతుండే సమయంలో కడుపులోపలి జింక తలభాగం బయటకు వచ్చిన సమయంలో కుక్కలు వెంబడించి దాడికి దిగాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే సమయంలోనే ప్రసవమయ్యే అవకాశం ఏర్పడటంతో అది అటూఇటూ అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే కుక్కలు వెంబడించగా నల్లగండ్ల చెరువు వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తరుణంలో అవి దాడి చేయడంతో తాను ప్రాణాలు వదలడంతోపాటు పుట్టబోయే జింకపిల్ల కూడా తల బయటకు వచ్చేస్తున్న తరుణంలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. సమాచారం అందించినా.. జింక మృత్యువాత పడిన ఘటన వివరాలను చిలుకూరులోని అటవీ శాఖ అధికారులకు మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలోనే జింకను ఉంచి అక్కడే హెచ్సీయూ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, వైల్డ్లెన్స్ గ్రూపు ప్రతినిధులు సాయంత్రం 6.30 గంటల వరకు వేచి ఉన్నారు. కానీ అటవీశాఖాధికారులు అప్పటికీ చేరుకోలేదు. వారి నిర్లక్ష్యం పట్ల హెచ్సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హెచ్సీయూలో కుక్కల బెడద నుంచి మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. గతంలోనూ పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో కుక్కలు సంచరిస్తున్నాయని, వాటిని క్యాంపస్ బయటకు వదలిపెట్టాలని సూచించారు. -
హెచ్సీయూలో రిక్షాల లొల్లి
గచ్చిబౌలిలోని హెచ్సీయూ క్యాంపస్లో మొదటిసారిగా ఈ రిక్షాల రవాణా ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత చార్జీలు చెల్లించి క్యాంపస్లో రాకపోకలు సాగించాలి. ఇప్పటి వరకు క్యాంపస్లో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూనే ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్లో ప్రస్తుతం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది కలిపితే 6 వేలకుపైగా ఉంటారు. రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు సంస్థకు అనుమతించారు. ఈ–రిక్షాలను బెంగుళూరుకు చెందిన మెజర్స్ ట్రాన్స్వాహన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఓన్, ఆపరేట్ అండ్ మెయింటెన్’ పద్ధతిన నిర్వహిస్తారు. అయితే రవాణాను ప్రైవేట్పరం చేసి విద్యార్థులపై భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఏఏ మార్గాల్లో... ఈ రిక్షాలు హెచ్సీయూ క్యాంపస్లో రెండు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మెయిన్గేటు నుంచి సౌత్ గేటు వరకు, సౌత్ క్యాంపస్ గేటు నుంచి మసీదుబండగేటు (స్మాల్ గేట్) వరకు ఉంటాయి. అక్కడి నుంచి తిరిగి అదేమార్గాల్లో అందుబాటులో ఉంటాయి. వేళలు... సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతాయి. ఆయా రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మోడ్లోనే చెల్లించాలి... ఈ రిక్షాలకు డబ్బుల చెల్లింపులన్నీ డిజిటల్ మోడ్లోనే ఉంటాయి. ఒక ట్రిప్పునకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, సందర్శకులు కూడా వినియోగించుకొనే అవకాశం కల్పించారు. దివ్యాంగులకు ఉచితం ఈ రిక్షాలలో దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. వారు యూనివర్శిటీ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ రిక్షాలను తిరగనివ్వం క్యాంపస్లో విద్యార్థులకు ఈ–రిక్షాలలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. ఇతరులకు చార్జీలు వసూలు చేసినా అభ్యంతరం లేదు. విద్యార్థులపై భారం వేసే ఎలాంటి చర్యలనూ అంగీకరించం. ఇప్పటికే రిజిష్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్కు వినతిపత్రాలను సమర్పించాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. లేదంటే ఈ–రిక్షాలను వర్సిటీలో తిరగనివ్వం. – ఎం.శ్రీచరణ్, హెచ్సీయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు విద్యార్థులపై భారం తగదు క్యాంపస్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఆర్థిక భారం మోపేలా ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. స్కాలర్షిప్ రూ. 750 మాత్రమే ఇస్తూ ఇలాంటి భారం మోపడం తగదు. ఒక్కో విద్యార్థి కనీసం నాలుగు సార్లు హాస్టల్ నుంచి బయట తిరిగితే రోజుకు రూ. 50 మేర రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మెస్, ఇతర ఖర్చులను ఎలా భరిస్తారు? ఈ చర్యను వెంటనే ఉపసంహరించాలి. లేదంటే గత్యంతరం లేక ఉద్యమించాల్సి ఉంటుంది. – పి సందీప్, డీఎస్యూ ప్రధాన కార్యదర్శి, హెచ్సీయూ -
హెచ్సీయూలో.. అందాల లోకం..
అందాలలో అహో మహోదయం.. హెచ్సీయూలో నవోదయం.. ఎటు చూసినా పచ్చదనం.. ఆహ్లాదపూరిత వాతావరణం.. ప్రకృతి రమణీయత. చెంగుచెంగుమంటూ గంతులు వేసుకుంటూ వెళ్లే జింకలు.. పక్షుల కిలకిలారావాలు.. జల సవ్వడిని తలపించే తటాకాలు. విభిన్న పుష్ప జాతుల వృక్షాలు.. ఇలా ఎన్నో అపురూప దృశ్య మాలికలకు కేరాఫ్గా నిలుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సువిశాలమైన హెచ్సీయూ క్యాంపస్లో ఒక్కోచోట ఒక్కో అందం, పచ్చదనం,జంతుజాలం.. సొగసు చూడతరమా.. అన్నట్లుగా ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతి ఏటా రూపొందించే కేలండర్లో ఇక్కడి క్యాంపస్లోని అందాలతో కూడిన ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం క్యాంపస్ అందాలతో కూడిన ఫొటోలతో కేలండర్కు రూపకల్పన చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు స్వయంగా తీసిన ఫొటోలను పంపాలని ఉన్నతాధికారులు కోరుతారు. ఆ ప్రకారం క్యాంపస్లోని వివిధ ప్రాంతాలలో ప్రకృతి అందాలతో కూడిన ఫొటోలను తీయడానికి ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫొటోలు పంపాలని కోరగా 200 ఎంట్రీలను విద్యార్థులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పంపించారు. వీరిలో రఘు గణపురం, డాక్టర్ రవి జిల్లపల్లి, విజయభాస్కర్ మరిశెట్టి, జ్ఞానశేఖర్, కేఎన్ కృష్ణకాంత్, మోనికా, పి.కె.నవనీత్ కృష్ణన్, శశిశేఖర్రెడ్డి, సుష్మ నంద్యాల, అనోజ్, చందాని సింగ్, నిరంజన్ బసు తీసిన చిత్రాలను 2020 కేలండర్ రూపకల్పనలో వినియోగించారు. వీరంతా క్యాంపస్లోని అందాలను తమ కెమెరాల్లో బంధించి కేలండర్ అందంగా రూపొందేలా దోహదపడ్డారు. -
మళ్లీ టాప్-10లో హెచ్సీయూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2020లో హెచ్సీయూ వరుసగా రెండోసారి టాప్టెన్ జాబితాలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఐఐటీ–బాంబే, ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ–ఢిల్లీ–మూడోస్థానం పొందగా హెచ్సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. స్టాఫ్ విత్ పీహెచ్డీ కేటగిరీలో బెస్ట్ స్కోర్ ఇండికేటర్ను హెచ్సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్లో ముఖ్యంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్స్లో 26.9 పాయింట్లు, సిటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ 40.5, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3.4, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్ రెప్యూటేషన్ 5.3, అకాడమిక్ రెప్యూటేషన్లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్ను ఖరారు చేశారు. -
కోక్ టిన్లో చిక్కి నాగుపాము విలవిల
రాయదుర్గం: పరిశోధనలకు, పచ్చదనానికే కాదు పాములకు సంరక్షణ కేంద్రంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మారుతోంది. గచ్చిబౌలిలోని హెచ్సీయూ క్యాంపస్ రెండువేలకు పైగా ఎకరాల సువిశాల స్థలంలో కొనసాగుతోంది. ఇందులో సగం భూభాగం వరకు అటవీ ప్రాంతంగా ఉంది. ఇందులో çసహజసిద్ధమైన భారీ బండరాళ్లు, చెట్లు, పచ్చదనం, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలున్నాయి. దీంతో దేశంలో కొన్ని అరుదైన పాములు తప్ప మిగతా అన్ని రకాల పాములు ఇక్కడ ఉన్నట్లు పలువురు పేర్కొంటారు. ఇందులో కొన్ని ఇప్పటి వరకు కనిపించిన వాటిలో విషసర్పాలు కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పటి వరకు పాము కాటు వేయకపోవడం మరో విశేషం. అప్పుడప్పుడు ఈ పాములు విద్యార్థులుండే వసతిగృహాలు, ప్రధాన, అంతర్గత రోడ్లు, వివిధ కార్యాలయాలవైపు వస్తుంటాయి. అయితే సెక్యూరిటీ విభాగం, వైల్డ్లెన్స్ గ్రూపు ఈ పాముల సంరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కాగా గత ఆరు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక కొండచిలువ తీవ్రంగా కాలి గాయాలపాలుకాగా మరో రెండు పాములు మృత్యవాత పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇక్కడ పాముల్ని చంపరు.. విద్యార్థులకు పలు చోట్ల పాములు అగుపించడం క్యాంపస్లో సర్వసాధారణం. పాము కనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్లెన్స్గ్రూపువారికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే పాములను పట్టే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీవారిని పిలిపించి వాటిని పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంగా ఉండే చోట పాములను వదిలి వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పాములను చంపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవంటేనే వీటి సంరక్షణ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏది ఏమైనా పాము అనగానే సహజంగా అందరూ భయపడిపోతుంటారు. అందులో రకరకాల విష సర్పాలు కూడా ఉండడంతో మరింతగా వీటిని చూడగానే భయపడిపోయే వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో పాములను పట్టేవారిని అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్పిన అవసరం ఉంది. జీవ వైవిధ్యానికి హెచ్సీయూ కేంద్రం హెచ్సీయూ క్యాంపస్ జీవ వైవిధ్యానికి కేంద్రం. అందులో రకరకాల పక్షులు, జంతువులు, పాములు, పచ్చనిచెట్లు ఉన్నాయి. వీటి పరిరక్షణలో హెచ్సీయూ యంత్రాంగం, సెక్యూరిటీ విభాగం చూపించే చొరవ, మా వైల్డ్లెన్స్ తోడ్పాటు నిరంతరంసాగే ప్రక్రియ. రకరకాల పాములు క్యాంపస్లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు చంపలేదు. పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. – డాక్టర్ రవి జిల్లపల్లి,వైల్డ్లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు హెచ్సీయూ కోక్ టిన్లో తల చిక్కి నాగుపాము విలవిల రాయదుర్గం: ఖాళీ కూల్డ్రింక్ టిన్ బాక్సులో ఓ నాగుపాము దూరింది. దీంతో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడగా..హెచ్సీయూ విద్యార్థిని ఒకరు గమనించి ఆ పాముకు విముక్తి కలిగించారు. హెచ్సీయూ క్యాంపస్లో ఉర్దూ డిపార్ట్మెంట్లో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని జునేరా అబ్రార్ గురువారం సాయంత్రం క్యాంపస్లోని వైట్రాక్స్ వైపు నుంచి వెళ్తుండగా పాము తల టిన్లో ఇరుక్కోవడం గమనించారు. వెంటనే వైల్డ్ లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు డాక్టర్ రవి జిల్లపల్లికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. దీంతో మరికొందరు విద్యార్థులతో కలిసి ఆమె పామును రక్షించారు. దాన్ని చెట్ల పొదల్లోకి వదిలేశారు. ఈ సందర్భంగా జునేర్ అబ్రార్ మాట్లాడుతూ క్యాంపస్లో ఎవరూ ఖాళీ బాటిళ్లు, కోక్ టిన్లను బహిరంగంగా పారవేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్స్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్నాడార్ వర్సిటీ, సోనెపట్లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్జీ యూనివర్సిటీ, తేజ్పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు. దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది. -
గో ఫర్ నేచర్
సహజసిద్ధమైన భారీ బండరాళ్లు.. పచ్చదనం.. వృక్ష సంపద.. వివిధ రకాల జంతువులు.. ప్రకృతి అందాల వీక్షణతో స్నేహం, ప్రేమభావన ఏర్పడేలా చేయడమే లక్ష్యంగా ‘ఎక్స్ప్లోరర్స్’ చేస్తున్న కృషి ఫలిస్తోంది. 2018లో ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోరర్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు 20 వరకు కార్యక్రమాలు చేపట్టారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా చేసి సీనియర్, జూనియర్ల మధ్య సఖ్యత, స్నేహభావం పెంపొందించేందుకు ట్రెక్కింగ్, నేచర్వాక్, లేక్ వాక్, రాక్ క్లైంబింగ్ చేస్తూ, ఫొటోగ్రఫీ కోసం ఎక్స్ప్లోరర్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీకెండ్లోనే విద్యార్థులకు అనువైన రోజుల్లో మాత్రమే వర్జిన్రాక్స్, వైట్రాక్స్ ప్రాంతాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ, స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. రాయదుర్గం :హెచ్సీయూలో పచ్చికబయళ్లు అధికంగా ఉన్నాయి. రెండువేలకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న క్యాంపస్లో నాలుగు చెరువులు, వాటి చుట్టూ రాతికొండలు, చిట్టడవి అందులో రకరకాల పక్షులు, జంతువుల తచ్చాడుతూ కంటికి ఇంపుగానే కాకుండా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ప్లోరర్స్ నేచర్వాక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేందుకే.. తెలంగాణ సంస్కృతిని విద్యార్థులకు చూపేందుకే హెచ్సీయూ ఎక్స్ప్లోరర్స్ ఆధ్వర్యంలో సిటీ టూర్ను నిర్వహిస్తున్నారు. నగరంలోని అందాలను తిలకించడం, తెలంగాణ సంస్కృతిపై అవగాహన పెంచేందుకు బోనాల వేడుకల రోజునే ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించారు. క్యాంపస్లోని సౌత్, నార్త్ క్యాంపస్ కాంప్లెక్స్ ప్రాంతంలో సమావేశమై సిటీటూర్కు బయలుదేరు తారు. గత ఏడాది 200 మంది దాకా వెళ్లగా ఈసారి 365 మంది పాల్గొన్నారు. సిటీ టూర్లో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ కోట, బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్దర్వాజా అమ్మవారి దర్శనం, ఆ తర్వాత వేడుకలను తిలకిస్తారు. అనూహ్య స్పందన.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు క్యాంపస్లోని బయోడైవర్సిటీని చూపించడమే ఎక్స్ప్లోరర్స్ లక్ష్యం. గత ఏడాది నుంచి తెలంగాణ కల్చర్ గురించి అందరికీ తెలిపేలా చేయడం కోసం బోనాల సందర్భంగా సిటీ టూర్ పేరిట కార్యక్రమాలు చేపట్టాం. రోజరోజుకూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. – రోహిత్కుమార్ బొందుగుల, హెచ్సీయూ ఎక్స్ప్లోరర్స్ ప్రతినిధి స్నేహ భావన.. వారంలో ఐదురోజుల పాటు నిత్యం కంప్యూటర్లు, పుస్తకాలతో తీరికలేకుండా గడిపే విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ ఎక్స్ప్లోరర్ కార్యక్రమాలు చేస్తున్నాం. సెలవుల్లోనే ఈ కార్యక్రమాలు చేస్తాం. సీనియర్, జూనియర్ అనే భావన పోగొట్టేలా, అంతా కలిసి ఉండేలా, చదువులోనూ, ఇతర అంశాలలో పరస్పరం సహకరించేలా ఉపకరిస్తోంది ఈ కార్యక్రమం. – ఎస్ సాయిదుర్గా రాంప్రసాద్,ఎక్స్ప్లోరర్స్ నిర్వాహకుడు -
బాత్రూమ్లో కిందపడి విద్యార్థిని మృతి
గచ్చిబౌలి :బాత్రూమ్లో కిందపడటంతో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివాసి స్టడీస్లో పీహెచ్డీ చేస్తున్న దీపిక మహాపాత్ర (29) ఎల్హెచ్1 హాస్టల్లోని రూమ్ నెంబర్ 204 లో ఉంటోంది. సోమవారం ఉదయం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన దీపిక కింద పడిపోయింది. శబ్ధం రావడంతో స్నేహితులు అక్కడికి వెళ్లి పిలిచినా స్పందించలేదు. దీంతో బాత్రూం తలుపులు తోసి చూడగా ఆమె కింద పడి ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బంది ఆమెను నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు దీపిక కొంతకాలంగా ఎపిలెప్సీ (మూర్చ) వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ధృవీకరించిన కేస్ షీట్లు లభించినట్లు తెలిపారు. దీనిని బట్టి ఆమె నరాల సంబంధ వ్యాధి కారణంగానే వెనక వైపు పడిపోవడంతో మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మలేరియాకు సరికొత్త విరుగుడు!
హైదరాబాద్: మలేరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి.. అయితే ఇప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ మందులు ఎక్కువగా వాడితే మలేరియా పరాన్నజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. అందుకోసమే ఈ నిరోధకతను కూడా అడ్డుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు చేసి వినూత్నమైన మందును కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం వైవాక్స్ వంటి పరాన్నజీవుల్లోని డీఎన్ఏలో మెలికలు తిరిగి ఉన్న పోగులు (డీఎన్ఏ డబుల్ స్ట్రాండ్) విడిపోవడం వల్ల సాధారణంగా అవి మరణిస్తాయి. అయితే ఆ పోగులు విడిపోకుండా ఉండేందుకు ప్రాథమికంగా హోమోలాగస్ రీకాంబినేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆ పోగుల మరమ్మతు చేసుకుంటాయి. ఇక్కడ పీఎఫ్రాడ్ 51 అనే రీకాంబినేజ్ అనే ఎంజైమ్ను ఆ పరాన్నజీవి వాడుకుంటుంది. ఇక్కడే శాస్త్రవేత్తలు తమ దృష్టిని సారించారు. ఈ మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటే పరాన్నజీవుల జీవిత కాలం తగ్గుతుందని, మలేరియా కోసం వాడే మందుల నిరోధకత తగ్గుతుందని భావించారు. ఇందుకోసం బీవో2 అనే ఓ మందును కనిపెట్టారు. ఇది పీఎఫ్రాడ్ 51 ఎంజైమ్ పనిని సమర్థంగా అడ్డుకోగలిగిందని హెచ్సీయూ ప్రొఫెసర్ మృణాల్కంటి భట్టాచార్య వివరించారు. అనేక మందులకు నిరోధకతను పెంచుకున్న ప్లాస్మోడియం జాతికి చెందిన డీడీ2, త్రీడీ7 అనే మరో ప్లాస్మోడియం జాతి పరాన్న జీవుల ఎదుగుదలను పరిశోధన కేంద్రంలోని సంవర్ధనంలో సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. అయితే ఈ మందును తొలుత జంతువులపై ప్రయోగించి, వచ్చిన ఫలితాల ఆధారంగా మానవులపై ప్రయోగించనున్నారు. పరిశోధన బృందంలో ప్రతాప్ వైద్యమ్, దిబ్యేందు దత్తా, నిరంజన్ సంత్రమ్, ప్రొఫెసర్ సునందభట్టాచార్యలు కీలక పాత్ర పోషించారు. -
కెన్నెడీకి కలామ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పురస్కారం 2019వ సంవత్సరానికి గాను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ పి కెన్నెడీ అందుకున్నారు. మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఆయనను ఈ పురస్కారం వరించింది. డాక్టర్ అబ్దుల్ కలామ్ రిసెర్చ్ సెంటర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కెన్నెడీకి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం హెచ్సీయూ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్గా పనిచేస్తున్న కెన్నెడీ.. టెలివిజన్ రంగంలో సుమారు 20 ఏళ్ల పాటు పనిచేశారు. పలు టీవీ చానల్స్ కోసం.. విద్యాసంబంధ కార్యక్రమాలు, రియాలిటీ షోలు, గేమ్ షోలకు ఆయన దర్శకత్వం వహించారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషనల్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్లో నిర్మాతగా కూడా సేవలు అందించారు. ఈ క్రమంలోనే యూజీసీ-సీఈసీకి అనేక విద్యారంగ కార్యక్రమాలను, ఇ- లెర్నింగ్ ప్రోగ్రాములను నిర్మించిన అనుభవాన్ని కెన్నెడీ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని భారతదేశంలోని అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థుల కోసం ఉద్దేశించి రూపొందించబడ్డాయి. ఈ పాఠ్యాంశాల ఆధారిత కార్యక్రమాలు జాతీయ చానల్ డీడీ-1తోపాటు, వ్యాస్ చానల్లో ప్రసారమవుతున్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలు పరిశోధన ప్రతిపాదికన రూపొందించబడినవే కావడం విశేషం. -
హెచ్సీయూలో విద్యార్థులకు షాక్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను బుధవారం నిలిపివేశారు. వేసవి కావడంతో నీటి సమస్య ఉందని దీంతోపాటు సెలవులుండడంతో కొన్ని హాస్టళ్లను మూసివేయాలని చీఫ్ వార్డెన్ వాసుకి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు క్యాంపస్లోని ఎల్హెచ్–8, ఎంహెచ్ ఎల్ అండ్ ఐ హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. వాటిలో ఉండే విద్యార్థులు ఇతర హాస్టళ్లకు మారాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మూడు రోజుల క్రితం కూడా ఇలాగే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయగా విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పునరుద్ధరించారు. ప్రస్తుతం క్యాంపస్లో సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్ పరీక్షల కోసం పలువురు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వీరిని ఇబ్బంది పెట్టకుండా పరీక్షలు అయ్యేంత వరకు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని విద్యార్థి యూనియన్లుడిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే సమాచారం ఇచ్చామని, వేసవిలో సెలవుల దృష్ట్యా కొన్ని హాస్టళ్ల మూసి వాటిలో ఉండేవారికి తెరిచి ఉంచే హాస్టళ్లలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఓబీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బైఠాయింపు హెచ్సీయూ క్యాంపస్లోని చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఓబీసీ ఫెడరేషన్ ముందు ఆ విద్యార్థి సంఘం నాయకులు బైఠాయించారు. అక్కడే కూర్చొని చదువుకోవడం ప్రారంభించారు. సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఓబీసీ ఫెడరేషన్ నాయకులు నినాదాలు చేశారు. నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో ఓబీసీ ఫెడరేషన్ నాయకులు రవికుమార్ యాదవ్, ధీరజ్ సంగోజి, శ్రీరామ్ పట్లోళ్ళ, సాయికుమార్, షేక్ హుస్సేన్, దాసరి అభిలాష్, చిన్మయ సుబుద్ధి, మణిసాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన మరోపక్క చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నిలిపివేసిన విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు నినాదలు చేశారు. ఇందులో ఎస్ఎఫ్ఐ నాయకులు, హాస్టల్ ఎల్అండ్ఐ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్కు 30 ఏళ్ల చరిత్ర ఉందని ఆ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ వినోద్ పావరాల తెలిపారు. ఇండియా టుడే ర్యాంకింగ్లో హెచ్సీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్కు దేశంలోనే మూడో ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి పలు అంశాలు వెల్లడించారు. 1988లో ఆబిడ్స్లోని గోల్డెన్ «త్రెషోల్డ్లో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ను ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్గా నామకరణం చేశారన్నారు. ఇటీవలే 30 ఏళ్లు పూర్తి కావడం జరిగిందన్నారు. 2002లో గచ్చిబౌలిలోని హెచ్సీయూ క్యాంపస్లోకి మారడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పూర్తిస్థాయి సొంతభవనం ల్యాటరైట్తో రాతితో ఆకట్టుకునేలా భవనాన్ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. సమష్టి కృషితోనే ఈ ర్యాంకింగ్ సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి కోర్సులకు పోటీ ఎక్కువ... ప్రారంభంలో మా డిపార్ట్మెంట్లో మాస్టర్ డిగ్రీలో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే తీసుకొనేవాళ్లం. ప్రస్తుతం 40 మందిని వరకూ తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ కూడా 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి రిజర్వు చేశారని, మిగతా 50 శాతం ఓపెన్లో ఉంటాయన్నారు. ఈ ఏడాది నుంచి 10 సీట్లు ఈబీసీలకు కేటాయించామన్నారు. కానీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ప్రస్తుత ఏడాది నాలుగు సీట్లు (44) సీట్లు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది మరో ఆరు సీట్లు పెంచి మొత్తం 50 సీట్లుగా మారుస్తామన్నారు. ప్రస్తుత ఏడాది 40 సీట్లకు 900 పైచిలుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రవేశపరీక్ష నిర్వహించి అందులో 1:4 కింద ఇంటర్వ్యూకు పిలిచి 40 మందిని ఎంపిక చేస్తామన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ఉన్న నాలుగు పీహెచ్డీ కోర్సులకు 160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నార చెప్పారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిని వారిలో 1:4 కింద ఇంటర్వ్యూకు ఎంపిక చేసి అందులో నలుగురికి పీహెచ్డీలో సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదట్లో టెలివిజన్ ప్రొడక్షన్ కోర్సును ప్రారంభించామని, ఆతర్వాత ప్రింట్ జర్నలిజమ్/న్యూ మీడియా, కమ్యూనికేషన్ మీడియా స్టడీ వంటి కోర్సులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడి కోర్సులు పూర్తి చేసినవారికి స్థానిక, జాతీయ స్థాయి చానళ్ళు, పేపర్లు, ఇతర వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కోర్సులకు ప్రాధాన్యత పెరగడంతోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. పూర్తి స్థాయి మౌలిక వసతులు హెచ్సీయూలోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి మౌలిక వసతులున్నాయన్నారు. టీవీ స్టూడియో, కమ్యూనిటీ రేడియోస్టేషన్ ‘బోల్ హైదరాబాద్’, మల్టీ మీడియా ల్యాబ్ ఉన్నాయని, ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ఫ్యాకల్టీ ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి తరగతులు నిర్వహించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 11 మంది ఎంతో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ప్రతినిధులున్నారన్నారు. బోల్ హైదరాబాద్ 90.4 ఎఫ్ఎం రేడియో హెచ్సీయూ క్యాంపస్కు చుట్టూరా 15 నుంచి 20 కి.మీ. దూరం వరకు వస్తుందన్నారు. -
హెచ్సీయూకు 11వ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల జాబితాలో తెలంగాణ వర్సిటీల పంట పండింది. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల ర్యాంకులు గతేడాది కంటే ఈసారి మెరుగయ్యాయి. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు 2016 నుంచి కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) బోధన, వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ – 2019 ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ ర్యాంకును సాధించింది. మన రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు కూడా ర్యాంకులజాబితాలో స్థానం దక్కింది. సోమవారం ఢిల్లీలో ఈ ర్యాంకులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ రీసోర్సెస్, రీసర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్కమ్, ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్సెప్షన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంహెచ్ఆర్డీ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్లో 83.88 పాయింట్లతో ఐఐటీ మద్రాసు మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్థానంలో నిలించింది. ఇందులో ఉన్నత విద్యాసంస్థలకు ఓవరాల్ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో, యూనివర్సిటీల విభాగంలో, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, లా, ఆర్కిటెక్చర్, మెడికల్ కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో 4 విద్యాసంస్థలు ఓవరాల్ కేటగిరీలో టాప్–100లో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలు ర్యాంకులను సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో (ఓవరాల్గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 61.85 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 11వ స్థానమే లభించింది. గతేడాది 56.92 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఐఐటీ ఈసారి కూడా 26వ స్థానంలో నిలువడం గమనార్హం. 2017–18లో 45వ ర్యాంకు సాధించిన ఉస్మానియా వర్సిటీ ఈసారి తమ ర్యాంకును మెరుగు పరుచుకుంది. 49.86 పాయింట్లతో 43వ ర్యాంకును సాధించింది. ఇక 46.06 పాయింట్లతో వరంగల్ ఎన్ఐటీ ఈసారి 61వ ర్యాంకును సంపాదించింది. గతేడాది వరంగల్ నిట్ 78వ స్థానంలో నిలిచింది. ఇక 101–150 ర్యాంకుల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. 151–200 జాబితాలో.. ఇఫ్లూతోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. ఇంజనీరింగ్ కేటగిరీలో.. ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్కు 8వ స్థానం, వరంగల్ ఎన్ఐటీకి 26వ స్థానం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 39వ స్థానం, హైదరాబాద్– జేఎన్టీయూకు 45వ స్థానం, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్కు 83వ స్థానం లభించింది. వీటితోపాటు 101–150, 151–200 స్థానాల్లో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు 6వ స్థానం లభించింది. దాంతోపాటు పలు ప్రైవేటు కాలేజీలకు ర్యాంకుల లభించాయి. డిగ్రీ కాలేజీల విభాగంలో పలు ప్రైవేటు కాలేజీలు ర్యాంకులు సాధించాయి. వర్సిటీల ర్యాంకింగ్లో.. యూనివర్సిటీల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగవ ర్యాంకు లభించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 26వ స్థానం లభించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 79వ స్థానం, హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 82వ స్థానం లబించింది. 101–150వ స్థానంలో ఇఫ్లూ, 151–200వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలు ఉన్నాయి. -
గిరిజన వర్సిటీ ప్రవేశాలు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఈ ఏడాది కూడా అందుబాటులోకి వచ్చేలా లేదు. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సూచనలు సైతం చేశారు. నిర్దేశిత యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాలి. ఈక్రమంలో హెచ్సీయూ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా గిరిజన యూనివర్సిటీ ప్రవేశాలు జరుగుతాయని భావించారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇందులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. స్థలం కేటాయింపు... భవనాల అప్పగింత గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పటికే మెజార్టీ భూమిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. తక్షణమే తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా యూత్ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించిన భవనాన్ని వర్సిటీకి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించింది. దీంతో ఇప్పటికిప్పుడు తరగతులు మొదలుపెట్టే వీలుంది. అయితే డిగ్రీ, పీజీ కేటగిరీల్లో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశాలు, బోధన తదితర బాధ్యతలన్నీ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి అప్పగించింది. అయితే, ఇప్పటికీ గిరిజన వర్సిటీ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు నోటిఫికేషన్లు జారీ చేయగా, చాలావాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముంచుకొస్తోంది. గిరిజన యూనివర్సిటీ ప్రవేశ బాధ్యతలు ప్రభుత్వం హెచ్సీయూకు అప్పగించిన నేపథ్యంలో హెచ్సీయూ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయని అంతా భావించారు. ఇటీవల హెచ్సీయూ నోటిఫికేషన్లో గిరిజన వర్సిటీ ప్రవేశాల సమాచారం లేకపోవడంతో ఈ ఏడాది కూడా గిరిజన వర్సిటీ అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు కోర్సులకు అవకాశం ఉన్నా... 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే తొలుత ఆరు కోర్సులను ప్రారంభించాలి. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ (హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, పీజీ కేటగిరీలో ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. తొలిఏడాది ప్రారం భించే కోర్సుల్లో మొత్తంగా 180 మందికి ప్రవేశా లు కల్పిస్తారు. ఏటా తరగతులు పెరుగుతూ, కొత్త కోర్సుల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30 శాతం సీట్లు వారికి కేటాయించనుంది. కానీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లే విడుదల కాకపోవడంతో గందరగోళం నెలకొంది. -
దద్దరిల్లిన హెచ్సీయూ
రాయదుర్గం: విద్యార్థుల ఆందోళనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దద్దరిల్లింది. హెచ్సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన న్యూలైఫ్ సైన్సెస్ భవనం ఎదుట పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేడెడ్ అటానమీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజుల పెంపు, ఇతర ఆర్థిక అంశాలను గతంలో మాదిరిగా అకడమిక్ కౌన్సిల్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు చేయాలని ఫైనాన్షియల్ కమిటీ నిర్ణయాలు చేయరాదన్నారు. ఈ సందర్భంగా హెచ్సీయూ సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది, గచ్చిబౌలి పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, వారికి మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ హెచ్సీయూ శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం సాగింది. ఎస్ఎఫ్ఐ హెచ్సీయూ శాఖ కార్యదర్శి అభిషేక్ నందన్ మాట్లాడుతూ.. పెంచిన ఫీజు లను వెంటనే తగ్గించాలని, గ్రేడెడ్ అటానమీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా డీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హెచ్సీయూలో ఆందోళన చేశారు. గ్రేడెడ్ అటానమీ ఐడియాను రద్దు చేయాలని, ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. నిరసన తెలిపిన ఓబీసీ ఫెడరేషన్ హెచ్సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే భవనం ఎదుట ఓబీసీ ఫెడరేషన్ (ఓబీసీఎఫ్) నిరసన తెలిపింది. తెలుగు ఎంఫిల్ కోర్సును పునరుద్దరించాలని, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రారంభించాలని, ఎంపీహెచ్, ఎంబీఏ, ఎంటెక్ కోర్సులకు డెవలప్మెంట్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థులకు అడ్మిషన్, సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సమయంలో ఫీజు మాఫీ చేయాలని, రూమ్రెంట్, మెస్ డిపాజిట్లను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ ఫెడరేషన్ నాయకులు రవికుమార్యాదవ్ పలువురు ఓబీసీ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమ్మో చిరుత!
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో చిరుత ఉందని మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి క్యాంపస్లోని గోప్స్ ప్రాంతంలో గేదె మృతి చెంది ఉండడంతో, దాన్ని చిరుతే చంపిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం ఉదయం వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్లెన్స్ బృందం గమనించి, కుక్కలే దాడి చేసి ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే గేదె ముఖం భాగంలో గాయాలుండడం, భారీ రక్తస్రావం కావడంతో పలువురు చిరుతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గేదె మరణించిన ప్రదేశానికి సమీపంలోని బురదలో కాలి గుర్తులు పడ్డాయి. అవి చిరుతవని పలువురు అనుమానిస్తుండగా, కాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. నమ్మొద్దు... క్యాంపస్లోకి చిరుత ప్రవేశించిందని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్లైన్ బృందం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గమనించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో చిరుత క్యాంపస్లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. వదంతులను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు. వేటగాళ్ల బెడద... హెచ్సీయూ క్యాంపస్లో కుక్కల బెడదను తీర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్యాయంగా మూగజీవాలు బలవుతున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేటగాళ్లు తరచూ క్యాంపస్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి చొరబడి జంతువులను వేటాడుతున్నారని పేర్కొంటున్నారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
హెచ్సీయూలో చిరుత?
రాయదుర్గం: నగర శివారులో కనిపించిన చిరుత గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్లోకి వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1:30గంటలకు ఎల్హెచ్–6 ప్రాంతంలో చిరుత కుక్కను వెంబడించగా తాను చూశానని హెచ్సీయూ సెక్యూరిటీ గార్డు పేర్కొనడంతో అందరూ అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు, వైల్డ్లెన్స్ బృందం, సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు చిరుతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. నగర శివారు యాచారం కొత్తపల్లి ప్రాంతంలో సంచరించిన చిరుతే వ్యవసాయ విశ్వవిద్యాలయం, హెచ్సీయూ క్యాంపస్లోకి వచ్చినట్లుగా పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు చేపట్టగా ఆధారాలు దొరకలేదు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని వర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లేదంటున్న అధికారులు... ⇔ కుక్కను చిరుత వెంబడిస్తే దాన్ని చంపేంత వరకు వదలదని, కానీ 24గంటలు గడిచినా కుక్క మృతదేహం ఎక్కడా కనిపించ లేదని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం రక్తపు మరకలు కూడా ఎక్కడా లేవంటున్నారు. ⇔ ఇటీవల క్యాంపస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా... జింకపిల్ల, రెండు పాములు, ఒక ఎలుక మరణించాయి. అయితే జింక పిల్ల తల కొరికేసినట్లుగా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ చిరుత ఉంటే? అది జింకను కొరికిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జింక అగ్నిప్రమాదంలోనే మరణించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ చిరుత ఉన్నట్లయితే ఈ 11రోజుల వ్యవధిలో క్యాంపస్లో ఎక్కడో ఓ చోట కనిపించేదంటున్నారు. చిరుత లేదు కాబట్టే ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు. ఉంటే రావాల్సిందే.. ఒకవేళ చిరుత క్యాంపస్లో పరిధిలో ఉంటే నీటి కోసం తప్పనిసరిగా చెరువుల వద్దకు రావాల్సిందే. క్యాంపస్ పరిధిలో నాలుగు లేక్స్ (పికాక్ లేక్, బఫెలో లేక్, మార్మేడ్ లేక్, మరొకటి) ఉన్నాయి. క్యాంపస్లో సుమారు 500 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో అనే రకాల జంతువులు ఉన్నాయి. అవన్నీ ఈ లేక్స్ దగ్గరే నీళ్లు తాగుతాయి. చిరుత కూడా నీటి కోసం వీటి దగ్గరికి రావాల్సిందే. ఈ నేపథ్యంలో గాలింపు బృందాలు వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఒకచోట అడుగు గుర్తులు కనిపించినా, అవి చిరుతవి కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ... కొన్నేళ్ల క్రితం హెచ్సీయూ క్యాంపస్కు 11కిలోమీటర్ల దూరంలోని పటాన్చెరులోని ఇక్రిశాట్లో, బంజారాహిల్స్లోనూ చిరుత కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడా చిరుత ఆనవాళ్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ పుకార్లు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ చిరుత రాత్రి వేళల్లోనూ సంచరిస్తుంటుందని, ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్తుంటుందని పేర్కొంటున్నారు. చెట్లు, ప్రహరీలను సులభంగా ఎక్కేస్తుందంటున్నారు. కెమెరాల ఏర్పాటు... చిరుత రాత్రి వేళల్లోనే ఎక్కువగా సంచరిస్తుందని, అందుకోసం క్యాంపస్ అటవీ ప్రాంతంలో ట్య్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అటవీ ప్రాంతం, లేక్స్ ప్రదేశాల్లో వీటిని అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విద్యార్థులంతా అలర్ట్గా ఉండాలని.. గ్రీన్జోన్, రాక్జోన్, లేక్స్ వైపు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. -
సినీరంగంలోకి రమ్మని నేనెవరికీ సలహా ఇవ్వను..
రాయదుర్గం: సినీరంగంలోకి రమ్మని, చేరమని తాను ఎవరికీ సలహా ఇవ్వనని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. హెచ్సీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సరోజినినాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో శుక్రవారం డాక్టర్ సి.వి.ఎస్.శర్మ మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ‘దక్షిణాది చిత్రాల పోకడ– వస్తున్న మార్పులు’ అనే అంశంపై ప్రసంగించారు. ఆ వివరాలు శేఖర్ మాటల్లోనే... ‘సినీ రంగంలో సక్సెస్ రేటు కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుంది. అందుకే భవిష్యత్తును ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దృఢ నమ్మకం, విజయం సాధిస్తామనే భావన ఉం టేనే ఇటువైపు రావాలి. నా జీవితంలో అదనంగా ప్రమోషన్ వర్క్స్కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’ అనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం, విజయవాడ నుంచి విద్యార్థులు, శేఖర్ కమ్ముల అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి చిత్రపరిశ్రమలో పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
హెచ్సీయూలో విద్యార్థి ఆత్మహత్య
-
హెచ్సీయూలో ఉత్తరాఖండ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఉత్తరాఖండ్కు చెందిన రజనీశ్ పర్మార్(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 17న వర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంగ్లిష్ ఫస్టియర్లో అడ్మిషన్ తీసుకున్న రజనీశ్.. ఐ హాస్టల్లోని రూం నంబర్ 25లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడు మనోజ్ ఆ గదికి వెళ్లగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు రజనీశ్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే మనోజ్ యూనివర్సిటీ అధికారులకు, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీశ్ రెండ్రోజుల క్రితమే తన అడ్మిషన్ రద్దు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. హాస్టల్ ఖాళీ చేస్తున్నట్టు వార్డెన్కు బుధవారం లేఖ కూడా రాసినట్టు వివరించారు. అడ్మిషన్ ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలియాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ గంగాధర్ తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నెగెటివ్ థాట్స్తోనే.. నెగెటివ్ థాట్స్తోనే రజనీశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బెనారస్ యూనివర్సిటీలో అతడితో కలిసి చదువుకున్న మనోజ్ పోలీసులకు తెలిపారు. బెనారస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఓ నవల చదివేవాడని అప్పట్నుంచి నెగెటివ్గా ఆలోచిస్తున్నాడని ఆయన తెలిపారు. వ్యతిరేక ఆలోచనలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
హెచ్సీయూలో ఉత్తరాఖండ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఉత్తరాఖండ్కు చెందిన రజనీశ్ పర్మార్(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 17న వర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంగ్లిష్ ఫస్టియర్లో అడ్మిషన్ తీసుకున్న రజనీశ్.. ఐ హాస్టల్లోని రూం నంబర్ 25లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడు మనోజ్ ఆ గదికి వెళ్లగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు రజనీశ్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే మనోజ్ యూనివర్సిటీ అధికారులకు, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీశ్ రెండ్రోజుల క్రితమే తన అడ్మిషన్ రద్దు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. హాస్టల్ ఖాళీ చేస్తున్నట్టు వార్డెన్కు బుధవారం లేఖ కూడా రాసినట్టు వివరించారు. అడ్మిషన్ ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలియాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ గంగాధర్ తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నెగెటివ్ థాట్స్తోనే.. నెగెటివ్ థాట్స్తోనే రజనీశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బెనారస్ యూనివర్సిటీలో అతడితో కలిసి చదువుకున్న మనోజ్ పోలీసులకు తెలిపారు. బెనారస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఓ నవల చదివేవాడని అప్పట్నుంచి నెగెటివ్గా ఆలోచిస్తున్నాడని ఆయన తెలిపారు. వ్యతిరేక ఆలోచనలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
హెచ్సీయూ చాన్స్లర్గా జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) చాన్స్లర్గా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. హెచ్సీయూ విజిటర్గా పదవి రీత్యా కొనసాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్సిటీ చాన్స్లర్ను నియమించారు. ఇప్పటివరకు చాన్స్లర్గా ఉన్న డాక్టర్ సి.రంగరాజన్ స్థానంలో నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా డిగ్రీలను పొందారు. -
రాజకీయ లబ్ధి కోసమే వాగ్ధానం: రాధిక వేముల
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే తనకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు తప్పుడు వాగ్ధానం చేశారని రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. దీనిపై రాధిక సోమవారం కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్ధి వేముల రోహిత్ 2016లో యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత కేరళ నుంచి ముస్లిం లీగ్ తరుపున కొంత మంది నాయకులు వచ్చి రోహిత్కు మద్దతుగా కేరళలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు ముఖ్య అతిధిగా తనను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. వేముల కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందిగా గుర్తించిన ముస్లిం లీగ్ నాయకులు విజయవాడలో ఇంటి నిర్మాణం కోసం ఇరవైలక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ మీటింగ్లో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికి వరకు రెండు చెక్కులు పంపారని అవి రెండు బౌన్స్ అయినట్లు ఆమె వెల్లడించారు. విజయవాడ, గుంటూరు మధ్య ఇంటి నిర్మాణం కోసం స్థలం కూడా చూపించారని అన్నారు. దీనిపై రాధిక తీవ్రంగా మండిపడ్డారు. చెక్కు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇలా తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండాలని, కేవలం రాజకీయం లబ్ధి కోసమే తనకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్పై స్పందించిన ముస్లిం లీగ్ సభ్యులు పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. -
గజగిరిగుట్టలో రాతి మనిషి గుట్టు!
సాక్షి, హైదరాబాద్: 4,000 ఏళ్ల క్రితం రాతియుగం మనిషి ఏం తిన్నాడు? చిరుధాన్యాలు వాటంతటవే పెరిగాయా.. సాగు చేసేవారా..? వరి సాగు ఎప్పుడు మొదలైంది? అసలు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇలాంటి ఆసక్తికర విషయాల నిగ్గు తేల్చే అన్వే షణ ఇప్పటివరకు దక్షిణ భారతంలో జరగలేదు. వేల ఏళ్ల నాటి మానవ అవశేషాల ఆధారంగా కొన్ని అం శాలు తెలుసుకున్నా ఆ నాటి పర్యావరణం, జీవ జాలం, ఉపద్రవాలపై పక్కా ఆధారాలు సేకరించే అధ్యయనాలు చేయలేదు. కానీ తొలిసారి హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ (హెచ్సీయూ) ఇందుకు నడుం బిగించింది. ఆది మానవుల మనుగడలో కొత్త కోణాలు ఆవిష్కరించే బృహత్ అన్వేషణను మొదలు పెట్టింది. తవ్వకాల్లో సేకరించే ఆధారాల విశ్లేషణకు లండన్ వర్సిటీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది. వేల ఏళ్ల నాటి ధాన్యపు గింజలు, పుప్పొడి, మానవులు, జంతువుల అవశేషాల ఆధారంగా ఆహారపు అలవాట్లు, మనుగడ, జీవజాలాన్ని చెల్లాచెదురు చేసిన ప్రకృతి విపత్తులు.. ఇలా అన్ని అంశాలను పరిశోధించబోతోంది. ఇందుకు జనగామ సమీపంలో కొన్నె, రామచంద్రాపురం శివారులోని గజగిరిగుట్టను ఎంచుకున్నారు. పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లభించడంతో హెచ్సీయూ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో వర్సిటీ పరిశోధక విద్యార్థుల బృందం శనివారం ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది. ఈ గుట్టపై వేల ఏళ్లనాటి మానవ ఆవాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద దాన్ని రూఢీ చేసే ఆధారాలు గతంలో లభ్యమయ్యాయి. బూడిదగుట్టగా మారిన ప్రాంతంపై గతంలో ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రాథమిక అధ్యయనంలో.. తొలి చారిత్రక యుగం, బృహత్ శిలాయుగం, కొత్తరాతియుగాలకు చెందిన ఆవాసా లు అక్కడ ఉన్నట్లు తేలింది. అక్కడి భూమిలోని ఒక్కో పొర ఒక్కో కాలం ఆధారాలు అందించే అవకాశం ఉండటంతో అధ్యయనానికి ఈ ప్రాం తమే అనువైనదని హెచ్సీయూ గుర్తించింది. గతంలో ఓ సదస్సులో లండన్ వర్సిటీ చరిత్ర విభాగాధిపతి డోరియన్ ఫుల్లర్తో ప్రొఫెసర్ పుల్లారావు భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ అన్వేషణలో సేకరించిన నమూనాలను ఆ వర్సిటీ ల్యాబ్లలో ఆధునిక పద్ధతుల్లో విశ్లేషించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలా విశ్లేషిస్తారు..? సాధారణంగా ధాన్యం గింజపై చిన్న బొడిపె ఉంటుంది. మొక్కతో గింజను అనుసంధానించేది ఈ బొడిపే. మట్టి పొరల్లో ఆ బొడిపె తాలూకు అవశేషాలు, పుష్పాల పుప్పొడి అవశేషాలు సేకరిస్తారు. వీటిలో చాలా అవశేషాలు కంటికి కనిపించవు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే విశ్లేషించగలుగుతారు. అలాగే ‘యాక్సలేటర్ మాస్ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్)’విధానాన్నీ అనుసరించనున్నారు. ఇందుకు లండన్ వర్సిటీ సహకరించనుంది. -
వర్సిటీలపై మావోల గురి
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ బలహీనమవుతున్న మావోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందా? అందులో భాగంగా విద్యార్థులను ఆకర్షించడంపై దృష్టి సారించిందా? రాష్ట్ర యూనివర్సిటీల్లోని విద్యార్థులను మావోయిస్టు పార్టీలో చేర్చే బాధ్యతను తెలంగాణ కమిటీ తీసుకుందా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేడర్ను పెంచుకోవడం, సాంకేతికంగా బలపడటం కోసం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే టార్గెట్గా వ్యూహాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను చేర్చుకోవడంపై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టిందన్న విషయం కలవరపెడుతోందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వర్సిటీల్లో.. మావోయిస్టు పార్టీ భావజాలంతో పనిచేస్తున్న పలు సంఘాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం నిషేధిత జాబితాలో చేర్చింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్, సింగరేణి కార్మిక సంఘం, ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్, రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సంఘం, రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ వంటివి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించాయని పేర్కొంటూ ఈ నిషేధం విధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ సంఘాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే రాష్టం ఏర్పాటైన మరుసటి ఏడాది 2015లో కొంత మంది యూనివర్సిటీల విద్యార్థులు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో మావోయిస్టులు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. దాంతో కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చాయి. అయినా కాకతీయ, ఉస్మానియా వర్సిటీలకు చెందిన సుమారు 24 మంది విద్యార్థులు మావోయిస్టు పార్టీలో చేరినట్టు ఎస్ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు స్పష్టం చేశాయి. అలా వెళ్లిన వారిలో సూర్యాపేటకు చెందిన వివేక్, వరంగల్కు చెందిన శృతి ఇద్దరూ ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఇప్పుడు హెచ్సీయూపై దృష్టి! రాష్ట్రంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి రిక్రూట్మెంట్ విషయంలో మావోయిస్టు పార్టీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దాంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కీలక విద్యార్థి నేతలను తాజాగా టార్గెట్ చేసుకుంది. ఇప్పటికే మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు విద్యార్థులను రిక్రూట్ చేసుకునే దిశగా మానసికంగా సిద్ధం చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే సమయంలో హెచ్సీయూకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీరాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన చందన్ మిశ్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్సీయూ వీసీని చంపేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మిశ్రాతో దేశవ్యాప్తంగా..! బెంగాల్కు చెందిన చందన్ మిశ్రా వ్యవహారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మిశ్రా ఓ కొరియర్ ద్వారా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ను ఈ ఏడాది జనవరిలో కలిశారని.. మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపాడని వెల్లడవడం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న పశ్చిమ బెంగాల్కు చెందిన చందన్ మిశ్రా.. పంజాబ్లోని తన స్నేహితుడు, వ్యవసాయ సంఘం నేత అమూల్సింగ్ను సైతం కలసి మావోయిస్టు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలియడం సంచలనంగా మారింది. హరిభూషణ్ను కలసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ విద్యార్థులను మావోయిస్టు పార్టీ కోసం పనిచేసేలా కృషి చేసేందుకు మిశ్రా ఆసక్తి చూపారని వెల్లడికావడం చర్చనీయాంశంగా మారింది. హెచ్సీయూ వీసీని హతమార్చిన తర్వాత మిశ్రాకు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవి ఇస్తానని హరిభూషణ్ చెప్పినట్టు తెలిసింది. దాంతో మిశ్రా దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో, మావోయిస్టు భావజాలంతో ఉన్న విద్యార్థులను, విద్యార్థి నేతలను ఏకం చేసేందుకు కార్యచరణ రూపొందించుకున్నట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా గతంలోలా వర్సిటీల్లో రాడికల్ విద్యార్థి విభాగాలను ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పేరుతో నడిపించేందుకు హరిభూషణ్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల యూనివర్సిటీల్లో పట్టుతోపాటు కేడర్పరంగా అర్బన్ ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ కమిటీలను సృష్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. అరెస్టులు కుట్రపూరితమంటున్న విరసం వీసీ హత్యకు కుట్రపన్నారంటూ పృథ్వీరాజ్, చందన్మిశ్రాలను పోలీసులు చేసినా.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలేవీ వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) సైతం పోలీసుల ఆరోపణలను ఖండిస్తోంది. పృథ్వీరాజ్, చందన్మిశ్రాలను నాలుగు రోజుల క్రితం విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని... వీసీ హత్య కుట్ర పేరిట విశ్వవిద్యాలయాల్లో మరింత నిర్బంధ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంటోంది. హెచ్సీయూ వీసీ అప్పారావుకు భద్రత పెంపు మావోయిస్టులు హెచ్సీయూ వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు హత్యకు కుట్రపన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. రోహిత్ వేముల ఘటన అనంతరమే రాష్ట్రం ప్రభుత్వం ఆయనకు ఇద్దరు గన్మన్లను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్సీయూలో వీసీ కార్యాలయం, అధికారిక నివాసాల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని పెంచారు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ లోనికి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. -
ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ(హెచ్సీయూ) విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దుండగులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం యూనివర్సీటీకి చెందిన ఓ యువతి ప్రవీణ్ అనే తన స్నేహితునితో కలిసి నల్లగండ్ల లేక్ వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు దుండగులు వీరిద్దరిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. అనంతరం ఆ నలుగురు యువతిపై లైంగికదాడికి యత్నించారు. ఆమె తన స్నేహితుడు ప్రవీణ్ సాయంతో దుండగుల నుంచి తప్పించుకొని బయటపడింది. అనంతరం యూనివర్సిటీ మిత్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఈ మేరకు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ సాయంతో దుండగులని పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. అయితే ఆ నలుగురు మైనర్లు కావడం గమనార్హం. వారిలో ఇద్దరు పాత నేరస్తులేనని డీసీపీ పేర్కొన్నారు. -
హెచ్సీయూ చెరువులో అరుదైన బ్యాక్టీరియా
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని బఫెల్లో చెరువులో అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. రెండేళ్లుగా వర్సిటీలోని ప్లాంట్ సైన్సెస్ ల్యాబ్లో ప్లాంట్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సీహెచ్ వెంకటరమణ చేస్తున్న పరిశోధనల్లో దీనిని కనుగొనడం విశేషం. దీనికి ‘ప్లాంటోపైరస్’అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. అరుదైన యాంటీ బయాటిక్ను ఉత్పత్తి చేసే ఇలాంటి బ్యాక్టీరియాను కనుగొనడం దేశంలోనే మొదటిçసారని వెల్లడించారు. ఈ యాంటీ బయాటిక్ ద్వారా ప్లాంటోమైసిటీని ఉత్పత్తి చేసి నూతన ఔషధాల తయారీకి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా పరిశ్రమల్లోని అమోనియా వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అరుదైన బ్యాక్టీరియాను వర్సిటీ చెరువులో కనుగొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీన్ని పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
దేశంలోనే అత్యుత్తమమైన ‘బయోనెస్ట్’
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ‘బయోనెస్ట్’పేరిట ఏర్పాటు చేసిన బయో–ఇంక్యుబేటర్ దేశంలోనే అత్యుత్తమమైందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని హెచ్సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద బయో–ఇంక్యుబేటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దేశంలో అత్యుత్తమమైన 5 బయో ఇంక్యుబేటర్లను పరిశీలించానని, కానీ ఇంత అత్యాధునిక సౌకర్యాలు, విశాల స్థలం కలిగి ఉన్నది మరెక్కడాలేదన్నారు. తాను 5 వేల పరిశోధక ప్రతిపాదనలను చేశానని, అందులో 700 ప్రతిపాదనలు 500 పరిశ్రమల్లో ఆపరేషన్ అవుతున్నాయని చెప్పారు. ఇవన్నీ 100 ప్రొడక్టులుంటాయని, అందులో 50 వ్యాపారాత్మకమైనవని గుర్తుచేశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో 1,000 రీసెర్చ్ లేబరేటరీస్ ఉన్నాయని, వాటిల్లో ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించి స్టార్టప్లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. మహిళా పరిశోధక విద్యార్థులు స్టార్టప్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలని సూచించారు. 30 స్టార్టప్లకు అవకాశం.. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బయో–ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేశామని హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె, ప్లాంట్ సైన్సెస్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పి.రెడ్డన్న వెల్లడించారు. దీనిలో 30 వరకు స్టార్టప్లకు అవకాశం ఉంటుందని.. 350కి పైగా పీహెచ్డీ స్కాలర్ విద్యార్థులు, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో న్యూయార్క్ మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈసీటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.ప్రేమ్కుమార్రెడ్డి, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ బి.సెంథిల్ కుమరన్ తదితరులు పాల్గొన్నారు. -
శివార్ల అభివృద్ధికే రేడియల్ రోడ్లు
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు రేడియల్ రోడ్లకు శ్రీకారం చుట్టినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హెచ్సీయూ డిపో నుంచి వట్టినాగులపల్లి వరకు రూ. 152 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు పనులకు శేరిలింగంపల్లి నల్లగండ్ల హుడాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పి.మహేందర్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్లతో కలసి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. 35 రేడియల్ రోడ్లకు గాను ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 17 రేడియల్ రోడ్ల పనులు పూర్తయ్యాయని, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. రేడియల్ రోడ్లతో నల్లగండ్ల, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల వారికి ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. మిగిలిన 14 రేడియల్ రోడ్లనూ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. మహానగరంలో ఐటీ సంస్థలు, కొత్త తరం నాలెడ్జ్ ఇండస్ట్రీస్ వెస్ట్జోన్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలోనే వస్తున్నాయన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందన్నారు. మౌలిక వసతులు, రేడియల్, గ్రిడ్ రోడ్లతో ఐటీ, ఇతర సంస్థలు నగరానికి నాలుగువైపులా విస్తరించే అవకాశం ఉందని.. అందుకోసం ప్రభుత్వం ప్ర«ణాళికలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఓఆర్ఆర్తో పాటుగా రీజినల్ రింగ్ రోడ్డును 350 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్కు మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)కు స్పష్టమైన ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తద్వారా ఓఆర్ఆర్కు ఇరువైపులా కిలోమీటర్ చొప్పన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే రెండు కిలోమీటర్లకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, డ్రైనేజీ తదితర సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే కొత్తగా రాబోతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ, దండుమల్కాపూర్ వద్ద తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కొత్తగా 350 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పార్కు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎస్ఆర్డీపీ ఫలాలు 2018లో వస్తాయన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరినట్టుగా నల్లగండ్ల నుంచి నేరుగా శేరిలింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ వరకు అర కిలోమీటర్ మేర కొత్త రోడ్డు అవకాశాలను పరిశీలించి మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ హరిచందనను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
అయ్యో అనన్య.. ఎంత ఘోరం!
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): అతి వేగం ఓ విద్యార్థిని ప్రాణాలు బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసి విందు కోసం వెళుతుండగా.. కారు అదుపు తప్పింది. డివైడర్ను దాటి 50 మీటర్ల వరకూ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ మండలం బుర్జుగడ్డ తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ప్రమాదానికి అతివేగంతోపాటు తాగి నడపడం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన అనన్య గోయల్(21) హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు నేపాల్ వాసి నిఖిత స్నేహితురాలు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఎంబీఏ చదివేటప్పటి నుంచి వీరిద్దరూ ఒకే రూమ్లో ఉండేవారు. జోధ్పూర్ వాసి జతిన్ పవార్ వీరితో కలసి ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం నిఖిత హైదరాబాద్లోనే ఉద్యోగాన్వేషణలో ఉంది. జతిన్ కొండాపూర్లోని కేపీఎంజీ కంపెనీలో ఇన్కంట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. డివైడర్పై నుంచి పల్టీలు కొట్టి.. సోమవారం జతిన్ పుట్టిన రోజు కావడంతో కొండాపూర్లో స్నేహితులతో కలసి కేక్ కట్ చేశారు. అక్కడికి అనన్య, నిఖిత వెళ్లారు. కేక్ కటింగ్ అనంతరం విందు కోసం బయలుదేరారు. జతిన్ వీరిద్దరితో కలసి కారులో కొం డాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వచ్చి పెద్ద గోల్కొండ వద్ద జంక్షన్ నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి పీ–వన్ రోడ్డు మార్గంలో పాల్మాకుల వైపు వెళ్తున్నారు. బుర్జుగడ్డ తండా సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్పై నుంచి పల్టీలు కొడుతూ కుడి వైపు ఉన్న రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న అనన్య తలకు బలమైన గాయాలవ్వగా.. నిఖిత, జతిన్ గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు కారు డివైడర్పై నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి రోడ్డు అవతలి వైపు పడింది. ఈ సమయంలో జతిన్ డ్రైవింగ్ చేస్తుండగా.. నిఖిత ముందు సీట్లో కూర్చుంది. వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న అనన్య సీటు బెల్టు ధరించకపోవడంతో కారు బోల్తా పడిన సమయంలో కింద పడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కాగా, కారు నడుపుతున్న జతిన్ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు బయటపడటంతో జతిన్ రక్త నమూనాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో అనన్య.. ఎంత ఘోరం! -
హెచ్సీయూలో మళ్లీ రగడ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో మళ్లీ రగడ మొదలైంది. విద్యార్థులు, వార్డెన్ మధ్య వాగ్వాదం కారణంగా పదిమంది విద్యార్థులను సస్పెండ్ చేయడంపై వర్సిటీ మరోమారు భగ్గుమంది. వైస్చాన్స్లర్ అప్పారావు కావాలనే దళిత, బలహీన వర్గాలు, వామపక్ష విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ మినహా అఖిల పక్షవిద్యార్థి సంఘాలు వెలివాడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలని, యూనివర్సిటీలో అశాంతికి కారకుడైన వీసీని తొలగించాలని నినదించారు. వీసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్కడి నుంచి మెయిన్ గేట్ వద్దకు చేరుకుని సస్పెన్షన్ కాపీలను దహనం చేశారు. పోలీసు క్యాంప్గా మారుస్తున్నారు..: యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు శ్రీరాగ్ మాట్లాడుతూ క్యాంపస్ను పోలీసు క్యాంపుగా మారుస్తున్నారని ఆరోపించారు. సస్పెన్షన్కి గురైన విద్యార్థులు విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోవడమే కాకుండా, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. విద్యార్థులపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు వెంకటేశ్ చౌహాన్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే వీసీ బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజిక ఐక్య కార్యాచరణ కమిటీ జాతీయ నాయకుడు ప్రశాంత్ హెచ్చరించారు. రోహిత్ మరణం తరువాత కూడా అప్పారావు వైఖరిలో మార్పు రాకపోగా, విద్యార్థులను మరింత రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అప్పారావును కాపాడినవారే ఈ ఘటనకు బాధ్యులని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్నా అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఆరిఫ్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ నాయకుడు బషీర్, బీఎస్ఎఫ్ నాయకులు అనిల్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు సుందర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం నిఘా: వర్సిటీలో వందలాది మంది పోలీసులు మోహరించారు. క్యాంపస్లో పదిమంది కలసి ఉండరాదని, ఆందోళనలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని, ప్రతి చర్యను ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు, విద్యార్థులను నిఘానేత్రాల్లో బంధించేందుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు సర్వాధికారాలు ఇస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
విపక్షాన్ని కదిలించే ఒక వీచిక
రెండో మాట వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది. ‘కొంతమంది కుర్రవాళ్లు/పుట్టుకతో వృద్ధులు పేర్లకీ పకీర్లకీ/పుకార్లకీ నిబద్ధులు తాతగారి నాన్నగారి/ భావాలకు దాసులు వీళ్లకి కళలన్నా రసమన్నా చుక్కెదురు! గోలచేసి అరవడమొకటే/వాళ్లెరుగుదురు... కొంతమంది యువకులు/రాబోవు యుగం దూతలు పావన నవజీవన/బృందావన నిర్మాతలు బానిస బంధాలను/తలవంచి అనుకరించరు పోనీ అని అన్యాయపు/ పోకడలు సహించరు వారికి నా ఆహ్వానం/వారికి నా శాల్యూట్! – శ్రీశ్రీ ఈ పంక్తులను ఇక్కడ ఉదహరించడానికి కారణం ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్షాలతో దీపిస్తున్న మూడు సంఘాల ఐక్య సంఘటన మరోసారి ఘన విజయం సాధించింది. కీలకమైన నాలుగు పదవులు ఈ సంఘటనే కైవసం చేసుకుంది. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దుగ్గిరాల శ్రీకృష్ణను (దళిత కుసుమం) ఈ సందర్భంగా ‘ది టెలిగ్రాఫ్’(కోల్కతా) ఇంటర్వ్యూ చేసింది. శ్రీశ్రీ రచనలతో ప్రభావితుడై... ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలు వెలుగుచూశాయి. కారల్మార్క్స్ ‘కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో’లోని విశేషాంశాలకన్నా, మహాకవి శ్రీశ్రీ విప్లవగీతాలే శ్రీకృష్ణను ఎక్కువగా ప్రభావితం చేశాయని ఆ పత్రిక పేర్కొన్నది. 27 ఏళ్ల శ్రీకృష్ణ బహుముఖ అంశాలతో, జీవనపార్శా్వలతో పరిచయం, అనుభవం ఉన్న వ్యక్తి. ఆఫ్రికాలోని ఇబో ప్రజల విమోచన పోరాటాలను నవలా రూపంలో తీర్చిదిద్దిన చినువా అచుబే ‘చెదిరిన సమాజం’లో కథానాయకుడు ఒకోన్క్వో జీవన పోరాటానికి, లేదా గోర్కీ ‘అమ్మ’నవలలో పావెల్ జీవనపోరాటంలో ఎదుర్కొన్న కష్టాలకు, శ్రీకృష్ణ జీవన పోరాటంలో ఘటనలకు దగ్గర సంబం ధం కనిపిస్తుంది. ధనికవర్గపు చట్రంలో చదువు కోసం ఒక పేద దళితుడు ఎంతగా నలిగిపోవలసి వస్తున్నదో! ఆ వ్యధ స్వయంగా అనుభవించినవారికి గాని బోధపడదు. చిత్ర పరిశ్రమలో నాలుగేళ్లపాటు నటీమణుల మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకుంటే గానీ అతడికి చదువుల ప్రాంగణంలోకి ప్రవేశం దొరకలేదు. ఆపై సివిల్ సర్వీసెస్ పరీక్షల తర్ఫీదు కోసం మరో పోరాటం. తృష్ణ ఉన్నా, యాభయ్వేలు చెల్లించుకుంటే గానీ ప్రవేశం దొరకలేదు. ఇందుకోసం హాఫ్టోన్ ప్రెస్లో నైట్షిఫ్ట్లో పన్నెండు గంటలు అదనంగా పనిచేయవలసి వచ్చింది. నెలకు ఐదు వేలు జీతం. దానితోనే సివిల్స్ తర్ఫీదు పూర్తికాదు. కనుక జేఎన్యూలో ఉన్నత చదువుల కోసం నానారకాలైన 17 కొలువులు చేయవలసి వచ్చింది. కనుకనే, ‘‘నా జీవితంలో ప్రతిరోజు, అడుగడుగునా పోరాటమే’’నని బరువైన గుండెతో శ్రీకృష్ణ ప్రకటించుకోవలసి వచ్చింది. అతడి నాయకత్వంలోనే జేఎన్యూలోని మూడు ప్రగతిశీల విద్యార్థి సంఘాలు(కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ బృందం మద్దతు ఉన్న ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్, అఖిల భారత మార్క్సిస్ట్ విద్యార్థి సంఘటన, సీపీఎం విద్యార్థి సంఘం, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)ఐక్యమైనాయి. దీని ఫలితమే విజయం. విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్కు ప్రభుత్వ వేధింపుల ఉదంతం తరువాత వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయమిది. ఇంతకు మించిన స్థాయిలోనిదే హెచ్సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల విజయం. రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన దుర్మార్గపు ఘటనల తరువాత, విశ్వవిద్యాలయం వ్యవహారాలను చక్కదిద్దే పేరుతో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సంస్కృతీ వ్యతిరేక వైఖరి అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ విజయం సాధ్యమైంది. ఇది దేశంలో ఏర్పడిన నియంత్రణ వాతావరణానికి సమాధానంగా లభించిన విజయం. వాక్, సభా స్వాతంత్య్రాలకు, పత్రికా స్వేచ్ఛకు, భిన్నాభిప్రాయాల ప్రకటనకు అడ్డు తగులుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు హెచ్చరిక కావాలి. వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా విద్యార్థుల ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన 16, 17 పార్టీల మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది. సైద్ధాంతిక పునాదులు కొరవడిన పలువురు అవకాశవాదుల కారణంగా ఈ దుస్థితి దాపురించింది. మతతత్వ పాలన ఫలితంగా ప్రబలిన నిరంకుశ ధోరణుల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థ మీద కారుచీకట్లు కమ్ముకున్నాయి. ఈ స్థితిలో జేఎన్యూ, హెచ్సీయూ విద్యార్థి సంఘాల విజయం ఆ కారుచీకట్లలో ఒక కాంతి రేఖగా భావించాలి. ఈ కిరణాలతోనే చిరకాలంగా నిద్రాణమై ఉన్న వామపక్ష రాజకీయ శక్తులు, ప్రగతిశీల దళిత, బహుజన మైనారిటీలు, కార్మిక, రైతాంగాలు మేల్కొనాలి. జేఎన్యూలో కొత్త సమీకరణ జేఎన్యూ ఎన్నికల సందర్భంగా ఈసారి మరొక పరిణామం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన కూడా చూసిన సరికొత్త సమీకరణ–బీర్సా–అంబేడ్కర్–ఫూలే విద్యార్థి సమాఖ్య (బాప్సా). ఇందులో దళిత, ఆదివాసీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులు భాగస్వాములు. అయినా వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయం వేరు. మున్నెన్నడూ లేని రీతిలో వామపక్ష ఐక్య సంఘటనకు మొదటిసారి బాప్సా నుంచి సవాలు ఎదురుకావడం వేరు. బహుశా ఈ కీలక అంశం ఆధారంగానే ‘ది హిందు’ప్రత్యేక ప్రతినిధి వికాస్ పాఠక్ జేఎన్యూ ఫలితాల మీద ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ‘ఇన్నేళ్లుగా సామాజికంగా అణగారిన వర్గాలకు నేడు ప్రాతినిధ్యం అనివార్యమైంది. బాప్సా ఇందుకు అవకాశం కల్పించిందని విద్యార్థి కార్యకర్తలు కొందరు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వామపక్షాలు కూడా తమ సంప్రదాయక నినాదం ‘లాల్ సలామ్’ను ‘జై భీమ్!–లాల్ సలామ్’గా మార్చుకున్నారు. బీఆర్ అంబేడ్కర్ను సొంతం చేసుకుంటూ ఈ సవరణ చేసింది. కనుకనే బాప్సా అణగారిన ప్రజల సంస్థగా రాజకీయ సవాలు విసిరింది’(20–9–2017). హెచ్సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో (24–9–17) ఎస్ఎఫ్ఐ, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత స్టూడెంట్స్ యూనియన్, భావ సారూప్యత కలిగిన బృందాలు కలసి ‘సామాజిక న్యాయ సాధన సంఘటన(అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్)గా ఆవిర్భవించాయి. సమాజాన్ని వర్గ పునాదిపై ఏర్పడిన సంకీర్ణ సామాజిక వర్గాల మిశ్రమంగా వామపక్షాలు భావిస్తాయి. కానీ, అణగారిన ప్రజల వాణికే ప్రాధాన్యం ఇవ్వాలని బాప్సా వాదన. వామపక్షాలు పట్టించుకోవలసిన విశ్లేషణ ఇదొక దృక్పథాల సంఘర్షణ. ఈ సంఘర్షణను స్పృశిస్తూ ప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత ప్రఫుల్ బిద్వాయ్ తన గ్రంథం ‘ఫీనిక్స్ పునర్జన్మ: భారత వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’లో చర్చించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోని రెండు ముక్కలను (సీపీఐ, సీపీఎం) కలిపి బిద్వాయ్ పార్లమెంటరీ లెఫ్ట్గా పరిగణించి ఒక సూత్రీకరణ చేశారు. ‘పార్లమెంటరీ లెఫ్ట్ కనుక రాష్ట్రాల ఎన్నికలలో గెలవడం మీదనే తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించకుండా, దేశవ్యాప్తంగా ఏకముఖంగా ఒక మహోద్యమ నిర్మాణం పైన కేంద్రీకరించి ఉంటే ఇప్పటికన్నా చాలా మెరుగైన పరిస్థితులలో ఉండేది’ అన్నారాయన. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులలో సామాజిక సంస్కరణల వైపు ఉత్సాహంతో ఉరకలేసిన ఈ పార్లమెంటరీ లెఫ్ట్, తాము ప్రాతినిధ్యం వహించవలసిన అసలైన ప్రజాబాహుళ్యాన్ని మరచిపోయిందని కూడా బిద్వాయ్ సూచనప్రాయంగా చెప్పారు. భూస్వామ్య వర్గానికీ, భూమి లేని పేదలకూ మధ్య అధికార చట్రాన్ని బద్దలు కొట్టలేకపోయిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పైగా మతతత్వ శక్తులతో మెతక వైఖరితో వ్యవహరిస్తున్నదని కూడా ఆయన భావించారు. సాంఘిక పరివర్తనకు దోహదం చేయవలసిందంటూ వామపక్షానికి ప్రజలు ఇచ్చిన మేండేట్ స్తబ్దతకు గురికావడం ఈ మెతకవైఖరి ఫలితమేనని ఆయన భావన. ఆది నుంచి వేధిస్తున్న ఐదు ప్రాథమిక సమస్యలను వామపక్షం పరిష్కరించుకోవడం మీదనే రాజకీయ శక్తిగా దానికి సంభవించిన పతన దశను నివారించే అంశం ఆధారపడి ఉందని బిద్వాయ్ సూచించారు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం. అధికార కేంద్రీకరణ వామపక్షాలలో భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను నొక్కేయడం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చించే అవకాశాన్ని అణచివేయడం, ఈ తప్పు లోకం కళ్లకు కనపడుతున్నా, ఆ తప్పునే కొనసాగించడం. కులాల సమస్య పరిష్కారంలో వైఫల్యం. అగ్ర నాయకత్వ స్థాయిలో అగ్రవర్ణ (సవర్ణ) కులాలకు చెందని వారిని అంటే దళిత బహుజన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలం కావడం, దళిత విమోచన పోరాటాలలో తమ శక్తియుక్తులను తగినంతగా వెచ్చించకపోవడం. తన ఆధిపత్యంలో లేని ప్రజా సమీకరణ ఉద్యమాలతో వామపక్షం సన్నిహితంగా ఉండలేకపోవడం (ఉదా: సఫాయి కర్మచారులు, పారిశుధ్య కార్మికులు, ఆదివాసులు వగైరా). వామపక్ష సంఘటనలో మాత్రమే కాదు, ఇలాంటి ఫ్రంట్తో కలసి వచ్చే భాగస్వామ్య శక్తుల మధ్య కూడా వ్యూహాత్మక ఐక్యత కొరవడడం. పార్లమెంటరీ మార్గాన్ని అనుసరించడం ద్వారా వామపక్షం సాధించగోరుతున్న లక్ష్యం గురించి స్పష్టమైన రాజకీయ భవిష్యద్దర్శనానికి తగిన నిర్వచనం కొరవడడం. పార్లమెంటరీయేతర వామపక్షాలు నిర్వహిస్తున్న పోరాటాల లక్ష్యాలకు పార్లమెంటరీ పద్ధతులలో వామపక్షాలు సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు సమన్వయం సాధించడంలో కూడా లక్ష్య శుద్ధి లేకపోవడం. అన్నింటికీ మించి భారత పాలకుల వర్గ స్వభావాన్ని గురించి స్పష్టమైన రాజకీయ దృక్కోణాన్ని అందించలేకపోవడం. బిద్వాయ్ వంటి విశ్లేషకులు వామపక్షాలతో కొన్ని సందర్భాలలో ఏకీభవించి ఉండవచ్చు. వ్యతిరేకించనూ వచ్చు. కానీ ప్రజల శ్రేయోభిలాషులుగా అలాంటివారు చేసిన విమర్శను సుహృద్భావంతో చూడడం తప్పకాదు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఎంఫిల్, పీహెచ్డీ సీట్ల భర్తీ విధానం చెప్పండి
హెచ్సీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఎంఫిల్, పీహెచ్డీ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న విధా నాన్ని తెలియజేయాలని హెచ్సీయూ రిజిస్ట్రార్ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఆదేశించారు. పీహెచ్డీ, ఎంఫిల్ సీట్ల భర్తీ ప్రక్రియల వాటిæ సంఖ్యను కుదించడాన్ని సవాల్ చేస్తూ ఎస్.మున్నా అనే విద్యార్థి వేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి విచారించారు. పాత–కొత్త విధానాల్లో ఏయే కేటగిరీలకు ఎన్ని సీట్లు ఉంటాయో వివరి స్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిజిస్రా ్టర్ను ఆదేశించారు. సీట్ల సంఖ్యను ఖరారు చేశాక వాటిని కుదించాలనే విధానం సబబు గా లేదని, విద్యార్థులకు వర్సిటీ తప్పుడు సంకేతాలను ఇచ్చినట్లు అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీట్ల సంఖ్యను తగ్గించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదించారు. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
హెచ్సీయూ స్కాలర్ ఆత్మహత్య
- అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకిన విశాల్ - హైదరాబాద్ నల్లగండ్లలో ఘటన హైదరాబాద్: ప్రఖ్యాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్ టాండన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అతను.. శనివారం సాయంత్రం భవంతి 14వ అంతస్తు నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. హెచ్సీయూలో జనరల్ స్టడీస్లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్.. తన తల్లితో కలిసి నల్లగండ్లలోని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే తల్లి ముంబై వెళ్లగా, శనివారం ఇంట్లో విశాల్ ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి స్వస్థలం కర్ణాటకలోని బెల్లామ్ ప్రాంతమని, చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు మెయిల్ చేసినట్లు గుర్తించామని చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కళ తప్పుతున్న హెచ్సీయూ
-
ఉర్దూ వర్సిటీకి వీసీ నియామకం
కర్నూలు(సిటీ) : డాక్టర్ మౌలీ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ కె.ముజాఫిర్ అలీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో ఆర్టీ నెం.54ను జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మొదటి ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉర్దూ శాఖ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కె.ముజాఫిర్ను ఈ వర్సిటీకి వీసీగా నియమించారు. -
‘ప్రతివాదిగా రాష్ట్రపతి’పై వైఖరి చెప్పండి
హెచ్సీయూ వ్యాజ్యంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయు) వైస్ చాన్సలర్గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్రపతిని ప్రతివాదిగా చేర్చే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్రాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పారావు బాధ్యతలు చేపట్టేందుకు మానవ వనరుల శాఖ అనుమతిని సవాలు చేస్తూ, ఆయన్ను మరో చోటుకు బదిలీ చేయడంతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా హెచ్సీయూ రిజిస్ట్రార్ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం తెలిసిందే. -
రోహిత్ని మరోమారు చంపే యత్నం
⇒ అతడి కుల ధృవీకరణ వెనుక రాజకీయ కుట్ర ⇒ కన్సర్న్డ్ సిటిజన్స్ ఫోరం ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను బీసీగా తేల్చి.. అతడిని మరో మారు హత్య చేసే కుట్ర ఢిల్లీ కేంద్రంగా జరుగుతోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. హైదరాబాద్లో కన్సర్న్డ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోహిత్ని బీసీగా తేల్చడం వర్సిటీల్లో వివక్ష కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలను కొనసాగించే దుర్మార్గపు ఆలోచనేనన్నారు. దేశంలో కులాన్ని నిర్థారించే హక్కు జిల్లా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. రోహిత్ కేసులో నియమించిన రూపన్వాల్ కమిటీ సైతం తనకు సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకుని అతడి కులంపై రిపోర్టు నివ్వడం హాస్యాస్పదమన్నారు. రోహిత్ వ్యవహారాన్ని కుల ధృవీకరణ అంశానికి కుదించివేయడం రాజకీయ కుట్రని మల్లేపల్లి అన్నారు. ఏడాది గడిచినా సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేసి, చివరకు కని, పెంచిన తల్లి కులం కాదని నిర్థారించడం దుర్మార్గమని విద్యావేత్త చుక్కా రామయ్య చెప్పారు. కాంప్రహెన్సివ్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఉ.సాంబశివరావు (ఊసా) మాట్లాడుతూ.. రోహిత్ ఎస్సీ కాదని చెప్పడం ద్వారా అట్రాసిటీ యాక్టు నుంచి తప్పించుకోగలరేమో కానీ, అతడి హత్యానేరం నుంచి కాదన్నారు. జవాబు దారీతనం లేని టీడీపీ ప్రభుత్వం తన బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుం దన్నారు. తమిళనాడులో శశికళ మాదిరిగా జైలుకి వెళ్లక తప్పదని ఏపీ సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. దళిత బహుజన్ ఫ్రంట్ శంకర్, ఏపీ అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ ప్రభాకర్, రోహిత్ సోదరుడు రాజా, రవి తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లోగా రుజువు చేసుకోండి!
⇒ రోహిత్ కులంపై కుటుంబానికి గుంటూరు కలెక్టర్ నోటీసులు ⇒ న్యాయపోరాటం చేస్తున్న రోహిత్ తల్లి రాధిక సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కులంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని కుటుంబసభ్యులకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం నోటీ సులు జారీ చేశారు. 15 రోజుల్లోగా తమ కులా న్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలను ఆదేశించారు. లేదంటే వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేస్తామన్నారు. వివక్ష, అణచివేతకు నిదర్శనం... ఈ నోటీస్పై రాధిక, రాజా మండిపడ్డారు. దళిత వాడలో పుట్టి పెరి గిన తమను కులం నిరూ పించుకోవాలంటూ హెచ్చరించడం ప్రభుత్వ వివక్ష, అణచివేత ధోరణికి నిదర్శనమ న్నారు. తమ వాదనలు వినకుండా, కనీసం తమ నివాసం చుట్టుపక్కల ఉన్నవారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తమ కులాన్ని మార్చే అధికారం కలెక్టర్కు ఎవరిచ్చారంటూ రాధిక ప్రశ్నించారు. తమ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మణికుమార్ (రాధిక భర్త), అతని తల్లి రాఘవమ్మల స్టేట్మెంట్ ఆధారంగా కులంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం దారుణమని పేర్కొ న్నారు. చంద్రబాబునాయుడు, బీజేపీతో కలసి సాగిస్తున్న దాడిగా దీన్ని ఆమె అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే... ఇలా ఉండగా, రోహిత్ వేముల, అతని తల్లి రాధిక, సోదరుడు రాజా దళితులు కాదని చెప్పడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నా రని దళిత మేధావి, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. నోటీసులు జారీ చేయడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వక్రీకరించడమేనన్నారు. రోహిత్కు మద్దతుగా నిలబడి పోరాడిన వాళ్లపైన నైతి కంగా దాడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టను న్నట్లు దళిత స్త్రీశక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. రాధికకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. -
హెచ్సీయూ గరం గరం
-
హెచ్సీయూ గరం గరం
► రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా వర్సిటీలో ఉద్రిక్తత ► హెచ్సీయూలోకి వెళ్లేందుకు విద్యార్థులు, పలు సంస్థల నాయకుల యత్నం ► అడ్డుకున్న పోలీసులు.. రోహిత్ తల్లి రాధికకూ అనుమతి నిరాకరణ ► ఆగ్రహంతో విద్యార్థుల ధర్నా.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ► తాళం పగలగొట్టి లోనికి... అరెస్టు చేసిన పోలీసులు ► విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కుల నిర్ధారణ: రాధిక సాక్షి, హైదరాబాద్ రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బలగాల మోహరింపు.. తనిఖీలు వర్సిటీలో వివక్ష ఎదురవుతోందంటూ ఏడాది కింద రోహిత్ వేముల అనే పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కింద ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. మంగళవారం హెచ్సీయూలో రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఐడీ కార్డులు చూపించిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్ తల్లి రాధిక సహా ఎవరినీ లోపలికి పంపించలేదు. దీంతో పలు పార్టీలు, సంస్థలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హెచ్సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు విద్యార్థులు గేటు తాళాన్ని పగలగొట్టి రాధికను, మరికొందరిని లోనికి తీసుకువచ్చారు. గేటు వద్దే రోహిత్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోహిత్ స్తూపానికి పూలమాల వేసేందుకు క్యాంపస్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చివరికి రాధికతోపాటు ఏపీ ఏఎస్ఎ కన్వీనర్ గుమ్మడి ప్రభాకర్, సుధీప్తో మండల్ (హిందుస్థాన్ టైమ్స్), విజయ్ పెదపూడి, ప్రమీల, కావ్య, రియాజ్, రాజా వేముల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే విద్యార్థి క్రిశాంక్ సహా 18 మందిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పారావును అరెస్టు చేయాల్సిందే.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని హెచ్సీయూ జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు. రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, అప్పారావులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రోహిత్ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లేవారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పీఎల్ విశ్వేశ్వర్రావు పేర్కొన్నారు. విలేకరిపై కేసు నమోదు హెచ్సీయూ క్యాంపస్లోకి బయటి వ్యక్తులు వెళ్లవద్దన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. క్యాంపస్లో సంచరించిన ఫ్రంట్లైన్ స్పెషల్ కరస్పాండెంట్ కునాల్æ శంకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెచ్సీయూ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులకు రక్షణ కరువైంది ‘‘నేను దళితురాలినైనా నా కుమారుడిని బీసీగా ఎలా ప్రకటిస్తారు? అధికారులు నా బిడ్డ కులం విచారణకని పిలిచి నా నైతికతకు భంగం కలిగించేలా మాట్లాడారు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని అగౌరవపరిచారు. నా ప్రవర్తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..’’అని రోహిత్ తల్లి రాధిక మండిపడ్డారు. రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన బిడ్డ కలెక్టరై కార్లలో తిరుగుతాడని కష్టపడి చదివించానని... కానీ వర్సిటీ వీసీ అప్పారావు తన బిడ్డను చంపేశాడని ఆరోపించారు. ఉద్యమానికి కారణం అప్పారావు అయితే ఆయనను వదిలిపెట్టి తన బిడ్డ కులాన్ని ధ్రువీకరించే పనిపెట్టుకున్నారని మండిపడ్డారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పని చేశారని ఆరోపించారు. రోహిత్ తల్లి రాధికను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు ఏపీ సర్కారు అవమానించింది.. గుంటూరులో విచారణకని పిలిచి తనను, తన పిల్లలను ఏపీ ప్రభుత్వం అవమానించిందని రాధిక ఆరోపించారు. ‘‘నీ బిడ్డని నువ్వే పెంచావా? నీకు డబ్బెక్కడిది? ఎవరిచ్చారు అంటూ ఆర్డీవో అవమానించారు. అనేకసార్లు మమ్మల్ని బెదిరించారు. మాకు ఎక్కడికెళ్లినా భద్రత లేదు. చివరికి గుజరాత్లోని ఉనాకు వెళ్లినా మాకు ఆశ్రయమిచ్చిన వారు భయపడ్డారు..’’అని చెప్పారు. తన కుమారుడి ఆత్మహత్య వెనుక బీజేపీ మంత్రులున్నారు కనుకనే తన కులంపై చర్చ జరుగుతోందన్నారు. తాము దొంగలం, గూండాలం, తీవ్రవాదులం, ఉగ్రవాదులం కాదని... ఇలాగే విద్యార్థులపై నిర్బంధాన్ని కొనసాగిస్తే దళితులంతా ఏకమై పాలకులకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కాగా వైవా పేరుతో దళితులకు మార్కుల్లో కోతవేస్తే ప్రశ్నించినందుకు తమను రస్టికేట్ చేశారని.. ఇప్పటికీ అది కొనసాగుతోందని రోహిత్తోపాటు సస్పెండైన విద్యార్థి రాహుల్ చెప్పారు. గుజరాత్లో ఊచకోత కోస్తున్నారు గుజరాత్లోని ఉనాలో జరిగిన ఘటనలో దళిత బాధితులు పీయూష్ సర్వయ్య, రమేష్ సర్వయ్య, జీతూ సర్వయ్య తదితరులు రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్లో దళితులను రక్తపుటేరుల్లో ముంచుతున్నారని, అయినా రోహిత్ లాంటి ఉద్యమాలు తమకు కొత్త ఊపిరి పోస్తున్నాయని వారు చెప్పారు. ఎన్ని అడ్డంకులైనా ఎదురిస్తామని, దళితుల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాలన్నింటికీ మద్దతిస్తామని పేర్కొన్నారు. దాద్రీ ఘటనలో మరణించిన అఖ్లాక్ సోదరుడు జాన్ మహ్మద్ మాట్లాడుతూ... తమ ఇంట్లో ఆవు మాంసం దొరికిందన్న నెపంతో తన అన్నను చంపారని, అదేమీ లేదని తరువాత తేలిందని చెప్పారు. దళితులపై అత్యాచారాలు, అవమానాలు, అసమానతలు పోయే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. -
రోహిత్ వేముల తల్లి తీవ్ర వ్యాఖ్యలు, అరెస్ట్
హైదరాబాద్: రోహిత్ వేముల వర్ధంతి సభ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో సభ నిర్వహణకు అనుమతిలేని కారణంగా పోలీసులు.. విద్యార్థులెవ్వరినీ లోనికి అనుమతించలేదు. దీంతో ప్రభుత్వానికి, వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలుచేశారు. చివరికి గేటుబయటే సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రోహిత్ తల్లి రాధిక ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ప్రభుత్వంతో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇప్పటికే కులం నిర్ధారణ పేరుతో నన్ను తీవ్రంగా వేధించారు"అని రాధిక అన్నారు. రోహిత్ లేఖరాసిన వెంటనే యూనివర్సిటీ అధికారులకు స్పందించి ఉంటే తనకు పుత్రశోకం ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యూనివర్సిటీల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. రాధిక సహా విధ్యార్థుల అరెస్ట్ రోహిత్ వర్ధంతి సభ సజావుగా పూర్తవుతున్నవేళ.. హెచ్సీయూ వీసీ అటుగా రావడంతో మళ్లీ కలకలం రేగింది. విద్యార్థులు ఒక్కసారిగా వీసీని చుట్టుముట్టి ముట్టడించారు. రోహిత్ తల్లి రాధిక కూడా విద్యార్థులతోకలిసి ముట్టడికార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది గమనించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు విఫలయత్నం చేశారు. చివరికి కొందరు విద్యార్థినాయకులు సహా రాధికను అరెస్ట్చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
రోహిత్ వర్థంతి: హెచ్సీయూలో ఉద్రిక్తత
-
రోహిత్ వర్థంతి: హెచ్సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట.. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ ఇవ్వాళ అలాంటి వాతావరణమే నెలకొంది. మంగళవారం రోహిత్ వర్ధంతి సందర్భంగా వర్సిటీ క్యాంపస్లో భారీ సంస్మరణ సభను నిర్వహించాలనుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ముందుగా ప్రకటించినట్లే వర్సిటీ క్యాంపస్లో రోహిత్ వర్ధంతి సభను జరిపితీరుతామని విధ్యార్థులు భీష్మించారు. సభలో పాల్గొనేందుకు దేశంలోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్సీయూకు తరలివచ్చారు. కానీ సభకు అనుమతిలేని కారణంగా పోలీసలు వారిని అడ్డుకున్నారు. ఒకదశలో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రవీణ్కు అవార్డు
కందుకూరు: బాచుపల్లికి చెందిన హెచ్సీయూ ఎంఫిల్ విద్యార్థి యాలాల ప్రవీణ్ కుమార్ ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ 2015-16 అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా వర్సిటీ సమీప గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, హెచ్ఐవీ, పల్స్ పోలియో, అక్షరాస్యత, యాంటీ డ్రగ్స, నేషనల్ ఓటర్స్ డే తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు గుర్తింపుగా ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈ నెల 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రవీణ్ను అభినందించారు. -
నేను రోహిత్ను మాట్లాడుతున్నా!
• మాది గుంటూరు... నేను దళితుడిని • ఆత్మహత్యకు ముందు వెలివాడ నుంచి మాట్లాడిన రోహిత్ • సోషల్ మీడియాలో వీడియో హల్చల్ • రూపన్వాల్ కమిషన్కు ఈ వీడియో సమాధానం: ఏఎస్ఏ సాక్షి, హైదరాబాద్: ‘‘నా పేరు రోహిత్, నేను గుంటూరు జిల్లాకు చెందిన వాడిని, నేను దళితుడిని, మా అమ్మ నన్ను పెంచి పెద్దచేసింది. హెచ్సీయూలో పరిశోధక విద్యార్థిని అయిన నాతోపాటు మరో నలుగురిని యూనివర్సిటీ పరిసరాల నుంచి, హాస్టల్ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. ఈ పరిసరాల్లో మేము సంచరించడం కూడా వర్సిటీ నేరంగా భావించి మమ్మల్ని వెలివేసింది.’’ అంటూ రోహిత్ తనకు తానుగా దళితుడినని చెప్పిన వీడియో రోహిత్ కులంపై తలెత్తిన సమస్యకు సమాధానం చెబుతోందంటున్నారు విద్యార్థులు. ఇప్పుడీ వీడియో ‘రోహిత్ స్పీక్స్’ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. గత జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడడానికి వారం పదిరోజుల ముందు వర్సిటీ షాప్కామ్ వద్దనున్న వెలివాడలో రోహిత్ మాట్లాడుతుండగా సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియో.. ఇప్పుడు అతని కులంపై కేంద్రం నియమించిన రూపన్వాల్ కమిషన్ రిపోర్టుకి సవాల్గా మారింది. తమ బహిష్కరణను వ్యతిరేకిస్తూ బాధిత విద్యార్థులు క్యాంపస్లోని ఉద్య మ వేదికకు ‘వెలివాడ’ అనే పేరుపెట్టుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు బహిష్కరణకు గురైన విద్యార్థుల అభిప్రాయాలను రికార్డు చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయగా.. ఇప్పుడు బయటపడడంతో చర్చనీయాంశమైంది. వీడియో తీసిన సెల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. వాటిని డిలీట్ చేయగా.. అనూహ్యంగా కంప్యూటర్లో ఇప్పుడు బయటపడినట్టు ఏఎస్ఏ నాయకుడు ప్రశాంత్ తెలిపారు. ఈ వీడియో రూపన్వాల్ కమిషన్కి సమాధానంగా భావిస్తున్నామని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ సన్నంకి మున్నా అన్నారు. ఇంకా ఈ వీడియోలో.. తాను బయోటెక్నాలజీ విద్యార్థిగా క్యాంపస్లోకి అడుగుపెట్టినప్పటికీ సోషల్ సెన్సైస్ పట్ల ఉత్సుకతతో అందులోకి మారానని వివరించాడు. తాను దళితుడిని అయినప్పటికీ జనరల్లోనే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి అది తనకు ఉపయోగపడినట్లు వివరించాడు. ఏబీవీపీతో జరిగిన ఘర్షణ తనకు కొత్తకాదని, 2012లో ఏబీవీపీ కేసు పెట్టినప్పుడు రెండు రోజులపాటు తాను స్టేషన్లోనే ఉన్నానని మాట్లాడుతుండగా మధ్యలోనే వీడియో కట్ అయిపోయింది. విద్యార్థి సంఘ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను బహిష్కరణకు గురైన విద్యార్థులందరి సామాజిక నేపథ్యాన్ని గురించి రికార్డు చేయాలనుకున్నానని మధ్యలోనే రోహిత్ ఏదో పనిపై పక్కకి వెళ్లిపోవడంతో వీడియోను పూర్తిగా చిత్రించలేకపోయినట్లు వివరించారు. -
హెచ్సీయూ అక్రమ కేసులు ఎత్తేయాలి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రోహిత్ వేముల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించి చర్యలు తీసుకోవాలని తెలంగాణలోని ప్రజాస్వామిక వాదులు, మేధావులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'హెచ్సీయూ కుల వివక్షకు, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఒక కేంద్ర బిందువుగా మారిందని అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఈ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్సీయూలో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలి' అని ఓ ప్రతికా ప్రకటనలో ప్రొఫెసర్ జి.హరగోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక మంది విద్యార్థులపైనా, అధ్యాపకులపైనా తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ కేసులున్న విద్యార్థులందరూ దళిత, మైనారిటీ, సామాజికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఈ కుటుంబాలకు ఈ విద్యార్థుల ఉపాధి, ఆదాయాలే జీవనాధారంగా ఉన్నాయి. కనుక విద్యార్థులు, అధ్యాపకుల మీద ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కొందరు మేధావులు సంతకాల సేకరణ చేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ రోహిత్ వేముల దళితుడేనని, మాల కులానికి చెందినవాడనీ, కలెక్టర్ ఇచ్చిన నివేదికల మీద ఆధారపడి నిర్ధారించింది. అంతే కాకుండా పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. అయినా ఇంతవరకూ ఆ విచారణ ముందుకు సాగలేదు. కావున తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని గౌరవించి, తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను నిర్వర్తించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం సమాజంలో జరుగుతున్న మార్పులను ప్రజాస్వామిక పోరాటాలను విశ్లేశించి మద్ధతునిస్తుంది. కానీ రోహిత్ వేముల సంస్థాగత హత్య తర్వాత యూనివర్సిటీలో నిరంకుశమైన సర్క్యూలర్ ద్వారా సభలు, సమావేశాలు జరగకుండా చూస్తున్నారు. బహుశా దేశంలోనే మీడియాను, ప్రజా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించని వర్సిటీగా హెచ్సీయూ తయారైందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని వర్సిటీలో స్వేచ్ఛాయుత, వివక్షా రహిత, ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలని కోరారు. -
రోహిత్ కులంపై రంధ్రాన్వేషణా?
►ఎవర్ని కాపాడటానికి జస్టిస్ రూపన్వాల్ కమిషన్ నివేదిక ఇచ్చింది ► కేంద్ర మంత్రులకు క్లీన్చిట్ ఇచ్చిన నివేదిక ఏకపక్షం ► వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.అరుణ్కుమార్ ధ్వజం ► ఆ కమిషన్ నివేదికను తిరస్కరిస్తున్నాం ► హెచ్సీయూ ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఎవర్ని కాపాడటానికి అతని కులంపై రంధ్రాన్వేషణ చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఎం అరుణ్కుమార్ ధ్వజమెత్తారు. కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని దాచడానికి కమిషన్ ప్రయత్నించడం దారుణమన్నారు. రోహిత్ దళితుడని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినా.. జస్టిస్ రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం అన్యాయమన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అరుణ్ విలేకరులతో మాట్లాడారు. రోహిత్ ఎస్సీనా? కాదా? అని చెప్పే అధికారం రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉంది తప్ప కమిషన్కు లేదన్నారు. రోహిత్కు గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ఎస్సీగా సర్టిఫికెట్ ఇచ్చారని, కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ ఎస్సీ అని చెప్పిందని అరుణ్ గుర్తు చేశారు. ఇపుడు దానిని కమిషన్ కాదనటం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. హెచ్సీయూ వీసీ అప్పారావును రక్షించేందుకే ఈ కమిషన్ వేశారా అని నిలదీశారు. రోహిత్ విషయంలో లేఖలు రాసిన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్చిట్ ఇచ్చిన కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కమిషన్ చెప్పడం దారుణమన్నారు. రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా పెద్దలను కాపాడే ప్రయత్నం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. సంస్కరణలు శూన్యం.. రోహిత్ మరణం తర్వాతైనా మంచి సంస్కరణలు వస్తాయని అందరూ ఆశించారని, కానీ ఆ దిశగా చర్యలు శూన్యమని అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా ఆత్మహత్యలు ప్రేరేపించేలా ఉండటం బాధాకరమన్నారు. ఈ నివేదిక ద్వారా సమాజానికి మంచి కన్నా, చెడే ఎక్కువ జరిగేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కుల సంఘాలు, అధికార సంఘాలు, రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో తిరస్కరించాలని హెచ్సీయూలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని అరుణ్ కుమార్ తెలిపారు. కులవివక్ష కమిషన్కు పట్టదా? రోహిత్ తన సూసైడ్ నోట్లో కులవివక్ష గురించి రాసిన విషయాలు కమిషన్కు పట్టవా? అని అరుణ్ ప్రశ్నించారు. చనిపోయే వారం రోజుల ముందు వైస్చాన్స్లర్కు రోహిత్ రాసిన లేఖలో కాలేజీలో చేరేముందు దళితులకు ఉరి తాడన్నా.. విషమన్నా ఇవ్వమని కోరాడని చెప్పారు. వీసీ అప్పారావు వెనుక ఉన్న రాజకీయ పక్షాలు, తమ వర్గాన్ని కాపాడటం కోసమే రూపన్వాల్ కమిషన్ రోహిత్ మరణాన్ని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఏ మాత్రం న్యాయం చేయని, భరోసా కల్పించలేని ఈ నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని చెప్పారు. -
రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవు
రిజర్వేషన్ల కోసమే రోహిత్ తల్లి కులం సర్టిఫికెట్ తీసుకున్నారు * వ్యక్తిగత విషయాలే రోహిత్ ఆత్మహత్యకు కారణం * రోహిత్ ఆత్మహత్యలో రాజకీయ జోక్యం లేదు * ఇందులో హెచ్సీయూ యాజమాన్యం, ప్రభుత్వానికి బాధ్యత లేదు * కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయకు క్లీన్చిట్ * హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిన రూపన్వాల్ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ తల్లి రాధిక రిజర్వేషన్ల లబ్ధి కోసమే తనని తాను దళిత్గా ప్రకటించుకున్నారని పేర్కొంది. రోహిత్ తల్లి రాధిక కన్నతల్లిదండ్రులు ఎవ్వరో తెలియకుండా ఆమెను పెంచిన తల్లి.. రాధిక ఎస్సీ అని చెప్పడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది. ఆమె దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. రాధిక వాంగ్మూలం ఆధారంగా రోహిత్కు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆగస్టు 1న హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు 41 పేజీల నివేదికను సమర్పించింది. 50 మందిని విచారించిన కమిషన్ రోహిత్ ఆత్మహత్యపై దుమారం చెలరేగడంతో ఈ ఏడాది జనవరి 28న హెచ్ఆర్డీ శాఖ నియమించిన ఏకసభ్య కమిషన్ మొత్తం 50 మందిని విచారించినట్టు పేర్కొంది. అందులో అత్యధికులు వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందే. ఇందులో సామాజిక న్యాయ ఐక్య పోరాట కమిటీ నేతృత్వంలో ఉద్యమించిన ఐదుగురు విద్యార్థి జేఏసీ నాయకులు సైతం ఉన్నారని కమిషన్ వివరించింది. వాస్తవానికి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన విషయాల్లోని నిజానిజాలు.. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు.. అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ విచారించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా చాలా అంశాలను ముఖ్యంగా రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పలు సిఫార్సులు చేసిన కమిషన్ విద్యార్థుల కోసమే కాక రీసెర్చ్ స్కాలర్ల కోసం తగిన కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే రోహిత్ మాదిరిగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను, సమాన అవకాశాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నివేదికను స్వాగతించిన వీసీ అప్పారావు హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై హెచ్సీయూ వీసీ పొదిలె అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ అప్పారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాము ఇప్పటి వరకూ నివేదికను చూడలేదని, అయితే అందులోని అంశాలపై ఒక యూనివర్సిటీగా తాము సంతోషంగా ఉన్నామని అప్పారావు చెప్పారు. రోహిత్ ఆత్మహత్యతో విశ్వవిద్యాలయానికి సంబంధం లేదంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించడాన్ని తాము గతిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులకు క్లీన్చిట్ యూనివర్సిటీలో జరిగిన విష యాల్లో రాజకీయ జోక్యం ఏమాత్రం లేదని కమిషన్ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ వారి బాధ్యతలను వారు నిర్వర్తించారు తప్ప వర్సిటీ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని నివేదికలో రూపన్వాల్ కమిషన్ క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రోహిత్ను వర్సిటీ హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ అధికారులుతీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని పేర్కొన్నట్టు తెలిసింది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య.. రోహిత్ మరణానికి వ్యక్తిగత అంశాలే కారణ మని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రోహిత్ నిరాశా నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అంతే తప్ప వివక్ష అతని ఆత్మహత్యకు కారణం కానేకాదని తేల్చి చెప్పింది. రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ కారణం కాదని, అది అతని స్వయంకృతాపరాధమేనని పేర్కొంది. రోహిత్ ఆత్మహత్యకు అప్పటికప్పుడు యూనివర్సిటీలో తన చుట్టూ జరిగిన విషయాలేవీ కారణం కాదని, ఇదే విషయాన్ని అతని లేఖ స్పష్టం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ రోహిత్ ఆత్మహత్యకు కారణం అయితే అదే విషయాన్ని అతను తన లేఖలో ప్రస్తావించి ఉండేవాడని స్పష్టం చేసింది. తన ఆత్మహత్యకు కారణం ఫలానా అని అతను ఎక్కడా పేర్కొనకపోగా, తాను బాల్యం నుంచి ఒంటరితనాన్ని అనుభవించానని, మెచ్చుకోలుకి కూడా నోచుకోలేదని స్వయంగా రాసుకున్నాడని రిపోర్టు తెలియజేసింది. దీన్ని బట్టి అతను నిరాశా నిస్పృహలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదిక తేల్చింది. -
హెచ్సీయూలో ఎస్ఎఫ్ఐ కూటమి ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభావం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్సీయూ) ఎన్నికల్లో ప్రతిబింబించింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కూటమిలోని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ అన్ని పదవులనూ కైవసం చేసుకొని సత్తా చాటుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం 2016-17 విద్యా సంవత్సరానికిగాను బుధవారం జరిగిన హెచ్సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలోని జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా హెచ్సీయూ ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,000 మంది విద్యార్థులుండగా అందులో 3,800 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం(టీఎస్ఎఫ్) దళిత్ స్టూడెంట్స్ యూనియన్(డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్)లు ఒకే ప్యానల్గా ఏబీవీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాయి. హెచ్సీయూ ప్రెసిడెంట్గా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి కుల్దీప్సింగ్ నాగి, ఏబీవీపీ అభ్యర్థి గోపికృష్ణపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా టీఎస్ఎఫ్ నుంచి బిక్యాసుందర్ 401 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు, జనరల్ సెక్రటరీగా డీఎస్యూ అభ్యర్థి సుమన్ దామెర 390 ఓట్లతో గెలుపొందారు. సాంస్కృతిక కార్యదర్శిగా బీఎస్ఎఫ్ నుంచి నఖ్రాయ్ దిబ్బరామ, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి పిల్లి విజయ్కుమార్, క్రీడల కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉష్ణిస్ దాస్ విజయం సాధించారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య ఎన్నికలుగా సాగాయి. చివరకు వామపక్ష, దళిత, గిరిజన విద్యార్థి సంఘాలతో కూడిన సామాజిక న్యాయ ఐక్యకార్యాచరణ పోరాట కమిటీ ఘనవిజయం సాధించింది. లైంగిక వే ధింపుల నిరోధక కమిటీ(కమిటీ ఎగెనైస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) సభ్యులుగా ఎస్ఎఫ్ఐ నుంచి తుషార, ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్దోసి సోనీ ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్ఏ) 944 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది. -
రోహిత్ది హత్యే : ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: రోహిత్ వేములది యూనివర్సిటీ చేసిన హత్యే అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ‘ఆధునిక అసమాన సంస్థాగత హత్యకు రోహిత్ వేముల ఉదాహరణ.. రోహిత్ చట్టం డ్రాఫ్ట్ బిల్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సమ్మయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వర్సిటీల అప్రజాస్వామిక వైఖరి వల్ల వివక్ష పెరుగుతోందన్నారు. అక్కడి వివక్ష, ఎస్సీ విద్యార్థులపట్ల నిర్లక్ష్య వైఖరి కలసే రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిందన్నారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరాడాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వచ్చి రోహిత్ తల్లిని పరామర్శించినా సీఎం కేసీఆర్కు మాత్రం అందుకు సమయం దొరకలేదన్నారు. రోహిత్ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఓ మేధావి ఈ సమాజంలో నేను బతకలేనని ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి ఒక ప్రమాదఘంటిక లాంటిదని అన్నారు. విమలక్క మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాయడానికి, పాడటానికి కూడా స్వేచ్ఛ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్కుమార్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు. -
అధికారులను తప్పించేందుకే కులంపై చర్చ
రోహిత్ కేసుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణాలు కనుగొని, వివక్షకు పరిష్కారాన్ని చూపాల్సింది పోయి అతడి కులంపై ఏకసభ్య కమిషన్ అనవసర చర్చకు తెరలేపిందని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. హెచ్సీయూ అధికారులను కేసు నుంచి తప్పించడానికే కులంపై చర్చన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ గురవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ హెచ్సీయూ ఘట నలపై ఏకసభ్య కమిషన్ తన పరిధిలు దాటి రోహిత్ కులంపై చర్చించడం దురుద్దేశపూరితమేనన్నారు. రోహిత్ తల్లి రాధిక మాట్లాడుతూ.. పెళ్లయిన ఐదేళ్ల తరువాత భర్త నుంచి విడిపోయానని, ఓ ఎస్సీ కాలనీలో ఉంటున్న తన వద్దే తన పిల్లలు పెరిగారన్నారు. అటువంటప్పుడు ఏ సంబంధమూ లేని వ్యక్తి కులం తన పిల్లలకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెచ్సీయూలో మళ్లీ ఉద్రిక్తత
సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రోహిత్ చిత్రపటంతో ఊరేగింపు జరిపారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
ఆ ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోండి: ఏపీసీసీ
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యాఖ్యనించింది. ప్రొఫెసర్లు కేవై రత్నం, సదాగత్ సేన్ గుప్తాలపై యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఖండించింది. వీరిపై వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి మరో ఉదాహరణ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి జంగా గౌతమ్ అన్నారు. ఓ వైపు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలంటూనే మరో వైపు దళితులను అణివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. -
ఇద్దరు హెచ్సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు
పోలీసు కస్టడీలో ఉన్నందుకే ఈ చర్యలన్న యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం దళిత ప్రొఫెసర్లు కె.వై.రత్నం, తథాగత్లను సస్పెండ్ చేసింది. రోహిత్ ఆత్మహత్యానంతరం హెచ్సీయూలో విద్యార్థి ఉద్యమానికి అండగా నిలి చిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కె.వై.రత్నం, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ తథాగత్లను సస్పెండ్ చేస్తూ వర్సిటీ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 రోజులకు పైగా పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా వారిపై ఈ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోహిత్ ఉదం తం నేపథ్యంలో సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి హఠాత్తుగా విధుల్లో చేరడాన్ని కొందరు విద్యార్థులు, ఆచార్యులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఆందోళనలో మొత్తం 27 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 25 మంది విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు రత్నం, తథాగత్లు కూడా ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే... వీసీ అప్పారావు నియంత పాలన సాగిస్తున్నారని, విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తమని అరెస్టులు చేయించి, పోలీసులతో కొట్టించి, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్లు రత్నం, తథాగత్లు ఆరోపించారు. అందులో భాగంగానే తమపై తాజా సస్పెన్షన్ వేటన్నారు. రోహిత్తో పాటు అంతకుముందు వర్సిటీలో జరిగిన ఆత్మహత్యలకు ఇక్కడ కొనసాగుతున్న కులవివక్షే కారణమన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. -
రోహిత్ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన రోహిత్ వేముల కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు అయ్యేఖర్చును భరించేందుకు కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ ముందుకు వచ్చింది. శనివారం గుంటూరు వచ్చిన కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షుడు తంగేడ్ రోహిత్ తల్లి రాధికకు రూ.10 లక్షల చెక్కును అందించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తాము భరిస్తామంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా తంగేడ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతపరమైన దాడులు పెరిగాయని అన్నారు. ముస్లిం మైనార్టీ, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇలాంటి దాడుల్లో ఇబ్బందులకు గురైన వారిని ఆదుకునేందుకు తాము ముందుంటామని చెప్పారు. -
హెచ్సీయూ
ర్యాంకింగ్లో మేటి.. విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయంగా ఇస్తున్న ర్యాంకుల్లో భారత్కు తగిన గుర్తింపు లభించటంలేదు. ఈ క్రమంలో దేశంలోని అన్ని కళాశాలలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ను ఇస్తూ, పోటీతత్వ వాతావరణాన్ని ఏర్పరిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఈ ర్యాంకులు రూపొందించింది. ఈ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు నాలుగో స్థానం దక్కింది. యూనివర్సిటీ : ప్రొఫైల్ వినూత్న కోర్సులెన్నో.. ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా ఎన్నో కొత్త కోర్సులకు హెచ్సీయూ రూపకల్పన చేసింది. ఈ క్రమలో ఎంఎస్సీలో ఐదేళ్ల కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త సెన్సైస్ వంటి కోర్సులకు అంకురార్పణ చేసింది. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ సెన్సైస్లో కూడా ఆంత్రోపాలజీ, సోషియాలజీ వంటి ఐదేళ్ల ఎంఏ కోర్సులున్నాయి. రెండేళ్ల ఎంఎస్సీలో సాధారణ సబ్జెక్టులతోపాటు ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ వంటి విభిన్న కోర్సును ఆఫర్ చేస్తోంది. సౌకర్యాల్లో ఉత్తమం పరిశోధనలు, టీచింగ్, లైబ్రరీ.. వంటి అన్ని సదుపాయాలు విద్యార్థులకు ఎంతో అనుకూలం. 13 యునీక్ స్కూళ్లలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ చేసిన విద్యార్థులకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 90 నుంచి 95 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బయోటెక్నాలజీ, మెడికల్ సెన్సైస్ వంటి విభాగాల్లో పరిశోధనలు పెరుగుతున్నాయి. మా దగ్గర పేటెంట్స్ కౌంట్ కూడా ఎక్కువగానే ఉంటోంది. విద్యార్థులకు ఇతర దేశాల్లో పరిశోధనలు చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నాం. అత్యాధునిక, డిజిటలైజేషన్తో ఉన్న లైబ్రరీ యూనివర్సిటీ సొంతం. దీనికోసం ఏటా రూ.1.65 కోట్లు ఖర్చుపెడుతున్నాం. లేబొరేటరీల్లో అత్యుత్తమమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక టీచింగ్లో అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ అయిన ఆడియో విజువల్ మెథడ్స్తోపాటు ఇంటరాక్షన్ సెషన్స్, ఎక్స్పరిమెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తాం. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నాం. - ప్రొఫెసర్ జె.మనోహర్రావు,ఎకనామిక్స్ విభాగం, హెచ్సీయూ. -
బయటి వ్యక్తులను అడుగు పెట్టనివ్వొద్దు
పసంగాలకు ఎవరికీ అనుమతినివ్వడానికి వీల్లేదు హెచ్సీయూ, పోలీసు వర్గాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లోకి బయట వ్యక్తులెవరూ అడుగుపెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సమావేశాలు పెట్టి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యూనివర్సిటీ విద్యా వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఏ వ్యక్తికి గానీ, సంఘాలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ అనుమతినివ్వరాదని అటు యూనివర్సిటీ వర్గాలను, ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పూర్తి పాఠం సిద్ధం కాకపోవడంతో మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. హెచ్సీయూలో నెలకొన్న వివాదాలను పరిష్కరించి విద్యా వాతావరణాన్ని కాపాడాలని, ఇందుకు ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంలో తాజాగా వినోద్కుమార్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. హెచ్సీయూలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, సంఘాలు, రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయని.. దీనివల్ల పరిస్థితులు దారుణంగా తయారువుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది నజీర్ఖాన్ వివరించారు. -
‘హెచ్సీయూ వీసీని తొలగించాలి’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో అశాంతికి కారణమైన వీసీ పొదిలి అప్పారావును తక్షణమే తొలగించాలని మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశంలో డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాన్ని మిలటరీ క్యాంపుగా మార్చిన అప్పారావును వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. యూనివర్సిటీలోకి మీడియా, ఇతర మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశించడం వారి ప్రజాస్వామిక హక్కు అని తెలిపింది. వర్సిటీలో వివక్షకు తావులేకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. -
అవి ఉద్యమ భానుల వధ్య శిలలా?
సందర్భం నూతన నిర్మాణంలోని ఇటు కల కలల్లో/గునపాల కొసలు దింపడం/ ఇప్పుడు ‘వాడి’ యుద్ధ విధానం/ ప్రతిఘటిం చకపోతే ఇది రాసిన నేనూ/ చదివిన నువ్వూ మిగలం. -ఉదయభాను ఉన్నత విద్యాలయాల్లో భావ సంఘర్షణలు కొత్తకాదు. ముఖ్యంగా తెలుగు సమాజంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి, తిరిగి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర కాలాల నుంచి అగ్రవర్గ, వర్ణ భూస్వామ్య వర్గాల పిల్లలు ఏబీవీపీ భావజాలానికి; దళిత, బడుగు, వర్గాల, కులాల పిల్లల రాడికల్ భావజాలానికి ప్రభావితులై భావ సంఘ ర్షణలు భౌతిక దాడులకు దారితీసిన రోజులు 1972 ఏప్రిల్ 14న జార్జ్రెడ్డి హత్యతో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో మొదలై వరంగల్ ఆర్ఈసీ, కేఎంసీలకు విస్తరించిన క్రమంలో విద్యార్థి సంస్థల ఎన్నికల రద్దుకు దారితీయడం తెలిసిందే. అయితే ఇప్పుడు మద్రాస్ ఐఐటీలో పెరియార్- అంబేడ్కర్ స్టడీ సర్కిల్ను నిషేధించమని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ లేఖ రాసిన నాటి నుంచి, పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కు టీవీలో ధర్మరాజు వేషధారి చౌహాన్ను డెరైక్టర్గా నియమించిన నాటి నుంచి, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ చక్రవర్తి, ప్రశాంత్ మొదలైన ఐదుగురు దళిత విద్యార్థుల సాంఘిక బహిష్కరణ దాకా, జేఎన్యూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య లాల్, డీఎస్యూ నాయకులు ఉమర్ ఖలీద్ అనిర్బన్, వాళ్ల సహచరులపై కేసులు, అరెస్టులు సమాజంలోనే భౌతిక దాడులకు దారితీసి ఈ దేశాన్ని ఒక ‘పోస్టాఫీసు లేని మరు భూమి’గా మార్చేస్తున్నాయి. డెభ్బైలు, ఎనభైలకు.. మోదిత్వ 2014-16కు తేడా ఏమిటంటే అప్పుడు విప్లవ భావాలకు-విప్లవ వ్యతిరేక భావాలకు ఘర్షణ. ఇప్పుడు హిందుత్వ కాషాయ జెండా నీడలో సామ్రాజ్యవాద-భూస్వామ్య దళారీలకు దళిత, ఆదివాని, ముస్లిం మైనారిటీలు మొదలు మొత్తం ప్రగతిశీల, విప్లవ భావజాలాలతో ఘర్షణ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళిత విద్యార్థులు సాంఘిక బహిష్క రణకు గురవుతారు. వెలివాడలో బ్రాహ్మణాగ్రహారానికి దూరంగా ఆకాశం కప్పుగా అలమటిస్తారు. ఆక్రోశి స్తారు. ఉద్యమిస్తారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో జాతి చైతన్యాన్ని రగిలిస్తాడు. ఉద్యమం పరిస్థితులను చక్కదిద్దితే వైస్ చాన్స్లర్ తిరిగి వచ్చి దౌర్జన్యాన్ని, హింసాకాండను రెచ్చగొట్టి క్యాంపస్ను ఒక కాన్సెం ట్రేషన్ క్యాంపుగా మారుస్తాడు. ఈ సందర్భంలో యూనివర్సిటీ అధికారులు, పోలీసులు కలసి తయారు చేసిన అభియోగపత్రంలో 47 మంది ముద్దాయిలపై కేసు పెట్టారు. అందులో 26 మందిని అరెస్టు చేసి వారం రోజులు చర్లపల్లి జైల్లో పెట్టారు. వీసీ అప్పారావు తిరిగి వచ్చి తన లాడ్జిలో దౌర్జన్యాన్ని రచించుకుని అది సాకుగా మూడు వేలమంది పైచిలుకు విద్యార్థులకు ఆహారం, నీళ్లు, కరెంటు లేకుండా చేశాడు. మెస్లు మూసివేశాడు. కరెంటు కట్ చేయించాడు. యూని వర్సిటీ గేట్లు మూసివేని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చేశాడు. విద్యార్థులు, ఆచార్యులు అరెస్టయిన వాళ్లు పోను, ఎందరని నీళ్లు, ఆహారం లేకుండా నకనకలాడుతారు. కనుక రెండవరోజు క్యాంపస్లో ఎండలో చెట్ల కింద పక్షుల వలె రాళ్లు ఏరుకుని పొయ్యి, కర్రలు ఏరుకుని నిప్పు, గిన్నెలు పోగుచేసి వంట చేయాలని పూను కున్నారు. అక్కడ మొదలవుతుంది మారణకాండ-అది ఉదయభాను మాటల్లో విన్నాం. ఉదయభాను పాల మూరు జిల్లా షాద్నగర్లో విశ్రాంత ఉపాధ్యాయుల సంతానమైన మాదిగ విద్యార్థి. తెలుగులో ఎం.ఫిల్. పూర్తిచేసి పి.హెచ్.డి. చేస్తున్నాడు. ఏడేళ్లుగా ప్రజాస్వా మిక ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయ కుడు. వక్త, కవి, నాటక ప్రయోక్త. రెండు కవితా సంకల నాలు- జంగ్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం, ముఖ్యంగా- గ్రీన్హంట్ ఆపరేషన్ పేరిట ప్రజలమీద యుద్ధాన్ని ప్రతిఘటిస్తూ ‘పిల్లనగ్రోవి తుపాన్’ కవితా సంకలనం ద్వారా సుప్రసిద్ధుడైనవాడు. హైదరాబాద్ యూనివర్సిటీ రోహిత్ వేముల అమ రత్వం తర్వాత ఏర్పడిన విద్యార్థి జాక్కు సహజంగానే నాయకత్వంలో ఉన్నాడు. అతడు రోహిత్, డాక్టర్ సి కాశీం వలె ‘నిషిద్ధ మానవుడు’. అతనికి చావు రుచి చూపించారు. తననెందుకు అంత చిత్రహింసలకు గురిచేసి చావు సరిహద్దుల దాకా తీసుకువెళ్లి వదిలిపోయారో, దానికి కారణాలను వాస్తవ గత వర్తమానాల మీద ఆధారపడి అతడు ఊహించాడు. విచిత్రమేమిటంటే- ఆయనని నలభై ఏడుగురు ముద్దాయిలలో చూపలేదు. ఇంత చిత్రహింసలు పెట్టిమళ్లీ క్యాంపస్లో విసిరేసి పోయారు గాని ఆసుపత్రిలో చేర్చి మెడికో లీగల్ కేసు వేయలేదు. విసిరేసి పోయేప్పుడు ఒక ఎస్ఐ వచ్చి హెచ్చరించినట్లు ఉదయభానును వాళ్లు చంపదలుచుకున్నారు. మాది హిందూ మతం, హిందూజాతి కాదు, మమ్మల్ని వెలివాడల్లో అస్పృశ్యులుగా చూస్తూ మా ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్నారన్న దళితులను జాతి వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రించి రాజద్రోహ నేరం మోపుతున్న ప్రభుత్వాలను... దళిత ఆదివానీ ముస్లిం మైనారిటీ, జాతుల స్వయం నిర్ణయ హక్కుల పోరాట ప్రజల పక్షాన చైతన్యవంతులుగా, ప్రజా స్వామిక వాదులుగా ధిక్కరిస్తున్నందుకే ఇవ్వాళ ఉన్నత విద్యాలయాల్లో ఈ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి. బహిష్కరణలు జరుగుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఇవ్వాళ ఈ వధ్యశిలపై ఉదయభాను నిలబడ్డాడు. ఆనాడు రోహిత్ నెలరోజుల ముందే వైస్ చాన్స్లర్కు లేఖ రాశాడు. ఆ కుట్రదారుడు అది బయటపెట్టక అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆ హంతకుడు ఇపుడు విద్యార్థులపై అధ్యాపకులపై పోలీసులను, సాల్వాజుడుంను విశృంఖలంగా వదిలేసి క్యాంపస్ను ఒక కాన్సెంట్రేషన్ క్యాంప్గా మార్చాడు. అందుకు ఉదయభానుపై హత్యాప్రయత్నం ఒక సంకేతం మాత్రమే. ఉదయభానును కాపాడుకోవడం, వ్యక్తిని కాపాడుకోవడం కాదు.. ఉద్యమ భానులను వధ్యశిలకు బలికాకుండా కాపాడుకోవడమే అవుతుంది. వరవరరావు, విరసం సంస్థాపక సభ్యులు varavararao@yahoo.com