నందికోట్కూర్(కర్నూలు): మొబైల్ షాపులో దొంగలు పడి ఫోన్లు ఎత్తుకెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా నందికోట్కూర్లోని పాతబస్టాండ్ వెనుక భాగంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపు షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణంలో ఉన్న విలువైన మొబైల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొబైల్ షాపులో భారీ చోరీ
Published Fri, Nov 11 2016 8:57 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
Advertisement
Advertisement