ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్ కలాం అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మన్సూర్ రహమాన్కు ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు–2016కు ఎంపికయ్యారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని వేరిగోల్డ్ ఆడిటోరియంలో ' గ్లోబల్ ఎకనామిక్ రిసర్చ్ అండ్ ప్రోగ్రెస్ ఫౌండేషన్, ఇండియన్ అబ్జర్వర్ పత్రికలు సంయుక్తంగా అవార్డును శనివారం బహుకరించనున్నాయి. విద్యారంగంలో చేసిన పరిశోధనాత్మక కృషి ఈ పురస్కారం లభించినట్లు రహమాన్ తెలిపారు.