Lathi charge
-
కృష్ణ దాస్ అరెస్ట్ వేళ దారుణం.. నిరసనకారులపై విరిగిన లాఠీ!
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానం బయట భయానక ఘటన చోటుచేసుకుంది. కోర్టు బయట ఉన్న వారిపై పోలీసులు లాఠీలు ఝలిపించారు.బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్లోని ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది.మరోవైపు.. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తుపై కోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు బయట వందల సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమ్మిగూడారు. కృష్ణ దాస్ అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను జైలుకు తరలిస్తుండగా.. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కృష్ణ దాస్ను తీసుకెళ్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు సమాచారం.🚨 SHAMEFUL! Fascist Yunus govt police 'BRUTALLY' beat Bangladeshi Hindus who were protesting against the 'ARREST' of Bangladesh ISKCON prominent saint Chinmoy Krishna Das Prabhu. pic.twitter.com/Nw1kw4dFl1— Megh Updates 🚨™ (@MeghUpdates) November 26, 2024ఇదిలా ఉండగా.. చిన్మోయ్ కృష్ణ దాస్ను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
డీఏపీకి ‘గాజా’ దెబ్బ
ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు. హరియాణా రైతుల విషయంలో అది నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న గాజా సంక్షోభం భారత్లో డీఏపీ కొరతకు దారి తీస్తోంది. హరియాణా రైతులు రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది. హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. ఏటా 100 లక్షల టన్నులు భారత్ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. సరఫరాలపై హౌతీల దెబ్బ! సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. దగ్గరి దారి అయిన సూయాజ్ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్ ఆఫ్ గుడ్హోప్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్–నవంబర్ సీజన్లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎన్పీకే డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్ టన్నుల ఎన్పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. -
సికింద్రాబాద్లో టెన్షన్.. టెన్షన్
రాంగోపాల్పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవా లయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు యువ కులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగింది. అలాగే ఆందోళనకారులు విసిరిన రాళ్లతో కొంత మంది పోలీసులకు స్వల్ప గాయా లయ్యాయి. ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద నుంచి వేలాది మంది హిందువులు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఆందోళనకా రులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది మోండా మార్కెట్ వైపు, మరికొంత మంది కవాడిగూడ వైపు ర్యాలీగా వెళ్లారు. మోండా, ఆల్ఫా హోటల్ మీదుగా ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆందోళన కారు లు చేరుకున్నారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొ నడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాల యం పక్కనే మరో వర్గానికి చెందిన ప్రార్థన మందిరం కూడా ఉంది. ఆందోళనకారులు ఆ వైపు వెళ్లేందుకు వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకు న్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి చెప్పులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆలయాల రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఛుగ్సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలను రక్షించడంలో, భక్తుల మనోభావాలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. శనివారం సికింద్రాబాద్లోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు.కేంద్ర మంత్రుల పరామర్శ కంటోన్మెంట్: లాఠీచార్జిలో గాయపడిన పికెట్కు చెందిన గుడిపల్లి వెంకట్ను కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు. -
రోడ్డెక్కిన గ్రూప్–1 అభ్యర్థులు
చిక్కడపల్లి (హైదరాబాద్)/కరీంనగర్ టౌన్: మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని, జీఓ నంబర్ 29 రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ గ్రూప్–1 అభ్యర్థులు శుక్రవారం మరోసారి నిరసనలకు దిగారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహిస్తూ రావడంతో నగరంలోని అశోక్నగర్, గాం«దీనగర్, ఆంధ్రా కేఫ్, జవహర్నగర్లలో రోడ్లు కిక్కిరిసిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే అభ్యర్థులను అదుపు చేయడం వారికి కష్టతరంగా మారింది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు సీతయ్య, రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది లాఠీలకు పనిచెప్పారు.దీంతో విద్యార్థులు వీధుల్లోకి పరుగెత్తారు. పోలీసులు వారిని తరుముతూ వెళ్లి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. కొందరు అభ్యర్థులు సమీపంలోని దుకాణాలు, బేకరీల్లోకి, చాయ్ దుకాణాల్లోకి వెళ్లగా, పోలీసులు వాటిల్లోకి సైతం వెళ్లి బయటకు లాక్కొచ్చి పోలీస్స్టేషన్లకు తరలించారు. పరుగెత్తకుండా మొండికేసి బైఠాయించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జిపై గాం«దీనగర్లోని ఎస్బీఐ బ్యాంకు, ఆంధ్రాకేఫ్ సమీపంలో, ఆర్టీసీక్రాస్రోడ్డు, ఇందిరాపార్కు రోడ్డులో నిరుద్యోగ అభ్యర్థులు నిరసనకు దిగగా.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఇతర నేతలు మద్దతు పలికారు. అయితే పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగేవరకు పోరాడతా: బండి సంజయ్ గ్రూప్–1 పరీక్షల రీ షెడ్యూల్కు పట్టుపడుతున్న అభ్యర్థులకు కేంద్రమంత్రి బండిసంజయ్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం పలువురు గ్రూప్–1 అ భ్యర్థులు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవడంతో పాటు గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన తప్పిదాలను సవరించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని హెచ్చరించారు. పరీక్ష రీషెడ్యూల్ చేయాలి: డా.కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జీవో నంబర్ 29ని రద్దు చేయడంతో పాటు గ్రూప్–1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు.వాయిదా వేసేలా చూడండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అభ్యర్థుల వినతిగ్రూప్–1 మెయి న్స్ పరీక్షను వాయిదా వేసేలా, జీవో నంబర్ 29ను రద్దు చేసేలా చూ డాలని పలువురు అభ్యర్థులు శుక్రవారం గాం«దీనగర్లో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయంచేయా లని విజ్ఞప్తి చేశారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 ప్రశ్నపత్రాల లీకేజీల కా రణంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లాఠీచార్జ్ దారుణం: కేటీఆర్గ్రూప్– 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులు, గ్రూప్ –1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్నగర్కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచి్చన రాహుల్గాం«దీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత పత్తా లేకుండా పోవడం దుర్మార్గమన్నారు. -
అట్టుడికిన కామారెడ్డి
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పీఈటీపై ఫిర్యాదు చేసినా... పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
బెంగాల్ బంద్ హింసాత్మకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనతోపాటు మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’పై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జనాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయాల్సి వచి్చంది. బీజేపీ కార్యకర్తలు రైలు పట్టాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రోడ్లపై బైఠాయించిన బీజేపీ మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ చటర్జీ, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఎమ్మెల్యేల అగ్నిమిత్ర పాల్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ‘బంగ్లా బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. వ్యాపార, విద్యా సంస్థలు, కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డాయి. రోడ్లపై ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని కోల్కతాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు! ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఇందులో నిజం లేదని, ఆ ఇద్దరు కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి్పంచామని తెలిపారు. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తుపాకీతో కాల్పులు జరిపారని బీజేపీ మాజీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బంద్పై పిటిషన్ కొట్టివేత బీజేపీ తలపెట్టిన 12 గంటల బంగ్లా బంద్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సంజయ్ దాస్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కోర్టులో ఇష్టారాజ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయకుండా గతంలోనే ఆయనపై నిషేధం విధించామని న్యాయస్థానం తేలి్చచెప్పింది. నిషేధం అమల్లో ఉండగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ సంజయ్ దాస్కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 10 రోజుల్లోగా పశి్చమ బెంగాల్ స్టేట్ లీగల్ సరీ్వసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం పశ్చిమ బెంగాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకు ఖండిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆందోళనలు విరమించి, విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరగా జూనియర్ డాక్టర్ల ఫోరమ్ అందుకు నిరాకరించింది.నిందితుడితో సంబంధం ఉన్న ఏఎస్ఐకి పాలిగ్రాఫ్ టెస్టు జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్తో సంబంధాలున్న ఏఎస్ఐ అనూప్ దత్తాకు సీబీఐ అధికారులు బుధవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ కేసులో అనూప్ దత్తాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎనిమిది మందికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనూప్ దత్తా కోల్కతా పోలీసు వెల్ఫేర్ కమిటీలో పనిచేస్తున్నాడు. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగాక నిందితుడు సంజయ్ రాయ్ ఈ విషయాన్ని అనూప్ దత్తాకు తెలియజేసినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. -
‘లాలా’ కోసం భగత్సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్కి భోజ్పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024 -
రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఇథనాల్ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్ మండలం ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల శివారులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మాగనూర్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ట్యాంకర్ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్ సీఐ రాంలాల్ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతోపాటు రెండు బైక్లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ
కర్ణాటక: పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తూ లాఠీతో కొడుతున్న పోలీసు కానిస్టేబుల్ ఉదంతమిది. వివరాలు.. బాధితురాలు సహన భర్త సునీల్ కుమార్ తుమకూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అరసికెరెకు చెందిన సహనకు ఏడాదిన్నర క్రితం సునీల్కుమార్తో పెద్దలు పెళ్లి చేశారు. 67 గ్రాముల బంగారం ఇచ్చి, అలాగే రూ. 18 లక్షలు ఇచ్చి అరసికెరె వీరశైవ కళ్యాణ మండపంలో ఘనంగా వివాహం చేశారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత సహనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. మరోవైపు అదనపు కట్నం కోసం సునీల్ కుమార్ వేధిస్తున్నాడు. ఇల్లు కట్టాలని, కారు కొనాలని, రూ. 20 లక్షలు తీసుకుని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాక లాఠీతో తరచూ కొడుతున్నాడని విలపించింది. తుమకూరు ఎస్పీని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తుమకూరు మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి
ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు. మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. अरे अरे.. हिंदूत्ववादी सरकारचे ढोंग उघडे पडले.. मुखवटे गळून पडले..औरंगजेब यापेक्षा वेगळे काय वागत होता?वारकऱ्यांचा हिंदू आक्रोश सरकार असा चिरडून टाकतआहे. मोगलाई महाराष्ट्रात पुन्हा अवतरली आहे..@BJP4Maharashtra @Dev_Fadnavis @AUThackeray @ https://t.co/pnUc45IZ01 — Sanjay Raut (@rautsanjay61) June 11, 2023 श्री क्षेत्र आळंदी येथे वारकरी बांधवांवर पोलिसांनी लाठीमार केल्याचा प्रकार अत्यंत संतापजनक आहे. वारकरी संप्रदायाचा पाया रचणारे थोर संत ज्ञानेश्वर महाराज यांच्या आळंदीत वारकरी बांधवांचा झालेला हा अपमान अत्यंत निषेधार्ह आहे. वारकरी संप्रदाय, वारकरी बांधव यांच्याबद्दल सरकारची काही… pic.twitter.com/IDtIy1azn3 — Chhagan Bhujbal (@ChhaganCBhujbal) June 11, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. -
బెంగాల్, మహారాష్ట్రల్లో ‘నవమి’ ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/హౌరా: రామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్లోని హౌరా నగరంలోని కాజీపారా ప్రాంతంలో గురువారం సాయంత్రం రామనవమి ర్యాలీ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. రెచ్చిపోయిన దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు ఆటోలు, దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కిరాద్పురా రామాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు కూడా జరిపారు. సుమారు 500 మందితో కూడిన గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సందర్భంగా 10 మంది పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇదే ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు 13 వాహనాలకు నిప్పుపెట్టాయి. రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శ్రీరామ్భగవాన్ ప్రతిమ యాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, కొందరు నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ యాత్ర నిర్వహించారు. గత ఏడాది ఇక్కడే హనుమాన్ జయంతి వేడుక రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. గుజరాత్లోని వడోదరాలో రెండు రామనవమి ర్యాలీలపై దుండగులు రాళ్లు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు. -
‘సల్మాన్’ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ బర్త్ డే వేడుకలు ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. బంద్రాలోని ఆయన నివాసం వద్దకు వందల మంది చేరుకున్నారు. బర్త్డే సందర్భంగా అభిమానులను పలకరించిన సల్మాన్ ఖాన్ వారి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే, రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ తన ఇంటిలోని బాల్కనీ నుంచి కనిపించిన సమయంలో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాల్కనీలో నుంచి అభిమానులను పలకరించారు సల్మాన్. ఈ క్రమంలో పోలీసుల మాటసైతం లెక్కచేయకుండా రోడ్డుపైకి వచ్చేశారు అభిమానులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. లాఠీఛార్జి మొదలు పెట్టడం వల్ల అక్కడి నుంచి కొద్ది క్షణాల్లోనే అంతా వెళ్లిపోయారని వెల్లడించారు. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House #Bandra @MumbaiPolice @DGPMaharashtra pic.twitter.com/dHHQBK4pR3 — Indrajeet chaubey (@indrajeet8080) December 27, 2022 सलमान के घर के बाहर बेकाबू हुई भीड़, पुलिस ने किया लाठीचार्ज#SalmanKhan #salmankhanfans #lathicharge #mumbaipolice #SalmanKhanBirthday #lathichargeonfans@BeingSalmanKhan @MumbaiPolice pic.twitter.com/farkLDSI0b — Topchand (@topchandnews) December 27, 2022 ఇదీ చదవండి: Salman Khan: మాజీ లవర్ను ముద్దాడిన సల్మాన్ ఖాన్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ -
‘సెస్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్స్వీప్
సిరిసిల్ల: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘ (సెస్) పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం వేములవాడలో లెక్కింపు చేపట్టగా.. మొత్తం 15 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అయితే వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బి.మమత తొలుత ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్గా బీఆర్ఎస్ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ అడ్డదారులు: సంజయ్ ‘సెస్’ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ రూరల్, చందుర్తిల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ మేరకు ఫలితాలు వెల్లడించకుండా చేశారని ఆరోపించారు. ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘సెస్’ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీ నేతలకు చెంచాల్లా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమాదేవి ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా జిల్లాలో బలపడిన బీజేపీని ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని పేర్కొన్నారు. -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం -
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పలువురిని అరెస్టు చేయడం.. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జీతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనితో నిర్వాసితులు ఆందోళనను మరింత ముమ్మరం చేశారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. అయితే తమకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గూడాటిపల్లిలో మోహరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లలోని నిర్వాసితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మహిళలు, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి దిగి చెదరగొట్టడంతో.. పలువురికి గాయాలయ్యాయి. పాదయాత్రగా హుస్నాబాద్కు.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గూడాటిపల్లి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడివద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు దిగివచ్చి అనుమతి ఇవ్వడంతో నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. అరెస్టైన వారిని విడుదల చేయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం హుస్నాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందే: సీపీఐ నారాయణ భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన పోలీసు లు క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే స స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆ ధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భం గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో నిర్వాసితులకు చెల్లించినట్టు గా గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేసిన పా పాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జాతీ య స్థాయికి వెళ్తున్నారని మండిపడ్డారు. దాడి క్షమించరానిది: రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సరైన పరిహారం ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహార ప్యాకేజీ అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో ఎకరం డబ్బులు రావాలి గౌరవెల్లిలో 5 ఎకరాల భూమి కోల్పోయాను. 4 ఎకరాలకు సంబంధించిన డబ్బులే చెల్లించారు. ఇంకా ఎకరం డబ్బులివ్వాలి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద స్థలమిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులు చేయాలి. – భూక్యా స్వప్న, సేవగాని తండా భూమికి భూమి ఇవ్వాలి గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమి సేకరించారు. అందులో 88 ఎకరాలకు సంబంధించిన రైతులు సంతకాలు చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. మల్లన్నసాగర్ నిర్వాసితులతో సమానంగా మాకూ నష్టపరిహారం చెల్లించాలి. – బద్దం ఎల్లారెడ్డి, గూడాటిపల్లి -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
పెటి కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున పోలీసుల దురుసు ప్రవర్తన ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న పెటి కేసు వివాదంలో ముస్లిం మహిళలపై సైఫాబాద్ ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టారు. సైఫాబాద్ నుంచి ఇద్దరు హిళలు కారులో నాంపల్లి వైపు వెళుతుండగా అదే దారిలో ప్రయాణిస్తున్న బస్సుతో మైనర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్, ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తమను ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీతో కొట్టినట్లు ఇద్దరు మహిళలు ఆరోపించారు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న యువకులు, బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు. చదవండి: రాకాసి రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా ఎన్హెచ్–44 తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ సీఐ జలీల్ పాషా, సైఫాబాద్ డీఐ రాజు నాయక్లు బాదితులను శాంతింపజేసీ ప్రయత్నం చేశారు. విచారణ జరిపి ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు నచ్చజెప్పారు. బాధిత మహిలు ఇచిన ఫిర్యాదును నాంపల్లి సీఐ కలిల్ పాషా స్వీకరించి , విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
గిరిజన వర్సిటీ కావాలని..
ఆదిలాబాద్టౌన్: గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్లో సోమవారం చేపట్టిన మహాధర్నాలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్నాలో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాహనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థి నేతలు మాట వినకపోవడంతో లాఠీచార్జికి దిగారు. అప్పటికే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఆయన ఆదేశాల మేరకు ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
‘పోలీసులు లాఠీఛార్జీ చేసినా నిరసనలు ఆగవు’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థులు, నాయకులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీసుల లాఠీఛార్జీపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ జయంతి రోజు విద్యార్థి, నిరుద్యోగ అంశాలపై కాంగ్రెస్ పార్టీ శాంతియుత పోరాటం చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వాయ్యయుతంగా ఉండాలి తప్ప.. నిరంకుశత్వంగా వ్యవహరించరాదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను గృహ నిర్భంధించడాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. శాంతియుత పోరాటాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. దీనిని ప్రజాస్వామ్యవాదులంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నదే కొలువుల కోసమని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా కొలువులు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. పోలీసులు లాఠీఛార్జీ చేసినంత మాత్రాన తమ నిరసనలు ఆగుతాయనుకుంటే అది పొరపాటేనని అన్నారు. తుపాకులు, మరఫిరంగులు ఎక్కుపెట్టిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ఎదిరించి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం, సిద్దాంతాల కోసం ముందుకు పోతూనే ఉంటుందని తెలిపారు. -
అసోంలో ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా
గువాహటి: అసోంలోని దరాంగ్ జిల్లా సిఫాజర్లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్పూర్లోని సిఫాజర్లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్ విజయ్శంకర్ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్శంకర్ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్ అరెస్ట్ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా సోదరుడు సుశాంత్ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొనిరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్ హుస్సేన్, షేక్ ఫోరిడ్గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా అన్నారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
రైతులపై లాఠీచార్జ్: సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మళ్లీ రైతుల రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి) నేతృత్వంలోని సమావేశానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్లోని ఘరౌండ టోల్ప్లాజా వద్ద ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓసీ ధంకర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. ఈ లాఠీఛార్జ్ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయ పడ్డారు. దీంతో పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రధాన రోడ్లు ,హైవేలను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నేతలు పిలుపు నిచ్చారు. అలాగే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీలతో క్రూరంగా దాడి చేసారనీ, వందలాది మంది రైతులను అరెస్టు చేశారని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు రోడ్లన్నీ బ్లాక్ చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసే వరకు రహదారుల దిగ్బంధనం కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. -
ధోని ఫ్యాన్స్పై లాఠీచార్జ్..
జైపూర్: రాజస్థాన్లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు. -
పోలీసుల లాఠీఛార్జీలో నా చెయ్యి విరిగింది
-
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్పై లాఠీచార్జ్
-
చూపు పోయింది.. అవార్డు వచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ: సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. లాఠీ దెబ్బలు అతని ఎడమకంటికి బలంగా తగిలాయి. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్ కంటి చూపు పోయింది. ఆ సమయంలో అతను మానవహక్కులకు సంబంధించిన వ్యాసం రాస్తున్నాడు. గాయం అనంతరం డాక్టర్ల వద్దకు వెళ్లగా అతని కంటిని పరీక్షించిన వారు ఇక శాశ్వతంగా చూపు రాదని స్పష్టం చేశారు. (కొట్టరాని చోటా కొట్టారు) ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు లాఠీ తనపై విరగడానికి కేవలం కొద్ది నిముషాల ముందే మిన్హాజుద్దీన్ తన వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కంటి చూపు కోల్పోయి తలనొప్పి ఎంతగా బాధిస్తున్నా.. ఆ పేపర్ కి తుదిమెరుగులు దిద్ది తన యూనివర్సిటీ అధ్యాపకుల సంఘానికి సమర్పించాడు. రెండు నెలలు గడిచిపోయాయి. మానవ హక్కులపై మిన్హాజుద్దీన్ రాసిన ఆర్టికల్ కే ఉత్తమమైనదిగా జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఆ విద్యార్ధి పొంగిపోలేదు. మానవ హక్కులు రోజురోజుకీ ఎందుకిలా దిగజారిపోతున్నాయా అన్నదే ఇప్పుడా 26 ఏళ్ళ విద్యార్ధి మనోవేదన ! ఒక చట్టానికి నిరసనగా ఆందోళన చేసినంత మాత్రాన ఎక్కడో లైబ్రరీలో ఉన్న తనలాంటి విద్యార్థుల మీద పోలీసు లాఠీ విరగడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. (‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’) చదవండి: టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది.. -
‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు విచక్షణరహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీసుల దాడిలో మిన్హాజుద్దీన్ కంటికి తీవ్రంగా గాయం కావటంతో పాక్షికంగా చూపు కోల్పోయారు. లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో అకారణంగా పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారని తెలిపారు. నిరసనలు ఏడో గేటు వద్ద జరుగుతుంటే పోలీసులు లైబ్రరీలోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. తాను అసలు నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని మిన్హాజుద్దీన్ వెల్లడించారు. తనకు శాంతి భద్రతలపై పూర్తి నమ్మకం ఉందని.. ‘నేను చేసిన నేరం ఏంటి’ అని మిన్హాజుద్దీన్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్లో తన కంటికి గాయం అయిందని దీంతో మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనతో నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఇకనుంచి లైబ్రరీలో చదుకోమని ఏ విద్యార్థికి నేను చెప్పలేను. ఆ భయంతో నేను లైబ్రరీలోకి చదుకోవడానికి వెళ్లలేను. విశ్వవిద్యాలయంలో భద్రత లేదు. ఈ ఘటనతో నా తల్లిదండ్రులు బిహార్కి వచ్చేయాలని కోరుతున్నారు’ అని మిన్హాజుద్దీన్ తెలిపారు. తాను న్యాయ విద్యను అభ్యసించి, శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అది పూర్తైన తర్వాతే బిహార్కి వెళ్తానని... అయితే. ఈ ఘటనతో తాను ఎందుకు ఢిల్లీకి వచ్చానా? అని బాధ పడుతున్నానని తెలిపారు. ఎందుకో ఢిల్లీని సురక్షితమైన నగరంగా తాను భావించటం లేదని.. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పుచేశానని మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం
న్యూఢిల్లీ: భారత్లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆందోళనలతో అట్టుడికింది. నిరసనల సందర్భంగా యూపీలో శుక్రవారం ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ఐదుగా పేర్కొన్నారు. బిజ్నోర్లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్లో ఒక్కరు చొప్పున చనిపోయారని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. కాన్పూర్లోనూ ఒకరు చనిపోయినట్లు సమాచారం. పోలీసు కాల్పుల కారణంగా ఈ మరణాలు సంభవించాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆందోళనకారుల దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ఇప్పటివరకు ఆందోళనలు జరగని ప్రాంతాల్లోనూ శుక్రవారం భారీ స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్పూర్ నుంచి బులంద్షహర్ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగాయి. ఢిల్లీలో జాతీయ పతాకం చేతపట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదాలతో నిరసనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనకారులు తమది శాంతియుత నిరసన అని తెలిపేందుకు పోలీసులకు గులాబీ పూలను అందించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మంగళూరు, ఒకరు చనిపోయిన లక్నో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో.. సీఏఏపై, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్నార్సీపై సలహాలు, సూచనలను స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఢిల్లీలో.. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆందోళనకారులు కారును తగలబెట్టారు. ఢిల్లీగేట్ వద్ద రాళ్లు రువ్వడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. రోడ్లపై భారీగా బారికేడ్లను నిలిపినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసేసినప్పటికీ, నిషేధాజ్ఙలను ఉల్లంఘిస్తూ వేలాదిగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. జామా మసీదు, ఇండియా గేట్, సెంట్రల్ పార్క్ల వద్ధ భారీ స్థాయిలో గుమికూడారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భారీ ర్యాలీకి నేతృత్వం వహించారు. పోలీసులు డ్రోన్లతో ఆందోళనలపై నిఘా పెట్టారు. హోంమంత్రి అమిత్ షా నివాసం దగ్గరలో నిరసన తెలుపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళ కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భిన్నాభిప్రాయాన్ని పోలీసు బలంతో అణచేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. జాతీయ గీతంతో.. బనశంకరి: పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింపజేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై అందోళనలు చేయడానికి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ గురువారం కొన్ని సంఘాల నాయకులు టౌన్హాల్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడకు చేరుకున్న డీసీపీ చేతన్సింగ్రాథోడ్ మాట్లాడుతూ ‘నేను మీవాడిని అనుకుంటే నేను ఆలపించే జాతీయ గీతాన్ని ఆలకించాల’ని కోరారు. అనంతరం ఆయన జాతీయగీతం ఆలపించగా అందోళనకారులు గౌరవంగా లేచి నిల్చుని, ధర్నా విరమించారు. డీసీపీ చేతన్సింగ్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నేరవిభాగ ఐజీ హేమంత్ నింబాళ్కర్ ట్వీట్ చేశారు. మిత్రపక్షాల వేరు బాట జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని బిహార్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జేడీయూ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరో మిత్రపక్షం ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ తీరును తప్పుబట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విషయంలో కేంద్రం విఫలౖ మెందన్నారు. ఎన్నార్సీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు వ్యతిరేకత తెలిపిన విషయం తెలిసిందే. యూపీలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గోరఖ్పూర్, సంభాల్, భదోహి, బహ్రెచ్, ఫరుఖాబాద్, బులంద్ షహర్, ఫిరోజ్బాద్లో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ యా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లక్నో, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్ సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ► మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్, పర్బాని జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్లో హిందువులే ఉండేలా మోదీ సర్కారు చట్టాలు తీసుకువస్తోందని ఆరోపించింది. ► కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో గురువారం ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కేరళలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ► అస్సాంలో ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినట్లు సీఎం శర్బానంద సోనోవాల్ తెలిపారు. మమత యూ టర్న్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని గురువారం డిమాండ్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట మార్చారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టం విషయంలో జోక్యం చేసుకుని, రద్దుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు విషయంలోనూ వెనక్కు తగ్గాలని కోరారు. డీసీపీ చేతన్ -
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
-
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీ కారణంగా మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎమ్) విద్యార్థి మిన్హాజుద్దీన్ తన చూపు కొల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఆయుధాలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు విద్యార్థులను కొడుతున్న వీడియోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత పోలీసులు జరిపిన లాఠీ చార్జీ కారణంగా జామియా యూనివర్సిటీ ఫైనలియర్ స్టూడెంట్ మిన్హాజుద్దీన్ (26) ఒక కంటికి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఇక రెండో కంటిపై కూడా దాని ప్రభావం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆవేదన చెందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం తాను లైబ్రరీలోని ఎంఫిల్ సెక్షన్లో చదువుకుంటుండగా.. 25మందికి పైగా సాయుధులైన పోలీసులు లాఠీలతో విద్యార్థులపై దాడికి దిగారు. తన ఒక కంటికి, చేతికి తీవ్ర గాయాలవడంతో.. పారిపోయి టాయిలెట్లో దాక్కుని అక్కడే స్పృహ కోల్పోయానని వివరించాడు. ఆ తర్వాత తన స్నేహితులు కొంతమంది ఎయిమ్స్కు, రాజేంద్ర ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్కు చేర్చారని అన్నాడు. పోలీసులు కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వైరల్ అయిన వీడియోల్లో విద్యార్థుల అర్తనాదాలు, లైబ్రరీలో పుస్తకాలు చెల్లాచెదురు కావడం గమనించవచ్చు. ఇక పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై సీనియర్ పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. జామియా విద్యార్థులపై అవసరానికి మించి బలప్రయోగం, యూనివర్సిటీ క్యాంపస్లోకి అక్రమంగా చొరబడటం అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఒక గుంపు లోపలికి వెళ్ళిన తర్వాతే పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇక హోం మంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసులు పంపిన రిపోర్టులో కాల్పులు జరుపలేదని పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా బుల్లెట్ గాయాలతో ఇద్దరు విద్యార్థులు సప్ధార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం విద్యార్థులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో స్థానిక ముఠాలు ప్రేరేపిస్తున్నాయనే నెపంతో హింసాత్మకంగా మార్చారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన దమనకాండలో విద్యార్ధులను మినహాయించి 14 మంది స్ధానికులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరు మంది ప్రాణాలు విడిచారు. కాగా ఢిల్లీలో నిరసనల హోరు కారణంగా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో.. ఏకంగా కొన్ని రోడ్లనే మూసివేశారు. -
జేఎన్యూ విద్యార్ధులపై లాఠీచార్జ్
సాక్షి, న్యూఢిల్లీ : ఫీజుల పెంపుపై జేఎన్యూ విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రపతి భవన్కు విద్యార్ధులు చేపట్టిన ప్రదర్శనలో ఘర్షణ చెలరేగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. తమ సమస్యలను రాష్ట్రపతికి నివేదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా వెళుతున్న విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాగా, ఆందోళనకారులు భికాజి కమాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా వారిపై లాఠీచార్జి చేశామని పోలీసులు తెలిపారు. హాస్టల్ చార్జీల పెంపును పూర్తిగా ఉపసంహరించేందుకు వర్సిటీ అధికారులు నిరాకరించడంతో విద్యార్ధులు రాష్ట్రపతి భవన్ వరకూ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. శాంతియుతంగా రాష్ట్రపతి భవన్కు ప్రదర్శనగా వెళుతున్న తమపై ఖాకీలు జులుం ప్రదర్శించారని, లాఠీచార్జ్తో విరుచుకుపడ్డారని విద్యార్ధులు ఆరోపించారు. హాస్టల్ ఫీజుల పెంపుపై గత కొన్ని రోజులుగా విద్యార్ధుల ఆందోళనతో జేఎన్యూ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. -
కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. 90 రోజుల షెడ్యూల్ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్కు దిగారు. కాగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝలిపించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తల హత్యలను నిరసిస్తూ బీజేపీ బుధవారం కోల్కతాలో భారీ నిరసన చేపట్టింది. నిరసనలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డగించి ముందుకు కదలకుండా నిరోధించారు. బీజేపీ శ్రేణులు ముందుకు కదలకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటి లోనికి చొచ్చుకువచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. తృణమూల్ ప్రభుతంపై నిరసనలకు దిగిన బీజేపీ కార్యకర్తలపై కోల్కతా పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసనలు తెలిపేందుకు బీజేపీ శ్రేణులు సంసిద్ధమవడంతో నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్ కోల్తాలో వీధుల్లో పోలీసులు పెద్దసంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తృణమూల్ దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు కైలాష్ విజయవర్గీయ, లాకెట్ ఛటర్జీ తదితరులు కోల్కతా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కాగా, లోక్సభ ఎన్నికల అనంతరం బెంగాల్లో బీజేపీ, తృణమూల్ వర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. మరోవైపు బెంగాల్లో పెచ్చుమీరిన హింసాకాండతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారనే ప్రచారం సాగుతోంది. -
వేధించడం సరికాదు : వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మంగళవారం జరిగిన లాఠీచార్జ్ ఘటనను ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉప్పాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా కొత్తపల్లి పోలీసు స్టేషన్ దగ్గర ఆందోళన చేసిన పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. చదవండి : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విరిగిన లాఠీ ఈ ఘటనపై ఆయన బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్తో ఫోన్లో మాట్లాడారు. కనీసం మహిళలని కూడా చూడకుండా స్పృహ కోల్పోయే విధంగా ఎలా కొడతారని ఎస్పీని ప్రశ్నించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలే కానీ టీడీపీ తొత్తులుగా మారొద్దన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధించడం సరికాదన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కారుతో సహా పోలింగ్ బూత్లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మపై ఇంతవరకు ఎందుకు కేసులు పెట్టలేదో పోలీసులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘జై కిసాన్పై’ దండెత్తుతారా?
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుందో మంగళవారం నాడు ఢిల్లీకి కదం తొక్కిన వేలాది మంది రైతుల ఆగ్రహావేశాలను చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడో హరిద్వార్ నుంచి ప్రారంభమైన రైతుల భారీ ర్యాలీ ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకోగానే ఇటు ఢిల్లీ, అటు ఉత్తర ప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా భారీ బారీకేడ్లు అమర్చి రైతులను కర్కశంగా అడ్డుకున్నారు. భాష్ప వాయువు గోళాలతో, నీటి శతఘ్నులతో నిప్పులు కుమ్మరించి నీరు గార్చేందుకు విఫలయత్నం చేశారు. చేసేదేమీలేక చివరకు బుధవారం తెల్లవారు జామున రైతులను నగరంలోకి అనుమతించారు. దేశంలోని రైతులు గత రెండేళ్ల నుంచి ఏదో రూపంలో ఆందోళన చేయడానికి నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభ పరిస్థితులు కారణమన్నది తెల్సిందే. 1970–1971 సంవత్సరం నుంచి దేశంలో సాగుభూమి శాతం దారుణంగా పడిపోతూ వస్తోంది. 2015 సంవత్సరంలో నిర్వహించిన వ్యవసాయం సెన్సెక్స్ ప్రకారం దేశంలో రైతులు సరాసరి సాగుభూమి కలిగి ఉన్నది 1.15 హెక్టార్లు మాత్రమే. పైగా భారత్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడంలో బాగా వెనకబడిపోయి ఉంది. దేశంలో ఆధునిక వ్యవసాయానికి పనికొచ్చే సాగు భూమి కూడా 46 శాతమే ఉండడం గమనార్హం. భారత్లో అతిపెద్ద వ్యవసాయ పంట వరి అన్న విషయం తెల్సిందే. అధిగ జనాభాలో చైనాతో పోటీ పడుతూ దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు వరి దిగుబడిలో మాత్రం ఆ దేశంతో బాగా వెనకబడి పోయింది. భారత్కన్నా మూడు రెట్లు ఎక్కువ వరిని నేడు చైనా పండిస్తోంది. ఇక ఈ విషయంలో వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్లో వరి దిగుబడుల లెక్క చూస్తే నిజంగా కళ్లు తిరిగి కిందపడి పోవాల్సిందే. భారత్ కన్నా వియత్నాం 233 శాతం, ఇండోనేసియా 216 శాతం, బంగ్లాదేశ్ 183 శాతం అధిక దిగుబడిని సాధిస్తోంది. ఒకప్పుడు దేశంలో బతకలేని వాడు బడి పంతులైతే ఇప్పుడు దేశంలో అన్నమో రామచంద్రా! అంటూ అలమటిస్తున్నది అన్నదాతలే. ఇక ఈ దేశంలో వ్యవసాయం ఏ మాత్రం లాభదాయకం కాదని తెల్సినా దాన్నే ఎక్కువ మంది ఆశ్రయించడానికి కారణం ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడమే. మనం ఉదహరించిన వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి హాపీగానే బతుకుతున్నాయి. అయితే అవి అత్యాధునకి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాయి. ఈ విషయంలో భారత్ బాగా వెనకబడి ఉంది. అందుకు కారణం వ్యవసాయ రంగం పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం. దేశంలోని రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో, వారికి వ్యవసాయ విద్యలో శిక్షణ ఇప్పించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టడం లేదు. ప్రత్నామ్నాయ ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను చూపించడంలో కూడా భారత ప్రభుత్వం దారుణంగా విఫలమవుతూ వస్తోంది. కనీసం వినియోగదారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధను వ్యవసాయదారులపై చూపడం లేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి–ఎగుమతి నిబంధనలను, సుంకాలను ఎప్పటికప్పుడు సవరిస్తోంది. ఫలితంగా కూడా భారతీయ వ్యవసాయదారులు దెబ్బతింటున్నారు. అన్ని రకాల వ్యవసాయ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని, పంటల భీమా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ నిలుపుకోలేక పోయాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మరీ ఘోరంగా విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు సమ్మె బాట పట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరి హక్కు. అలా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న రైతులపైకి ప్రభుత్వం పిడికిలి బిగించింది. అదీ మన శాంతిదూత గాంధీ తాత 150వ పుట్టిన రోజున. అదీ ‘జై కిసాన్’ అంటూ మన రైతులకు సగౌరవంగా నమస్కరించిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజున కూడా. జై కిసాన్ అనే నినాదం శాస్త్రీతోనే ప్రాచుర్యంలోకి వచ్చిందన్న విషయం తెల్సిందే. -
రైతు ర్యాలీ.. అర్ధరాత్రి అనుమతి
న్యూఢిల్లీ: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం ఈ యాత్రను పోలీసులు ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులను దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేసి ప్రవేశించే యత్నం చేసిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినా కూడా రైతులు వెనకడుగు వేయలేదు. అర్థరాత్రి అయినా వెనక్కి వెళ్లకుండా అక్కడే బస చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో అర్ధరాత్రి బారికేడ్లు తొలిగించి అనుమతించారు. దీంతో రైతులు చేపట్టిన పాదయాత్ర కిసాన్ ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున ముగిసింది. ఈ సందర్భంగా నరేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమైంది. మేం గత 12 రోజులుగా ర్యాలీ చేస్తున్నాం. రైతులంతా అలసిపోయారు. మేం మా డిమాండ్స్, హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తాం. కానీ ప్రస్తుతం ఈ ర్యాలీని ముగిస్తున్నాం’ అని తెలిపారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల ప్రధాన డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. తమ డిమాండ్లను అమలు చేయాలని బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న హరిద్వార్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్తోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు. చదవండి: రైతు ర్యాలీ భగ్నం -
ఛలో కిసాన్ ఘాట్
-
రైతు ర్యాలీ భగ్నం
న్యూఢిల్లీ/సేవాగ్రామ్: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న ర్యాలీగా బయలుదేరారు. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తమను లాఠీలతో కొట్టారని కొందరు రైతులు ఆరోపించగా పోలీసులు ఖండించారు. బీకేయూ ర్యాలీ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. రోడ్డు పక్కనే రైతుల బస: పోలీసు చర్య అనంతరం రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనే కిలోమీటర్ మేర మకాం వేశారు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్లు, ట్రాలీల పక్కనే నిద్రకు ఉపక్రమించారు. కొందరు తమ వెంట జనరేటర్లు కూడా తెచ్చుకున్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ అహింసా దినం రోజున దేశ రాజధానిలో రైతులపై కేంద్రం దాడి చేయించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల డిమాండ్లు ఇవీ.. ♦ చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ♦ ప్రధానమంత్రి మంత్రి ఫసల్ బీమా యోజన పునరుద్ధరించాలి. ♦ పదేళ్లు పాతబడిన డీజిల్ ట్రాక్టర్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాన్ని ఎత్తివేయాలి. ♦ డీజిల్ ధరలను తగ్గించాలి. ♦ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు ♦ 60ఏళ్ల పైబడిన రైతులకు వృద్ధాప్య పింఛను ♦ యూపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలి. యాత్రలో పాల్గొన్న రైతులు: సుమారు 70వేలు ఏయే రాష్ట్రాల రైతులు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి. ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది: సెప్టెంబర్ 23న హరిద్వార్లో -
కిసాన్ ర్యాలీ : ఏడుగురు పోలీసులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకు దేశ రాజధాని బాట పట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే క్రమంలో ఢిల్లీ-యూపీ బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఢిల్లీలోకి చొచ్చుకురానీయకుండా నిరోధించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించడంతో పోలీసులు అన్నదాతలను అడ్డుకున్నారు. లాఠీచార్జి, భాష్పవాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రైతులు, పోలీసుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఓ ఏసీపీ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బారికేడ్లను తొలగించవద్దని రైతులను కోరినా వారు వినిపించుకోలేదని ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులే ఆందోళనకారులను రెచ్చగొట్టారని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను, వాటర్ కెనాన్లను ప్రయోగించామని పోలీసులు తెలిపారు. రైతులను ఢిల్లీ చేరుకోకుండా నిలువరించేందుకు 3000 మంది పోలీసులను ఢిల్లీ-యూపీ బోర్డర్లో నియమించారు. స్వామినాధన్ కమిషన్ నివేదికను అమటు చేయాలని, రుణమాఫీ ప్రకటించాలని, ఇంధన ధరలు తగ్గించాలనే పలు డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి రాజ్ఘాట్ వరకూ కిసాన్ క్రాంతి యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. -
కిసాన్ క్రాంతి యాత్ర : రైతులపై ఖాకీ జులుం
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించి లాఠీచార్జి జరపడాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఖండించారు. గాంధీ జయంతి రోజున బీజేపీ ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తిన రైతులను నెట్టివేసిందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టి ఢిల్లీకి వస్తున్న క్రమంలో వారిని బలవంతంగా పోలీసులు తోసివేయడం దారుణమని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. రైతులను ఢిల్లీ రాకుండా ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రస్తుతం రైతులు తమ ఇబ్బందులు తెలిపేందుకు దేశ రాజధానికి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు మోదీ సర్కార్ను తప్పుపట్టారు. రైతులను ఢిల్లీకి వచ్చేందుకు అనుమతించాలని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని..తాము రైతులకు బాసటగా నిలుస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రైతులకు చేసిన వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో వారు ఆందోళనకు పూనుకోవడం సరైనదేనని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ సర్కార్ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, స్వాతంత్ర్యానంతరం రైతులను సంక్షోభంలోకి నెట్టిన తొలి సర్కార్ ఇదేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఢిల్లీలో 144 సెక్షన్ రుణమాఫీ, ఇంధన ధరల తగ్గింపు, చెరకు బకాయిల చెల్లింపు, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన వంటి పలు డిమాండ్లతో రైతులు ఢిల్లీకి చేరుకుంటుండగా, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తూర్పు, ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే రహదారులపై ట్రాఫిక్ పలుచోట్ల నిలిచిపోయింది. యూపీ బోర్డర్లో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలు గుమికూడరాదని, లౌడ్స్పీకర్లు వాడరాదని నిషేదాజ్ఞలు విధించారు. సెప్టెంబర్ 23న హరిద్వార్లో ప్రారంభమైన కిసాన్ క్రాంతి యాత్రలో యూపీలోని పలు ప్రాంతాల నుంచి రైతులు జత కలిశారు. రైతులు పెద్దసంఖ్యలో కాలినడకన, ట్రాక్టర్లలో, వాహనాల్లో తమ తమ గమ్యస్ధానాల నుంచి ఆందోళన బాటపట్టారు. డిమాండ్లపై సర్కార్ సానుకూలం ఢిల్లీ-యూపీ బోర్డర్లో నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చలు జరిపారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై కేంద్రం సానుకూలంగా లేకున్నా ఇతర డిమాండ్లపై మెతకవైఖరి ప్రదర్శించింది. మరోవైపు రైతుల నిరసనలతో యూపీ సర్కార్ దిగివచ్చింది. రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ చేపట్టిన విధానానికి అనుగుణంగా తాము పలు చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తాము తొలిసారిగా సన్న, మధ్యతరహా రైతులకు రుణమాఫీ ప్రకటించామని చెప్పుకొచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. -
రైతుల నిరసనపై విరిగిన లాఠీ..
సాక్షి, జైపూర్ : సమస్యలపై సమరభేరి మోగించిన రైతుల నిరసన హింసాత్మకంగా మారింది. తమ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు రుణ మాఫీ ప్రకటించాలని కోరుతూ శుక్రవారం జైపూర్లో రైతులు పండ్లు, కూరగాయలు, పాలను రోడ్డుపై పారవేసి నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో రైతులు వారిపైకి కూరగాయలను విసిరారు. మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పాలు, కూరగాయల అమ్మకాలను నిలిపివేస్తామని ఆందోళనబాట పట్టిన పలు రాష్ట్రాల రైతులు హెచ్చరించారు. జూన్ 1 నుంచి జూన్ పది వరకూ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తామని 172 రైతు సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిసాన్ ఏక్తా మంచ్, రాష్ర్టీయ కిసాన్ మహా సంఘ్లు ప్రకటించాయి. రైతులు తమ ఉత్పత్తులను గ్రామాల్లోనే విక్రయించాలని, నగరాలకు పంపవద్దని కోరామని భారత్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రజేవాల్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరలు కల్పించడం లేదని, స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదని అన్నారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా పలు రైతు సంఘాలు ఆదివారం భారత్ బంద్కు పిలుపు ఇచ్చాయి. రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. -
అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు సిగ్గుగా లేదా?
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో వేతనాలను పెంచనందుకు సిగ్గుగా లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విజయనగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జి చేయడాన్ని మంగళవారం వైఎస్ జగన్ ట్వీటర్లో తీవ్రంగా ఖండించారు. ‘తమ హక్కుల సాధన కోసం విజయనగరంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై జరిగిన పాశవికమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబూ.. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. మళ్లీ వారిపై తీవ్ర అణచివేత చర్యలకు ఒడిగడతారు. తెలంగాణలో మాదిరిగా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు మీకు సిగ్గుగా లేదా?’అని జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు. Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018 -
మహిళలపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
-
హీరోయిన్ సమంత అభిమానికి చేదు అనుభవం
-
హీరోయిన్ సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్
-
సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్
సాక్షి, చెన్నై: ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన హీరోయిన్ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది దుకాణం ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన సమంత అభిమానులకు చేతులు ఊపుతూ తన కారు ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆమె కారు వద్దకు దూసుకు వచ్చారు. పోలీసులు అప్రమత్తమై సమంతను కారులో ఎక్కించి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులు కారు వైపుకు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల హడావుడి, పోలీసుల లాఠీచార్జ్ నేపథ్యంలో కృష్ణగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. -
‘విద్యార్థినులపై లాఠీచార్జి జరగలేదు’
సాక్షి, వారణాసి : లైంగిక వేధింపులకు నిరసనగా ఇటీవల బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జి జరగలేదని వర్సిటీ వీసీ గిరీష్ చంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. విద్యార్థినులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై లాఠీచార్జి చేశారనే వార్తలను తోసిపుచ్చారు. ‘ఈవ్టీజింగ్ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బయటినుంచి వచ్చి హింసకు పాల్పడిన వారిపైనే పోలీసులు చర్య తీసుకున్నార’ని వీసీ స్పష్టం చేశారు. సంకుచిత ప్రయోజనాల కోసం బయటివ్యక్తులే ప్రతిష్టాత్మక వర్సిటీలో ఈ ఘటనకు పాల్పడ్డారని త్రిపాఠి అన్నారు. వారణాసిలో ప్రధాని పర్యటన నేపథ్యంలోనే ఇవన్నీ కొందరు పనిగట్టుకుని చేశారని ఆయనే ఆరోపించారు. వర్సిటీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు వర్సిటీలో విద్యార్థినులపై పోలీసుల చర్యను పలువురు ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు కోరారు. -
మెదక్ ‘లాఠీచార్జీ’పై విచారణ జరిపించాలి
భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ బహిరంగ చర్చకు మంత్రి హరీశ్ సిద్ధమా?: జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: మెదక్ జిల్లాలో భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జీ ఘటన, పూర్వాపరాలపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బయటి నుంచి వచ్చిన వారు రెచ్చగొట్టడం వల్లనే లాఠీచార్జీ జరిగిందని మంత్రి హరీశ్రావు చెబుతున్నారని.. లాఠీచార్జీలో గాయపడిన 175 మంది వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఘటన వివరాలను వారి ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నందున, నిర్వాసితులకు పరిహారంపై ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర కమిటీల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లో కమిటీ గౌరవాధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యలపై సమావేశాలు పెట్టే వాళ్లను, ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్లను జైళ్లలో వేస్తామని హెచ్చరించడానికి హరీశ్రావు ఎవరని ప్రశ్నించారు. భూములిచ్చేం దుకు రైతులు అంగీకారంతో ఉన్నారని హరీశ్ చెబుతున్నారని, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎం జోక్యం చేసుకుని, వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా రెఫరెండం నిర్వహించకపోతే తామే దానిని నిర్వహిస్తామన్నారు. భూ సేకరణలో రెవెన్యూ యంత్రాం గం టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో కమిటీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, మచ్చా వెంకటేశ్వర్లు, మూడ్ ధర్మానాయక్, బండారు రవికుమార్, టి.సాగర్, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల లాఠీ చార్జ్..మహిళలకు గాయాలు
తోగుట: మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల లాఠీ చార్జ్లో నలుగురు మహిళలకు గాయాలు అయ్యాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సర్వేకు ఆర్డీవో పోలీసులతో కలసి వచ్చారు. వీరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారంపై పూర్తి వివరాలు తెలిపిన తర్వాతే సర్వే చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నలుగురు మహిళలకు గాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. -
శ్రీనివాసపురంలో ఉద్రిక్తత
- పాలేరును కొట్టిన రైతు - ఆందోళనకు దిగిన దళితులు జంగారెడ్డిగూడెం రూరల్ రైతుకు పాలేరుకు మధ్య జరిగిన గొడవ ఓ గ్రామంలో లాఠీచార్జికి దారి తీసింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దళితులకు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసపురానికి చెందిన రైతు సురేష్ దగ్గర ప్రభాకర్ అనే వ్యక్తి పాలేరుగా పనిచేస్తున్నాడు. సురేష్ పొలంలోని పంటను పశువులు పంటను నాశం చేశాయి. పంట నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ రైతు పాలేరుపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పాలేరు బంధువులు ప్రభాకర్కు న్యాయం చేయాలని గ్రామంలో ఆందోళన దిగారు. ఈ సందర్భంగా రైతులకు దళితులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తం మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న దళితులపై లాఠీ ఝుళిపించారు. నాయయం అడిగిన తమపై అన్యాయంగా పోలీసులు లాఠీచార్జి చేశారని దళితులు ఆరోపించారు. -
వెళ్లి తీరుతా, అనుమతించే ప్రసక్తే లేదు..
హైదరాబాద్ : హెచ్ సీయూ మరోసారి అట్టుడుకుతోంది. ఓవైపు వర్సిటీలోకి వెళ్లితీరుతానంటున్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, మరోవైపు అతడిని క్యాంపస్లోకి అనుమతించేది లేదని పోలీసులు ...ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా కన్హయ్య కుమార్ను లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. అయితే కన్హయ్యను వర్సిటీలోకి అనుమతించకుంటే తామే బయటకు వచ్చి సభ నిర్వహించుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. అంతకు ముందు హాస్టల్లో వంట చేసుకుంటున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు, ఇంటర్నెట్, వర్శిటీ క్యాంటిన్లు ఇలా అన్నింటిని మూసేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా అంతకు ముందు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.... పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కన్హయ... రోహిత్లా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. హెచ్సీయూకు వెళ్లి, అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు చెప్పారు. వర్సిటీలో హింసకు వీసీ అప్పారావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మరో వర్సిటీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లం కాదని, కట్టుబడి ఉండేవాళ్లమని కన్హయ్య తెలిపారు. కాగా కొండాపూర్లోని సీఆర్ పౌండేషన్లో ఉన్న రోహిత్ తల్లి రాధికను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు బయల్దేరారు. కాగా హెచ్సీయూ నుంచి పోలీసు బలగాలను తక్షణమే పంపించివేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. -
హెచ్సీయూ ఘటనలో 28మంది విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్ : హెచ్సీయూలో రెండోరోజు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న హెచ్సీయూలో జరిగిన ఘటనకు సంబంధించి 28మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు తమకు అనుమతి ఇవ్వకపోయినా హెచ్సీయూలో నిరసన కార్యక్రమం నిర్వహించి తీరతామని విద్యార్థులు స్పష్టం చేశారు. నిరసన తెలపటం తమ హక్కు అని, వీసీ అప్పారావును తొలగించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. తమకు మద్దతు తెలిపే అందరినీ వర్శిటీకి ఆహ్వానిస్తామన్నారు. విద్యార్థుల నిరసన కార్యక్రమానికి జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ హాజరు కానున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, బయటవారిని వర్శిటీలోకి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 28మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
తరిమి తరిమి కొట్టారు
- హెచ్సీయూలో విద్యార్థులపై మళ్లీ విరిగిన లాఠీ - వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో ఉద్రిక్తత - పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళన.. వీసీ నివాసంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం - ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వీసీ నివాసం ముందు నిరసన - విద్యార్థులను చెదరగొట్టేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిన ఖాకీలు - ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు - వీసీకి మద్దతుగా నిలిచిన నాన్టీచింగ్ స్టాఫ్, ఏబీవీపీ, లైఫ్సైన్స్ విద్యార్థులు - రెండు కేసులు నమోదు.. అదుపులో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు - నేడు వర్సిటీలో రోహిత్ తల్లి దీక్ష.. కన్హయ్య కుమార్ రాక సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ మళ్లీ రణరంగమైంది! విద్యార్థులపై లాఠీలు విరిగాయి. ఖాకీలు విచక్షణారహితంగా దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఒక్కసారిగా విరుచుకుపడి విద్యార్థులను తరిమితరిమి కొట్టారు. ఈ లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. రోహిత్ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వర్సిటీకి మంగళవారం వైస్ చాన్స్లర్(వీసీ) అప్పారావు రావడం, రహస్యంగా బాధ్యతలు చేపట్టడం ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. వీసీ నివాసంపై విద్యార్థుల దాడి, వారిపై పోలీసుల లాఠీచార్జి, ప్రతిగా విద్యార్థుల రాళ్లదాడితో యూనివర్సిటీ రోజంతా అట్టుడికిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 26 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ప్రొఫెసర్లనూ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీసీకి మద్దతుగా నిలిచిన నాన్-టీచింగ్ స్టాఫ్ మంగళవారం సాయంత్రం నుంచి సహాయ నిరాకరణ పేరుతో మెస్ల బంద్కు పిలుపునిచ్చారు. కాక రేపిన వీసీ రాక హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ పొదిలె అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కొందరు విద్యార్థులు దాడికి యత్నించారు. దీన్ని ఖండిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. అప్పారావు నివాసంలోనే ఉండడం గమనించిన విద్యార్థులు అటువైపు చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో కొందరు నాన్ టీచింగ్ ఉద్యోగులు వైస్ చాన్స్లర్కు మద్దతుగా నిలిచారు. వీసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ సిబ్బంది తాము వర్సిటీ మెస్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనల క్రమంలో హెచ్సీయూ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అలోక్పాండే అస్వస్థతకు లోనై కుప్పకూలారు. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది వర్సిటీలోని హెల్త్ సెంటర్కు తరలించారు. వీసీకి స్కూల్ ఆఫ్ లైఫ్సైన్స్ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచారు. నివాసంలో వారు వీసీ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, వ్యతిరేకంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య తోపులాట జరిగింది. లాఠీలతో విరుచుపడ్డ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వీసీ నివాసం వద్దే ఆందోళనలు చేపట్టారు. 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకునే సమయంలో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుపోయారు. విద్యార్థినులను మహిళా పోలీసులు వారి జడలు పట్టుకుని లాక్కెళ్లారు. లాఠీచార్జిలో భాస్కర్, షోహన్, సంజయ్, వరుణ్, అక్షిత, హాసిని, ఫైజల్ అనే విద్యార్థులతోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. విద్యార్థులకు మద్దతు పలికేందుకు వెళ్లిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు గేట్ వద్దే అడ్డుకున్నారు. హెచ్సీయూలో బుధవారం జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వర్సిటీలకు చెందిన విద్యార్థులు మంగళవారమే హెచ్సీయూకు చేరుకున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కూడా వారినీ అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు కార్డులు సమర్పించాలని, అప్పుడే వదులుతామంటూ వేధించారు. మొత్తమ్మీద యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వర్సిటీలో పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైతం తొలిసారిగా వర్శిటీకి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు. -
ఆయనొచ్చారు.. విద్యార్థులపై లాఠీలు విరిగాయి
ముంబయి: పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద పోలీసుల లాఠీలు విద్యార్థులపై సవారీ చేశాయి. ఈ సంస్థ చైర్మన్ గా ఎంపికైన వివాదాస్పద నటుడు గజేంద్ర చౌహాన్ ను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన విద్యార్థులను అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీ ఝులిపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ఎంపికైన తర్వాత తొలిసారి గురువారం బాధ్యతలు స్వీకరించేందుకు ఇన్ స్టిట్యూట్ కు వచ్చారు. అయితే, ఇందులోని కొందరు విద్యార్థులు ఆయన నియామకాన్ని అస్సలు అంగీకరించడం లేదు. గత 139 రోజులుగా కొంతమంది విద్యార్థులు నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తొలిసారి బాధ్యతలు స్వీకరించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో గజేంద్రకు అధికారులు ఘన స్వాగతం ఏర్పాటుచేశారు. అయితే, అక్కడికి వచ్చిన విద్యార్థులు చౌహాన్ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన పేరుపై ఒక ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేసి గురువారంనాటి సమావేశాన్ని ఉద్దేశిస్తూ భేషరమ్(సిగ్గుసిగ్గు) అంటూ పోస్ట్ చేశారు. మహాభారత్ వంటి టీవీ సీరియల్ తోపాటు పలు బీ, సీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన గజేంద్రకు సరైన అర్హతలు లేకుండానే చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, సీనియర్లను పక్కన పెట్టారని ఇప్పటికే పలువురు సినిమా నటులు ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు విద్యార్థులకు కూడా ఆయన నియామకం ఏ మాత్రం ఇష్టం లేదు. -
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
-
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎగబడడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రసాదం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని వారే కాకుండా జిల్లాల నుంచి భక్తులు రావడంతో శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ కిక్కిరిసింది. ఈ తెల్లావారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత మంది తమకు తెలిసిన వారికే ప్రసాదం పంచిపెట్టారు. దీంతో వరుసలో నించున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రసాదం తమకు దక్కదేమోనన్న ఆందోళనతో భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమయినట్టు తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతసేపు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. సరైన ఏర్పాట్లు చేయని నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసాదం పంపిణీ పూర్తయింది. -
పోలీసుల కర్కశత్వం
సమస్యలు పరిష్కరించమంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ర్యాలీకి అనుమతి లేదన్న పేరుతో తమ కర్కశత్వాన్ని లాఠీలతో విద్యార్థులపై చూపించారు. అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగు పరచాలని, నాణ్యమైన ఆహారం అందివ్వాని, మెస్ చార్జీలు తగ్గించవద్దని కోరుతూ నగరంలోని వివిధ హాస్టళ్ల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లాలని వేరే మార్గంలో కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు కలెక్టరేట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి దొరికిన వాళ్లను దొరికినట్టు చావబాదారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. పోలీసుల దౌర్జన్యకాండపై విద్యార్థిలోకం తీవ్రంగా మండిపడుతోంది. సమస్యలు పరిష్కరించమని కొరినందుకే లాఠీచార్జ్ చేస్తారా అంటూ మండిపడుతోంది. లాఠీచార్జ్కి నిరసనగా బుధవారం విశాఖలోని విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. - సాక్షి, విశాఖపట్నం -
విరిగిన లాఠీ
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం వేలాదిగా తరలి వచ్చిన యువత తొక్కిసలాటలో చిరిగిపోయిన సర్టిఫికెట్లు విరుచుకుపడిన పోలీసులు.. లాఠీచార్జి పలువురికి గాయాలు సమాచారంలో విఫలమైన అధికారులు పోలీస్ అవతారమెత్తిన డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దేశభక్తితో కొందరు.. పొట్ట పోషించుకునేందుకు మరికొందరు.. యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని తాపత్ర యపడ్డారు. వీరిలో చాలా మంది శుక్రవారం పోలీసుల లాఠీచార్జ్లొనూ తరవాత తొక్కిసలాటలోనూ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలో తొలిరోజే ఆర్మీ ర్యాలీ గందరగోళమైంది. విశాఖపట్నం: కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది..అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపించింది. నియంత్రణ పేరుతో పోలీసులు చితకబాదడంతో కదల్లేని పరిస్థితి ఎదురైంది. బతుకు జీవుడా అంటూ తీవ్ర గాయాలతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. శుక్రవారం ఆర్మీర్యాలీకి వెళ్లిన నిరుద్యోగులకు ఎదురైన చేదు అనుభవమిది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం ఈ నెల 13వ తేదీ వరకూ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖ, అనకాపల్లి డివిజన్ల అభ్యర్ధులకు టోకెన్లు జారీ చేశారు. దీనికి దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. దరఖాస్తుల్లో సూచించిన తేదీలకు తర్వాత ప్రకటించిన తేదీలకు ఒక రోజు వ్యత్యాసం ఉండటంతో ఇతర డివిజన్ల నుంచి కూడా అభ్యర్ధులు వచ్చేశారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. తాగునీరు కూడా అభ్యర్ధులకు అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. దీని కోసం బారికేడ్లు నిర్మించారు. అక్కడక్కా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందు వచ్చిన వారికి ముందు టోకెన్లు ఇస్తామని అధికారులు చేసిన ప్రకటన అభ్యర్ధులకు చిక్కులు తెచ్చిపెట్టింది. టోకెన్ తీసుకోవాలనే ఆరాటంలో బారికేడ్లుపై నుంచి దూకడం, కింది నుంచి దూరి వెళ్లడం వంటివి చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. టెంట్లు, బారికేడ్లు కూలిపోయాయి. దీంతో తర్వాత నుంచి ఎండల్లోనే కూర్చున్నారు. పక్కనే పళ్ల మార్కెట్, స్టేడియంను ఆనుకుని డ్రైయిన్ ఉండటంతో ఆ డ్రైయిన్లోని ఈగలు అభ్యర్ధులపై దాడిచేశాయి. అవి తేనెటీగలేమోనని బెదిరిపోయిన అభ్యర్ధులు పరుగులు తీయడంతో మరోసారి తొక్కిసలాట జరిగింది. పలుమార్లు లాఠీచార్జ్: టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సైతం పోలీసులు ఉపయోగించే లాఠీ పట్టుకుని యువకులను చావబాదారు. పలుమార్లు జరిగిన లాఠీ చార్జ్లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి తలలు పగిలాయి. కొందరికి కాళ్లు విరిగాయి. ఈ గందరగోళంలో అభ్యర్ధుల పర్సులు, సెల్ఫోన్లు, బ్యాగులు పోయాయి. వెంట తెచ్చుకున్న సర్టిఫికెట్లు చిరిగిపోయాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు. ఖర్చులకు డబ్బుల్లేవ్ రెండో తారీకునే టోకెన్లు ఇచ్చేస్తామని ముందు చెప్పారు. తర్వాత తేదీలు మార్చారంట. ఆ విషయం మాకెలా తెలుస్తుంది.క్లర్క్ పోస్టు పరీక్షకు రెండు రోజుల క్రితమే వైజాగ్ వచ్చేశాం. ఇక్కడ ఉండటానికి ఏమీ లేదు.ఫుట్పాత్లపై పడుకుంటున్నాం. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. -ఎ.రాజు, శ్రీకాకుళం నిబంధనలు మార్చేశారు ఈ సారి ఆర్మీ సెలక్షన్లలో పాత నిబంధనలు మార్చేశారు. గతంలో ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఒకదాంట్లో ఫెయిల్ అయితే మరోదానికి ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు ఒకరు ఒక పోస్టుకే పరీక్షకు హాజరవ్వాలని, ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు రావు. -కె.ఆదిత్య, పరవాడ అంతా గందరగోళం టోకెన్ల జారీ, పరీక్షల తేదీల్లో స్పష్టత లేదు. దీంతో తేదీలు ఖచ్చితంగా తెలుసుకోవాలని వచ్చాం. ఇక్కడ సమాచారం చెప్పేవాళ్లు కూడా లేరు. వచ్చిన తోటి అభ్యర్ధులను అడిగి వివరాలు తెలుసుకున్నాం.మళ్లీ వెనక్కు వెళ్లి రాలేం. ఇక్కడే ఎక్కడో కాలం గడపాలి. -జె.సుధీర్, శ్రీకాకుళం ఎప్పుడో వచ్చాం టోకెన్లు ఇస్తామంటే 2వ తేదీన వచ్చాం. కానీ ఇవ్వలేదు. మళ్లీ ఈ రోజు వచ్చాం. ట్రేడ్మెన్ ఉద్యోగం కోసం పరీక్షకు హాజరవుతున్నాం. ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మాలో చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. -ఎం.అప్పలరామశ్రీను, విశాఖ -
ఆర్టీసీ కార్మికులపై లాఠీప్రతాపం
-
'మా పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషం'
హైదరాబాద్: కరీంనగర్లో శుక్రవారం రైతాంగ సమస్యలపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని తెలంగాణ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతల ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడానికి జిల్లా కలెకర్ట్ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. అధికార టీఆర్ఎస్ నేతలు రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచి.... కరువు, రైతాంగ సమస్యలపై చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. -
క్యాంపు ఆఫీసు వద్ద రైతులపై లాఠీచార్జీ
-
''రైతులపై లాఠీచార్జ్ అమానుషం''
-
బాబూ.. మాట తప్పొద్దు
- ఇంటికో ఉద్యోగం హామీకి కట్టుబడాలి - డీఎస్సీకి డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలి - కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయిన విద్యార్థులు - పోలీసుల లాఠీచార్జి.. పలువురి అరెస్టు కర్నూలు(న్యూసిటీ): ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు విమర్శించారు. డీఎస్సీ-2014లో డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు స్థానిక సి.క్యాంప్ నుంచి మద్దూరునగర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ధర్నానుద్దేశించి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం మాటకు బాబు కట్టుబడాలని.. ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం కల్పించకపోతే రెండు సంవత్సరాలు వృథా అవుతాయనే విషయం గ్రహించాలన్నారు. 2008లో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీలో ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించిందన్నారు. రానున్న డీఎస్సీలో వీరికి అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులు జి.రంగన్న, ఎం.మనోహర్, రమేష్, సోమన్నలను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఎం.మనోహర్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి రమేష్, ఏఐఎస్ఎఫ్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న, నాయకులు రామానాయుడు, రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై తిరగబడిన టిడిపి కార్యకర్తలు
-
పోలీసులపై తిరగబడిన టిడిపి కార్యకర్తలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక వద్ద తెలుగుతమ్ముళ్లుపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. వేదిక వద్ద వీఐపీ గ్యాలరీల్లోకి చొచ్చుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు పోలీసులపై తిరుగబడ్డారు. కుర్చీలు తీసుకొని విసిరివేశారు. వాటిని విరగగొట్టారు. దీంతో వేదిక వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
దెబ్బకు దెబ్బ తీస్తున్న క్రేజీవాల్