అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు | officials acting as party followers | Sakshi

అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

Jul 21 2016 12:28 AM | Updated on Aug 17 2018 2:24 PM

అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు - Sakshi

అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

మాలకొండయ్య ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, జిల్లా టెలికాం అడ్వైజరీ‡బోర్డు సభ్యుడు దూడల శంకరనారాయణమూర్తి ఆధ్వర్యంలో అయితపూడిలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాలకొండయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాలకొండయ్య

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య 
అయితపూడి (కాజులూరు) : ప్రభుత్వాధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, జిల్లా టెలికాం అడ్వైజరీ‡బోర్డు సభ్యుడు దూడల శంకరనారాయణమూర్తి ఆధ్వర్యంలో అయితపూడిలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాలకొండయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ  ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం   పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం 40కి పైగా కొత్తపథకాలను ప్రవేశపెట్టిందన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలను విడుదల చేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా మోదీ మార్కు కనపడకుండా చేసి తెలుగుదేశం నాయకులు అవి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు. పథకాల పంపిణీలోనూ అధికారులు ప్రజలకు వాస్తవాలు తెలపకుండా అధికారపార్టీ నాయకులు సూచించిన వారినే అర్హులుగా ఎంపికచేస్తున్నారని ఆరోపించారు. వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పార్టీ జిల్లా మాజీ  అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీలో చేరిన 25 మందికి మాలకొండయ్య తదితర నేతలు కండువాలుకప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. పార్టీ జిల్లా కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి రామరాజు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మండల కార్యదర్శి యాళ్ళ వీరాంజనేయసతీష్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలాటం శ్రీనివాసు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement