
రాయదుర్గం: శ్యాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని కల్గించండం కరోనా ప్రధాన లక్షణమని హెచ్సీయూ విభాగం ప్రొ. లలితా గురుప్రసాద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పరిశోధనలను బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకజాతికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్లకు కేంద్రస్థానాలని భావిస్తున్నామన్నారు. తరచుగా పొందుతున్న ఉత్పరివర్తనలతో ఈ వైరస్ ఇతర జంతువులకి వ్యాప్తిస్తోందన్నారు. కరోనా వైరస్ కొమ్ములాంటి ప్రోటీను నిర్మాణం ఉంటుందన్నారు. ఈ వైరస్ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్–2 గ్రాహకంగా మారుతోందన్నారు. అమెరికాలోని లాస్ ఆల్మాస్ జాతీయ ప్రయోగశాల పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయలనే వెలిబుచ్చారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment