బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం
విజయవాడ: విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్లో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరులు వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం రాయపాటి అనుచరులు ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న నాగభూషణం అనే వ్యక్తిపై వారు దాడికి చేశారు. పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు.