followers
-
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుల బరితెగింపు
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్స్ట్రాగామ్లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
YSRCP నేత జావెద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం
-
విశాఖ HPCLలో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
-
హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారినే పనిలో పెట్టుకోవాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. లేబర్ గేటు వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు.. తమకు అనుకూలంగా వ్యవహారిస్తేనే పనులు సాగనిస్తామని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్పీసీఎల్ పరిశ్రమలో పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.పనులు బహిష్కరించాలని కార్మికులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల ఆరాచకాలతో హెచ్పీసీఎల్ యాజమాన్యం విసిగిపోతోంది. తెర వెనక ఉండి ఎమ్మెల్యే గణబాబు కథ నడిపిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
టార్గెట్ వంశీ.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపులు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.గన్నవరం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్లపై వైఎస్సార్సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యుద్ధానికి సిద్ధం.. ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా!
-
అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
-
ఎక్స్లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం. -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
జగన్ ను కలిసేందుకు పోటెత్తిన అభిమానులు
-
హిందూపురంలో బాలకృష్ణ హింసా రాజకీయం
-
ట్రెండ్ సెట్టర్.. 100M క్రాస్..
-
ప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. -
ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు
-
‘ఎక్స్’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్’హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. దేశంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్బాల్ క్రీడాకారుడు నెయ్మార్కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్ స్విఫ్ట్కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్ కర్దాషియన్కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
కుప్పంలో దారుణం..
-
పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు..
-
పోలీస్ స్టేషన్ లో YSRCP నేతపై టీడీపీ దాడి
-
చిత్తూరులో ఆగని టీడీపీ హింసాకాండ
-
YSRCP కార్యకర్తలపై టీడీపీ దాడులు..
-
విధ్వంసమే విధానమా..?
-
క్యాష్ ‘హంట్’
జనాలతో సందడిగా ఉండే ప్రాంతం అది..ఒక వ్యక్తి తొందరతొందరగా వచ్చి ఫుట్పాత్పై ఉన్న చెత్తకుండీకి అంటించి ఉన్న కవర్ తీసుకొని అందులోని 500 రూపాయల నోట్ జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. మనుషులే లేని మరో నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన పాతబస్టాండ్లోకి వేగంగా వెళ్లి ఇనుప చువ్వలో దాచిన వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్లాడు మరొకతను. వ్యూస్, లైక్స్ కోసమేనా?? సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్బండ్, సచివాలయం, అసెంబ్లీ, క్రికెట్ స్టేడియం వంటి పరిసర ప్రాంతాలతోపాటు బస్టాండ్లు, పార్కులు, ఫ్లైఓవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. నగరంలో న్యూ ట్రెండ్గా మారింది ఈ తరహా ట్రెజర్..కాదుకాదు క్యాష్ హంటింగ్. నగరంలోనే కాదు..నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో సైతం మనీ హంటింగ్ కొనసాగించడం విశేషం. కొందరు వ్యక్తులు ఇలా డబ్బులను వివిధ ప్రాంతాల్లో పెట్టి అంతా వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు. వీటి కోసం ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా ప్రత్యేకంగా సైట్లు, సోషల్ పేజ్లు తయారు చేసుకున్నారు. ఇందులోని ఫాలోవర్స్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లో అక్కడకు చేరుకొని డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. మరికొందరు యాక్సెసరీస్ ప్యాక్ చేసి పెట్టి వారి స్టోర్ లేదా బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సోషల్ మీడియా అకౌంట్లకు పెద్దఎత్తున ఫాలోవర్స్ ఉండటం విశేషం. సోషల్మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్ను ఆకర్షించడం, వ్యూస్, లైక్స్ సంఖ్య పెంచుకోవడానికి ఈ తరహా ట్రెజర్ హంటింగ్ నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సోషల్మీడియాలో ఫేమ్తో పాటు యాడ్స్ రూపంలో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు హంట్ వీడియో పెడతారా అని ఫాలోవర్స్ చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఎవరు ముందు వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారనేది కూడా వీడియో తీసి అదే సోషల్ సైట్లలో పెడుతుంటే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్మహల్కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు. -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్ప్రదేశ్లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్ను ‘ఇన్స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్స్టాగ్రామ్కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోలు వీరే
హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని ఫాలో అయ్యేవారి సంఖ్య (ఫాలోవర్స్) 25 మిలియన్స్ కు చేరుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించి, తగ్గేదే లే అంటున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అదే విధంగా ఆ మూవీకి ఉత్తమ నటుడి కేటగిరీలో తెలుగులో జాతీయ అవార్డు సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించారాయన. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు అల్లు అర్జున్. అందులో భాగంగానే దక్షిణాదిలో అత్యధిక ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్ను క్రియేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హీరో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో హీరో రామ్ చరణ్ (20.8మిలియన్లు) ఉన్నారు. -
‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాంచి(మధ్యప్రదేశ్)లో 71వ మహాబోధి మహోత్సవం ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఉత్సవంలో భగవాన్ గౌతమ బుద్ధుని సన్నిహిత శిష్యుల అస్థికలను అనుచరుల దర్శనం కోసం అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 7 గంటలకు అస్థికల కలశ యాత్రను మహాబోధి సొసైటీ కార్యాలయం నుంచి చెతీస్గిరి వరకూ నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం ఆ కలశాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీలంక, వియత్నాం, థాయ్లాండ్, జపాన్తో సహా పలు దేశాల బౌద్ధ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీలంక మహాబోధి సొసైటీ చీఫ్ వంగల్ ఉపాథిస్ నాయక్ థెరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి సాంచి చేరుకున్నారు. ఊరేగింపు సందర్భంగా సాంచిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారుజామున కళాకారులు ఢోలక్, వేణువుల శ్రావ్యమైన రాగాలకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సాంచి వీధుల్లో నడిచారు. ఈ ఊరేగింపు సాంచి స్థూపం వద్దనున్న చెటియగిరి విహార్కు చేరుకుంది. అక్కడ బుద్ధ భగవానుని శిష్యులైన అర్హంత్ సారిపుత్ర, అర్హంత్ మహామొగ్గలన్ల అస్థికలను నేలమాళిగలో నుండి బయటకు తీసి పూజలు నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం వాటిని ప్రత్యేక స్థలంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, అనుచరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు.. -
బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్ఎస్ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు. తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు. మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. వారితో చెడిందా? ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చదవండి: కాంగ్రెస్ను వీడనున్న నాగం జనార్దన్రెడ్డి? -
ఆనంద్ మహీంద్రను దాటేసి మరీ టాప్లోకి రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్లో ప్లేస్ కొట్టేశారు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) ఈ జాబితాలో టాప్ టెన్లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్బర్గ్ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్ను ప్రారంభించింది. కొత్త ఛానెల్కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
సుకుమారి సూపర్ స్టంట్స్
పాపులర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్స్టాగ్రామ్లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి. ‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్. -
సైక్లింగ్తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్,అస్సాం, వెస్ట్బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్లాండ్లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 3,15,000 మంది, యూట్యూబ్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
కాంగ్రెస్లోకి వేముల వీరేశం?
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నకిరేకల్కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
అదంతా ఉత్తదే! ఎలాన్ మస్క్పై షాకింగ్ రిపోర్ట్
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది. ఎక్స్ (ట్విటర్)లో ఎలాన్ మస్క్కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్’ (Mashable) అనే టెక్ వెబ్సైట్ నివేదించింది. మస్క్కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్ ప్రీమియం (ట్విటర్ బ్లూ) సబ్స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని రిపోర్ట్ వెల్లడించింది. -
తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్కే తుమ్మల అనుచరులు జై.. పాలేరు బీఅర్ఎస్లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం. కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది. -
జనగామలో టెన్షన్ టెన్షన్.. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
సాక్షి, జనగామ: బీఆర్ఎస్లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు -
ఇన్స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి అసూయ, అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త... కన్న పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు.. లక్నోలోని పారా ప్రాంతంలో వ్యాపారవేత్తకు భార్య 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేగాక ఇన్స్టాగ్రామ్లో భార్య తనను బ్లాక్చేయడంతో భర్తకు కోపం వచ్చింది. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను సోషల్ మీడియా ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి కారులో రాయ్బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. నిందితుడు మధ్యలో సుల్తాన్పూర్లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్ చేసుకుని ఉండిపోయాడు. ఊహించని ఘటనతో పిల్ల్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. అనుమానాస్పదంగా కారు పార్కింగ్ చేయడంతో పెట్రోలింగ్ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో బన్నీ. ఐకాన్ స్టార్గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. బన్నీ విషయానికోస్తే ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పటికే ఇన్స్టాలో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ యాప్ను జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ యాప్లోను ఐకాన్ రికార్డ్ సృష్టించాడు. ఇండియాలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి నటుడిగా నిలిచారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యాప్ ఏదైనా ఐకాన్ స్టార్ తర్వాతే ఎవరైనా అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!) Icon star @alluarjun is ruling threads as he becomes the first Indian actor to hit 1 Million followers on the app. Not only is he setting the silver screen on fire with his incredible performances, but he's also ruling the digital world and has managed to create a deep connection… pic.twitter.com/sejrIV8Nv5 — Sarath Chandra Naidu (@imsarathchandra) July 24, 2023 -
తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్లో పొన్నం అనుచరుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, పొన్నం ప్రభాకర్కు మద్ధతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఈ రోజు ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలివచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. రేవంత్కు వార్నింగ్! మరో వైపు, హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశంలోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. -
2023లో టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఫాల్లోవర్స్
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అయితే ఆటలో మాత్రమే అతను కింగ్ అనిపించుకోవడం లేదు.. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల విషయంలోనూ కోహ్లి తనకు తానే సాటి. ఇటీవలే ఐపీఎల్ రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లి తాజాగా ఇన్స్టాగ్రామ్లో 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లి నిలిచాడు. టీమిండియా తరపున ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్గానూ కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కోహ్లి తర్వాత ఎంఎస్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు ఇన్స్టాలో 40.3 మిలిమిన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్లో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. రొనాల్డోను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవారి సంఖ్య 585 మిలియన్. రొనాల్డో తర్వాత లియోనల్మెస్సీ 462 మంది మిలియన్ ఫాలోవర్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడంలో మరోసారి విఫలమైంది. సీజన్లో మంచి విజయాలు నమోదు చేసినప్పటికి ఆర్సీబీ ప్లేఆఫ్లో అడుగుపెట్టలేదు. అయితే కోహ్లి మాత్రం రెండు సెంచరీలు సహా ఐదు అర్థసెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించి తన సూపర్ఫామ్ను కంటిన్యూ చేశాడు. చదవండి: కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్ ఉల్ హక్ ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?' -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్గా చెలరేగిపోతుంది. చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్గా ఉండే రష్మిక తరచూ సినిమాలు, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మిక ఇన్స్టాగ్రామ్లో మరో మైలురాయిని చేరుకుంది. 38 మిలియన్ ఫాలోవర్స్తో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్లో ఒకరిగా రష్మిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మార్క్ను చేరుకున్న తొలి హీరోయిన్గానూ క్రేజ్ దక్కించుకుంది. సమంతకు 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, కాజల్కు 25.4, తమన్నాకు 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఉదయ భాను కొత్తంటిని చూశారా?భలే రిచ్గా ఉందే! View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
దళపతి విజయ్.. థియేటర్లే కాదు.. సోషల్ మీడియా కూడా షేక్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఆయనకు భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇటీవలే వారసుడు(వారీసు) మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో టచ్లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సినీతారలు ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఇన్స్టాలో ఖాతా లేదంటే విచిత్రంగా ఉంది కదూ. అవునండీ తాజాగా దళపతి విజయ్ తన ఇన్స్టా ఖాతాను తెరిచారు. ఇంకేముంది ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. విజయ్ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే ఏకంగా 4.6 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేశారు. ఖాతా ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ల ఫాలోవర్స్ చేరిన తొలి ఇండియన్గా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ విషయంలో విజయ్ మూడోస్థానం దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ(43 నిమిషాలు), ఎంజెలీనా జోలీ(59 నిమిషాలు) ఉన్నారు. దీంతో నెటిజన్స్ దళపతి విజయ్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు కేవలం 15 గంటల్లో 3.9 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. విజయ్ ఇన్స్టాలో ఎంట్రీ ఇస్తూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇన్స్టాలో రాస్తూ.. 'హలో నంబా అండ్ నంబిస్' వెల్కమ్ సందేశం ఇచ్చారు. కాగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ షూటింగ్లో ఉన్నారు. గతంలో ట్విటర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు. దళపతికి ఇప్పటికే ఫేస్బుక్లో 7.8 మిలియన్లు, ట్విట్టర్లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
అనంతపురంలో పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
-
తగ్గేదే లే
సోషల్ మీడియాలో ఫాలోయర్స్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్. ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ఫాలోయర్స్ జాబితా 20 మిలియన్స్ (2 కోట్లు)కు చేరింది. దక్షిణాదిన ఈ ఫీట్ను సాధించిన తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అయితే ‘పుష్ప’ తొలి భాగం రిలీజ్కు ముందు అల్లు అర్జున్కు ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్ల ఫాలోయర్లు ఉంటే ఆ సినిమా విడుదల తర్వాత వచ్చిన 20 మిలియన్స్కు చేరుకుందని అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
వరల్డ్కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు. ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్కప్ను అందించాడు. ఈ వరల్డ్కప్లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్తో పాటు మూడు అసిస్ట్లు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్స్టాగ్రామ్లో మెస్సీ 400 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు -
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్ప్రదేశ్లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్ప్రదేశ్లో ఆర్తి రాజ్పుత్ అనే యువతి ఈ రీల్స్కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, వాట్సప్లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
ఆనంద్ మహీంద్ర అద్భుత రికార్డ్, అదిరిపోయే చమక్కు
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్ సాధించారు. సోషల్ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు. అంతేకాదు ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ, తనదైన శైలిలో చమత్కరించడం విశేషం. దీంతో పలువురు ఫ్యాన్స్ ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు ‘‘ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి అందరికీ బిగ్ థ్యాంక్స్..ఇకపై నాతో కలసే ఉండండి’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే ఒక జిఫ్ను షేర్ చేయడంతో నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందన తెలియజేస్తున్నారు. (మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం) కాగా ఆనంద్ మహీంద్ర అంటే బిజినెస్ వర్గాల్లోనే కాదు, ట్వీపుల్లో బాగా పాపులర్ అయిన పేరు. ఎందుకంటే వింతలు, విజ్ఞానం, సైన్స్, లేటెస్ట్టెక్నాలజీ అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేయడం ఆయనకు అలవాటు. ఆ స్పెషాలిటీనే కోటి మంది అభిమానులకు చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 -
వైఎస్సార్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి
-
ఎఫ్బీలో జుకర్బర్గ్కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్బర్గ్కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్బర్గ్తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
ఫేస్బుక్లో అన్ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్బర్గ్కు తిప్పలు తప్పలేదు. జుకర్బర్గ్కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్గా మెసేజ్లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
'రాధేశ్యామ్'కు ముందే ప్రభాస్ అరుదైన రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుమారు రూ. 300కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో కొనసాగుతున్నాయయి. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటికే ప్రపంచమంతా క్రేజ్ ఉన్న ప్రభాస్ తాజాగా మరో మైల్స్టోన్కి రీచ్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఆయన ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య 8మిలియన్స్కి పైగా చేరుకుంది. అయితే సోషల్ మీడియాకు దూరంగానే ఉండే ప్రభాస్ కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ‘సలార్', ‘ప్రాజెక్ట్-K’ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. -
రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానొ రొనాల్డో పేరిట ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. మైదానంలో తన ఆటతో రికార్డులను సొంతం చేసుకునే రొనాల్డో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్ను టచ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం అటు ఆటగానిగా.. ఇటు వ్యక్తిగా ఏ విధంగా చూసినా ఇన్స్టాగ్రామ్లో 400 మిలియన్ ఫాలోవర్ల సంఖ్య రొనాల్డోకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే రొనాల్డో తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెరికన్ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఫాలోవర్ల సంఖ్య 309. వీరిద్దరి మధ్య దాదాపు వంద మిలియన్లు తేడా ఉంది. ఈ మధ్యనే రొనాల్డో(ఫిబ్రవరి 5న) తన 37వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది సెప్టెంబర్లో ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 230 మిలియన్గా ఉండేది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన ఫాలోయింగ్ను డబుల్ రేంజ్కు పెంచుకున్నాడు. గతేడాది 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. సూపర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అదే సమయంలోనూ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లోనూ తన ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నాడు. కాగా రొనాల్డో తన ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు 3,242 పోస్టులు చేశాడు.. విచిత్రమేంటంటే రొనాల్డో తాను ఫాలో అవుతున్న సంఖ్య 501 మాత్రమే. చదవండి: కోల్కతా థండర్బోల్ట్స్ ఉత్కంఠ విజయం -
మా గొంతు నొక్కేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్ వెల్లడించింది. తమ ప్లాట్ఫామ్పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ సైనియడ్ మెక్స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు. కేంద్రమే కారణం తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది. -
కెప్టెన్ గేమ్ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరో రికార్డు క్రియేట్ చేసిన రౌడీ హీరో
Vijay Deverakonda Hits 14 Million Followers on Instagram: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్కు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సోషల్ మాధ్యమాల్లోనూ విజయ్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్ ఫాలోవర్స్తో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ తర్వాత ఈ ఘనతను సాధించిన టాలీవుడ్ హీరో విజయే కావడం విశేషం. ఈ సందర్భంగా రౌడీ హీరోకు ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. #14MRowdiesOnInsta పేరుతో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లయినా తగ్గని ‘చందమామ’ క్రేజ్.. ఇన్స్టాలో 20 మిలియన్ల ఫాలోవర్స్
టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. రామ్ చరణ్ హీరోగా చేసిన ‘మగధీర’తో టాప్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది. అందచందాలతో అభిమానుల మనసులు దోచిన ఈ తార.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్ మరింతగా పెంచుకుంటూ పోయింది ఈ భామ. అంతేకాకుండా కొన్ని మూవీస్తో బాలీవుడ్ ప్రేక్షకులని సైతం పలకరించింది ఈ బ్యూటీ. అయితే కాజల్ ఇటీవల స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లాయిన తర్వాత కొంతమంది హీరోయిన్ల క్రేజ్ పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈ చందమామది ఏ మాత్రం తగ్గలేదని.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకోవడం చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఖాతాలో 20 మిలియన్ల (2కోట్లు)కు ఫాలోవర్స్ వేసుకుంది. తన జోరు ఇలాగే కొనసాగితే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది కాజల్. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర వరకు షూటింగ్ను పూర్తి చేసిన ఈ బ్యూటీకి చిరుతో రెండో మూవీ. కాగా ఇటీవల సినిమాలను తగ్గించేసింది ఈ భామ. దానికి కారణం తను గర్భవతి కావడమేనని ఫిల్మీ దునియాలో ప్రచారం జరుగుతోంది. చదవండి: హబ్బీతో హాలిడే ట్రిప్, స్టన్నింగ్ ఫోటోలు -
కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..!
న్యూఢిల్లీ: క్రికెట్లో రికార్డుల రారాజుగా చలామణి అవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే, ఈ సారి కింగ్ కోహ్లి రికార్డును క్రియేట్ చేసింది క్రికెట్లో మాత్రం కాదు. కోహ్లి.. ఇన్స్టాగ్రామ్లో 150 మిలియన్ల (15 కోట్లు) ఫాలోవర్ల రేర్ ల్యాండ్ మార్క్ను క్రాస్ చేసి సోషల్మీడియా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల్లో నిలిచాడు. భారత్లోనే కాక ఆసియా ఖండం మొత్తంలో ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి కోహ్లినే కావడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్స్టాలో అత్యంత ప్రజాదరణ(ఫాలోవర్స్) కలిగిన క్రీడాకారుల్లో కింగ్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్మార్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, టీమిండియా కెప్టెన్కు ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్బుక్ (48 మిలియన్లు)లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కోహ్లి ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా ఏకంగా రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. చదవండి: "కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు".. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు -
ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సమంత అంత సంపాదిస్తుందా?
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేశావే' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ను కొనసాగిస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో సమంత యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు తనకి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఫాలోయింగ్ విషయంలోనూ సౌత్లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. దీంతో దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్ట్కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పలు టీవీ యాడ్స్ నుంచి కూడా లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటుందట. దీంతో సినిమాలకు ధీటుగా పాటు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తూ షాక్ ఇస్తుంది అక్కినేని కోడలు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ట్విటర్లో కీలక మైలురాయి దాటిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాకర్షక నాయకుడిగా ప్రధానమంత్రి ఒకరిగా ఉన్నారు. మోదీకి దేశంలో అత్యంత ప్రజాదరణ ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. పలు ఆసక్తికరమైన పోస్టులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్లో ఏడు కోట్ల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకుని అగ్రభాగాన నిలిచారు. మొత్తం 70 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకుని కీలక మైలురాయిని దాటేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ 2009లో ట్విటర్ ఖాతా తెరిచారు. 2010 వరకు ఆయన ఫాలోవర్లు లక్షకే పరిమితమయ్యారు. పదకొండేళ్ల అనంతరం అంటే 2021కి ఏకంగా ఏడు కోట్లకు పైగా ఫాలోవర్స్ను పెంచుకున్నారు. ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక నరేంద్రమోదీని ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు మోదీ సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు దేశం, ప్రపంచంలో జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తుంటారు. పలుసార్లు సామాన్య ప్రజలను కూడా ట్విటర్ ద్వారా పలకరించి ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకే ప్రధాని మోదీకి ట్విటర్లో ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. ప్రధాని ఈ మైలురాయిని అధిగమించడంపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్పందించారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి, నిర్ణయాత్మక చర్యలు ప్రజాదరణను మరింత పెంచుతోంది. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకుని మరో మైలురాయి దాటిన ప్రధానికి నా శుభాకాంక్షలు. మీ నాయకత్వంతో మేం గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. PM @NarendraModi ji's personal connect, vision and decisive actions keep adding to his surging global popularity. Congratulations to our Prime Minister on another milestone of 7 crore twitter followers. We are proud of and inspired by your leadership. pic.twitter.com/xSKFMzHmSm — Piyush Goyal (@PiyushGoyal) July 29, 2021 -
అక్కడ 'రౌడీ'ని కోటి మంది ఫాలో అవుతున్నారు
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు ఈ రౌడీ హీరో. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ‘వాట్సప్.. వాట్సప్ మై రౌడీస్’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్ అంటే బోలెడంత ప్రేమ. అలా సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్ను పెంచుకుంటున్న విజయ్ ఇప్పుడు మరో రికార్డును సాధించాడు. ఫేస్బుక్లో 10 మిలియన్ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్ ఒకరు. ఇక ఇటీవలె విజయ్ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్తో విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్తో పాన్ ఇండియా మూవీ ‘లైగర్' చేస్తున్న సంగతి తెలిసిందే. -
రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
మెగా పవర్స్టార్ రామ్చరణ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఇన్స్ట్రాగ్రామ్లో 4 మిలియన్స్(40 లక్షలు) ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. సౌత్ నుంచి నాలుగు మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కొద్ది మంది హీరోలో రామ్ చరణ్ ఒకటిగా నిలిచాడు. మిగతా యంగ్ హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే చెర్రీ.. ఇటీవల చాలా చురుగ్గా పోస్టులు పెడుతున్నాడు. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇక ట్విటర్లో చరణ్కు 1.3 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం చెర్రీ తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. -
అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు
Allu Arjun: అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు స్నేహ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్స్ట్రాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్లో ఏ హీరో భార్యకు లేనంత మంది ఫాలోవర్స్ని ఆమె సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాలో ఆమె 4 మిలియన్స్కి పైగా ఫాలోవర్స్తో దూసుకెళ్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం విశేషం. అల్లు స్నేహ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన 3.3 మిలియన్స్, మహేశ్బాబు భార్య నమ్రత 2 మిలియన్స్ ఫాలోవర్స్లో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’! -
Jr NTR: తారక్ రికార్డు.. తక్కువ పోస్టులతోనే ఆ ఘనత
టాలీవుడ్లో మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాడు. ఎప్పుడో ఒక్కసారి, ముఖ్యమైన సమాచారం ఉంటే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడు. కానీ అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ తన ట్విటర్లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్స్లో ఒకరిగా తారక్ నిలిచాడు. మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒక్కరోజే ఈయనను దాదాపు 2 వేల మంది ఫాలో అవ్వడం గమనార్హం. ఇక తమ అభిమాన హీరో ట్విటర్లో 50 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. చదవండి: ఆ సినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడ్డాం : రాశిఖన్నా బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్ -
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు
తమిళ సూపర్ స్టార్ శింబు ఇన్స్టాగ్రామ్లో 1మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది అక్టోబర్లో ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన శింబు ఏడాది కూడా పూర్తి కాకుండానే 1మిలియన్ మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులకు శింబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది చెన్నైలోని ఓ కాలేజీ ఈవెంట్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ 1 మిలియన్ ఫాలోవర్స్కి థ్యాంక్స్ చెప్పాడు. ఇక లేట్గా ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చినా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మానాడు’ సినిమాలో శింబు నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి :Rangam: జీవా ప్లేస్లో శింబు, ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Silambarasan TR (@silambarasantrofficial) -
'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పికప్పుడు అప్డేట్స్ను షేర్ చేస్తూ ష్యాన్స్తో టచ్లో ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. కొద్ది రోజుల కిందటే విజయ్ దేవరకొండ ఈ ఫీట్ను అందుకోగా, ఆ తర్వాతి స్థానంలో బన్నీ ఉన్నాడు. మిగతా స్టార్స్ మహేష్ బాబు (6.8), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6), మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా వీళ్లందరిని వెనక్కి నెట్టి ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్ల ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఫిల్మ్లో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. చదవండి :Pushpa Movie: రెమ్యునరేషన్ భారీగా పెంచిన బన్నీ, ఎంతంటే.. త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ! -
ఆ ఫౌండేషన్ నాది కాదు: సోనూసూద్
ముంబై: లాక్డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. -
అందరికీ హగ్గులు, ముద్దులు ఇచ్చిన పూజా, ఎందుకంటే?
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటు దక్షిణాది అటు ఉత్తరాది అభిమానులను రౌండప్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలు చేస్తున్నారు కాబట్టి ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అందుకే ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యూటీని ఫాలో చేస్తున్నవారి సంఖ్య 13 మిలియన్ల (1 కోటీ 30 లక్షలు) కు చేరుకుంది. యోగా, జిమ్ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు పూజా హెగ్డే. అలాగే తన సినిమాల సమాచారాన్ని కూడా ఇస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారామె. అందుకే రోజు రోజుకు ఆమె ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్లో 13 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకున్న సందర్భంగా.. ‘‘అందరికీ (ఫాలోయర్లు, అభిమానులు) థ్యాంక్స్ లవ్లీస్.. మీ అందరికీ నా హగ్గులు, ముద్దులు’’ అన్నారు పూజా హెగ్డే. చదవండి: కరోనాతో డ్రైవర్ మృతి.. హోం ఐసోలేషన్లో రామ్ చరణ్ -
సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. భర్త మరణం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటారు. పార్టీలు, పబ్లు అంటూ కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్ చేస్తుంటారు. దీంతో అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. సోషల్మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సుప్రీత..వరుస పోస్టులతో తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతుంది. అయితే సడెన్గా ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా సుప్రీతను అన్ఫాలో చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే కొత్తగా 321 మంది కొత్తగా ఫాలో అయితే..422 మంది అన్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన లిస్ట్ను సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలోపోస్ట్ చేస్తూ..ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ ..ఎందుకు అన్ఫాలో అవుతున్నారు అంటూ తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం ఆమెకు 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చదవండి : 'అలాంటి వాళ్లను నమ్మొద్దు.. అప్పుడే సంతోషంగా ఉంటాం' ఉన్న న్యూస్ చెప్పండి: సురేఖా వాణి కూతురి ఫైర్