HCU వద్ద తీవ్ర ఉద్రి‍క్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌(వీడియో) | Telangana police lathi charge On HCU Students | Sakshi
Sakshi News home page

HCU వద్ద తీవ్ర ఉద్రి‍క్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌(వీడియో)

Apr 2 2025 11:33 AM | Updated on Apr 2 2025 12:54 PM

Telangana police lathi charge  On HCU Students

సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల  అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి  తీసుకోవాలని  విద్యార్థుల  డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న  విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

మరోవైపు.. హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ  అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. 

అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. యూనివర్సిటీ  విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా  నాయకులు వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement