Abdul Kalam APJ
-
కలాం వర్ధంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేడు. ఈ సందర్భంగా.. కలాంను కొనియాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కలాంకు నివాళులర్పించారు. Remembering Dr. APJ Abdul Kalam, Former President of India, great scientist, and inspiring personality, on his death anniversary. His vision, humility, and unwavering dedication to education and innovation continue to inspire us. Let's honour his legacy by striving for excellence… pic.twitter.com/6u4B1tZsvD— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 -
నిన్ను సంతోషంగా కానీ.. దుఃఖంతో కానీ.. ఉంచేది నీ మనసే!
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు. పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు. నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే. అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
-
ఈ మౌన ముని.. ‘పోఖ్రాన్–2’ పథ నిర్దేశకుడు
1996 మే 8. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాంకు వర్తమానం వచ్చింది – రాత్రి 9 గంటలకు ప్రధానిని కలవమని. పి.వి.నరసింహారావు ప్రధాని. కలాం ప్రధానికి శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారు, డీఆర్డీఓ కార్యదర్శి. ‘‘కలాంగారూ, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్, మీ బృందం పరీక్షలకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ పరీక్షలకు డీఆర్డీఓ, డీఏఈ సిద్ధంగా ఉండాలి’’– అని కలాంకు ముఖాముఖిగా చెప్పారు పీవీ. అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించలేదు. 1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టర్ ఆర్. చిదంబరం కలసి అంతకుముందురోజే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అటల్ బిహారీ వాజ్పేయిని కలిశారు. పీవీ ప్రధానికి ఓ చీటీ ఇచ్చారు. వాజ్పేయి కేవలం 13 రోజులు పని చేసి, మెజారిటీ చాలదనే కారణం మీద జూన్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న వాజ్పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 మే 22 దాకా పదవిలో ఉన్నారు. 2004 క్రిస్మస్ రోజులు. డిసెంబర్ 23న పీవీ కన్నుమూశారు. గ్వాలియర్లో వాజ్పేయి రచయితల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ విషయం బయటికి చెప్పవద్దని పీవీ కోరారు. కానీ ఆయనే గతించారు. చెప్పడం తన విధి’ అని ప్రకటిస్తూ 1996 మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. ‘సామగ్రి తయ్యార్ హై’ అని రాసిన చీటీ లోగుట్టు చెప్పేశారు. ‘అణుపరీక్షలకు అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు’ అని దాని అంతరార్థం. పీవీనే పోఖ్రాన్– 2 న్యూక్లియర్ ప్రోగ్రాం మూలపురుషుడు అని ఆ రోజు వాజ్పేయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్లో పీవీ ప్రారంభించిన భూసంస్కరణలు, విద్యాసంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని చేశాయి. ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలలో భారత్ ధోరణి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అణుశక్తి రంగంలో ఆయన చూపిన చొరవ, వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావన రాలేదు. 1996 మే నెలలో జరగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి 1995 డిసెంబర్లో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆరునెలలు వాయిదా పడ్డాయి. 1995 నవంబర్ చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు అబ్దుల్ కలాం, ఆర్.చిదంబరంకు టి–30 కార్యక్రమం నిర్దేశించారు. ముప్పయి రోజుల్లో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే డిసెంబర్ 15న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి సంచలనం రేపింది. మరోవైపు సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి డిసెంబర్లో అణు పరీక్షలు జరుపలేదు. మరి మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు పీవీ? ఎందుకంటే 1995 డిసెంబరు నాటికి హైడ్రోజన్ బాంబు సిద్ధం కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలల వ్యవధి అడిగారు. అంతేకాకుండా థార్ ఎడారిలో పోఖ్రాన్ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢచారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టిం చాలో కూడా ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉంటే 1995 డిసెం బర్లో కొన్ని పరీక్షలు జరిపి ఉండేవారు పీవీ. కానీ ఆయన ఆవిధంగా ఆలోచించలేదు. నరసింహా రావు కనుమూయడానికి కొన్నినెలల ముందు జర్నలిస్టు శేఖర్ గుప్తా ఈ విషయం అడిగితే– ‘భయ్యా కొన్ని రహస్యాలు నా పాడెతోనే పోనీవోయ్’ అని పీవీ అనడం అందరూ టీవీల్లో చూశారు. పోఖ్రాన్–2 అణుపరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని అంగీకరించింది. అదేవిధంగా పీవీ ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానులు సీటీబీటీ, ఎన్పీటీ ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. కనుకనే ఈ విషయాలన్నీ దగ్గరగా చూసిన అబ్దుల్ కలాం– దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడటం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది. వ్యాసకర్త సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 డా. నాగసూరి వేణుగోపాల్ -
అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆన్లైన్ పోటీలు
కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్షిప్ ఆన్లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లైవ్లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
కలాం ఆశయాలకు కార్యరూపం
రైతు భరోసా కేంద్రాల వల్ల భవిష్యత్లో అద్భుతాలు చూస్తాం.. సాక్షి ప్రతినిధి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: ‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా తెలిసింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఆశయాలకు కార్యరూపంగా అద్భుతమైన ప్రణాళికతో ఆర్బీకే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. కలామ్ ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల్లోని సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ అయ్యేలా వీటిలో ఏర్పాట్లు చేశార’ని తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ క్యాంపస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత జి.కృష్ణారెడ్డి చెప్పారు. ఆర్బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని సి.రామాపురం, పూతలపట్టు మండలం వావిల్తోట, గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు, చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అక్కడి ఆర్బీకేలలో గుర్తించిన విషయాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. వ్యవసాయ రంగానికి మంచి ప్రోత్సాహం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రోత్సాహం అందించారు. సేంద్రియ విధానంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. – రాగమ్మ, మహిళా రైతు, కుప్పం బాదూరు, ఆర్సీ పురం మండలం ఏం కావాలన్నా చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది పంటల సాగుకు ఏం కావాలన్నా 15 కిలోమీటర్ల దూరంలోఉన్న చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది. అధిక ధరల భారంతో పాటు, రవాణా ఖర్చు కూడా ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని గ్రామంలోనే పొందే వెసులుబాటు కలిగింది. – టి.గోవిందయ్య, రైతు, వేల్కూరు, గంగాధర నెల్లూరు మండలం రైతుల ఇంటికే విత్తనాలు సి.రామాపురం ఆర్బీకేని పరిశీలించేందుకు వెళ్లగా.. రామ్మోహన్ అనే రైతు కనిపించారు. ఆయన్ని కదిలించగా ‘మండల కేంద్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకునేవాళ్లం. గంటల తరబడి నిరీక్షించినా విత్తనాలు దొరికేవి కాదు. అనవసర ఖర్చు పెరిగేది. ఇప్పుడవేవీ లేకుండా ఆర్బీకే ద్వారా విత్తనాలు ఇంటికే వచ్చాయి’ అని చెప్పారు. వేల్కూరు ఆర్బీకేలో ఏకాంబరం అనే రైతును పలకరించగా.. పశువులకు చిన్నపాటి వైద్యం కోసం కూడా ఐదారు కిలోమీటర్లు తీసుకెళ్లాల్సి వచ్చేదని, రోజంతా దానికే సరిపోయేదని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే పశు వైద్యుడే వచ్చి వైద్యం చేసేలా సౌకర్యాలు కల్పించారని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం, సేంద్రియ కషాయాలు ఉండడం, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ల ద్వారా పంటల సాగుకు సూచనలు, సలహాలు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రానున్న విధానాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను. ఉత్పత్తుల వివరాలన్నీ కియోస్క్లో ఇస్తే మరింత మేలు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలను కూడా పొందుపరిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు కుప్పం, పలమనేరు మార్కెట్లలో ప్రతి వారం రూ.కోటి విలువైన మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతాయి. కియోస్క్లో గొర్రెల పెంపకందారుల వివరాలు, వారి వద్ద ఉన్న జీవాల వివరాలు, ధరలను పొందుపరిస్తే.. వ్యాపారి నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల దళారీ వ్యవస్థను సంపూర్ణంగా నిరోధించవచ్చు. -
కలాం విజన్ ఇదీ..
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020 నాటికి భారత్ ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయనకు ఎన్నో అంచనాలున్నాయి. 2000 సంవత్సరంలో కలాం నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగంలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్ఐసీ)కు చెందిన 500 మంది నిపుణులతో విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించారు. అప్పటికి భారత్ రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయన వైఎస్.రాజన్ తో కలసి ‘2020: ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. భారత్లో ఉన్న సహజవనరులు, మానవ వనరులు, భారతీయుల్లో నెలకొన్న పోటీతత్వం మన దేశాన్ని శక్తిమంతమైన దేశాల సరసన నిలబెడుతుందని అంచనా వేశారు. విద్యతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆకాక్షించారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటు కావాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు. భారత్ ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి 11 శాతంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన జరిగితేనే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. కలాం కన్న కలలకు అందరూ సలాం చేసినా ఆయన అంచనాలకు దేశం ఏ మాత్రం చేరుకోలేకపోయింది. పైగా సరికొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. -
'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫిలాన్తరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు. -
ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు
సౌండింగ్ రాకెట్ స్థాయి నుంచి చంద్రయాన్–2 ప్రయోగం దాకా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది. విక్రమ్సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ దేశఅంతరిక్ష ప్రయోగాలకు బీజాలు వేశారు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం వాటిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారు. నేడు ఇస్రో సాధిస్తున్న విజయాల్లో వీరి పాత్ర కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్కు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక వీరు వేసిన బాటలో నడిచిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల పితామహులు విక్రమ్సారాభాయ్, సతీష్ ధవన్ వేసిన బీజాలతో నేడు వినువీధిలో ఇస్రో విజయపతాకాన్ని ఎగురవేస్తోంది. డాక్టర్ విక్రమ్సారాబాయ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థను బుడి బుడి అడుగులతో నడిపించగా, తప్పటడుగులు లేకుండా సజావుగా నడిపించిన శాస్త్రవేత్త సతీష్ ధవన్. ఆ తరువాత ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రోను ముందుకు నడిపించారు. 1972లో విక్రమ్సారాభాయ్ దురదృష్టవశాత్తు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఎవరు నడిపించగలరని వెతుకుతుండగా అందిరి అలోచనల్లో పుట్టిన వ్యక్తి ప్రొఫెసర్ సతీష్ ధవన్. విక్రమ్సారాభాయ్ మరణానంతరం 1979లో షార్ కేంద్రంగా అంతరిక్ష పరిశోధనలను ఆనాటి ఇస్రో చైర్మన్ సతీస్ ధవన్, మరో ముఖ్యశాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నడిపించారు. షార్ నుంచి చేపట్టిన తొలిప్రయోగం ఎస్ఎల్వీ–3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఏపీజే అబ్దుల్కలాం(ఫైల్) వీరిద్దరి సారధ్యంలో షార్ నుంచి మొదట ప్రయోగించిన ఎస్ఎల్వీ–3 విఫలమైనప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనైన సహచర శాస్త్రవేత్తల వెన్నుతట్టి మరో ప్రయోగానికి కార్యోన్ముఖులను చేశారని ఈ నాటికి వారి గురించి తెలిసిన సహచర శాస్త్రవేత్తలు చెప్పుకోవడం విశేషం. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి భారీ రాకెట్ల ప్రయోగానికి ఆద్యుడిగా ఇస్రో చరిత్రలో నిలిచిపోయారు సతీష్ ధవన్. ఆ తరువాత యూఆర్ రావు, కసూర్తిరంగన్, మాధవన్నాయర్, ప్రస్తుతం డాక్టర్ కే రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్కుమార్ వంటి అతిరథ మహారధులు ఇస్రో చైర్మన్లుగా అంతరిక్ష ప్రయోగాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచ దేశాల్లో భారత్ను బలమైన దేశంగా నిలబెట్టారు. ఇస్రో తొలినాళ్లలో సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేక చిన్నచిన్న ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ రష్యా, ప్రాన్స్ ంటి దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలపై ఆధారపడి పెద్ద పెద్ద ఉపగ్రహాలను పంపేది. నేడు ఆ స్థాయిని దాటి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపిస్తూ సంవత్సరానికి సరాసరిన సుమారు రూ.1000కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 297 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి త్రిబుల్ సెంచరీకి చేరువలో ఉంది. అదే ఇస్రో ఇప్పటి వరకు 30 ఉపగ్రహాలను మాత్రమే విదేశాల నుంచి పంపించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చంద్రయాన్–1, మంగళ్యాన్–2, నేడు చంద్రయాన్–2 వంటి గ్రహాంతర ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా అవతరించనుండడానికి ఆనాటి అంతరిక్ష పితామహులు వేసిన బీజాలే కారణం. నేటి తరం శాస్త్రవేత్తలు ఇస్రో భాహుబలి రాకెట్గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనలకు త్రిమూర్తులు చేసిన కృషిని మరిచిపోకుండా కేరళలోని రాకెట్ విడిభాగాల తయారీ కేంద్రానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్సెంటర్, శ్రీహరికోటకు వెళ్లే మార్గానికి విక్రమ్ సారాభాయ్ మార్గ్, శ్రీహరికోట హైలీ అల్టిట్యూడ్ రేంజ్ (షార్) కేంద్రానికి ప్రొఫెసర్ సతీష్ ధవన్ పేరుతో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా, బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రానికి ప్రొఫెసర్ యూఆర్రావు శాటిలైట్ సెంటర్లుగా నామకరణాలు చేసి వారికి అంకితం ఇవ్వడం విశేషం. -
గుండె గుడిలో ఆ దీపం వెలగాలి
ఒక్కొక్కప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోవచ్చు. విచారించనవసరం లేదు. మీరు కష్టపడ్డారు. త్రికరణశుద్ధిగా కృషి చేసారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే తప్పు కాదు. కానీ అసలు లక్ష్యం లేకపోవడం మాత్రం దారుణం. జీవితంలో లక్ష్యం ఉండి తీరాలి. దాన్ని సాధించగలనన్న నమ్మకం ఉండాలి. అందుకే అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత తరువాత ప్రతిజ్ఞగా ‘‘నేను నా విశ్వాసం అంత యువకుడను. సందేహమంత వృద్ధుడను. కాబట్టి నా హృదయంలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగిస్తాను’’ అని ప్రమాణం చేయించారు.మనిషికి విశ్వాసం, సందేహం పక్కపక్కనే ఉంటాయి. ఈ పని నేను చేయగలననుకుంటాడు. ఆ మరు క్షణంలోనే ‘చేయగలనా?’ అనుకుంటాడు. అందుకే నమ్మకం దృఢంగా ఉండాలి. ఒకప్పుడుకలాంగారిని ఇరాన్ నుంచి వచ్చిన కొందరు దివ్యాంగులయిన విద్యార్థులు కలిసారు. వారిలో ఆత్మ స్థయిర్యాన్ని నింపడానికి కలాంగారు ఒక కవిత రాసి వినిపించారు. ‘‘మీ శరీరంలో అక్కడక్కడా వైక్లబ్యాలు ఉండవచ్చు. కానీ మీలో భగవంతుడున్నాడు. మీకు ఎప్పుడు ఏది అవసరమో దానిని ఆయన ఎప్పుడూ భర్తీచేసి కాపాడుతూ ఉంటాడు.’’ అని చెపుతుండగా కాళ్ళు సవ్యంగా లేని ఒక విద్యార్థి చేతికర్రల సాయంతో వచ్చి కలాం గారి పక్కన నిలబడి తాను రాసిన ఒక కవితను ఆయన చేతికిచ్చాడు. అందులో ఇలా ఉంది –‘‘నాకు కాళ్ళు సరిగా లేవు. వంచలేను. కానీ ఎంతటి గొప్పవాడు నా ఎదురుగా ఉన్నా, మహారాజయినా వారి ముందు వంగవలసిన అవసరాన్ని నాకా భగవంతుడు కల్పించలేదు’’ అని ఉంది. ఆ కుర్రవాడి ఆత్మస్థయిర్యం చూసి కలాంగారు చలించి పోయారు.చేతులు తెగిపోయినా, కాళ్ళు రెండూ పూర్తిగా లేకపోయినా వారి పనులు వారు చేసుకోవడమే కాదు, చిత్రకళలవంటి కళల్లో, క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. కష్టపడి చదివి పరీక్షకు వెళ్ళేముందు క్షణంలో తండ్రి చనిపోతే, గుండె దిటవు చేసుకుని తండ్రి ఆకాంక్షలను నెరవేర్చడానికి వెళ్ళి పరీక్షలు రాసి వచ్చిన పిల్లలున్నారు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం చెదిరిపోనంత కాలం మిమ్మల్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యంకాదు.మీరు ఎంత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయాణం మొదలు పెట్టిన తరువాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. అవి లేకుండా ఎవరి జీవితమూ గడవదు. సానబెడితే తప్ప వజ్రానికి కాంతి రాదు. అగ్నితప్తం చేసి సాగదీస్తే తప్ప బంగారం కూడా ఆభరణం కాదు. కష్టాలు అనుభవిస్తేనే రాణించి ప్రకాశించేది. సూర్యుడి కాంతిని అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ ఆపలేరు. ధర్మంతో ముందుకెడుతున్న వాడిని ఆపగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. వాడు ప్రకాశించి తీరతాడు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్... ఇలా గొప్పవాళ్ళయిన వారంతా జీవితంలో భయంకరమైన కష్టాలు అనుభవించి వచ్చినవారే. మొక్క పెరుగుతున్నప్పుడు పైన ఏదో అడ్డువచ్చిందని ఆగిపోదు, దిశ మార్చుకుని పెరుగుతూ అడ్డు తొలగంగానే తిరిగి నిటారుగా పైకి లేస్తుంది. సీతాకోక చిలుకల్లా రంగులతో ఎగరాలంటే గొంగళి పురుగు దశ దాటాల్సిందే. బురదలోంచి వచ్చిన తామరపువ్వు సువాసనలు వెదజల్లుతూ వికసించినట్లుగానే మీరంతా ఆత్మ విశ్వాసంతో వికసనం చెందాలి. అటువంటి ధైర్యంతో, పూనికతో మీరంతా ముందుకు నడవాలన్న బలమైన ఆకాంక్షతోనే కలాంగారు విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞలు చేయించారు. -
అన్ని వికారాలకు అదే మూలం
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటూ సామాజిక పరిశుభ్రతకోసం పరితపించిన వారిలో విశేషంగా చెప్పుకోదగిన వ్యక్తి మహాత్మాగాంధీ. అబ్దుల్ కలాంగారు కూడా అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కోసం, స్వచ్ఛమైన శక్తికోసం నిరంతరం శ్రమిస్తాను’’ అని విద్యార్థులచేత ప్రమాణం చేయించేవారు. ఇంకొన్ని రోజుల్లో ప్రాణం వదిలిపెట్టేస్తారన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా బాధపడిన అంశం–మన దేశంలో చాలా మంది ఆరోగ్యం నశించిపోవడానికి కారణం– ప్లాట్ఫారమ్ మీద ఆగి ఉండగా ప్రయాణికులు రైళ్లలోని శౌచాలయాల్లో మలమూత్ర విసర్జన చేయడం–అన్న విషయం. అలా చేసినప్పడు అవి స్టేషన్లలోని పట్టాల మధ్యలోనిలిచి పోతాయి. వాటిమీద వాలిన ఈగలు, దోమలు, సూక్ష్మక్రిములు అక్కడే తిరుగుతూ ప్లాట్ఫారాలమీద అమ్మే, ప్రయాణికులు తినే ఆహార పదార్థాలమీద వాలి నేరుగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రైలు ప్రయాణికులలో చంటిపిల్లలు, వృద్ధులు, రోగులు మాత్రమే కాదు, అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వ్యాధిగ్రస్తులవుతారు. చదువుకున్నవారయినా, చదువులేనివారయినా అక్కడ ప్రయాణ హడావుడిలో విచక్షణ కోల్పోయి అనారోగ్యానికి బలవుతున్నారు. విద్యార్థులుగా మీరు దీని పట్ల అవగాహన పెంచుకుని మీరు పాటించడమే గాదు, మీ ఎదురుగా మరెవరయినా స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళలో శౌచాలయాలు వినియోగించకుండా చూడండి.అలాగే పల్లెలు, పట్టణాలు,నగరాలు అనే తేడా లేకుండా అనుసరిస్తున్న మరొక చెడ్డ అలవాటు – బహిరంగ మలమూత్ర విసర్జన. ఇది మన పరిసరాలను, మన ఆరోగ్యాన్నే కాకుండా మన దేశ గౌరవాన్ని కూడా పాడు చేసి అప్రతిష్ఠ తీసుకు వస్తున్నది. మరుగుదొడ్లు కట్టుకుంటామంటే ఇప్పుడు ప్రభుత్వాలుకూడా డబ్బిస్తున్నాయి. అలాగే శక్తి ఎప్పడూ కూడా స్వచ్ఛమైనదై ఉండాలి. నేను ఏది తింటే అది నాకు శక్తిగా మారుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తితోపాటూ మంచి శక్తిని కూడా పొందుతున్నా. కుళ్ళిన ఆహారాన్ని తీసుకుంటే వెంటనే శరీరం రోగగ్రస్థమైపోయి నీరసపడిపోతాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాయామాల ద్వారా బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే సమస్త శక్తులకూ కారణమయిన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరొక ఎత్తు. కళ్ళతో, చెవులతో, ముక్కుతో, స్పర్శతో మనం గ్రహించే వాటితో మన మనసు కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల మనం లోపలికి గ్రహించే వాటిపట్ల మనం సర్వదా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ ఉన్న పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకుంటే అవి మీ ఆరోగ్యాన్నేకాక, మీ మనసును కూడా ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా మీ మనసును ఎంతగా నియంత్రించి శక్తిమంతం చేసుకుంటే మీమనస్సులోంచి అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు ఎంత మంచి ఆహారాన్ని పుచ్చుకుంటే అంత మంచి శక్తి మీ శరీరం నుండి విడుదలవుతుంది.నిలకడగా ఒక చోట ఉండగలిగేటట్లు, మీ ఆలోచనలను స్థిరంగా ఉంచగలిగేటట్లు, మీ చదువుసంధ్యలపట్ల మీ శ్రద్ధాసక్తులు నిశ్చలంగా ఉండేటట్లు మీ శరీరాన్ని, మీ మనసును నియంత్రించుకోగలగాలి. ప్రయత్నపూర్వకంగా అది అది అలవాటుగా చేసుకోవాలి. అలా వ్యక్తిగతంగా మీ వద్ధి, తద్వారా మీ వంటి ఉత్తమ పౌరులతో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అపురూపం హతజోడి:హతజోడి లేదా హస్తజోడి అనేది ఒక అరుదైన మూలిక. రెండు మూడంగుళాల పరిమాణంలో ఉండే ఈ మూలిక చూడటానికి ముకుళించిన హస్తాల రూపంలో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ఎక్కువగా నేపాల్లోని లుంబినీ లోయలోను, అమర్కంటక ప్రాంతంలోను దొరుకుతుంది. ఉమ్మెత్తజాతికి చెందిన ఒక మొక్కకు చెందిన మూలిక ఇది. మొక్క బాగా ఎదిగిన తర్వాత దాని వేళ్లు జోడించిన చేతుల ఆకారంలోకి రూపుదిద్దుకుంటాయి. హతజోడి మూలికను చాముండేశ్వరీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. దృష్టిదోష నివారణకు, దుష్టశక్తుల కారణంగా తలెత్తే అనర్థాల నివారణకు హతజోడి మూలిక అద్భుతంగా ఉపయోగపడుతుందని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. పూజ మందిరంలో చాముండేశ్వరీ దేవి ఎదుట హతజోడి మూలికను ఉంచి, దానిని ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షతలతోను, ధూప దీప నైవేద్యాలతోను అర్చించాలి. దీనిని ఉంచి చాముండేశ్వరి హోమం జరిపించడం మరీ శ్రేష్ఠం. అలా పూజించిన తర్వాత ఎర్రని వస్త్రంలో కట్టి డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనిని తాయెత్తులో ఉంచి భుజానికి లేదా మెడలో ధరించినట్లయితే, కార్యసిద్ధి, మానసిక స్థైర్యం కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటబడతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
అబ్దుల్ కలాం బయోపిక్లో బాలీవుడ్ స్టార్..!
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ప్రస్తుతం అని ఇండస్ట్రీలలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మరో ప్రముఖుడు చేరనున్నాడు. మిసైల్ మ్యాన్గా భారత దేశానికి ఎన్నో సేవలందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ను హాలీవుడ్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ టైటిల్ రోల్లో కనిపించనున్నారట. ఇప్పటికే కథ విన్న అనిల్ కపూర్ నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
బతకడం అంటే పునర్నిర్మాణం
సన్మార్గ నిర్దేశకులనైన మహోన్నతులు ఎక్కడెక్కడనో కాదు, మనసుతో చూస్తే మన చుట్టూనే అతి సామాన్యులుగా జీవిస్తూ కనబడుతుంటారు. ఆ విషయాన్ని అబ్దుల్ కలాం ‘నా జీవన గమనం కలల సాకారం’ స్పష్టంగా వివరించింది.రామసేతు నిర్మాణ ప్రదేశమైన ధనుష్కోడి దర్శనార్థం వెళ్లే హిందువులను రామేశ్వరం నుండి అక్కడికి పడవ ద్వారా చేరవేసేవాడు జైనులాబ్దిన్. అదే అతనికి జీవనాధారం. అయితే, 1964లో భారీ తుఫాను వచ్చి అతని పడవ ధ్వంసమైంది. అది అతనికి కొత్తేమీ కాదు. ఆ విధంగా జరిగినప్పుడల్లా మరో కొత్త పడవని నిర్మించుకునేవాడు. సాధారణంగా ఇటువంటి సమయంలో అతడి చేతికింద అబ్దుల్ కలాం ఉండేవాడు. ఆ తండ్రి కొత్త పడవలో కూర్చుని అలలకి ఎదురుగా తన ప్రయాణాన్ని యథావిధిగా మొదలుపెట్టేవాడు. ‘బ్రతకడం అంటే కష్టాలని ఎదుర్కొని జీవితాన్ని పునర్నిర్మించుకోవడమే’ అన్న గొప్ప సారాంశాన్ని కుమారునికి వారసత్వంగా అందించాడు. సాధారణంగా భారతీయులు తమ మాటామంతిలో కులమతాల నుండి ఎంతటి ఆదర్శవంతునికైనా సరే మినహాయింపు ఇవ్వరు, ఒక్క కలాంకు తప్ప. ఈయనని కేవలం భారతీయుడిగా మాత్రమే గౌరవించడానికి ఇష్టపడతారు. అందుకు కారణం ఆయన ప్రతీ మతంలోని గొప్ప అంశాలని గుర్తించి గౌరవించడమే. కలాం తండ్రి జైనులాబ్దిన్ రామేశ్వరంలోని మసీదుకు ఇమామ్. పక్షి లక్ష్మణశాస్త్రి రామనాథ ఆలయ అర్చకులు. ఫాదర్ బోడల్ చర్చికి ప్రీస్ట్. ముగ్గురూ వర్తమాన స్థితిగతుల గురించి చర్చలు జరుపుతుండేవారట. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా రామేశ్వరం మాత్రం ప్రశాంతంగా ఉండేదట. దీని గురించి కలాం ఈ విధంగా చెప్పారు: ‘పట్టణంలో శాంతి భద్రతలు నిలిచి ఉండటానికి ముఖ్యమైనది ప్రజల మధ్య సరైన ప్రచార ప్రసారం’ అని. బహుశా ఆ ముగ్గురి మైత్రీ ప్రభావమేమో కలాం మహనీయత! స్క్వార్జ్ హైస్కూలు నుండి ఇస్రో వరకు సాగిన ప్రస్థానంలో ఎప్పటికప్పుడు వెంటే ఉండి ముందుకు తోసిన జ్ఞాపకాలని పొందుపరిచారు కలాం. ‘కలలు అనేవి నిద్రలో వచ్చి కరిగిపోయేవి కావు. అవి మనలని నిద్ర పోనివ్వకుండా చేయాలి’ అని చెప్పిన ఈ మిస్సైల్ మాన్ ఒక ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ‘ఈ సమాజం ప్రస్తుత పరిస్థితిని ప్రశ్నించకుండా ఉండటం నేర్చుకున్నది’ అని. రేపటి తరానికి అది అలవర్చటం కోసమే కావొచ్చు, తరచూ పిల్లల్ని కలిసి ఏదైనా ప్రశ్నించమని కోరేవారు. ‘నేను కూడ ఒక అన్వేషినే. మీతో జరిపే చర్చల ద్వారా నేనూ కొన్ని సమాధానాలు వెతుక్కుంటున్నాను’ అంటూ వికసించే మొగ్గలతో గడిపిన జ్ఞాపకాలని అక్షరీకరించారు. ఈ పుస్తకం కేవలం ఆలోచింపజేయడమే కాదు, ఆచరణ వైపు కదిలిస్తుంది కూడా. కె.నందన్కుమార్ గౌడ్ -
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, హైదరాబాద్ : మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రఖ్యాత శాస్త్రవేత్త, దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ.. నిరాడంబరత్వానికి ఆయన ప్రతీక అని ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం సదా స్ఫూర్తిదాయకమని, ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా భారత్ వర్ధిల్లాలన్న కలాం స్వప్నం నిజం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. #AbdulKalam You have been a great influence and inspiration. I hope India carries on with your dream of seeing India as the world’s innovation hub. #MissileMan pic.twitter.com/I3me4j7tp8 — YS Jagan (@YSJagan4CM) 15 October 2018 -
చిన్ని నా బొజ్జకు... అనుకుంటే ఎలా ?
కుల, జాతి, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరోఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను–అన్నది అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన నాలుగో ప్రతిజ్ఞ. నిజానికి ఈ మాటలు ఎక్కడివంటే...అబ్దుల్కలాంగారిని చాలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు నెల్సన్ మండేలా. వీరిద్దరూ అంటే ఆయనకు చాలా గౌరవం. బారిష్టర్ చదువుకోవడానికి విదేశాలకు వెడుతున్నప్పుడు గాంధీగారి తల్లి ఆయనకు చెప్పిన మాటలు ఇవి. ఆమె ఏమన్నారంటే...‘ ‘మనిషిగా పుట్టినందుకు ఒకరికి ఉపకారం చేయాలి. దానికి ముందు – నా కులం వాడా, నా మతం వాడా, నా జాతి వాడేనా, నా భాష వాడేనా వంటివి చూడొద్దు. ఈ తేడా చూపకుండా ఎవరో ఒక్కరి నైనా సరే, వాళ్ళ జీవితాన్ని రక్షించడానికి లేదా వద్ధిలోకి తీసుకురావడానికి నీవు కారణం కావాలి. మనిషికీ , మిగిలిన జీవులకూ తేడా అక్కడే ఉంది’’ అని. ఆకలితో ఉన్న పులికి నిండు గర్భంతో ఉన్న జింక కనబడినా దానిని ఆహారంగానే చూస్తుంది తప్ప ఇతరత్రా ఆలోచించదు. పెద్ద చేప చిన్న చేపలను మింగేస్తుంది. అది వాటి స్వభావం. కానీ మనిషి మాత్రం –‘‘నేనొక్కడినీ బతకడం గొప్పకాదు, నా చుట్టూ ఉన్న ప్రాణులనూ కాపాడవలసిన బాధ్యత నాది’’ అనుకుంటాడు. మండుటెండలోనుంచి వెళ్ళి మనిషి ఒక చెట్టు నీడన సేదతీరతాడు. ‘‘నేను దీని నీడను అనుభవిస్తున్నాను’’ అనుకుని కాసిన్ని నీళ్ళు దానికి పోస్తాడు. ఆ చెట్టే కాదు, ఏ చెట్టయినా దానికి కొద్దిగా నీళ్ళు పోసే ప్రయత్నం చేయగలగాలి. ఏదో ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టగలగాలి. తమిళనాడులో ఒక వ్యక్తిని చూసా. ఆయనకు మామిడితోట ఉంది. చాలా చెట్లున్నాయి. అన్ని చెట్లనుంచి కాయలు కోసుకుంటాడాయన. కానీ ఒక్క చెట్టును మాత్రం కోయకుండా అలా వదిలేస్తాడు. ఎందుకలా అని అడిగితే – మామిడిచెట్టంటూ ఉంటే పళ్ళు తినడానికి రామచిలుకలు వస్తాయి. నా తోటలోని కాయలన్నీ నేనే తినేయడం ఎందుకండీ. ఒక చెట్టును వాటికి వదిలేస్తా. రేపు పొద్దున వచ్చి చూడండి. చెట్టుమీద కాయలను మీరు లెక్కపెట్టగలరేమో కానీ ఆనందంతో రెక్కలు విప్పుకుని వచ్చే చిలుకలను లెక్కపెట్టలేరు. ఆ అందం చూసి అనుభవించే తృప్తి ఎంత ఖర్చుపెట్టినా దొరకదు. ఇన్ని చెట్లకాయలను నేనొక్కడినీ తినలేకపోతే అమ్ముకుంటాను...కానీ ఆ చిలకలు మాత్రం వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. తప్ప తుంచుకెళ్ళవు, కింద పడేయవు. మళ్ళీ రేపొచ్చి తింటాయి.’’ అని చాలా తన్మయత్వంతో చెప్పాడు. అంతేకాదు నూకలు(విరిగిన బియ్యం) తెప్పించి రోజూ కొద్దిగా పొలంలోని మూలల్లో చీమల పుట్టల దగ్గర రోజూ చల్లుతుంటాడు. ‘‘చిన్ని నాబొజ్జకు... అని మాత్రమే అనుకోను. నాతోపాటూ నాలుగు ప్రాణులు తినాలి కదండీ’’ అంటాడు. ‘‘అన్ని ప్రాణులకూ ఆకలి ఒక్కటే. నేను తినకుండా వాటికి పడేయడం లేదు కదా, అటువంటప్పడు కాసిని వాటికి కూడా పెట్టడానికి అభ్యంతరం ఎందుకుండాలి’’అని కూడా అంటాడు. అంటే మనిషి మిగిలిన ప్రాణుల్లా బతకకూడదు. అవి భూతదయతో ఉండే అవకాశం లేదు. కానీ మనిషి తానొక్కడూ బతకడం కాదు,‘‘మరొక ప్రాణి బతకడానికి, మరొకరు వృద్ధిలోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నానా..??’’ అని తనను తాను నిత్యం ప్రశ్నించుకుంటూ ఉండాలి.’’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జైత్రయాత్ర నీ కుటుంబం నుంచే ప్రారంభించు
కలాంగారు రాష్ట్రపతి పదవిలో ఉండగా, ఆయన అన్నగార్లు, వాళ్ళపిల్లలు, బంధువులు చాలా మంది రాష్ట్రపతిభవన్ చూడడానికి వస్తామని ఉత్తరం రాసారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు ! అందర్నీ రమ్మన్నారు. వారు వచ్చారు. భోజన ఫలహారాలు తీసుకుంటూ . రెండూమూడురోజులు అక్కడే గడిపి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళంగానే కలాంగారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచి...‘‘మా బంధువులు అక్కడ విడిదిచేసిన ఫలితంగా భోజనాలకు, బసకు, కరెంటుకు ఇతరత్రా వసతులకు ఖర్చెంతయిందో లెక్కగట్టి చెప్పండి’’అని అడిగారు. వాళ్ళు సంకోచిస్తుంటే...‘‘ఈ దేశమంతా నా కుటుంబమే. వాళ్ళు కష్టపడి కట్టిన పన్నులను నా బంధువులకోసం ఖర్చు పెట్టలేను’’ అని చెప్పి వారు ఆ బిల్లు ఎంతో చెప్పంగానే కట్టేసారు. అదీ వ్యక్తిత్వమంటే. ఆయన అలా బతికిచూపించి ఈ దేశ యువతరం ముఖ్యంగా విద్యార్థులు అంతా అలా బతకాలని కలలు కన్నారు. లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు. 30వేల పాటలకు పైగా పాడారు. ఆవిడ పాడని పాటలేదు, ఆలపించని కీర్తనలు, భజనలు లేవు. కానీ ఆమె ఐశ్వర్యవంతురాలిగా పుట్టలేదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆమెకు నలుగురు చెల్లెళ్ళు. కుమార్తెలను కూడా తన నాటక కంపెనీలో సభ్యులుగా చేర్పించి నాటకాలు వేయగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరిపేవారు. తరువాత కాలంలో ఆమె పాటలుపాడి పేరు, హోదా, డబ్బు బాగా సంపాదించినా తన కుటుంబాన్ని వదలలేదు.అందరినీ వృద్ధిలోకి తెచ్చారు. ఎంతో ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారు. ఆదర్శవంతంగా బతికారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత విదుషీమణి. ఆవిడ జీవితం అంతే. అది వడ్డించిన విస్తరేమీ కాదు. మీరాబాయి సినిమాలో ఆమె నటించినప్పుడు కనకవర్షం కురిసింది. అదీగాక దేశవిదేశాల్లో సంగీత కచ్చేరీలద్వారా కూడా సంపాదించారు. ఎన్నో సంస్థలకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టారు. ఎన్నో గుళ్ళూ గోపురాల నిర్మాణాలకు, నిర్వహణకు సాయం అందించారు. ఆస్తులుకూడా అమ్మేసుకున్నారు. ఒక దశలో సొంత ఇల్లు కూడా లేకుండా చేసుకున్నారు. ఆమెకూడా కుటుంబంలో ఒక మంచి సభ్యురాలిగానే జీవితం మొదలుపెట్టి, నలుగురికి ఆదర్శంగా గడిపారు. ఆమె సుబ్బులక్ష్మి...ఆమె మాదన్నారు తమిళులు, ఆమె సుబ్బలక్ష్మి..ఆమె మాది అని దక్షిణాది వాళ్ళంటే, ఉత్తరాదివాళ్ళు ఆమెను శుభలక్ష్మి అని పిలుచుకుని సొంతం చేసుకున్నారు. ఆమె శరీరత్యాగం చేసారని తెలిసిన తరువాత మొదటగా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి కలాంగారు. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళి, ఆమె అంత్యక్రియల్లో ముందు నిలబడి కంటనీరు కారుతుండగా ఒక మాటన్నారు...‘‘నాకు ముగ్గురు తల్లులు. ఒకరు జన్మ ఇచ్చిన తల్లి. మరొకరు ఈ దేశమాత. నాకు మూడవ తల్లి సుబ్బలక్ష్మిగారు. నేను ఎవరి కంఠస్వరం వింటే నా కష్టాలన్నింటినీ మర్చిపోతానో, ఆ తల్లిని ఈ వేళ పోగొట్టుకున్నాను.’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. మీరు పిల్లలు. ఇటువంటివారిని ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఎంత పెద్దకలలు కన్నా వాటి ఆచరణలో ముందు వీరిలాగా ఒక మంచి కుటుంబ సభ్యునిగా మీ పాత్ర సమర్ధంగా నిర్వహించండి. మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం గర్వపడే విధంగా జీవించండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అలెగ్జాండర్ని ప్రెసిడెంట్ చేసింది నేనే: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : భరింపశక్యంకాని గొప్పలు చెప్పుకోవడంలో తమను మించిన వారు లేరని మరోసారి రుజువుచేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చరిత్రంటే నారా వారిదేనని.. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేశానని చెప్పుకునే చంద్రబాబు తాజాగా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి చంద్రబాబు పేల్చింది అలాంటి ఇలాంటి బాంబుకాదు. చంద్రబాబు చెప్పింది ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు, కార్యకర్తలు జుట్టుపీక్కుంటుంటే, నెటిజన్లు మాత్రం చంద్రబాబు మాటలను రీపీట్ చేసుకొని మరీ వింటూ తెగ నవ్వుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే... గత మంగళవారం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీం కోర్టులో పోరాడుతానని, రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేస్తామని, హజ్యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తామని, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ఆదుకుంటామని హామీలిచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గానికి త్వరలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తానన్నారు. ఇక అదే ఫ్లో లో 'తెలుగుదేశం పార్టీ ఎన్నో చరిత్రలు సృష్టించాము. ఒకటి రెండు కాదు ఒక దశలో అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాము. నేనొక్కటే చెప్పాను ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పి ప్రధాన మంత్రిగారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ ఈ తెలుగు దేశం పార్టీ' అంటూ చంద్రబాబు స్పీచ్ దంచికొట్టారు. దీంతో అక్కడున్నవారంతా ఎవరబ్బా ఈ అలెగ్జాండర్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుకు ప్రసంగానికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆ అలెగ్జాండర్ ఎవరో కాదు క్రీ.పూ. 3వ శతాబ్ధంలో ప్రపంచ దండయాత్రకు బయలుదేరిన గ్రీకు రాజు అలెగ్జాండర్ అయ్యిండొచ్చు, అతనికి మన చంద్రబాబుకు మంచి స్నేహితుడనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ యువతలో స్పూర్తినింపిన అబ్దుల్ కలాం అయ్యి ఉంటారని, చివరికి పేరుకూడా సరిగ్గా పలకడం రాదు కానీ మిసైల్ మ్యాన్ కలాంకు చంద్రబాబు రాష్ట్రపతి పదవి ఇప్పించారా అంటూ మండిపడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలానే.. హైదరాబాద్లో గత మేలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్ను డిలిట్చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి... (డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్షాట్) -
కలిసి నడవాలి.. నడిపించాలి
జీవితంలో కొన్ని పనులు మనం ఒక్కరమే చేయగలం. కానీ చాలా పనులు పదిమంది సహాయం లేకుండా చేయలేం. అందుకే అందరితో కలిసిమెలిసి చేయడం, చేయి చేయి పట్టుకుని నడవడం, నడిపించడం చేతకావాలి. నేనే గొప్ప, నేనెవరితోకలవను–అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. అబ్దుల్ కలాం ఈ మాటలు ఒఠ్ఠిగా చెప్పలేదు. తాను స్వయంగా ఆచరించి చూపాడు కాబట్టే ఆయన మాటలంటే మనకంత గురి, మనకంత గౌరవం. విధి నిర్వహణలో ఏదయినా లోపం జరిగితే దానికి ఆయన ఒక్కడే బాధ్యత తీసుకునేవాడు. అదే ఉప్రగహం కక్ష్యలోకి వెళ్ళడం వంటి విజయాలు చవిచూసినప్పుడు ఆ గొప్పతనం తనొక్కడిదే కాదనీ, శాస్త్రవేత్తలందరిదీ అనడమేకాక, పై అధికారులకు, చివరకు ప్రధానమంత్రికి కూడా ఫలానా వారికృషివల్ల ఇది సాధించగలిగామని చెబుతూ వారిని స్వయంగా వెంటపెట్టుకెళ్ళి చూపేవాడు. ఒకరోజు కలాం తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని ‘నువ్వు ఇవ్వాళ రాత్రి 11 గంటల వరకు ఉండి ఈ కార్యాన్ని పూర్తి చేయాలి’ అని పురమాయించారు. ఆ ఉద్యోగి కొంచెం ఇబ్బందిగానే తనకు అప్పగించిన పనిని అంగీకరించి చేసేందుకు వెళ్ళాడు. కలాం వెంటనే అతని సన్నిహిత ఉద్యోగిని మరొకరిని పిలిచి ‘రోజూ బాగా శ్రద్ధగా చేసేవాడు, ఇవ్వాళేమయింది’ అని వాకబు చేసాడు. ‘ఆయన తన భార్యాబిడ్డలను ఇవ్వాళ సాయంత్రం ఏదో ఎగ్జిబిషన్కు తీసుకెడతానని చెప్పాడు. పని చేయాల్సి వచ్చినందుకు కాదు, వాళ్ళను నిరాశపరచాల్సి వస్తున్నందుకు బాధపడి ఉంటాడు’’ అని అతను చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలకు తనకు అప్పగించిన పనిముగించుకుని సదరు ఉద్యోగి భార్యాబిడ్డలకు సంజాయిషీ ఎలా చెప్పాలని మథనపడుతూనే ఇంటికి చేరుకుని తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నిరాశలో ఉంటారనుకున్నవాళ్ళంతా ఆనందంతో తుళ్ళుతూ కనిపించారు. అయోమయం నుంచి తేరుకోకముందే పిల్లలొచ్చి ‘‘నాన్నా, నాన్నా అబ్దుల్ కలాం తాతగారు మనింటికి వచ్చారు. మీనాన్న అత్యవసరమయిన పనిమీద కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎగ్జిబిషన్కు తీసుకెళ్తానన్నారటకదా, పదండి, నేను తీసుకెళ్తా అని తన కారెక్కించుకుని మమ్మల్ని తీసుకెళ్ళి అంతా తిప్పి చూపించి మళ్ళీ ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయారు’’ అని చెప్పారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తన చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల కలాం అంత ప్రేమభావంతో ఉండేవారు. ఇటువంటి వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలి. కలాం కలలు కన్న విద్యార్థులగా మీరు తయారు కావాలి. చదరంగం ఆడాలి. మీ ఒక్కరి ప్రజ్ఞాపాటవాలు చాలు. ఫుట్బాల్ ఆడాలి. మీ టీమ్ అంతా కలిసి ఆడితేనే మీరు గెలుస్తారు. ఒక గోడ కట్టాలి. ఇటుకలు మాత్రం ఉంటే సరిపోదు, సిమెంట్ ఒక్కటి ఉంటే చాలదు. వాటితోపాటూ ఇసుక, నీరు ఉండాలి, అవన్నీ సమపాళ్ళలో కలిసినప్పుడే గట్టిగోడ నిలుస్తుంది. అందుకే మనకన్నా కిందివారిని, మనతోటివారిని, మనకంటే పైవారిని అందరినీ కలుపుకుని, సఖ్యతతో సమన్వయంతో, విశాల హృదయంతో ముందుకడుగేయాలి. మనందరం చేయిచేయి పట్టుకుని ‘‘మేమందరం భారతమాత బిడ్డలం, భారతీయులం, అందరం కలిసి నవభారతాన్ని నిర్మించుకుంటాం’’ అన్న దృఢ దీక్షతో అటువంటి సమగ్రతతో పనిచేసిన నాడు కలాంగారు ఏ లోకంలో ఉన్నా ఆయన పరిపూర్ణ ఆశీస్సులు మీకందరికీ అందుతాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచిని చూస్తుంటేనే మంచివారు అవుతారు
భవిష్యత్తంతా విద్యార్థులదే. దేశ కీర్తి ప్రతిష్ఠలు, అభివృద్ధి మీ చేతిలో ఉన్నాయని గట్టిగా నమ్మిన అబ్దుల్ కలాం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి పలు సూచనలుచేసారు. ఎవరికి వారు తాము చదువుకున్న చదువుతో డబ్బు సంపాదించుకుంటూ, అదే ధ్యేయంగా బతికితే దేశం ఎలా, ఎప్పటికి బాగుపడుతుందనేది ఆయన ఆవేదన. చదువుకోవడం గొప్పకాదు. మీరో గొప్ప ఇంజనీరో, డాక్టరో అవుతారు. మీ చదువుద్వారా ఎంతమందికి మీరు ఉపయోగపడుతున్నారనే దాన్ని బట్టి మీ చదువుయొక్క సార్ధక్యం ఆధారపడి ఉంటుంది. మీరు డాక్టరై ఎంతమందికి ప్రాణభిక్షపెడుతున్నారు, స్వార్థంలేకుండా ఎంతమందికి చికిత్స చేయగలుగుతున్నారు. సమాజ హితానికి ఎంత ప్రయత్నిస్తున్నారన్న స్పృహతో మీరు గొప్పవారవుతారు తప్ప అన్యథా కాదు. నేను ఇంజనీరయినాను కాబట్టి ఎంతమంది ఏమయిపోయినా ఫరవాలేదు, ఏ ఆనకట్ట ఎలా బద్దలయిపోయినా ఫరవాలేదు, నా డబ్బు నాకొస్తుందికదా.. అన్న ఆలోచన మంచిది కాదు. మీ చదువుతో మీరు, మీ కుటుంబం, మీ బంధుమిత్ర పరివారం, మీ సమాజం, మీ దేశం అందరూ బాగుండాలి, అన్నీ బాగుపడాలి. అప్పుడు మీ చదువుకు సార్థకత. అలా జరగాలంటే...పదిమందితో కలిసి మీ ప్రజ్ఞాపాటవాలు పంచుకోవాలి. అలా పంచుకోవాలంటే మున్ముందుగా మీకు ఉండవలసిన ఒకానొక ప్రధాన లక్షణం– అందరిలో మంచిని చూడగలగడం. ప్రతివారిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ గొప్పతనం లేకుండా ఎవరూ ఉండరు. మీ చుట్టూ ఎవరున్నా, ప్రతివారిలో ఉన్న ప్రతిభను వెతకగలగడం మీకు చేతకావాలి. మీ వద్ద ఎవరిపేరయినా ప్రస్తావనకు వచ్చీరాగానే వారిలోని ఉత్తమగుణాలు మీకు వెంటనే స్ఫురణకు రావాలి. అలా కాకుండా ప్రతివాడిలోనూ చెడు మాత్రం చూసే అలవాటున్నప్పుడు వారిని తృణీకరించడం, చులకనచేసి మాట్లాడడం అలవాటవుతుంది. దానివల్ల అవతలివాళ్ళకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందో నాకు తెలియదు కానీ, ఎవరిలోకూడా మంచి చూడడం అలవాటు చేసుకోక, మంచిని అనుకరించడం తెలియక, మంచిమార్గంలో వెళ్ళడం చేతకాక... చివరకు మనమే పతనమయిపోతాం. అలా కాకుండా ఉండాలంటే... ఎక్కడికెడితే అక్కడ ఇమిడి పోవడం చిన్నప్పటినుంచీ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ప్రోత్సహించాలి. నీటిలో ఇసుక వేస్తే కరగదు. అదే చక్కెరవేస్తే కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది మీకు చేతకావాలి. అలా నలుగురిలో కలిసిపోవాలి, కరిగిపోవాలి. మీరు బడికి వెళ్ళారు. అక్కడ తోటి పిల్లలతో హాయిగా కలిసిపోవాలి. కాలేజికి వెళ్ళారు. సహ విద్యార్థులతో, కింది తరగతుల వాళ్ళతో, పైతరగతుల వాళ్ళతో కలిసిపోవాలి. ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ చిన్నా పెద్దా ఉద్యోగులందరితో కలిసిపోవాలి. కుటుంబంలో, బంధువులతో, దేశపౌరులతో.. అలా కలిసిపోతుండాలి. ‘‘నేను ఇంత గొప్పవాడిని’’ అని గిరిగీసుకుని మిగిలిన వాళ్ళకన్నా దూరంగా బతకడం, మిగిలినవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు అని భావించడం మనకు మేలు చేయకపోగా మనల్ని మరింత కిందకు దిగజారుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనతో సమానులను ఆదరబుద్ధితో చూడాలి. మన కంటే కిందివారిని మనమే చొరవతీసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి, వారిని ప్రేమించాలి. మనకన్నా పైవారిపట్ల గౌరవ మర్యాదలతో మసులుకోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఏపీజే అబ్దుల్ కలాంకు ఘననివాళి
వనపర్తిటౌన్: అధికారం సమాజశ్రేయస్సుకు వెచ్చించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఏపీజే అబ్దుల్ కలాం ప్రాణం పోశారని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతిని శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ రెండోసారి రాష్ట్రపతి అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలిపారు. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత మరుసటి రోజు అధికారిక లాంఛనాలను దరిచేరనీయలేదన్నారు. కలలు కని, వాటిని సహకారం చేసుకోవాలని భారతవనికి దిశనిర్దేశం చేసిన మహానీయుడు కలాం అని వెల్లడించారు. టీజేఎస్ పట్టణాధ్యక్షుడు ఖాదర్పాష, పానుగంటి నాగన్న, గిరిజన నేత హరీష్, కృష్ణ పాల్గొ న్నారు. ఖిల్లాఘనపురం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల్లో శుక్రవారం దివంగత మాజీ రాష్ట్రపతి భారత రత్న అవార్డు గ్రహిత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వకృ త్వ పోటీల విజేతలకు విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు గోపి బహుమతులను అందజేశారు. గురుపౌర్ణమిని పురష్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. -
అబ్దుల్కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
పుల్లంపేట: సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పీవీజీ పల్లి ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి పేర్కొన్నారు. పాఠశాలలో శుక్రవారం సాయంత్రం అబ్దుల్ కలాం వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి చదువుకున్న అబ్దుల్కలాం గురువుగా, శాస్త్రవేత్తగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నేటి విద్యార్థులందరూ అబ్దుల్కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సుబ్బరామిరెడ్డి, చంద్రకుమార్, శివశంకర్ రాజు, నవీన్కుమార్, భారతీ అబ్దుల్కలాం జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో రెడ్డిప్రసాద్, గంగనపల్లె వెంకటరమణ మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు గుత్తికొండ హేమసుందరం రచించిన ‘ఓ విద్యార్థి తెలుసుకో’ అనే పుస్తకాలను హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేశారు. -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!
అబ్దుల్ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే. గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు. ‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది. ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం. ‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు. గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి. ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బంగారు భవితకు పది సూత్రాలు
విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్ను, వారి వ్యక్తిత్వ వికసనాన్ని దృష్టిలోపెట్టుకుని, వేనాడు(కేరళ)లోని జవహర్ నవోదయ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వారిచేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. అది ఒక్క సందర్భంలోనే చేయించారు. అది తన జీవితంలో మరచిపోలేని రోజని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ ప్రతిజ్ఞలోని పదిసూత్రాలు ఇవి.... 1 నేను ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరమని గుర్తించాను. 2 చిత్తశుద్ధితో పనిచేసి సమగ్ర విజయం సాధిస్తాను. 3 నేను నా కుటుంబంలో, నా సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి సభ్యుడిగా ఉంటాను. 4 కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను. 5 ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ‘‘నేనేం ఇవ్వగలను’’ అని ఆలోచిస్తాను. 6 సమయ ప్రాముఖ్యతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. జవసత్వాలతో ఉన్న నా కాలాన్ని వృథా కానివ్వను. దీనినే నేను ఆదర్శంగా భావిస్తాను. 7 స్వచ్ఛమైన భూగ్రహ వాతావరణం కోసం, స్వచ్ఛమైన ఇంధన శక్తికోసం సర్వదా ప్రయత్నిస్తాను. 8 ఈ దేశ యువ ప్రతినిధిగా నా లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధించడానికి సాహసంతో పనిచేస్తాను. ఇతరుల విజయాలను కూడా అదే స్ఫూర్తితో ఆస్వాదిస్తాను. 9 నేను నా విశ్వాసమంత యువకుడిని/యువతిని. సందేహమంత వృద్ధుడను/వృద్ధురాలను. అందువల్ల నా హృదయంలో విశ్వాసమనే దీపాన్ని వెలిగిస్తాను. 10 నా దేశ పతాకం నా హృదయంలో ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. నా దేశానికి కీర్తి, వైభవం తీసుకు వస్తాను. ఆ రోజున తనలోంచి వచ్చిన భావావేశాన్ని పదిసూత్రాలుగా మలచి కలాం అక్కడ విద్యార్థులతో చేయించిన ఈ ప్రతిజ్ఞను కాకినాడలో విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఒకశిబిరంలో వారితో అదే స్ఫూర్తితో, నిబద్ధతతో చేయించాం. ఈ ప్రతిజ్ఞా పాఠాన్ని ప్రతి విద్యార్థీ ప్రతిరోజూ ఒకసారి ఇంట్లో కుడిచేయి ముందుకు చాపి నిజాయితీగా ప్రతిజ్ఞలాగా చదువుకోవాలి. విద్యాలయాలు కూడా ఇలా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తే ... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, వారి ఊరు, ఈ దేశం అన్నీ గర్వపడే పౌరులుగా తయారవుతారు. దీని కారణంగా అబ్దుల్ కలాంగారి ఆశీస్సులు వారందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి. నేను కూడా ‘‘మహాత్మా! విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మీరు కన్న కలలు సాకారం కావాలనీ, అలాగే మీరు చెప్పిన విషయాలు వారి మనసులలో బాగా నాటుకుని వారు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి అవసరమైన శ్రద్ధాసక్తులను వారికి కటాక్షించవలసింది’’ అని కోరుతూ శారదామాతకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కలాంను చూడాలన్న కల అది
పూర్వ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించి మన దేశంలో తెలియని విద్యార్థినీ విద్యార్థులుండరు. ఆయనకు పిల్లలన్నా, పిల్లలకు మంచి విషయాలు బోధించాలన్నా ప్రాణం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంటనే మద్రాస్ ఐ.ఐ.టి ప్రాంగణంలోని ఒక అతిథి భవనంలో ఉంటూ దేశంలోని పలు ప్రాంతాల్లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలను పునఃప్రారంభించిన మహానుభావుడు. చివరకు విద్యార్థులతో మాట్లాడుతూ, మాట్లాడుతూ జారిపడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేసాడు. అటువంటి కలాం– రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కేరళ రాష్ట్రంలోని వేనాడులో జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసంగించడానికి వెళ్ళాల్సి ఉంది. ఆయన దానికి తగ్గట్టుగా ప్రణాళికవేసుకుని ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ విమానం రెండు గంటలు ఆలస్యం అయింది. ముందనుకున్న ప్రకారం బెంగళూరులోదిగి కాలికట్ విమానం ఎక్కి, అక్కడినుంచి కారులో వేనాడుకు వెళ్ళాలి. బెంగళూరుకు ఆలస్యంగా చేరుకోవడంతో కాలికట్ విమానం వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగానే సాయంత్రం ఆరు కావచ్చింది. అంటే ఆ సమయానికి ఆయన వేనాడులో వేదికమీద ఉండాలి. వెంటనే ఆయన పాఠశాలవారికి ఫోన్ చేసి ‘‘విమానం ఆలస్యం అయింది. రాలేకపోతున్నా. కనుక మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. నా ఆశీస్సులు మీ కెప్పుడూ ఉంటాయి.’’ అని చెప్పారు. అది విన్న నిర్వాహకులు – ‘‘కలాంగారిని దగ్గరగా చూడాలని, ఆయనతో మాట్లాడాలని మా పిల్లలందరికీ కల. ఎంత ఆలస్యమయినా ఫరవాలేదు. మీరు రాగలరా ?’’ అని అడిగారు. దానితో చలించిపోయిన కలాం–‘‘ఇప్పడు నాకు మరో మార్గంలేదు. ఒక్క అరణ్యమార్గంలో ఇక్కడినుండి (బెంగళూరు) కారులో వస్తే తెల్లవారు జామున 2.30–3గంటలకు చేరుకోగలను. అప్పటివరకూ మీ పిల్లలు ఉండగలరా ?’’ అని బదులిచ్చారు. ‘‘పరమ సంతోషంతో కూర్చుంటారు’’ అని నిర్వాహకులు చాలా హుషారుగా సమాధానమిచ్చారు.‘అయితే, వస్తున్నా..’’ అన్నారాయన. ‘‘నాగరకతకు సంబంధించిన చిహ్నంగా ఆ రహదారి తప్ప వేరొకదారి లేదు. అంత భయంకరమైన అరణ్యమార్గంలో చంద్రుడి కాంతి ఒక్కటే తోడుగా నేను ఆరుగంటలకు వేనాడు బయల్దేరాను’’అని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నరకు వేనాడు చేరుకున్నారు. అంతదూరం ప్రయాణం చేసిన బడలికనుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి మందిరానికి వెళ్లకుండా, కనీసం ముఖంకూడా కడుక్కోకుండా పిల్లలు ఎదురుచూస్తుంటారని నేరుగా పాఠశాలకు వెళ్ళారు. తెల్లవారుఝాము మూడవుతున్నది. పిల్లలకళ్ళు మత్తుకు వాలిపోయి, తలలు పక్కకు ఒరిగిపోయి నిద్రముఖాలతో తూగుతూ ఉండాలి. కానీ కలాం గారొస్తున్నారన్న సంతోషంలో పౌర్ణమి చంద్రుడిలా వికసించిన ముఖాలతో వారందరూ ఎదురుచూస్తుంటే, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆనందంలో ఆయన ప్రసంగించినా సంక్షిప్తంగానే ముగించారు. దానికి ముందు ఆయన వారితో పది సూత్రాలతో పొదిగిన ఒక చక్కటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ దేశం వృద్ధిలోకి రావాలని, పిల్లలందరూ కూడా జీవితంలో మూడుపూవులూ ఆరుకాయల చందంగా ఎదగాలన్న ఆకాంక్ష ఆ సూత్రాలవెనుక ఉన్న సూత్రం. (అబ్దుల్ కలాం జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలతో కాకినాడ గోశాలలో విద్యార్థులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు 2017లో చేసిన వ్యక్తిత్వ వికాస ప్రసంగం సంక్షిప్త పాఠం– ఈ వారం నుంచి). -
చరిత్ర సాక్షి భవిష్యవాణి
‘విభజన విషయంలో మనం విజ్ఞతతో వ్యవహరించగలిగామా, సక్రమంగా వ్యవరించగలిగామా అనేది చరిత్ర మాత్రమే నిర్ణయిస్తుంది.’ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్న మాట ఇది. అబుల్ కలాం ఆజాద్– స్వతంత్ర భారత తొలి విద్యామంత్రిగానే సాధారణంగా చెప్పుకుంటారు. లేదా బహు భాషా పండితునిగా ప్రస్తావిస్తారు. కానీ ఆజాద్కు ఎంతో ఘనమైన గతం ఉంది. అంతకు మించి సమకాలీన చరిత్ర పరిణామాలు భవిష్యత్తు మీద ఎలా ప్రతిబింబించగలవో తూకం వేసినట్టు వెల్లడించగల దృష్టి ఆయన సొంతం. ఇందుకు పైన చెప్పిన మాటే గొప్ప సాక్ష్యం. అందులోని ‘విభజన’ అంటే దేశ విభజన (1947) అని గమనించాలి. నిజానికి విభజనను గాంధీజీ ‘స్పిరిచ్యువల్ ట్రాజెడీ’ అని నిరసించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు కొత్తకాదు. భారత జాతీయ కాంగ్రెస్లో పలువురికీ, హిందూ మహాసభ వంటి సంస్థల నాయకులకీ కూడా దేశ విభజన మీద తీవ్ర నిరసనలు ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాట క్రమంలో కొన్ని వివాదాంశాలు లేవని ఎవరూ చెప్పలేరు. అలా చెప్పడం అచారిత్రకం కూడా. దేశ విభజన తరువాతే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇది ఎక్కువ మందికి– అటు హిందువులు, ఇటు ముస్లింలకు కూడా రుచించని పరిణామం. ఆ పరిణామాలలో భాగస్వామి అబ్దుల్ కలాం. ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ అన్న తన గ్రంథంలో భారతీయులు జీర్ణించుకోలేని చాలా వాస్తవాలను ఆజాద్ కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు. నేతలు గొప్పవారు కావచ్చు. కానీ వారిని సృష్టించిన చరిత్ర ఇంకా గొప్పది. దేశం అంతకంటే గొప్పది. ఆ వాస్తవాలను నిష్కర్షగా చెప్పడంలో ఆజాద్ అంతరంగం అదేనని అనిపిస్తుంది. అబుల్ కలాం (నవంబర్ 11,1888–ఫిబ్రవరి 22, 1958) మక్కాలో పుట్టారు. కలాం తండ్రి ఢిల్లీలోనే అమ్మమ్మగారి ఇంట ఉండేవారు. ఆయన తండ్రి (అబుల్ కలాం తాతగారు) చిన్ననాడే కన్నుమూశారు. 1857లో అబ్దుల్ కలాం తండ్రి మక్కా వెళ్లిపోయారు. మళ్లీ కలాం పుట్టిన రెండేళ్ల తరువాత 1890లో కలకత్తా వచ్చారు. ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ, ఇంగ్లిష్ భాషలు ఆయన అక్కడే నేర్చుకున్నారు. నిజానికి ఆయన మత పెద్ద కావలసి ఉంది. కానీ కొంత విప్లవాత్మక ధోరణి వల్ల జర్నలిస్టుగా మారారు. రెండు పత్రికలు నడిపారు. అటు ఇస్లాం మీద ప్రగాఢ విశ్వాసం, ఇటు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకత ఉజ్జ్వలంగా ఉన్న ముస్లింలు ఆ కాలంలో చాలా దేశాలలో ఉండేవారు. అలాంటి ధోరణికి చెందినవారే అబ్దుల్ కలాం. అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీలలో పర్యటించి అలాంటి ధోరణి కలిగిన ముస్లిం ప్రముఖులను ఆయన కలుసుకున్నారు. బెంగాల్ విభజనను వ్యతిరేకించడం, ఖిలాఫత్ ఉద్యమంతో మమేకం కావడం ఇలాంటి ధోరణినే ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖిలాఫత్ ఉద్యమాన్ని విస్తరింపచేసిన గాంధీజీకి అబుల్ కలాం సన్నిహితుడు కావడం అత్యంత సహజంగా కనిపిస్తుంది. ఖిలాఫత్ ఉద్యమం ఉద్దేశం– టర్కీలోని ఖలీఫా పీఠాన్ని (ప్రపంచ ముస్లింల గురుపీఠం) పునరుద్ధరించడం. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓటమితో ఆ పీఠాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది. చిత్రమేమిటంటే, ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించడం సరికాదని మహమ్మదలీ జిన్నా వాదన. ఖిలాఫత్ ఉద్యమాన్నీ, భారత స్వాతంత్య్రోద్యమన్నీ అంటే రాజకీయోద్యమాన్నీ కలపరాదన్నది జిన్నా అభిప్రాయం. దానివల్ల రాజకీయాలలో మతం చొరబడుతుందని ఆయన వాదించాడు. 1928 వరకు జాతీయవాదిగా వ్యవహరించిన జిన్నా తరువాత తన నాయకత్వంలోని ముస్లింలీగ్ను దేశ విభజన కార్యక్రమం దిశగా నడిపించాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు ఒకటి కాదని ప్రచారం చేశాడు. దీనిని అబ్దుల్ కలాం వ్యతిరేకించడమే మరొక చారిత్రక వైచిత్రి. అబుల్ కలాం పూర్తి మత నిబద్ధుడు. వారి పూర్వీకులు కూడా సనాతన ముస్లింలే. కానీ భారతదేశం విడిపోవడానికి కలాం అంగీకరించలేదు. జిన్నా మహమ్మదీయుడే అయినా మత ఆచరణకు కడుదూరంగా ఉండిపోయాడు. కేవలం ఆయన తాతగారే మతం మారారు. కానీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా దేశ విభజన కోరాడు. అదే జరిగింది. అబుల్ కలాం నమోదు చేసిన జ్ఞాపకాలను యథాతథంగా వెల్లడించడం సాధ్యం కాలేదు. కొన్నింటిని పరిహరించి మాత్రమే వాటిని జనంలోకి పంపించవలసి వచ్చింది. స్వరాజ్య పోరాటంలో నెహ్రూ పాత్ర చరిత్రాత్మకమే అయినా అది విమర్శలకు అతీతం కాదు. మౌంట్బాటన్ (ఆఖరి ఆంగ్ల వైస్రాయ్), కమ్యూనిస్టు ముద్రాంకితుడు వీకే కృష్ణమేనన్ల ప్రభావంతో నెహ్రూ కొన్ని తప్పిదాలు చేశారని అబుల్ కలాం నిష్కర్షగా చెప్పారు. నెహ్రూ అంతటి వ్యక్తి మీద విమర్శలే అయినప్పటికీ వీటిని కొట్టి పారేయలేమన్నది చాలామంది అభిప్రాయం. 1940 నాటికి స్వాతంత్య్రోద్యమంలో కనిపించిన మొదటి ఐదురుగు ప్రముఖులలో అబుల్ కలాం కూడా ఒకరు. ఆయన వ్యాఖ్యలు ఇవి. ముస్లిం వేర్పాటువాద ధోరణికి ప్రతినిధిగా జిన్నా కనిపిస్తారు. సామ్యవాద పునాదిగా సామాజిక వ్యవస్థ అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తిగా నెహ్రూ అగుపిస్తారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారతీయత ఆధారంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణ ం గురించి ఆలోచించిన మనిషిగా వినుతికెక్కారు. అబ్దుల్ కలాం అఖండ భారత్ కోసం తుదికంటా కట్టుబడిన యోధుడిగా దర్శనమిస్తారు. కేబినెట్ మిషన్ ప్రతిపాదనలను అంగీకరించడం ద్వారా నెహ్రూ ముస్లిం లీగ్కు ప్రాధాన్యం పెరగడానికి అవకాశం కల్పించారన్నది కలాం అభియోగం. ఆ సమయంలో పటేల్ కనుక కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటే ముస్లింలీగ్ ఒక ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఇచ్చేవారు కాదని కలాం నమ్మకం. 1946 వరకు కలాం కాంగ్రెస్ అధ్యక్షుడు. తన తరువాత ఆచార్య జేబీ కృపలానీ ఆ పదవికి వచ్చినా, వాస్తవికంగా వ్యవహారాలు నడిపినవారు నెహ్రూయే. మొదటి నుంచి నెహ్రూను గాంధీజీకి ఆప్తునిగా చెబుతారు. కానీ కలాం తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నెహ్రూకు ఇవ్వడం గాంధీజీకి కూడా పూర్తిగా సమ్మతం కాలేదని కలాం వెల్లడించారు. పటేల్కు పగ్గాలు ఇవ్వాలన్నది గాంధీజీ కోరిక. కానీ పటేల్ తన వారసునిగా రావడం కలాంకు సమ్మతం కాలేదు. నిజానికి ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించి, పాకిస్తాన్ విడిపోతేనే తలనొప్పి వదులుతుందని తీవ్ర నిస్పృహలో పడిన పటేల్ భావించారని ఆజాద్ అంచనా. తాత్కాలిక మంత్రివర్గంలో ఆర్థికమంత్రి లియాఖత్ అలీ (ముస్లింలీగ్ నాయకుడు, విభజన తరువాత పాకిస్తాన్ ప్రధాని) నెహ్రూనూ, పటేల్నూ ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన బడ్జెట్ సైతం ముస్లింలీగ్ అనుకూల రాజకీయమే. ఆయన విధానాలు మొత్తం దేశంలోని ధనికులకు శరాఘాతలయ్యాయి. అది ధనికుల మీద కక్షతోనో, పేదల మీద ప్రేమతోనో లియాఖత్ చేయలేదు. వారంతా కాంగ్రెస్ను ఆర్ధికంగా ఆదుకుంటున్నవారే. వీటి మూలంగానే పటేల్ పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించిన తొలి కాంగ్రెస్ వాదిగా చరిత్రకు ఎక్కారు. ఇంకా చిత్రం– మౌంట్బాటన్ను భారతదేశానికి పంపించినదే విభజన ప్రణాళికను అమలు చేయడానికి. కానీ అతడు దేశంలో అడుగు పెట్టడానికి ముందే పటేల్ విభజనకు యాభై శాతం అంగీకారంతోనే ఉన్నారని కలాం నిశ్చితాభిప్రాయం. ‘విభజన జెండాను ఎగరవేసినవారు జిన్నాయే, కానీ దానిని భుజానికెత్తుకున్నవారు పటేల్’ అనేదాకా అబుల్ కలాం వెళ్లారు. ఇక్కడ పటేల్ ఆలోచన వేరు. పాకిస్తాన్ను కోరుకున్నా, విభజన జరిగినా మళ్లీ ముస్లింలు మనసు మార్చుకుని సరిహద్దు రేఖలు చెరుపుకుని వచ్చి చేరిపోతారని ఆయన అంచనా. ఈ అంచనా తప్పింది. లియాఖత్ అలీఖాన్కు అలాంటి వేధింపునకు అవకాశం కల్పించినవారు సాక్షాత్తు పటేల్ అని కలాం అభిప్రాయం. ఎలాగంటే, ఆర్థికశాఖను పటేల్కు అప్పగించాలని వేవెల్ (మౌంట్బాటన్కు ముందు ఉన్న వైస్రాయ్. విభజనను వేగంగా అమలు చేయడానికి ఇతడి ఉద్యోగం పీకి, మౌంట్బాటన్ను హుటాహుటిన భారత్కు పంపారు) అనుకున్నారు. కానీ పటేల్ హోంశాఖకే మొగ్గు చూపారు. నెహ్రూ, అబుల్ కలాం సన్నిహిత మిత్రులు. కానీ నెహ్రూ చేసిన తప్పిదాలను తాను క్షమించలేనని రాసుకున్నారాయన. అందులో మొదటిది 1936 నాటి ఎన్నికలలో నెహ్రూ అనుసరించిన విధానం. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దేశంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సెస్లలో తప్ప మిగిలిన చోట్ల ముస్లింలీగ్కు భంగపాటు తప్పలేదు. కొన్నిచోట్ల కాంగ్రెస్కు కూడా మెజారిటీ రాలేదు. ఆ సమయంలో ఆ రెండు చోట్ల తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని ముస్లింలీగ్ కోరింది. అలాగే కాంగ్రెస్కు మెజారిటీ తక్కువైన చోట లీగ్ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఇందుకు నెహ్రూ పూర్తిగా వ్యతిరేకించారు. ఈ పరిణామమే జిన్నాను ద్విజాతి సిద్ధాంతం వైపు, క్రమంగా దేశ విభజన వైపు అడుగులు వేసేటట్టు చేసిందని చరిత్రకారుల అభిప్రాయం. వీరందరికంటే ముందు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినవారు అబుల్ కలాం. హిందువులను విశ్వసించలేమన్న అభిప్రాయానికి జిన్నా వచ్చేటట్టు చేసింది ఆ పరిణామమే. అప్పటి నుంచి ఆయన మాజీ జాతీయవాది అయ్యారు. 1940 నాటి లాహోర్ తీర్మానంలో ముస్లింలీగ్ దీనినే సుస్పష్టంగా వెల్లడించింది. మౌంట్బాటన్ దేశానికి వచ్చిన తరువాత నెహ్రూలో క్రమంగా వచ్చిన మార్పునకు అంతా చెప్పే కారణం ఒకటి ఉంది. అదే అబుల్ కలాం వంటి పెద్దమనిషి కూడా చెప్పారు– ఆ మార్పును నెహ్రూలో తీసుకువచ్చిన మనిషి మౌంట్బాటన్ భార్య ఎడ్వినా. నెహ్రూ అడుగులను చూసి, విభజన దిశగా సాగుతున్న నడకను చూసి ఒక దశలో అబుల్ కలాం హెచ్చరించారట. ఇదంతా చూస్తే, దేశ విభజన ముస్లింలీగ్ వల్ల కాదు, కాంగ్రెస్తోనే జరిగిందన్న అపవాదు వచ్చేలా ఉందని కలాం హెచ్చరిక సారాంశం. విభజనకు ఆమోదం చెబితే మనలని చరిత్ర క్షమించదని కూడా కలాం నెహ్రూను హెచ్చరించారు. సరైన పరిష్కారం దొరికే వరకు వేచి ఉందామంటూ ఆయన ఎంత నచ్చ చెప్పినా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ‘వాస్తవాలను చూడ నిరాకరించడం, వారిని కమ్మేసిన నైరాశ్యం వారి దృష్టిని మసకబారేటట్టు చేసింది’ అని చెప్పుకున్నారు కలాం. తన సమకాలికుల తప్పులు చూడడానికే అబుల్కలాం పరిమితం కాలేదు. ఆఖరికి తన వల్ల జరిగిన తప్పిదాలను కూడా అంగీకరించారు. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టడం తప్పిదమని, గాంధీజీ పరిభాషలో ‘హిమాలయమంత తప్పిద’మని ఆయన అన్నారు. ఆ సంవత్సరం ఏప్రిల్ 15న విభజన అంశం గురించి విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన మాట చరిత్రాత్మకమైనది. ‘దేశ విభజన కోసం ముస్లింలీగ్ ప్రతిపాదించిన ప్రణాళికను ప్రతి కోణం నుంచి పరిశీలించవలసిన అవసరం నాకు ఉంది. ఒక భారతీయునిగా ఆ ప్రణాళిక ప్రభావం భవిష్యత్తు మీద ఎలా ఉంటుందో యోచించవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. భవిష్యత్తులో ఆ ప్రణాళిక ముస్లిం జనాభా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా నేను ఒక ముస్లింగా గమనించవలసి ఉంది. ఇవన్నీ పరిశీలించిన తరువాత ఆ ప్రణాళిక భారత్కు మాత్రమే కాదు, మొత్తం ముస్లింలకు, ముఖ్యంగా భారతీయ ముస్లింలకు ఎంతో చేటు చేస్తుందని నా అభిప్రాయం. ఇది సమస్యను పరిష్కరించదు. పైగా మరిన్ని కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది’ అన్నారు. నిజమే. వర్తమానం అదే నిరూపిస్తున్నది. ‘తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లు తమ సమస్యలను పరిష్కరించుకుని సఖ్యంగా ఉంటాయని ఎవరూ చెప్పలేరు’ అన్నారాయన (1958). ఇది నిజమైంది. పశ్చిమ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. తూర్పు పాకిస్తాన్లో కూడా సిం«ద్, బలూచిస్తాన్, వాయువ్య సరిహద్దు ప్రాంతాలకు ఎవరి ఆకాంక్షలు వారికి ఉన్నాయని కలాం చెప్పారు. పాకిస్తాన్ మనుగడ గురించి కలాం చెప్పిన జోస్యం చాలా వరకు నిజమైంది. ఆయన చూస్తూ ఉండగానే ఆ దేశం మత దేశంగా మారిపోయింది. సైనిక పాలన కింద మగ్గింది. జిన్నా మరణం, లియాఖత్ అలీఖాన్ హత్య దక్షిణాసియాను కుదిపేసిన పరిణామాలే అయ్యాయి. ‘దేశ విభజన విషయంలో మనం విజ్ఞతతో వ్యవహరించామా? సక్రమంగా వ్యవరించగలిగామా?’ ఆయన ప్రశ్నకు బదులు చెప్పడం ఇప్పుడు ఎవరికీ కష్టం కాదు. - డా. గోపరాజు నారాయణరావు -
కమల్ హాసన్ ఓ గందరగోళం వ్యక్తా!?
సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్ బుధవారం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక భవనాన్ని సందిర్శించడం వెనక మతలబు ఏమైనా ఉందా? కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీకి ముస్లింల మద్దతు కూడగట్టడంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లినట్లు స్పష్టం అవుతుంది. అబ్దుల్ కలామ్ను మైనారిటీల నాయకుడిగా ఎవరూ పరిగణించనప్పటికీ దేశాధినేతగా దేశ ప్రజల్లో ఆయనకు సముచిత గౌరవం ఉంది. ముఖ్యంగా తమిళనాడు ముస్లిం ప్రజల్లో కలాంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి హేతువాదిగా చెప్పుకునే కమల్ హాసన్కు అబ్దుల్ కలాం స్మారక భవనం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం ద్వారా ముస్లింలకు ఆకర్షించవచ్చని భావించి ఉండవచ్చు. తమిళనాడు జనాభాలో ఏడు శాతం ముస్లింలు ఉన్నారు. వారిలో కమల్ హాసన్ పట్ల సానుకూలత ఉందో, లేదోగానీ వ్యతిరేకత మాత్రం ఉంది. 2013లో కమల్హాసన్ నటించి, నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం వివాదాస్పదం అవడమే కాకుండా దాన్ని నిషేధించాలంటూ తమిళ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ చిత్రంలో ముస్లింలను టెర్రరిస్టులుగా చూపించడమే అందుకు కారణం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, డైలాగులను తొలగిస్తే సినిమా విడుదలకు అనుమతిస్తామని, లేదంటే లేదని ముస్లిం నాయకులు నాడు హెచ్చరించారు. తన సినిమా విడుదల చేయకపోతే తాను దేశం విడిచి మరో దేశానికి వలసపోతానుగానీ సినిమాలో ఒక్క సన్నివేశాన్నిగానీ, డైలాగునుగానీ తొలగించే సమస్యే లేదని కమల్ హాసన్ ప్రతిఘటించారు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జోక్యంతో సమస్య పరిష్కారమైంది. కొన్ని డైలాగులను తొలగించి సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదలకు సహకరించినందుకు కమల్ హాసన్, జయలలితను కలసుకొని మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ముస్లింలు కమల్హాసన్కు వ్యతిరేకంగా మారారు. ఆయన తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తనే కోపం కూడా వారికి ఉంది. ఇలాంటి కులాలు, మతాల పట్టింపు తమిళ ముస్లింలకు ఒకప్పుడు అసలు ఉండేదికాదు. అందుకనే మొదటి నుంచి తమిళనాడు ముస్లింలు ద్రావిడ పార్టీలను, ముఖ్యంగా డీఎంకే పక్షాన ఉంటూ వచ్చారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం మొదటిసారి వారిలో ర్యాడికల్ భావాలను రేకెత్తించాయి. ‘క్వాయిద్ ఏ మిల్లాత్’ (మత సామరస్యానికి స్ఫూర్తిదాత)గా గుర్తింపు పొందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నాయకత్వంలోని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ ప్రభావంతో అన్ని కులాలు, మతాలు సమానమన్న స్ఫూర్తితోనే తమిళ ముస్లింలు జీవించారు. తమిళ భాషాభివృద్ధికి వారు కూడా కృషి చేశారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి కూడా ముస్లింల పట్ల ఎంతో సానూభూతితో వ్యవహరించేవారు. 1972లో మొహమ్మద్ ఇస్మాయిల్ మరణంతో ముస్లింలీగ్లో విభేదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ లీగ్ ద్రవిడ పార్టీలతోనే కొనసాగింది. బాబ్రీ మసీదు విధ్వంసంతో లీగ్లో ర్యాడికల్ భావాలు ఊపందుకున్నాయి. ముస్లిం వ్యాపారస్థుల ప్రయోజనాలకు పనిచేస్తున్నారనే ఆరోపణలు, వివాదాలు తలెత్తాయి. పర్యవసానంగా పలువురు నాయకులు బయటకు వచ్చి 1994లో ‘ఇండియన్ నేషనల్ లీగ్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1998లో కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్లతో తమిళనాడులో హిందువులు, ముస్లింలు అంటూ స్పష్టమైన విభజన ఇరువర్గాల ప్రజల్లో ఏర్పడింది. ‘అల్ ఉమ్మా’ అనే రాడికల్ ఇస్లాం గ్రూపునకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హత్యకు ప్రతీకారంగా జరిగినట్లు భావిస్తున్న నాటి వరుస బాంబు పేలుళ్లలో 58 మంది అమాయకులు మరణించారు. 2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘ఇండియన్ తవీద్ జమాత్, తమిళనాడు తవీద్ జమాత్’ కరడుగట్టిన ముస్లిం సంస్థలు పుట్టుకొచ్చాయి. 1995లో ‘తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం’ అనే సంస్థ ఏర్పడగా, దాని రాజకీయ పార్టీ 2009లో ‘మానితనేయ మక్కల్ కాచి’ ఏర్పాటయింది. ఈ పార్టీలు ఇప్పటికీ డీఎంకే లేదా ఏఐడీఎంకే ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ దశలో కమల్ హాసన్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు. ఆయనకు ముస్లింలు మద్దతిచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ముస్లింల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు సొంతంగానే పలు పార్టీలు ఉన్నాయని, మరో పార్టీ అవసరం లేదని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలేమిటో తమకు తెలియవని, ప్రజలు మాత్రం ఆయన ‘విశ్వరూపం’ మరచిపోలేదని అన్నారు. కమల్ హాసన్ ‘ఓ గందరగోళం నాయకుడు’ అని తమిళ ముస్లింల మత చరిత్ర, సంస్కృతిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించిన ప్రముఖ రచయిత, చిత్ర నిర్మాత కొంబాయ్ ఎస్. అన్వర్ వ్యాఖ్యానించారు. -
కలాంను స్మరించుకొని ..రాజకీయ ప్రస్ధానం
-
వడివడిగా కమల్ అడుగులు!
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు కమల్హాసన్ బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం అక్కడి నుంచి మదురై బయలుదేరారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్లతోపాటు రజనీకాంత్, విజయ్కాంత్లను కమల్ కలుసుకున్నారు. -
కమల్కు అప్పుడే చిక్కులు!
సాక్షి, రామంతపురం (తమిళనాడు) : ప్రముఖ నటుడు, తమిళనాడు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి క్రియాశీలకంగా మారనున్న కమల్హాసన్కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పాఠశాలను సందర్శించడానికి వీల్లేదంటూ తమిళనాడులోని హిందూ మున్నానీ అనే హిందూ సంస్థ డిమాండ్ చేసింది. రాజకీయాలను పాఠశాలలకు దూరం పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ జిల్లా విభాగ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కమల్ను అక్కడికి రాకుండా నిలువరించాలని కలెక్టర్ను వారు కోరారు. కలాం జన్మించిన రామేశ్వరం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని కమల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం ఇక్కడ నుంచే పార్టీని ప్రకటించి పూర్తి స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. ఈ సందర్భంగా ఏపీజే కలాం చదివిన పాఠశాలను సందర్శించనున్నారు. -
దూకుడు పెంచిన కమల్..!
సాక్షి, చెన్నై: విశ్వనాయకుడు కమల్ హాసన్ రాజకీయపార్టీ ప్రకటనకు దూకుడు పెంచారు. ఈనెల 12న(సోమవారం) సీఈసీ ముందుకు వెళ్లనున్నారని సమాచారం. పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను సీఈసీకి సమర్పించి, రిజిస్ట్రేషన్ చర్యలో నిమగ్నమయ్యారు. ఇందుకు జిల్లాకు ఐదుగురు అభిమాన సంఘం నేతల్ని ఎంపిక చేసి, వారి సంతకాలతో ప్రమాణ పత్రాన్ని సిద్ధం చేశారు. కమల్ రాజకీయ అరంగ్రేటం చేసినా, పార్టీ ప్రకటనలో మాత్రం జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడంతో కమల్ పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 21వ తేదీన భారత రత్నం, దివంగత అబ్దుల్ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరంలో పార్టీ పేరును ప్రకటించేందుకు కమల్ నిర్ణయించారు. ఈ తేదీ దగ్గరపడటంతో ముందుగా సీఈసీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించేందుకు తగ్గ చర్యలో పడ్డారు. దీనికి ఐదుగురితో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ పలు దఫాలు ఢిల్లీలో పర్యటించినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాల్ని, రాజకీయంగా పార్టీ ఏర్పాటుకు నియమ నిబంధనలు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంశాలపై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిననట్టు సంకేతాలు వెలువడ్డాయి. 12న సీఈసీ వద్దకు.. ఢిల్లీలో అన్ని పక్రియలు ముగియడం, పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదుగురితో కూడిన కమిటీ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా సీఈసీ వద్ద పేరు నమోదుకు ప్రమాణ పత్రం సమర్పించేందుకు నిర్ణయించారు. ఈ పత్రాన్ని రూపొందించేందుకు కమల్ సన్నిహితుడు రాశి అలగప్పన్ చర్యలు చేపట్టారు. అంతేకాక జిల్లాకు ఐదుగురు అభిమాన సంఘం నేతల్ని చెన్నైకు శనివారం పిలిపించారు. ఈనెల 12వ తేదీ ఢిల్లీలో ఐదుగురితో కూడిన కమిటీ సీఈసీ వద్ద పార్టీ నమోదుకు తగ్గ చర్యలు చేపట్టినట్టుగా అభిమాన సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. -
బొమ్మ పడాల్సిందే!
నిడదవోలు: ‘ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆవృత్తి అంటే నాకు ఎంతో గౌరవం’.. అన్నారు అబ్దుల్ కలాం. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసి మెరుగైన సమాజాన్ని అందించడంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయులకు ఉన్న స్థానం అటువంటిది. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. నోటీసుబోర్డులో వివరాలు తప్పనిసరి తాజాగా వివిధ పాఠశాలల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫొటోలు, బోధించే సబ్జెక్టు తదిత ర వివరాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఏర్పా టు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14,534 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సాధారణంగా గ్రామస్తులందరికీ తెలిసే ఉంటారు. పాఠశాలల పునఃప్రారంభంలో గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా తమ వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలని ఆదేశాలు జారీచేయడమేమిటని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్క శాఖకూ లేని నిబంధనలు తమ శాఖకు మాత్రమే అమలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఏమన్నా ఖైదీలమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల మహిళా ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తుత్తాయని చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆదేశాలు ఉపాధ్యాయుడి పేరు, బోధించే సబ్జెక్టు, ఐడీ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని అన్ని పాఠశాలలకు సర్కిలర్లు పంపారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది పాఠశాలలకు గ్రేడ్లు నిర్ణయించేటప్పుడు ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్న స్కూళ్లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వనున్నారు. దాంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మహిళా ఉపాధ్యాయుల ఆందోళన మహిళా ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు లేకుండా వివరాలు నోటీసుబోర్డులో పెట్టాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే తమ ఫోన్ నంబర్లు, వివరాలు ఇలా బహిర్గతం చేయడం వల్ల తమకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మహిళా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పాఠశాలల్లో నోటీస్ బోర్డుల్లో ఉపాధ్యాయుల ఫొటోలు, ఫోన్ నంబర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఖైదీల్లా కనిపిస్తున్నామా..? ఈ నిర్ణయం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. అవివాహితులైన మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. దీనివల్ల వారికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నిర్లయాన్ని విరమించుకోని పక్షంలో అన్ని యూనియన్ నాయకులతో సమష్టిగా ఉద్యమం చేపడతాం. – పి.జయకర్, జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు, నిడదవోలు ఏశాఖకూ లేని నిబంధనలు మాకేనా? రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో లేని నిబంధనలు విద్యాశాఖకు మాత్రమే అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఉపాధ్యాయుల వివరాలను ఎప్పుడో ఆన్లైన్లో ఉంచారు. కొత్తగా నోటీస్ బోర్డుల్లో పెడితే మహిళా ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతింటాయి. వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారు..? – చెరకు శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి, నిడదవోలు -
అభివృద్ధే అసలైన నివాళి
♦ దేశ ప్రగతికి ఉడుతలా పాటుపడదాం ♦ అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభోత్సవంలో ప్రధాని పిలుపు శ్రీరాముని కాలంలో రామేశ్వరంలోనిర్మించిన వారధికి ఉడుత చేసిన సాయంలా అందరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 125 కోట్ల జనాభా ప్రగతిపథం వైపు ఒక అడుగువేస్తే 125 కోట్ల అడుగులు ముందుకు సాగినట్లు అవుతుంది. అబ్దుల్ కలాంకు, అమ్మకు అదే మన శ్రద్ధాంజలి’’ అన్నారు. రామేశ్వరం సమీపం పెయికరుబూరులో గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్కలాం స్మారక మండపాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం విజ్ఞాన కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని పరిశీలించారు. కలాం విగ్రహాలు, చిత్రాలను తిలకించి పులకించారు. ఆ తర్వాత కాసేపు కలాం కుటుంబ సభ్యులతో గడిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశం అభివృద్ధి చెందినపుడే భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్కలాంకు అసలైన నివాళి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రామనాథ పురం జిల్లా రామేశ్వరం సమీపం పెయికరుబూరులో నిర్మించిన అబ్దుల్కలాం స్మారక మండపాన్ని ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కలాం ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. యువతరంలో మార్పు రావాలని అబ్దుల్ కలాం ఆశించేవారని, తమ ప్రభుత్వం ఆయన ఆశయాల సాధనకు అంకితం అవుతూ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఉద్యోగాల కోసం యువత పరుగులు పెట్టకుండా ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా పథకాలను రూపొందించామని అన్నారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని చెప్పారు. సముద్రంలో చేపల వేట సమయంలో మత్స్యకారుల కష్టాలకు పరిష్కారంగా కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని మోదీ తెలిపారు. ముఖ్యంగా నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అందుకే గ్రీన్ కారిడార్ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. రామాభిరాముని చరిత్రలో రామేశ్వరం ప్రస్తావన కూడా ఉండడం వల్ల ఆయోధ్య–రామేశ్వరం మధ్య రైలు సేవలను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అలాగే ధనుష్కోటికి రహదారిని నేడు ప్రారంభించిన్నట్లు ఆయన చెప్పారు. చెన్నై, మదురై, కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి రూ.900 కోట్లను మంజూరు చేశామని ప్రధాని తెలిపారు. అలాగే అమృత్ పథకాన్ని రామేశ్వరం, తిరునెల్వేలి, నాగర్కోవిల్, మదురై నగరాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. తమిళనాడులోని 8లక్షల మందికి ఇళ్లు కావాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉండి ఉంటే మణిమండపాన్ని చూసి ఎంతో మెచ్చుకునేవారని ఆయన అన్నారు. ఈ శుభతరుణంలో ఆమె లేకపోవడం బాధాకరమని అన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రజలందరి హృదయాల్లో కలాం చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కచ్చదీవులను భారత్ స్వాధీనం చేసుకోవడం ద్వారా తమిళ మత్స్యకారుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రధాని మోదీకి సీఎం ఎడపాడి తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. కలాం..సలాం అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలిసి మోదీ కూడా పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసింది. ఆటో సవారీ ఉచితం అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని చెన్నైకి చెందిన వీరాభిమాని కలైయరసన్ గురువారం ఉచిత సవారీ నిర్వహించాడు. ఉదయం 7గంటల నుంచి రాత్రి వరకు తన ఆటో ఎక్కిన ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేయకుండా కోరినచోట దింపాడు. ‘నేను వదిలేసి వెళ్లిన పనులను పూర్తిచేయండి విద్యార్థులారా’ అనే అబ్దుల్ కలాం నినాదాన్ని ఆటో వెనుక పోస్టర్గా అంటించుకుని ప్రచారం చేశాడు. తన సేవలను గురించి కలైయరసన్ మాట్లాడుతూ, ఆటో సవారీతో రోజుకు రూ.700 సంపాదిస్తా, ఇందులో రూ.250 యజమానికి, రూ.200లు పెట్రోలుకు పోగా రూ.250 తనకు మిగులుతుందని తెలిపాడు. కలాం ఒక మంచి మనిషి, ఈ దేశానికి ఎంతో చేశాడు, ఆయన వర్ధంతి, జయంతి రోజుల్లో గత మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్నానని, ఇక కూడా కొనసాగిస్తానని తెలిపాడు. కలాం కుటుంబంతో కాసేపు.. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తది తర సభ్యులతో కలిసి కూర్చుని క్షేమ సమాచా రాలు తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చునబెట్టుకుని మురిపెంగా ముద్దులాడా రు. మోదీకి కుటుంబసభ్యులంతా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం మదురై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు స్వాగతం పలికారు. ప్రధానితోపాటూ కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు వచ్చారు. మదురై నుంచి ఆర్మీ హెలికాప్టర్లో స్మారక మందిరానికి చేరుకున్నారు. అదే హెలికాప్టర్లో గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం ఎడపాడి సైతం వచ్చారు. 11.30 గంటలకు స్మారక మండపాన్ని, కలాం ఆలోచనలకు అద్దం పట్టేలా రూపొందించిన కలాం విజన్ 2020 సంతోష్ వాహిని ప్రచార రథాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం కలామ్ ద్వితీయ వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రీన్బెల్ట్ కారిడార్ పథకం కింద నడిసముద్రంలో చేపలవేట నిమిత్తం ప్రాజెక్టు అనుమతి ప్రతిని మత్య్సకారులకు అందజేశారు. దేశంలోని రెండు ఆధ్యాత్మిక కేంద్రాలైన రామేశ్వరం–అయోధ్య మధ్య రైలు సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేదికపై నుంచే ప్రారంభించారు. రూ.55 కోట్లతో నిర్మించిన రామేశ్వరం–ధనుష్కోటి జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం పళనిస్వామి, కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, పొన్ రాధాకృష్ణన్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై పాల్గొన్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.40 గంటలకు మదురై నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. -
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళి
మనందరికీ స్ఫూర్తి ప్రదాత అంటూ ట్వీటర్లో ట్వీట్ సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. కలాం రెండో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన్ను స్మరిస్తూ జగన్ ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘నిరాడంబరమైన వ్యక్తి, మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ మిస్సైల్ మ్యాన్’ అంటూ కలాంను జగన్మోహన్రెడ్డి కీర్తించారు. -
అభివృద్ధి భారతం.. కలాం కల
దానిని సాకారం చేసేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం - దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు - రామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం - కలాం సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని - జయలలిత లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందన్న మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న 2022 నాటికి అభివృద్ధి భారతాన్ని చూడాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలుగన్నారని, ఆయన కలలను నిజం చేసేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రస్తుతం దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగు ముం దుకేస్తే.. దేశం 125 కోట్ల అడుగులు ముందుకువెళుతుంది’’అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా తమిళనా డులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుం బూరులో కలాం భౌతికకాయాన్ని ఖననం చేసి న చోటనే నిర్మించిన స్మారక మండపాన్ని ప్రధా ని జాతికి అంకితం చేశారు. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. మాది చేతల ప్రభుత్వం.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కలాం కలలుగన్న అభివృద్ధి భారతాన్ని నిజం చేసేం దుకు కేంద్రం ప్రారంభించిన వివిధ అభివృద్ధి పథకాలైన.. స్టాండప్ ఇండియా లేదా స్టార్టప్ ఇండియా, అమృత్ సిటీస్ లేదా స్మార్ట్ సిటీస్, స్వచ్ఛభారత్ ప్రాజెక్టులు చాలాదూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. కలాం స్మారకంతో రామేశ్వరానికి మరింత శోభ, ప్రతిష్ట చేకూరిం దని, యువత, పర్యాటకులు రామేశ్వరాన్ని, కలాం స్మారకాన్ని సందర్శించాలని మోదీ కో రారు. ‘‘కలాం అంతిమయాత్రలో పాల్గొన్నపు డే స్మారకంపై మాటిచ్చా. నేడు అది నిలబెట్టుకున్నా. రెండేళ్ల వ్యవధిలో అద్భుతమైన స్మారక నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించా’’అని మోదీ పేర్కొన్నారు. స్ఫూర్తిప్రదాత కలాం.. కలాం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారని మోదీ అన్నారు. యువతను, విద్యార్థులను కలాం అమితంగా ఇష్టపడేవా రని, వారి కోసమే స్టాండప్, స్టార్టప్ స్కీముల ను ప్రారంభించామని, యువతకు ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని పనిచేస్తే.. కొత్త భారతదేశాన్ని, కొత్త తమిళనాడును చూడవచ్చన్నారు. రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లే వీక్లీ రైలును ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, సీఎం కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు పొన్ రాధాకృష్ణన్, నిర్మలాసీతారామన్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. స్మారకం.. ప్రత్యేకం..: కలాం స్వగ్రామం పేయికరుంబూరులో తమిళనాడు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కలాం స్మారకాన్ని నిర్మించారు. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. కలాంకు చెందిన 900 పెయింటింగ్లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. అమ్మ ఆశీస్సులు ఉంటాయి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కలాం స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నేను పాల్గొన్న భారీ కార్యక్రమం ఇదే. ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ(జయలలిత) లేకపోయినా.. తమిళనాడు సమగ్ర వికాసానికి ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను’’అని మోదీ వ్యాఖ్యానించారు. కలాం.. సలాం.. అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలసి మోదీ పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. కలాం కుటుంబంతో కొంతసేపు కలాం కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తదితర సభ్యులతో కలసి కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని మురిపెంగా ముద్దులాడారు. -
అమ్మ లేని లోటు కనిపిస్తోంది: మోదీ
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దివంగత ముఖ్యమంత్రి జయలలితను స్మరించుకున్నారు. 'అమ్మ ఇక్కడ లేని లోటు కనిపిస్తోంది. ఆమె ఆత్మ తన ఆశీస్సులను మనకు అందిస్తూనే ఉంటుంది' అని ప్రధాని మోదీ అన్నారు. 'అమ్మ ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే.. ఆమె ఎంతో సంతోషించి ఉండేవారు. శుభాకాంక్షలు తెలిపేవారు. మనమందరం గుర్తించుకోదగిన నేత ఆమె' అని అన్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కలాం యువతకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారు. ఈ రోజు ఎంతోమంది యువత జాబ్ క్రియేటర్లుగా ఎదగాలనుకుంటున్నారు' అని చెప్పారు. కలాంను పేయ్కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. -
కలామ్ స్మారక మందిరం ప్రారంభం
►కలాం.. కలకాలం! చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. కలాంను పేయ్కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ‘కలాం...సలాం’ అంటూ రూపొం దించిన గీతాన్ని ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి ఆలపించారు. ‘కలాం విషన్ 2020 సంతోష్ వాహినీ’ ప్రసార వాహనాన్ని ప్రారంభించారు. 12.25 గంటలకు రామేశ్వరం–అయోధ్య ఎక్స్ప్రెస్ రైలు సేవలను, రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రూ.55 కోటత్లో నిర్మించిన జాతీయ రహదారిని ఆరంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, నితిన్ గడ్కరి, పొన్ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, సీఎం ఎడపాడి పళనిస్వామి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. చరిత్ర ఎరుగని బందోబస్తు ప్రధాని మోదీ రాక సందర్భంగా రామేశ్వరం జిల్లాలో తమిళనాడులో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉచ్చిపుళ్లి విమానాశ్రయం నుంచి రామేశ్వరం వరకు జాతీయ రహదారి పొడవునా వేలాది మంది పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు. బుధ, గురువారాల్లో సముద్రంలో చేపలవేటకు మత్య్సకారులను అనుమతించలేదు. భారత నౌకాదళం, సముద్రతీర గస్తీదళం సైతం సముద్ర తీరంపై నిఘా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ తరువాత సైతం భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతగా పాటుపడ్డారు అబ్దుల్కలాం. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్లో 2015 జూలై 27వ తేదీన జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వేదికపైనే ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం కలాం మృతికి కన్నీళ్లు పెట్టాయి. అబ్దుల్కలాం జన్మించిన రామేశ్వరం పేయ్ కరుంబులో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఆయన ఆశయాలను ప్రతిబింబించేలా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ అదేరోజు ప్రకటించారు. ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో.. స్మారక మండప నిర్మాణ పనులను డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) పర్యవేక్షణలో సాగాయి. ప్రస్తుతం తొలిదశగా రూ.15 కోట్లతో మణిమండపం, రూ.10 కోట్లతో పరిసరాల్లోని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండప నిర్మాణానికి అవసరమైన అపురూపమైన వస్తువులను దేశం నలుమూలల నుంచి (కేరళ మినహా) తెప్పించారు. ప్రధానమైన ప్రవేశ ద్వారాలను తంజావూరు శిల్పులు తీర్చిదిద్దారు. స్థానిక పనివారితోపాటు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిర్మాణ రంగ నిపుణుల సేవలను వినియోగించారు. వీరుగాక కొత్త ఢిల్లీ నుంచి 500 మంది పనివారిని రప్పించారు. దేశంలోని అనేక ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో దీని నిర్మాణం చేపట్టారు. అబ్దుల్ కలాం జీవితంలోని ప్రధాన ఘట్టాలను అక్కడ పొందుపరిచారు. అద్భుతమైన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం పేపర్ బాయ్గా జీవితం ప్రారంభించి భార త ప్రథమ పౌరుడి స్థాయి వరకు తన జీవనగమనంలో అన్నింటా తన బాధ్యతలకు వన్నెతెచ్చారు కలాం. అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు నేటికీ మరువలేనివి. అందుకే అన్నింటిలోకి ఆయన ఇష్టపడే అంతరిక్ష ప్రయోగాలకు గుర్తుగా ఫొటో మ్యూజియంలో రాకెట్ నమూనాలను ఉంచారు. ఆయనలోని కళాకారుడిని పరిచయం చేసేలా కలాం రూపొందించిన చిత్ర లేఖనాలను అమర్చారు. ప్రాంగణం పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. డీఆర్డీవో కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా 24/7 పనిచేసేలా సీసీ కెమెరాలను అమర్చారు. రెండోదశలో అబ్దుల్కలాం వినియోగించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియం నిర్మిస్తారు. కలాం వర్ధంతి రోజు జూలై 27, జయంతి రోజైన అక్టోబర్ 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
‘ప్రగతి భారత్’కు స్ఫూర్తి
సందర్భం అయిదో తరగతిలో చదువు ఆపవలసిన పరిస్థితిలో ఇంటింటికీ పేపర్ వేసి చదువు సాగించిన రామేశ్వరం అబ్బాయి ఏపీజే అబ్దుల్ కలాం.. తర్వాత క్షిపణి రూపకర్తగా, రాష్ట్రపతిగా ఎదిగారు. కోట్లాది విద్యార్థులకు స్వాప్నికుడిగా, మార్గదర్శిగా అయ్యారు. భారతదేశపు మేలి రత్నం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాలంలో కలసిపోయి అప్పుడే రెండేళ్లు అయింది. ఆయన నిజమైన సర్వ ధర్మ సమన్వయకర్త, నిత్య జీవి తంలో ధర్మాన్ని నూరుపాళ్లు పాటించి అధికారానికి– వ్యక్తిగతా నికి మధ్య నిఖార్సయిన అడ్డుగో డను నిర్మించారు. రాజకీయాలు తన చుట్టూ అలముకున్నా ఎక్కడా ఏ వివాదానికీ తావు ఇవ్వని వివాదరహిత సర్వజన సుముఖుడు కలాం.. వ్యక్తి గత సంతోషానికి వివాహం, మిద్దెలు, మేడల కోసం ఆలో చన కూడా లేకుండా నిరంతరం దేశ సేవలో తరించిన కర్మ యోగి. తన స్వప్నమైన అభివృద్ధి భారత్ను సాధించడానికి లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమానికి రథ సారథ్యం వహించారు. డాక్టర్ కలాం రెండవ వర్ధంతి సందర్భంగా 27.7.2017నాడు తన జన్మస్థానం రామేశ్వరంలో మన ప్రధాని నరేంద్ర మోదీ కలాం మ్యూజియంను ప్రారం భించి దేశానికి అంకితం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో లీడ్ ఇండియా ఉద్యమ నాయకులు ‘కలాం మిషన్ 2020’ ప్రారంభించి 12–24 సంవత్సరాల మధ్యలో ఉన్న 20 కోట్ల యువతకు ‘మీ అభివృద్ధే దేశాభివృద్ధి’ శిక్షణను ఇచ్చి కలాం ప్రబోధించిన అభివృద్ధి భారత్ కలలను సాకారం చేసేందుకు నాంది పలుకుతున్నారు. ఈరోజు దేశం మొత్తం వారిని మరోమారు గుర్తు చేసుకుని వారి వారస త్వాన్ని స్వీకరించవలసిన సమయం. దేశం మొత్తంలో 2009 ప్రాంతంలో అవినీతి కుంభ కోణాలు కోకొల్లలు వెలుగు చూశాయి. ఈ అవినీతి రక్కసి వెన్ను విరిచేందుకు అన్నా హజారే, రవిశంకర్ గురూజీ, రాందేవ్ బాబా, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్బేడీ లాంటి దేశ ప్రముఖులందరూ ఏకమై ‘భ్రష్టాచార్ ఆందోళన్’ దేశవ్యా ప్తంగా చేయించడానికి డాక్టర్ అబ్దుల్ కలాంను అధ్యక్షు లుగా ఆహ్వానించారు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా వారు ఒప్పుకోలేదు. ‘ఇది దేశానికి చాలా అవసరం, ప్రముఖ నాయకులందరూ సంఘటిత శక్తిగా మారుతున్న చక్కని అవకాశం మీరెందుకు నాయకత్వం వహించేందుకు ఒప్పు కోవడం లేదు’ అని వారిని ఒక సందర్భంలో అడిగాను. ‘..అవినీతిని ఆపడం ఉద్యమాల ద్వారా సాధ్యం కాదు. అసలు అవినీతి జన్మస్థానం మనిషి మనసులో తన ఆలోచనలలో, మాట్లాడే మాటలలో చేసే చేష్టలలో ఉంటుంది. తనకొక న్యాయం, ఇతరులకొక న్యాయం, తన కొక చట్టం, ఇతరులకు మరొక చట్టం.. ఈ ద్వంద్వ వైఖరే అవినీతికి ముఖ్యమైన మూలాలు. ఎవరికి వారుగా గట్టి తీర్మానం చేసుకుని నీతితో జీవిస్తే కానీ అవినీతి అంతమ వదు. మీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వారిని మార్చ డానికి ఇది సరైన వయసు. మీరు చేసే ప్రయత్నానికి ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు తోడ్పడి అందరూ సమష్టిగా కృషి చేసినా వచ్చే తరంలో అవినీతి తగ్గుతుంది. అందుకే అవినీతి బురదకు దూరంగా ఉంటున్నాన’ని అన్నారు. చాచా నెహ్రూ తర్వాత బాలల హృదయాలు జయిం చినది ఒక్క అబ్దుల్ కలాంగారే. వారు జీవితమంతా శాస్త్ర వేత్త అయినా ఉపాధ్యాయ ప్రవృత్తి అవకాశం దొరికి నప్పుడల్లా విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత ఆఖరి శ్వాస వరకూ బాలలకే అంకితమైన మహామనిషి. అది 2009 సాధారణ ఎన్నికల సమయం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేవీ రమణాచారి ఆహ్వానం మేరకు కలాం తిరుపతి వచ్చి 50 వేల మంది విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఈ సంద ర్భంలో చిత్తూరు కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో లక్షమంది పిల్లలకు లీడ్ ఇండియా శిక్షణ ఇచ్చి ‘నోటుకు ఓటు అమ్మవద్దు’ అని పిల్లల ద్వారా ఎన్నికల్లో అవినీతిని నిరోధించేందుకు కృషి చేశాం. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ‘నోటుకు ఓటు అమ్మను’ అని సంతకం చేయించి ఒక లక్ష పోస్టు కార్డుల దండను కలాంగారి మెడలో వేశారు. ‘ ఈ పిల్లలు లంచం ఇవ్వరు, లంచం తీసుకోరు, తల్లిదండ్రులు లంచం తీసుకుంటే ప్రశ్నిస్తారు. అవినీతివల్ల దేశాభివృద్ధి ఎలా కుంటుపడుతుందో వారికి అర్థం చేయిస్తారు. అది దేశ అవినీతిని నిరోధించేందుకు లీడ్ ఇండియా చేస్తున్నదే సరైన ఉద్యమం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తోడై అవినీతిని ఆపాలి’ అన్నారు కలాం. ఈ మధ్య కోయంబత్తూర్ లోని పల్లపట్టికి చెందిన 18 ఏళ్ల విద్యార్థి రిఫత్ షారూక్... కలాం సాట్ను ఆవిష్కరించి పేరుగాంచాడు. 2006 ఆగస్టు 28న కలాం వందమంది లీడ్ ఇండియా మార్పు ప్రతినిధులను రాష్ట్రపతి భవన్కు పిలిపించి మీరు ఏం అవ్వాలని కలలు కంటున్నారు అని ప్రశ్నించారు. వారిలో అంగవైకల్యం కలిగిన 9వ తరగతి విద్యార్థి బొల్లా శ్రీకాంత్ లేచి ‘నేను మొట్టమొదటి అంగవైకల్యం కలిగిన రాష్ట్రపతి కావాలని కలలు కంటు న్నాను’ అన్నాడు. వెంటనే కలాం ‘రండి రండి భవిష్యత్ రాష్ట్రపతితో నేను ఫొటో దిగాల’ని పిలిచి ఫొటో దిగి ప్రోత్స హించారు. తర్వాత చాలాసార్లు శ్రీకాంత్ గురించి ప్రస్తా వించి ప్రస్తుతించారు. తర్వాత లీడ్ ఇండియా ప్రోత్సా హంతో ఎదిగివచ్చిన శ్రీకాంత్ ఈరోజు రతన్ టాటా మన్ననలు పొందిన యువ పారిశ్రామికవేత్త అయ్యారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 వసం తాలు నింపుకునే సమయానికి కలాం కలలు నిజమ నిపించేలా అభివృద్ధి జరిగి భారత్ విశ్వగురువుగా ఆవిర్భ వించబోతోంది. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ ఏకమై అభివృద్ధి భారత్ వైపు అడుగులేయడమనే లక్ష్య సాధనకోసం విత్తనం వేసిన కలాంకి మనందరి సలాం. (నేడు ఏపీజే అబ్దుల్ కలాం రెండవ వర్ధంతి సందర్భంగా) ప్రొ‘‘ నల్లబోయిన సుదర్శన్ ఆచార్య వ్యాసకర్త ఫౌండర్–చైర్మన్, ‘లీడ్ ఇండియా 2020’ మొబైల్స్ : 96666 61215 -
నాడు అబ్దుల్ కలాం నేడు కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా నాడు అబ్దుల్ కలాం ఆజాద్ను నాటి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని బేజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడానికి, నేడు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడానికి సుస్పష్టమైన లెక్కలు ఉన్నాయి. 2002లో ఫిబ్రవరి–మార్చి నెలల మధ్య గుజరాత్లో చెలరేగిన అల్లర్లతో వెయ్యి మందికిపైగా ముస్లింలు మరణించారు. పదివేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. అటు గుజరాత్లోని మోదీ ప్రభుత్వంపైనా, కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వంపై ముస్లిం ప్రజలు మండిపడుతున్న సమయమది. అంత పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లను చూసి వాజపేయి కూడా ఎంతో నొచ్చుకున్నారు. ముస్లిం ప్రజల పట్ల తమకు భేదభావం లేదని చెప్పడానికి, వారిని శాంతింపచేయడానికి 2002, జూన్ 10వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలామ్ పేరును ప్రకటించారు. పోఖ్రాన్ అణు పరీక్షల విజయంలో ప్రత్యక్ష పాత్ర ఉండడం, ఆయన రోజు భగవద్గీత చదువుతారన్న ప్రచారమూ ముందుగా వ్యతిరేకించినా ఆతర్వాత ఆరెస్సెస్ను అంగీకరించేలా చేసింది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా యూపీలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం దళిత వ్యతిరేకమైనదన్న ప్రచారంతోపాటు దేశంలో పలుచోట్ల దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం దళితుడైన రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. 2016, జనవరి నెలలో హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య, ఉనాలో చనిపోయిన గోవు తోలును వలుస్తున్న దళితులను చితకబాదడం, మాయావతిని వ్యభిచారికన్నా నీచమైనదని యూపీలోని బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ విమర్శించడం, ఆయన భార్య స్వాతి సింగ్కు యూపీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ఇవ్వడం, ఆమె గెలిచాక యోగి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వడం తదితర పరిణామాలన్నీ బీజేపీ దళిత వ్యతిరేకమన్న ప్రచారానికి దోహదం చేశాయి. ముఖ్యంగా యూపీలో ఇటీవల ఠాకూర్లు, దళితులకు మధ్య జరిగిన అల్లర్లు దీనికి మరింత ఆజ్యం పోసింది. దళితుల యాభై ఇళ్లను ఠాకూర్లు దగ్ధం చేయడం, వారికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వాన ‘భేమ్ ఆర్మీ’ నిరసనను పోలీసులు అడ్డుకోవడం, ఆయన్ని అరెస్ట్ చేసి అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టడం దళితుల్లో ఆగ్రహాన్ని నింపింది. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ దళితవాడను సందర్శించినప్పటికీ బాబా అంబేద్కర్కు నివాళులర్పించలేదు. పైగా ఆయన వెంట ఉన్న కార్యకర్తలు, దళితులు ‘జై భీమ్’ అని నినాదాలు చేస్తుంటే అందుకు బదులుగా ‘జై శ్రీరామ్’ అనాల్సిందిగా గొడవ చేశారు. అంతకుముందు రోజు అధికారులు దళితుల వద్దకు వచ్చి, సబ్బులు, షాంపోలు పంచారు. శుభ్రంగా స్నానం చేసి ముఖ్యమంత్రి కార్యక్రమానికి రావాలని ఆదేశించారు. ఈ ఉదంతంతో కూడా దళితులు కోపోద్రిక్తులయ్యారు. సరిగ్గా ఈ సమయంలో దళితులను మంచి చేసుకోవచ్చు. దళిత వ్యతిరేకులంటూ ప్రతిపక్షాలు విమర్శంచకుండా తప్పించుకోనూ వచ్చనే దూరాలోచనతోనే కోవంద్ను ఎంపిక చేశారు. ఆయనకు ఓటు వేయని వారంతా దళిత వ్యతిరేకులేనంటూ అప్పుడే కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రచారం కూడా ప్రారంభించారు. -
అంతరిక్ష సూక్ష్మజీవికి అబ్దుల్ కలాం పేరు
లాస్ ఏంజిలస్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను గౌరవిస్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ కొత్త జీవికి ఆయన పేరుతో నామకరణం చేసింది. ఇది ఒక రకం సూక్ష్మజీవి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్)లో తప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ భూమిపై కనిపిం చలేదు. కొత్త జీవికి శాస్త్రవేత్తలు సొలిబెసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు. నాసాలో సీనియర్ శాస్త్ర్రవేత్త అయిన కస్తూరీ వెంకటేశ్వరన్ ఈ విషయం వెల్లడించారు. 1963లో కలాం నాసాలో శిక్షణ తీసుకున్నారు. -
మా నాన్న ఆ రోజున ఆ దెబ్బ కొట్టాడు కాబట్టే...
‘రామా అదిగో తాటక, బాణమేసి సంహారం చెయ్’ అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఎందుకో సంకోచిస్తున్నట్లనిపించింది విశ్వామిత్రుడికి. ‘‘అది తప్పా, ఒప్పా పక్కనబెట్టు, పాపమా కాదా అని ఆలోచించకు. ప్రజల రక్షణకోసం, లోక కళ్యాణంకోసం ఎంతటి పాపమైనా మూటగట్టుకోవలసిందే, స్త్రీ అని చూడకు, బాణం వేసెయ్’’ అన్నాడు. దానికి రాముడేమన్నాడో చూడండి ‘మా నాన్నగారు నన్ను మీతో పంపినప్పుడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళు, ఆయన ఏదిచెప్తే అది చెయ్యి అన్నారు. మా నాన్నగారి మాట మీద గౌరవం, మీ మీద గౌరవం. వేస్తున్నా బాణం’ అన్నాడు. అదీ తండ్రిమాటకిచ్చే విలువ అంటే. శ్రీరామాయణం బాలకాండలోవచ్చే కుశనాభుడు అన్న రాజుకు ఘృతాచికి నూరుగురు కన్యలు పుట్టారు. వారు మహా అందగత్తెలు. వాళ్ళ అందం చూసి మోహించిన వాయుదేవుడు ‘మానవ కాంతలయితే మీ అందం క్షణికమే. నాకు భార్యలయితే దాన్ని శాశ్వతం చేస్తా’ అన్నాడు. దానికి వాళ్ళు ‘కన్యాదానం చేస్తే పది తరాల ముందు, పదితరాల వెనక తరిస్తారని ఆడపిల్లను కన్నతండ్రి ఎంతో మురిసిపోతాడు. మా తండ్రికూడా అంతే. తండ్రి చెప్పని వాళ్ళని మేం చేసుకోం. వివేకవంతుడివయితే మా నాన్నను అడుగు. ఆయన కన్యాదానం చేస్తే నీకు భార్యలమవుతాం’ అన్నారు. ఆగ్రహించిన వాయుదేవుడు వాళ్ళని గూని పొందమని శపించాడు. తరవాత తండ్రి వారిని బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేయడం, ఆయన శక్తికి వారు శాపవిముక్తులవడం జరిగింది. తండ్రిస్థానానికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారతీయ సంస్కృతి. తండ్రికి కోపం ఎప్పుడొచ్చినా సరే, అది అభ్యున్నతి కోసమే వస్తుంది తప్ప ఏదో పాడుచేయడానికో, నిందించడానికో కాదు... తండ్రి కోపం అమృతం పైకి పొంగి చిలికిన చినుకు. నేను మంచిగా చెబితే వినక ప్రమాదం తెచ్చుకుంటాడేమోనన్న ఆర్తిలో, కోపంలో తండ్రి కేకలేస్తాడు. అలా కేకలేయడం సంతోషకారకం కాదు తండ్రికి. తర్వాత ఎంత బాధపడతాడో! అరే, తొందరపడి దెబ్బలాడానే, వాడు చిన్నబుచ్చుకున్నాడనుకుని తండ్రి కుమిలిపోతాడు. చిన్న పిల్లలయితే తప్పు సరిచేసుకుంటారు. పెద్దవాడయిన తరువాత కూడా నన్ను మా తండ్రి తిట్టకూడదనుకోవడం మహాదోషం. తండ్రి ఇంట్లో లేనప్పుడు ఎవరో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ‘ఇది మీ నాన్నగారికి బహుమానం. ఆయనకు అందచేయండి’ అని చిన్న కుమారుడికి ఇచ్చి వెళ్ళారు. తండ్రి తిరిగొచ్చి ఈ వస్తువేమిటని అడిగితే కొడుకు ‘అది ఎవరో మీకు బహుమానమని ఇచ్చివెళ్ళా’ అని చెప్పాడు. వెంటనే ఎర్రబడ్డ కళ్ళతో తండ్రి ఈడ్చి ఒక్కలెంపకాయ కొట్టాడు. ‘బుద్ధుందిరా నీకు, అలా తీసుకోకూడదు. కారణం లేని బహుమానాలు చిట్టచివరకు దాస్యానికి కారణమవుతాయి. వాళ్ళమాట వినవలసి వస్తుంది. ఎందుకు పుచ్చుకున్నావ్? మా నాన్నగారికే ఇవ్వండని చెప్పి ఉండాల్సింది’’ అన్నాడు తండ్రి. ‘‘మా నాన్నగారు ఆనాడు నన్ను కొట్టిన దెబ్బ జీవితంలో బహుమానాలు, పొగడ్తల విషయంలో ఎప్పుడూ జాగత్తగా మసలుకునేటట్లు చేసింది. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఆనాడు మా నాన్నగారు నన్ను కొట్టిన దెబ్బే’’ అని రాసుకున్నారు అబ్దుల్ కలాం తన పుస్తకం ‘ఇన్డామిటబుల్ స్పిరిట్’లో. అదీ తండ్రి కోపాన్ని అర్థం చేసుకోవడం అంటే. అదీ విధేయత అంటే. -
చూపు లేకపోతేనేమి.. లక్ష్యముంది!
ఇప్పటివరకూ 3,000 మంది విద్యార్థులకు విద్యను అందించటమే కాదు.. వృత్తివిద్య కోర్సుల్లోనూ శిక్షణ ఇచ్చాం. కానీ వారికి ఉపాది ఎలా ? అందుకే ఈ కంపెనీ మొదలు పెట్టాం. ఇప్పుడు మా కంపెనీలో 150 మంది రకరకాల వృత్తి నిపుణులు ఉన్నారు. అంతా ఏదో ఒక భౌతిక అవయవ లోపం ఉన్నవారేం. అయితే మిగతావారికి వీరంతా ఏమాత్రం తీసిపోరు. లోపమనది ఎప్పటికీ విజయానికి అడ్డుగోడ కాదు. ఉన్నత లక్ష్యాలు లేకపోవడమే నిజమైన లోపం. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడమే గొప్పగా భావిస్తారు. అలాంటిది అతిపిన్న వయసులో.. ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ ఫ్రమ్ ఏషియా జాబితాలో చోటు దక్కించుకున్నా.. ఆయన దానిని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దృష్టంతా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరడమే. సాధారణ వ్యక్తులు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే గొప్పేంకాదు.. కానీ పుట్టుకతో చూపులేనివారు ఇటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సాధించడం సాధారణ విషయం కాదు. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. మన తెలుగువ్యక్తి శ్రీకాంత్ బొల్లం. వివరాల్లోకెళ్తే... స్కూల్ ఎడిషన్: శ్రీకాంత్ బొల్లం... రూ.50కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి సీఈవో. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తన కంపెనీని సక్సెస్ గ్రాఫ్లో ముందుంచడానికి కష్టపడే ఈ యువకుడిని చూసి ఒకప్పుడు నవ్వినవాళ్ళే అంతా. ఆఖరికి మంచి ర్యాంక్తో ఐఐటీ సీటు సంపాదించుకున్నా క్యాంపస్లోకి కూడా రానివ్వలేదు. ఎందుకంటే శ్రీకాంత్ అంధుడన్న కారణంతోనే.. మన తెలుగువాడే..: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లె టూరిలో పుట్టాడు శ్రీకాంత్. పుట్టినప్పటి నుంచే కళ్లు కనిపించవు. దీంతో ఏదైనా అనాధాశ్రమంలో చేర్చమని సలహా ఇచ్చారు బంధువులు. కానీ కన్నప్రేమ అందుకు అంగీకరించలేదు. అంధుడైనప్పటికీ మిగతావారిలాగే ఊర్లోని బడికి పంపించారు. ఆ తర్వాత అంధుల పాఠశాలలో చేరి పదోతరగతిలో 90 శాతం మార్కులు సంపాదించాడు. క్రికెట్, చెస్ ఆటల్లోనూ చాంపియన్గా నిలిచాడు. అయితే ఈ విజయాలేవీ అతనికి పూలబాటను ఏర్పాటు చేయలేదు. ఐఐటీతోపాటు ఇంజనీరింగ్ పూర్తిచేసేందుకు ఎన్నో ముళ్లబాటల్లో నడవాల్సి వచ్చింది. అబ్దుల్ కలాం చొరవతో...: అంధుడైనప్పటికీ అద్భుత ప్రతిభతో లీడ్ ఇండియా ప్రాజెక్ట్లో చోటు దక్కించుకున్నాడు. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం చేపట్టిన ప్రాజెక్ట్లో చదువుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశాల్లోని ఆహ్వానాలు.. అడ్మిషన్లు శ్రీకాంత్ జీవితాన్నే మార్చేశాయి. చదువు పూర్తయిన వెంటనే తిరిగి భారత్లో అడుగు పెట్టాడు. తన లాంటి మరికొందరికి చేయూత అందించాలని నిర్ణయించుకున్నాడు. బొల్లాంత్ ఇండస్ట్రీస్ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. -
పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి!
ఖండాంతర క్షిపణి వ్యవస్థలో భారతదేశం మరో మైలురాయిని దాటింది. మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వదేశంలో తయారుచేసిన ఇంటర్సెప్టర్ మిసైల్ను ఒడిషా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. అబ్దుల్ కలాం ద్వీపంలో దీన్ని శనివారం ఉదయం పరీక్షించారు. భూమి వాతావరణానికి 50 కిలోమీటర్ల పైన ఉండే లక్ష్యాలను కూడా ఛేదించే పీడీవీ మిషన్ అని దీనికి పేరు పెట్టినట్లు డీఆర్డీఓ అధికారి ఒకరు తెలిపారు. పీడీవీ ఇంటర్సెప్టర్తో పాటు రెండు దశల టార్గెట్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించామన్నారు. ప్రయోగ కేంద్రానికి 2వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న ఒక నౌక నుంచి ఒక క్షిపణిని ప్రయోగించగా, దాన్ని ఈ ఇంటర్సెప్టర్ విజయవంతంగా అడ్డుకుంది. దాడి చేసేందుకు వస్తున్న శత్రు క్షిపణిని రాడార్ అధారంతో గుర్తించి, ట్రాక్ చేసి దాన్ని ఛేదించడమే ఈ కొత్త ఇంటర్సెప్టర్ మిసైల్ పని. పూర్తిగా కంప్యూటర్ల నియంత్రణలో ఉండే పీడీవీ.. ఆ కంప్యూటర్ నుంచి తగిన ఆదేశం రాగానే బయల్దేరింది. దీనికి అత్యంత కచ్చితమైన ఇనెర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్) ఉంది. దాని సాయంతోనే లక్ష్యం దిశగా ఇది నూటికి నూరుశాతం కచ్చితంగా వెళ్తుంది. భూమి వాతావరణాన్ని దాటగానే దానికున్న హీట్ షీల్డ్ ఊడిపోతుంది. ఐఆర్ సీకర్ డోమ్ తెరుచుకుని, లక్ష్యం ఎక్కడుందో వెతుకుతుంది. వెంటనే దాన్ని అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. గల్ఫ్ యుద్ధం సమయంలో స్కడ్ క్షిపణులను అడ్డుకున్న పేట్రియాట్ మిసైళ్ల తరహాలోనే ఈ పీడీవీ ఉంటుందని అంటున్నారు. -
‘అగ్ని–5’ విజయవంతం
• అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి • పరిధి 5–6 వేల కిలోమీటర్ల పైనే • ఒడిశాలోని అబ్దుల్కలాం ద్వీపం నుంచి ప్రయోగం • దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతోనే రూపకల్పన • త్వరలోనే భారత రక్షణ వ్యవస్థలోకి ప్రవేశం బాలాసోర్: రక్షణ శాఖ అమ్ములపొదిలోకి త్వరలోనే అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5 చేరనుంది. ఒడిశాలోని బాలాసోర్లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం అగ్ని–5ను విజయవంతంగా పరీక్షించారు. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5–6 వేల కిలోమీటర్లు. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలున్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించటం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్ఎఫ్సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణశాఖ స్పష్టం చేసింది. మూడు దశల్లో పనిచేసే భూఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యమున్న అగ్ని–5ను ఉదయం 11.05 గంటలకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మొబైల్ లాం చర్ నుంచి ప్రయోగించారు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థంమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. 1,500 కిలోల అణ్వాయుధాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే దీన్ని లాంచింగ్ కోసం సిద్ధం చేయొచ్చు. అత్యాధునిక అగ్ని–5 2012లో అగ్ని–5 సిద్ధమైనప్పటికీ నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించాకే అగ్ని–5 సామర్థ్యాన్ని అధికారికంగా సోమవారం ధ్రువీకరించారు. ఇప్పటివరకున్న అగ్ని క్షిపణుల్లో అగ్ని–5 చాలా ప్రత్యేకమైంది. 5వేల కి.మీ.కు మించిన పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండటంతోపాటు.. దీని నేవిగేషన్, గైడెన్స్ వ్యవస్థ, ఇంజన్, వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం అన్నీ అత్యాధునిక సాంకేతికతో కూర్పుచేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ట్రయల్స్లో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్సిస్టమ్ (ఆర్ఐఎన్ఎస్), అధునాతనమైన మైక్రోనేవిగేషన్ వ్యవ స్థ (ఎమ్ఐఎన్ఎస్) ఉన్నాయి. హైస్పీడ్ కంప్యూటర్, లోపాల్లేని సాఫ్ట్వేర్, నమ్మకమైన బస్.. అగ్ని–5ను దోషరహిత క్షిపణిగా మార్చాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. 2011 కల్లా ఇది సిద్ధమవుతుందని భావించినప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు. దేశ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. మన వ్యూహాత్మక, నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేశారని ప్రణబ్ ట్వీట్ చేశా రు. ‘అగ్ని–5 సక్సెస్ భారతీయుందరికీ గర్వకారణం. వ్యూహాత్మక రక్షణ వ్యవస్థకు బ్రహ్మాండమైన బలాన్నందించారు’ అని మోదీ అభినందించారు. వైఎస్ జగన్ అభినందనలు: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం సక్సెస్పై ఆయన ట్టిట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. ఎలా పనిచేస్తుంది? విక్షేపక మార్గంలో అత్యున్నత ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ ద్వారా, ఆన్బోర్డు కంప్యూటర్ మార్గదర్శకత్వంలో రెట్టించిన వేగంతో (క్షిపణి వేగం, భూమ్యాకర్షణ శక్తి కలిపి) నిర్దేశిత లక్ష్యం వైపు అగ్ని–5 దూసుకెళ్తుంది. ఈ సమయంలో క్షిపణి ఉష్ణోగ్రత 4 వేల డిగ్రీల సెల్సియస్ను దాటిపోతుంది. అందుకోసం స్వదేశీ తయారీ కార్బన్–కార్బన్ కంపోజిట్ రక్షణ కవచం.. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించకుండా లక్ష్యం చేరేవరకు పేలోడ్ను కాపాడుతుంది. ఆర్ఐఎన్ఎస్, ఎమ్ఐఎన్ఎస్S కమాండ్తో టార్గెట్ను ఢీ కొంటుంది. సోమవారం ప్రయోగం సందర్భంగా మధ్య దార్లో, లక్ష్యిత స్థానంలో ఏర్పాటు చేసిన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థ మిసైల్ కచ్చితత్వాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. తొలిరెండు దశల ప్రయోగంతోనే ఈ మిసైల్ సామర్థ్యం ప్రపంచానికి అర్థమైంది. -
వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారులు, ఫిలిం స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా తమదైన ముద్ర వేసిన ప్రతీ ఒక్కరి జీవితాన్ని వెండితెర మీద చూపించేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి మరో ఇద్దరు ప్రముఖుల జీవితాలు చేరేందుకు రెడీ అవుతున్నాయి. ఆ ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది ప్రముఖులు కావటం మరో విశేషం. ఇప్పటికే ఒలింపిక్ విజేత మేరీకొమ్ బయోపిక్ తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖులు, వెయిట్ లిఫ్టర్గా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లీశ్వరీ జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగమ్మాయి సంజన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాత అనీల్ సుంకర కూడా బయోపిక్ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితకథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ అబ్దుల్ కలాం అనే టైటిల్ను రిజిస్టర్ చేసిన నిర్మాతలు ఈ సినిమాను పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పలుకూరు వాసికి అబ్దుల్ కలాం పురస్కారం
బనగానపల్లె రూరల్: మండల పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జేఎస్ఎస్ బ్రహ్మనందాచారికి డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం లభించింది. తాను చేసిన 525 కేటగిరీల సామాజిక సేవా కార్యక్రమాలకుగాను పురస్కారం లభించినట్లు బ్రహ్మందాచారి సోమవారం తెలిపారు. ఇటివల విజయవాడలోని మానస సాహిత్య సాంస్కృతిక అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో సంస్థ అధ్యక్షులు బ్రహ్మనందరావు, ప్రముఖ సీనినటులు పిళ్లా ప్రసాద్, నటి మహాలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం, ప్రశంస ప్రత్యం అందుకున్నట్లు ఆయన చెప్పారు. -
డల్లాస్లో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
డల్లాస్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 85వ జయంతిని డాల్లాస్ లోని ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్ లోని దేసీ ప్లాజా స్టూడియోలో కృష్ణా రెడ్డి కోడూరు, ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలాంతో కలిసి పని చేసిన శాస్త్రవేత్త కొల్లి ప్రసాద్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రావు కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్ కలాం సమయ పాలనకి ఎంత విలువిచ్చేవారో అలాగే పనిలో కూడా అంతే ఖచ్చితత్వంతో పనిచేసేవారనీ, ఎవరైనా తప్పు చేసినా వారిని ఆ తప్పుల నుండి నేర్చుకోమనేవారని, ముఖ్యంగా జూనియర్ శాస్త్రవేత్తలకి మరిన్ని అవకాశాలని కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించే వారని ప్రసాద్ రావు చెప్పారు. వ్యక్తి గతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వారు కాదని అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి తన దగ్గరకు చేరదీసేవారని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలన్న ఉద్దేశం కలాంకు ఉండేది కాదని, చేసిన తప్పులను సరిదిద్దేవారన్నారు. దేశాన్ని శక్తి వంతంగా ఉంచడానికి తను నిరంతరం తపించే వారని అన్నారు. తన కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని గడిపే వారు కాదని తన జీవితం మొత్తాన్ని దేశ సేవకే అంకితం చేసారని కొనియాడారు. పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం చేయడంలో కలాం గారి కృషిని వివరించారు.స్వతహాగా శాఖాహారి అయిన కలాం ఆహారపు అలవాట్లను ఎంతో నిబద్దతగా పాటించేవారని చెప్పారు. అలాగే కలాం గారు ఎప్పుడూ దేశానికి యువ శాస్త్రవేత్తలను, మంచి పౌరులను తయారుచేయాలనే సంకల్పంతో పనిచేసేవారని అందులో భాగంగానే తను రాష్ట్రపతి పదవీలో ఉన్నపుడు, పదవి కాలం పూర్తయిన తర్వాత ఎక్కువ సమయాన్ని విద్యార్థుల కోసం కేటాయించేవారని చెప్పారు. కలాం జీవితం నుండి ఇప్పటి యువత ఎంతో స్పూర్తి పొంది దేశానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని ప్రసాద్ రావు గారు కోరారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డా. బి. సోమరాజుతో కలిసి స్టెంటు ని అభివృద్ధి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాంకే దక్కిందని అన్నారు. డా. సుధా రాణి మాట్లాడుతూ దేశానికి అబ్దుల్ కలాం గారు ఎంతో సేవ చేసారని కొనియాడారు. వారి జయంతిలో పాల్గొనడం చాలా సంతోషకరమని చెప్పారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు డా.నరసింహారెడ్డి ఊరిమిండి మాట్లాడుతూ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్ర భాగాన నిలబెట్టడంలో కలాం గారి కృషి అభినందనీయమని శ్లాఘించారు. రాజకీయాలకి సంబంధం లేకపోయినప్పటికీ కలాం రాష్రపతిగా చక్కగా రాణించారని కొనియాడారు. గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీన ఎలాగైతే గుర్తుపెట్టుకొని జరుపుకుంటున్నామో అలాగే అబ్దుల్ కలాం జయంతి ని కూడా దేశమంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రసాద్ గుజ్జు మాట్లాడుతూ ఒక శాస్ర్త వేత్త భారత దేశ ప్రధమ పౌరుడుగా ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఆయనని అధ్యక్షులుగా నియమించారంటే వారు దేశానికి ఎంత సేవ చేసారో తెలుస్తుందని అన్నారు. దేశానికి ఒక ఆదర్శనీయమైన రాష్ట్రపతిగా మిగిలిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యుడు ఉమా మహేష్ పార్నపల్లి , శ్రీ బసాబత్తిన, ప్రసాద్ రెడ్డి గుజ్జు, సురేష్ రెడ్డి చాడ, ప్రబంద్ తోపుదుర్తి, కృష్ణారెడ్డి మాడ, వెంకటేష్ కోరమోని, కృష్ణమోహన్ రెడ్డి కుందూరు, ప్రసాద్ రెడ్డి చొప్పా, కృష్ణా పుట్టపర్తి, మనోహర్ నిమ్మగడ్డ, ప్రతీప్ కుమార్ రెడ్డి యద్దల, సతీష్ బండారు, ప్రవీణ్ కుమార్, హరీష్ రెడ్డి, చందు, రవితేజ, బాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. -
అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు
గుంటూరు (అరండల్పేట): యువత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సినీహీరో సుమన్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో కలాం 85వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం వంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం దేశ ప్రజల అదృష్టమన్నారు. విద్యార్థులు, యువత ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని అబ్దుల్కలాం జీవితాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. చివరి వరకు దేశసేవ కోసం ఆయన పరితపించారని పేర్కొన్నారు. కలలు కనండి. సాకారం చేసుకోండి అంటూ యువతకు ఆయన చ్చిన సందేశాన్ని అందరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యామ మురళీ, పోతురాజు శ్రీనివాస్, టి.శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. -
నిరంతర స్ఫూర్తిప్రదాత కలాం: వైఎస్ జగన్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి ఎప్పటికీ అలాగే నిలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. అబ్దుల్ కలాం పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2015 జూలై15న షిల్లాంగ్లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కుప్పకూలారు. అనంతరం బెధాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.1931 అక్టోబర్ 15న ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. Remembering Bharat Ratna Sri Abdul Kalamji on his birth anniversary. He will remain an inspiration forever. — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 October 2016 -
ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్ కలాం అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మన్సూర్ రహమాన్కు ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు–2016కు ఎంపికయ్యారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని వేరిగోల్డ్ ఆడిటోరియంలో ' గ్లోబల్ ఎకనామిక్ రిసర్చ్ అండ్ ప్రోగ్రెస్ ఫౌండేషన్, ఇండియన్ అబ్జర్వర్ పత్రికలు సంయుక్తంగా అవార్డును శనివారం బహుకరించనున్నాయి. విద్యారంగంలో చేసిన పరిశోధనాత్మక కృషి ఈ పురస్కారం లభించినట్లు రహమాన్ తెలిపారు. -
ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం
గన్ ఫౌండ్రీ: నేటితరం విద్యార్థులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను రోల్ మోడల్గా తీసుకోవాలని రామకృష్ణమఠం వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స డైరెక్టర్ పూజ్యశ్రీ స్వామి బోదమయానంద అన్నారు. శుక్రవారం కింగ్కోఠిలోని భారతీయ విద్యాభవన్లో హైదరాబాద్ కేంద్ర భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో డాక్టర్ అబ్దుల్ కలాంపై స్మారకోపన్యాస సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీ బోదమయానంద మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదల, కృషి వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత రాణించడంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. భవన్స సైనిక్ పురి కేంద్ర సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ, హైదరాబాద్ కేంద్ర చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్శాఖ ప్రొఫెసర్ సుమితారాయ్, సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లోకేష్ చెప్పడంతో ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్నా ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది నేనే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు చాలా కష్టపడ్డా 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నించా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయితే శాశ్వతంగా ఉంటుందని.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమేనని అప్పట్లో తన కుమారుడు లోకేష్ బాబు చెప్పడంతో.. ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నానని ఆయన అన్నారు. అంతేకాదు.. 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తాను ప్రయత్నించానని కూడా చంద్రబాబు అన్నారు. (వాస్తవానికి ఏపీలో మండలి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అందులోకి ప్రవేశించడానికి కనీస వయసు 30 ఏళ్లు అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చెప్పారు). 28 ఏళ్లకే తాను మంత్రిని అయ్యానని, అసలు రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీ రామారావుకు చెప్పింది కూడా తానేనని ఆయన అన్నారు. (ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవసరమైతే మామపై పోటీ చేసేందుకు సిద్ధమని నాటి కాంగ్రెస్ నాయకుడిగా చంద్రబాబు ప్రకటించారు). ఇక అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు తాను చాలా కష్టపడ్డానని కూడా ఆయన తెలిపారు. చివరకు నాటి ప్రధానమంత్రి వాజ్పేయిని అందుకు ఒప్పించానన్నారు. -
ఆంతర్యమేమిటో..
సూపర్స్టార్తో పొన్రాజ్ మరి కొందరితో భేటీకి కసరత్తు సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, భారతరత్నం, దివంగత అబ్దుల్ కలాం వెన్నంటి ఉండి, ఆయన పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఉన్న పొన్రాజ్ కొత్త మంతనాలు చర్చకు తెర లేపాయి. తాజాగా, దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్తో మంతనాలు సాగించి, మరి కొందరు వీఐపీలతో భేటీ కసరత్తుల్లో పొన్రాజ్ ఉండడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. భారత రత్నం, దివంగత అబ్దుల్ కలాం కు సలహాదారుడిగా పొన్రాజ్ వ్యవహరించిన విష యం తెలిసిందే. కలాం మరణానంతరం ఆయన ఆ శయ సాధన లక్ష్యంగా తన ప యనాన్ని కొనసాగించే పని లో పడ్డారు. ఇందులో భాగం గా అసెంబ్లీ ఎన్నికల సమయం లో పొన్రాజ్ కొత్త పార్టీని ప్రకటించారు. మేధావులు, యువత, నిపుణులు, వీఐపీలతో కూడిన ఆ పార్టీకి అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ పార్టీని బలోపేతం చేయడానికి తగ్గ కసరత్తుల్ని పొన్రాజ్ వేగవంతం చేశారు. యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా, అన్ని రంగాల్లోని ప్రముఖుల్ని ఈ వేదిక మీదకు తెచ్చే దిశగా తన కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శించే ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని వారిని కలాం ఆశయ సాధన దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో వీఐపీలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఆ దిశగా రాజకీయాల్లోకి దేవుడు ఆదేశిస్తే...అంటూ దాటవేత దోరణితో ముందుకు సాగుతున్న దక్షిణభారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్తో పొన్రాజ్ భేటీ సమాచారం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో రజనీకాంత్తో భేటీలో రాజకీయ అంశాలపై చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడడంతో అంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. పొన్ రాజ్తో భేటీ సమయంలో దేవుడు ఆదేశిస్తే..అన్న పాత పాటనే సూపర్ స్టార్ పాడినట్టు సమాచారం. రజనీకాంత్తో భేటీ తదుపరి, మరి కొందరు సీనీ వీఐపీలతో భేటీకి తగ్గ కసరత్తులతో పొన్రాజ్ ముందుకు సాగుతుండడం ఆలోచించ దగ్గ విషయమే. -
రామేశ్వరంలో కలాం విగ్రహం
అమృత్ పథకంలో మాజీ రాష్ట్రపతి స్వస్థలం రామేశ్వరం/సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని తమిళనాడులోని ఆయన స్వస్థలమైన రామేశ్వరంలో బుధవారం నిర్వహించారు. రక్షణ, పట్టణాభివృద్ధి శాఖలతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధానికి గుర్తుగా రామేశ్వరంలో డీఆర్డీవో(డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) జరిపిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పరీకర్, పొన్ రాధాకృష్ణన్ ఘనంగా నివాళులర్పించారు. పేకరంబులో కలాంనిలువెత్తు విగ్రహాన్ని కేంద్రమంత్రులు ఆవిష్కరించారు. కలాంకు నివాళిగా ఆయన స్వస్థలం రామేశ్వరాన్ని అమృత్(అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) కింద చేర్చినట్లు వెంకయ్య తెలిపారు. రూ. 48 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించామన్నారు. సాధారణంగా లక్ష లేదా ఆపైన జనాభా ఉన్న నగరాలనే ఈ పథకం కింద చేరుస్తారని, కానీ కలాంకు నివాళిగా 45 వేల జనాభా ఉన్న రామేశ్వరాన్ని ప్రధాని మోదీ ఈ పథకంలో చేర్చారన్నారు. కలాం సైకత శిల్పాన్ని ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఆవిష్కరింపజేశారు. కలాం లేని లోటు తీర్చలేనిదని మోదీ ట్వీట్ చేశారు. కాగా, కడలూరులో ప్రజలు నెలకొల్పిన కలాం విగ్రహాన్ని అనుమతులు లేవంటూ అధికారులు తొలగించారు. -
కలాం ఆశయాలను నిజం చేయాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క శామీర్పేట్: మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చూపిన దారిలో పయనించి ఆయన ఆశయాలను నిజం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం శామీర్పేట్లోని కేఎల్లార్ డిగ్రీ కళాశాల ఆవరణలో మాజీ రాష్ర్ట పతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, మధుయాస్కి హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం బట్టి మాట్లాడుతూ.. అబ్దుల్కలాం చూపిన మార్గంలో అందరూ పయణించాలని సూచించారు. దేశవిదేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటిన మహనీయుడు కలాం అని కొనియాడారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసినసేవలను కొనియాడారు. అనంతరం కళాశాలలో విద్యార్థులు డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను, కలలను సంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, లక్ష్మాపూర్ సర్పంచి కటికెల శ్యామల, కేశవరం ఎంపీటీసీ సభ్యుడు వీరప్ప, దేవరయాంజాల్ ఎంపీటీసీ సభ్యుడు జైపాల్రెడ్డి, జగన్గూడ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్రెడ్డి, నాయకులు చిట్టమల్ల రాగజ్యోతి, శ్రీనివాస్, గోపాల్రెడ్డి, భిక్షపతి, జగన్నాథం, అశోక్, వెంకటేశ్, అరుణ్కుమార్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంతచారి, నాయకులు పాల్గొన్నారు. -
విజనరీ లెజెండ్
-
అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి మొయినాబాద్: విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని భావిభారత పౌరులుగా ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సురాజ్య భారత్ స్టూడెంట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా పనిచేసి దేశ రాష్ట్రపతి అయి అనేక సేవలందించారని కొనియాడారు. భారత రాష్ట్రపతి అయికూడా సాధారణ జీవితం గడిపిన అసాధారణ వ్యక్తి కలాం అన్నారు. విద్యార్థులు అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశానికి సేవలందించే సైనికులుగా తయారు కావాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ప్రముఖ కవి డాక్టర్ జే.బాపిరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాంకు విద్యార్థులంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నా విద్యార్థులతోనే ఎక్కువగా మాట్లాడేవారన్నారు. కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు విజయ్ ఆర్య, కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కొమ్మిడి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గున్నాల రాంచంద్రారెడ్డి, సర్పంచ్లు గీతావనజాక్షి, సుధాకర్యాదవ్, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, మాణిక్రెడ్డి, మంగలి పెంటయ్య, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, నాయకులు ఈగ రవీందర్రెడ్డి, పద్మారావు, మాణెయ్య, హరినాథ్, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ
రామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బుధవారమిక్కడ ఆవిష్కరించారు. అలాగే రామేశ్వరంలో ఆయన పేరిట నిర్మించే స్మారక కేంద్రానికి వారు శంకుస్థాపన చేశారు. కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియంను సైతం నిర్మించనున్న విషయం తెలిసిందే. మరోవైపు కలాంకు దేశప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయనను భౌతికంగా కోల్పోయినా, కలాంను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆమె అన్నారు. -
మహా స్వాప్నిక విజేత
కష్టించే ప్రజల స్వేదం, శ్రమశక్తి ఎటువంటి దుష్టత్వా న్నయినా ఎదిరించగల అగ్నిని సృష్టించగలదని అబ్దుల్ కలాం విశ్వసించారు. డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం లోకాన్ని విడిచిపెట్టి వెళ్లి అప్పుడే సంవత్సరం అయింది. భారతదేశపు అత్యు న్నత పురస్కారమైన భారతరత్న గుర్తింపు వరించిన ఐదేళ్ల అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం, పదకొండవ దేశాధ్య క్షుడయ్యారు. అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు పూర్తి అయిన వెంటనే దాదాపు ఎనిమిదేళ్లు తనకు అత్యంత జీవిత లక్ష్యమైన టీచింగ్లోనే ఆఖరి శ్వాస విడిచిపెట్టారు. మధ్యతరగతి కుటుంబంలో ‘పేపర్ బోయ్’గా ఆరంభ మైన బాల్యం రామే శ్వరం నుంచి ఢిల్లీ వరకు 83 ఏళ్లపాటు సాగించిన జీవన ప్రస్థానంలో ఏపీజే అబ్దుల్ కలాం, నిత్య కర్మిష్టిగా దేశ సౌభా గ్యాన్ని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తగా క్రమేపీ దేశాధ్యక్షునిగా పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, భారత ప్రజాస్వామ్య యువపథ నిర్దేశకునిగా మార్గ దర్శకులయ్యారు. అబ్దుల్ కలాం జీవితంలో స్ఫూర్తిదాయకమైన ఉదంతా లెన్నో ఉన్నాయి. తన వ్యక్తి త్వంపై ప్రగాఢ ముద్ర వేసిన దేశ, విదేశీ మేధావులైన సత్పు రుషుల ప్రస్తావనలు ఉపన్యా సాలలో, రచనలలో సాక్షాత్క రిస్తాయి. ‘ది వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘మై జర్నీ’, ‘ఇగ్నై టెడ్ మైండ్స్’, ‘యూఆర్ బోర్న్ టు బ్లోసమ్’ వంటి రచనలు ఆయన అపూర్వ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటంతో భవిష్యత్ భారత యువతరా నికి కరదీపికలుగా ఉపకరిస్తున్నాయి. యువజనులే జాతి సంపదగా, భారత భవితవ్యాన్ని నిర్మించగలరని ఆయన కలలు కన్నారు. అపజయాలను ఎదుర్కొంటున్న సామాజిక వైరుధ్యాలను, నిరాశా నిస్పృహలు, దిశా నిర్దేశంలేని అస్పష్టత, సంక్లిష్టతా వైఖరులకు ఆయన తపించి, శ్రమించిన తీరుతెన్నులే ఆయన జీవ నయానం. ఆయన తత్వవేత్త కాదు. భారతదేశ పౌరునిగా మహత్తర గర్వంతో జీవితం చాలించాలని, తిరిగి మాతృ దేశం సౌభాగ్యవంతమైన జనావళి సుఖసంతోషాలతో బతికే శాస్త్రీయ సాంకేతిక పురోగతి సాధించేటట్టు ఆశీర్వదించాలని సర్వేశ్వరున్ని ప్రార్థించేవారు. ప్రజలు కష్టించే స్వేదం, శ్రమశక్తి ఎటువంటి దుష్టత్వాన్నయినా ఎదిరించగల అగ్నిని సృష్టించ గలదని ‘మిస్సైల్స్ మేన్ ఆఫ్ ఇండియా’ క్షిపణి పిత విశ్వసించారు. విరామ మెరుగని బోధనా పథికునిగా శ్రమించారు. ఉద్యోగాన్వేషిగా తొలి ఇంటర్వ్యూ వైఫల్యంతో ఋషీకేశ్లో స్వామీ శివానంద వద్ద పొందిన విద్యా సందేశ స్ఫూర్తి తోడుగా సాగిన యువ అబ్దుల్ కలాం జీవన యానం.. స్వామి నారాయణ్ గురు సంప్రదాయ యోగి ప్రముఖ్ స్వామీజీ దివ్యాను భవ చైతన్యం వరకు కొనసాగింది. ‘ట్రాన్సండెన్స్’గా ఆఖరి రచన మరణానంతరం విడుదల అయింది. 2020 టెక్నాలజీ విజన్ విజయవంతం కావాలని శ్రమించిన స్వాప్నిక జీవి అబ్దుల్ కలాం 2015 జూలై 27న మేఘాలయలోని షిల్లాంగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్నుమూసారు. యువతీ యువకుల స్వప్నాలు చెదిరిపోకుండా. చిరునవ్వులు చెరిగిపోకుండా, కళ్ళల్లో కాంతులు సన్నగిల్లకుండా 54 కోట్ల మంది యువతీ యువకుల ఆకాంక్షలకు, జీవన సంక్షోభానికి సత్వరం జాతి సర్వశక్తులు కేంద్రీకరిం చాలని సాగించిన శాశ్వత స్వప్నాన్వేషణలో ఏపీజే అబ్దుల్ కలాం సాగిపోయారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే మాటేమో గానీ ఆయ నకు ఒక అపురూపమైన స్మృతి చిహ్నాన్ని నిర్మించే విషయంలో కూడా మన పాలకులు సంవత్సర కాలంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుం డటమే అసలు విషాదం. (డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా) (వ్యాసకర్త : జయసూర్య, సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 94406 64610) -
అరుదైన రీతిలో అబ్దుల్ కలాంకు నివాళి!
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మొదటి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కోచికి చెందిన లెటర్ఫామ్స్ అనే సంస్థ అరుదైన రీతిలో నివాళులర్పించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఏడాదిగా ఇందుకోసం శ్రమిస్తోంది. కలాం మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ ఉత్తరాలు రాయాలని దేశంలోని 200 నగరాల పౌరులను ఆహ్వానించింది. ‘డియర్ కలాం సర్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా యువత.. కలాం గురించి రాసిన లేఖలను, వేసిన పెయింటింగ్లను యథాతథంగా పుస్తకంలా ప్రచురించాలని భావిస్తోంది. గతేడాది అక్టోబర్లో కలాం జయంతి రోజు నుంచి తమ ప్రయత్నాన్ని ప్రారంభించామని, యువత నుంచి అద్భుతమైన స్పందన కనిపించిందని, వాటిని పుస్తకరూపంలోకి తీసుకురావడం ద్వారా మహామనిషి కలాంకు నివాళులర్పిస్తామని లెటర్ఫామ్స్ సహ వ్యవస్థాపకుడు జాబీజాన్ తెలిపారు. ఈ పుస్తకానికి ‘డియర్ కలాం సర్’గా నామకరణం చేయాలని నిర్ణయించారు. వేలాది లేఖలు వచ్చినా, అందులో నుంచి 358 లేఖలను ఎంపికచేసి, వాటిని పుస్తకంగా ప్రచురిస్తున్నారు. -
కలాంకు ఇదేనా మర్యాద!
చెన్నై : మనిషి ఉన్నంత వరకే విలువ..అన్న నాడికి అద్దం పట్టే రీతిలో భారత రత్న అబ్దుల్ కలాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. స్మారక కేంద్రానికి స్థల కేటాయింపులో సాగుతున్న అలసత్వాన్ని బట్టి చూస్తే, ఇదేనా ఆ మహనీయుడికి ఇచ్చే మర్యాద అన్న ఆవేదన ప్రతి ఒక్కరి మదిలో మెదలక మానదు. రాష్ర్ట ప్రభుత్వ అలసత్వంపై కేంద్ర బృందం సైతం అసహనం వ్యక్తం చేసింది. ‘కలలు కనండి.... వాటిని సాకారం చేసుకోండి.. ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునకు స్పందించిన వాళ్లు దేశ విదేశాల్లో కోట్లల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు గత ఏడాది జూలై 27న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. అల్లంత దూ రాలకు వెళ్లినా, ఆయన సందేశాలు, పి లుపు శాశ్వతం. అందుకే ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకాని కి అమితాభిమానం. అయితే, పాలకుల్లో ఆ అభిమానం, గౌరవం కన్పించడం లే దని చెప్పవచ్చు. మనిషి ఉన్నంత వరకే విలువ...తదుపరి...అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. తాను పుట్టిన గడ్డ రామేశ్వరంలోని తేకరంబు వద్ద శాశ్వత నిద్రలో కలాం ఉన్నారు. ఆ ప్రదేశంలో స్మారక మండపం, ఎగ్జిబిషన్, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించారు. ఇందుకు తగ్గ హామీని కలాం సొదరుడు మహ్మద్ ముత్తు మీరాన్కు ఇచ్చారు. అయితే, పనులన్నీ నత్తనడకే. పర్యాటక, ఆథ్యాత్మిక కేంద్రం గా ఉన్న రామేశ్వరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కలాం సమాధిని సందర్శించి వెళ్తున్నారు. అయితే, అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రహరీ నిర్మాణాలు, కంచె ఏర్పాటు పనుల్ని ముగించారు. ఇనుప కమ్మిలను ఏర్పాటు చేసి బయటి నుంచి కూడా జనం సమాధిని వీక్షించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సమాధి మీద ఎండ పడకుండా ఓ షెడ్డును నిర్మించారు. అంతటితో తమ పని ముగిసినట్టే అన్నట్టుగా పాలకుల తీరు స్పష్టం అవుతున్నాయి. ఇదేనా మర్యాద : కలాం భౌతికంగా అందర్నీ వీడి మరో రెండు వారాల్లో ఏడాది కావస్తున్నది. అయినా, ఇంత వరకు కలాం స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, కలాంకు సంబంధించిన వస్తువుల ప్రదర్శన శాల, చిన్న పిల్లల పార్కు పనులు అడుగైనా ముందుకు సాగ లేదు. విజ్ఞాన కేంద్రం తదితర పనులకు రూ. 60 కోట్లను కేంద్రం కేటాయించినట్టు సంకేతాలు ఉన్నా, అందుకు తగ్గ పనులు చేపట్టేందుకు స్థలం సమస్య నెలకొని ఉన్నది. కలాం సమాధి ఉన్నప్రదేశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కలాం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఎకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఆ మహనీయుడు శాశ్వత నిద్రలో ఉన్నారు. అయితే, స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, ఇతర నిర్మాణాలకు తగ్గ స్థలం సమస్య నెలకొని ఉన్నది. ఈ స్థలాన్ని కేటాయించాలంటూ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, రాష్ట్ర పాలకుల్లో స్పందన కరువైనట్టుంది. అసెంబ్లీ ఎన్నికలు అడ్డొచ్చినా, మళ్లీ అమ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నది. అయినా, ఇంత వరకు స్థల కేటాయింపు విషయంగా ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. దీంతో ఏడాదిలోపు పనుల్ని ముగించి తీరుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలకు రాష్ర్ట ప్రభుత్వ తీరు అసహనాన్ని రేకెత్తిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎం మోహన్, ఆర్కే కౌహలాల్, మహేంద్రలతో కూడిన బృందం కలాం సమాధి పరిసరాల్ని మంగళ, బుధవారం పరిశీలన జరిపారు. అక్కడ ఇప్పటి వరకు సాగిన, సాగుతున్న పనుల్ని పరిశీలించి, స్థల కేటాయింపులో జాప్యంపై ఆ బృందం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
యువత లక్ష్యంతో ముందుకెళ్లాలి.
సింగరేణి ప్రాజెక్టుఅండ్ప్లానింగ్ డెరైక్టర్ మనోహర్రావు యైటింక్లయిన్కాలనీ : యువత తపన, పట్టుదలతో ముందుకెళ్లాలని సింగరేణి ప్రాజెక్టుఅండ్ ప్లానింగ్ డెరైక్టర్ మనోహర్రావు అన్నారు. స్థానిక అబ్దుల్కలాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తో బుధవారం మాట్లాడారు. పక్కా ప్రణాళికలను రచించుకుని, వాటి అమలుకు ముందుకు సాగాలన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకోసం యాజమాన్యం సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ప్రస్తుతం యువత విజయానికి అడుగుదూరంలో ఉందని, సంకల్పంతో చేరుకోవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి సంస్థ తనవంతు కృషి చేస్తోందన్నారు. కోల్బెల్ట్ ప్రాంత యువతకు ఉద్యోగావశాలు కల్పించేందుకు సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా సింగరేణి ఆణిముత్యాల కార్యక్రమం నిర్వహించి 11వేల మంది యవతకు వివిద సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 142 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొంది సింగరేణి సంస్థకు త మ చేయూతనందించాలని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న శిక్షణను అభినందించారు. పోలీసుశాఖ లో ఉద్యోగాలు పొంది సింగరేణి సంస్థకు సహాయ సహాకారాలు అందించాలన్నారు. ఆర్జీ-2 జీఎం విజయపాల్రెడ్డి, ఎస్ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేష్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, రాజారెడ్డి, యూనియన్ నాయకులు ఐలి శ్రీనివాస్, దశరధం తదితరులు పాల్గొన్నారు. -
స్కాలర్ షిప్ పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్: స్కాలర్ షిప్ పేరుతో ఆసిఫ్ నగర్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. అబ్దుల్ కలాం మెరిట్ స్కాలర్షిప్ పేరుతో ఒక్కొక్కరి నుంచి నిర్వాహకులు రూ. 200 వసూలు చేశారు. ఈ రోజు(ఆదివారం) పరీక్ష ఉందంటూ హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్ష లేకపోవడంతో ఆసిఫ్నగర్ పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
కలాం పాత్రలో ఇర్ఫాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతున్నాడు. మిసైల్ మ్యాన్గా భారత రక్షణ వ్యవస్థ విశేష సేవలు అందించటంతో పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం పాత్రలో నటించనున్నాడు. మరాఠీ నిర్మాత ప్రమోత్ గోరె, కలాం జీవితంపై సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలాం సాధించిన విజయాలతో పాటు ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే కలాం జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన ప్రమోద్, ఆయన కుటుంబసభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఏపీజే అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో ప్రారంభించి 2017లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ ను కలాం పాత్రకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్న నిర్మాత ప్రమోద్, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
‘అబ్దుల్కలామ్ విజన్ ఇండియా’పై నిషేధం
మద్రాసు హైకోర్టు తీర్పు సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అబ్దుల్కలామ్ సోదరుడు మహ్మద్ముత్తు మీరాన్ మరక్కయ్యర్ (99) మద్రాసు హైకోర్టులో ఇటీవల వేసిన పిటిషన్ శుక్రవారం అత్యవసర విచారణకు వచ్చింది. పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భారత 11వ రాష్ట్రపతిగా ఉండిన తన తమ్ముడు అబ్దుల్ కలామ్ జీవితాంతం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని ముత్తుమీరాన్ తెలిపాడు. తన తమ్ముని వద్ద సలహాదారుగా పనిచేసిన పొన్రాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అబ్దుల్కలామ్ విజన్ ఇండియా పేరుతో పార్టీని స్థాపించాడని, పార్టీ జెండాపై తన తమ్ముడి ఫొటోను ముద్రించాడని తెలిపారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఇతర రాజకీయ పార్టీల నేతల ఫొటోలు, విగ్రహాలకు ముసుగు తగిలించినట్లే తన సోదరుడి బొమ్మలకు కూడా మూసివేయడం బాధాకరమని అన్నారు. తన సోదరుడు పేరు ప్రతిష్టలకు కళంకం తెస్తూ అబ్దుల్కలామ్ పేరుతో ఏర్పాటైన పార్టీ కార్యవర్గాన్ని (గౌరవాధ్యక్షులు వి.పొన్రాజ్, ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి ఆర్ తిరుచెందూరన్) రద్దు చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఎస్ విమల అబ్దుల్కలామ్ పార్టీని, కార్యవర్గాన్ని నిషేధిస్తున్నట్లు శుక్రవారం తీర్పు చెప్పారు. -
నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఫెయిల్యూర్!
విద్య - విలువలు శ్రీరామాయణం ఉంది. సీతమ్మతల్లిని రావణాసురుడు అపహరించాడు. ఈ విషయం రాముడికి తెలియదు. రాముడు దేముడని రామాయణం ఎక్కడా చెప్పదు. రాముడు మనుష్యుడిగా వచ్చాడు. మీరు కూడా రాముడు మనుష్యుడనే భావనతోనే రామాయణం చదవండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. అది నరుడి కథ. సీతాపహరణం జరిగింది. లక్ష్మణస్వామి వెనక్కి వచ్చేశాడు. ఎవరెత్తుకెళ్ళారో ఆయనకి తెలియదు. ఏం జరిగిందని రాముడు గోదావరినడిగాడు. చెట్లను అడిగాడు. అరణ్యాన్ని అడిగాడు. మృగాలను అడిగాడు. ఏవీ పలకలేదు. ఎత్తుకుపోయినవాడు రావణాసురుడని వాటికి తెలుసు. అన్నీ చూశాయి. కానీ అవి రావణాసురుడికి భయపడ్డాయి. చెప్తే చంపేస్తాడు. ఎవరూ చెప్పకపోయేసరికి రాముడికి విపరీతమైన కోపమొచ్చింది. ఎవరికైనా ఆ క్షణంలో కోపమొస్తుందా, రాదా ! ’’నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు. నేనింతకాలం ధర్మానికి కట్టుబడ్డాను. నా భార్యను ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు. అయినా వాడికి ఇవి భయపడుతున్నాయి. నేను ధార్మికంగా బతుకుతుంటే నన్ను చేతకానివాడినని అనుకుంటున్నాయి. అంటే ధర్మానికి ఇవి రోజులు కావు. నేనూ ధర్మాన్ని కాసేపు పక్కనబెట్టేస్తా. ఇప్పుడు నా విలువిద్య ఏపాటిదో చూపిస్తా. తమ్ముడా, లక్ష్మణా! నా బాణాలు ప్రయోగిస్తున్నాను. వాటితో శరపంజరాన్ని కడతాను. పక్షులు కాదుకదా, దేవతలు కూడా తిరగలేరు. ఈ భూమ్మీద ప్రాణి అనేది ఉండదిక. సమస్త ప్రాణులనూ లయం చేసేస్తాను’’ అంటూ ఊగిపోతున్నాడు రాముడు. ధర్మానికి రోజులు కావు అని మనమూ నిత్యవ్యవహారంలో అంటూంటాం. కోపమొస్తే ఎవరికైనా అంతే. రాముడు బాణ ప్రయోగం మొదలుపెడితే ఆయన భుజా లు తాండవం చేస్తాయి. ఒక గంటా 48 నిమిషాల్లో 14 వేలమంది రాక్షసులను మట్టుబెట్టాడు ఒకానొక సమయంలో. ఆయనకు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎంత అస్త్రవిద్య ఇచ్చారంటే... మీరు బాలకాండ చదివితే తెలుస్తుంది. సంకల్పంచేసి మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు, సమస్త లోకాల్ని నాశనం చేసేస్తాయి. ఊగిపోతున్నాడు కోపంతో.. బాణంతీసి ఎక్కుపెడుతున్నాడు. ఇంతలో లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళమీద పడి ఒక్కటే ఒక్కమాట అడిగాడు - ‘‘అన్నయ్యా! వదిన కనబడడంలేదని లోకాన్నంతటినీ చంపేయటానికా గురువులయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మనకు విద్య ఇచ్చింది? అన్నయ్యా! నీ స్వార్థంకోసం ఈ అస్త్రాలను ఎన్నటికీ వాడవనీ, లోక క్షేమం కోసం మాత్రమే వాడతావని గురువులు ఈ విద్యను నీకిచ్చారు. వదిన కనబడనప్పుడు, ఎత్తుకు పోయినవాడు ఎవడో వాడిని వెతికి పట్టుకుని చంపకుండా, వీళ్ళెవరూ నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేదనే కోపంతో లోకాలనన్నిటినీ చంపేస్తావా? దానిని లోక క్షేమానికే ఉపయోగించాలన్నయ్యా, వద్దు, వాటి జోలికెళ్ళొద్దు’’ అన్నాడు ప్రాథేయపడుతూ. రాముడు వెంటనే ఏమన్నాడో తెలుసా... ‘‘తమ్ముడా! మంచి మాట చెప్పావు. నిజంగా ఈ విద్యను గురువుగారు మనకు అందుకు ఇవ్వలేదు. ఎవడు సీతమ్మను అపహరించాడో వాడిని వెతుకుదాం పద. నేనిక ఈ అస్త్రాన్ని ప్రయోగించను’’ అని వెనక్కి తీసుకున్నాడు. ఒక్కటి ఆలోచించండి. సైంధవుడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సుచేసి ఒక అక్కరలేని కోరిక కోరి తాను నాశనమవడమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు. రాముడు మాత్రం ఒక్క క్షణం కోపానికి వివశుడైపోయినా, లోకాన్ని నాశనం చెయ్యకుండా వెంటనే నిగ్రహించుకున్నాడు. రావణుడిని వెతికాడు, చివరకు సంహరించాడు. అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం పోయి కలియుగం కూడా వచ్చేసింది. అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు. ఆయనకు దేవాలయం కట్టి పూజ చేస్తున్నాం. నామం జపిస్తున్నాం. ఎందుకంటే... రాముడు దైవమనుకోకండి. ఒకానొక క్లిష్ట సమయం వచ్చినప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే శాశ్వతకీర్తి పొందుతాడో అటువంటి అడుగువేశాడు తప్ప, ఆవేశంలో ఊగిపోయినా నిగ్రహించుకుని వెనకముందులాలోచించాడు తప్ప దానికి వశమైపోలేదు. ఒక్క సంఘటనతో పాతాళమంత కిందకు వెళ్ళవలసినవాడు అలా వెళ్ళకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించి విచక్షణా శక్తిని ఉపయోగించిన ఫలితం ఎలా ఉందో చూసారుగా. ఇటువంటి సందర్భంలోనే ఆవేశాన్ని నిగ్రహించుకోలేని సైంధవుడు ఎంతగా దిగజారిపోయాడో యుగాలు మారినా అతని బలహీనతని లోకం ఎలా గుర్తుంచుకుని అలా బతకవద్దని తమ పిల్లలకు తరతరాలుగా ఎలా చెబుతూ వస్తుందో చూశారుగా... అలాగే కేవలం గురువుగారికిచ్చిన మాటకోసం ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా లక్షా 76వేల పోలియో ఆపరేషన్లు చేసిన ఒక డాక్టర్ ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. లోకక్షేమంకోసం గురువుగారికి, పెద్దలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరినైనా ఎంత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో చూశారుగా. ఇది విస్ఫోటనా శక్తి. మీరు పిల్లలు. మీలో అంత తేజస్సు, అంత బలం ఉంటుంది అయితే జీవితంలో ఏ పొరబాటు జరిగినా మీరు కోపంతోటి, ఉద్రేకంతోటి పదిమందిని బాధపెట్టే నిర్ణయాలు ఎప్పుడూ చేయకండి. పరిశీలించుకుని - ‘‘నా పొరబాటు దిద్దుకుంటాను, ఎవడు ఏమన్నా అనుకోనీయండి. జీవితంలో పైకి వస్తాను’’ అని సంకల్పించుకుని అలా రావడానికి ప్రయత్నించండి. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంగారంతటివాడి జీవితం ఫెయిల్యూర్తోనే స్టార్టయింది. ఆయన కోరుకున్న ఉద్యోగానికి సెలక్ట్ కాలేదు. వేరొకదానికి సెలక్టయి, నిరాశపడి తర్వాత ఒక స్వామీజీ ఉద్బోధంతో వెళ్ళి జాయినయ్యారు. అంతే ఇక మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన తన అనుభవంతో ఫెయిల్యూర్ను అద్భుతంగా నిర్వచించారు. ఎవరికోసమో తెలుసా! మీ పిల్లలందరికోసం. ఫెయిల్యూర్ అంటే జీవితంలో నీవెందుకూపనికిరావని తలుపులు మూసివేయడం కాదు. అది F.A.I.L. - First Attempt In Learning. అంటే నేర్చుకునే క్రమంలో అది మొదటి ప్రయత్నం అని. విఫలమయ్యావు - మళ్ళీ ప్రయత్నించు. అంతేకానీ అదే తలచుకుని నీరుకారిపోకూడదు. -
మోదీ పాలనను ఓర్వలేకే విమర్శలు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాలమూరు: మోదీ పాలన ద్వారా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని హరిహర హైటెక్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శేషప్ప పదవీ విరమణ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అంబేద్కర్, అబ్దుల్కలాంలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 1975లో అప్పటి కేంద్రప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో భాగస్వాములయిన యోధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఎమర్జెన్సీవి చీకటి రోజులని అన్నారు. దేశం నలుమూలల నిరసన జ్వాలలు రగిలాయని, జిల్లా నుంచి యువకులు అనేక మంది ఉద్యమ బాట పట్టారని అన్నారు. ఏబీవీపీ జరిపిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న శేషప్ప ముందు వరుసలో ఉండి పోరాడి జైలు జీవితం గడిపారని అన్నారు. ఈ సందర్భంగా శేషప్పను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఏలే శ్యామ్కుమార్, రావుల రవీంద్రనాథ్రెడ్డి, మురళిమనోహర్, లక్ష్మన్, నాగూరావునామాజి, శ్రీనివాస్,టి. ఆచారీ, రతంగ్పాండురెడ్డి, కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
కలామ్ పార్టీ!
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత రాష్ట్రపతి అబ్దుల్కలామ్ పేరుతో పార్టీ వెలిసింది. ‘ అబ్దుల్కలాం విజన్ ఇండియా పార్టీ’ పేరున కలాం సలాహాదారుడైన పొన్రాజ్ పార్టీని స్థాపించారు. అయితే పార్టీ ఏర్పాటుపై కలాం బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతుల వరసలో ప్రత్యేక స్థానాన్ని పొందిన అబ్దుల్ కలామ్కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐదేళ్లపాటు భారత రాష్ట్రపతి హోదాలో అనేక రాజకీయ పార్టీలతో మెలిగినా ప్రత్యేకమైన శైలిని చాటుకునేవారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అన్ని పార్టీల నేతలను ఆకట్టుకున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అబ్దుల్కలామ్ను ఇష్టపడుతారు. అంతరీక్ష శాస్త్రవేత్తగా మేధావులను, తత్వవేత్తగా యువతను, భావి భారత పౌరులకు మార్గదర్శిగా విద్యార్థిలోకాన్ని ఆలరించారు. విద్యార్థిలోకమైతే అబ్దుల్కలామ్ను అపురూపమైన వ్యక్తిగా ఆరాధిస్తారు. నేటి యువతను మేల్కొలుపుతూ, ఉత్తేజపరుస్తూ కలామ్ ఇచ్చిన సందే శాలు అన్నీఇన్నీ అని లెక్కకట్టలేం. విద్యార్థిలోకంతోనే చివరి వరకు గడపాలని అబ్దుల్ కలామ్ ఆశించారు. ఆయన ఆశించినట్లుగానే మేఘాలయా రాష్ట్రం షిల్లాంగ్లో గత ఏడాది జూలై 27వ తేదీన విద్యార్థుల నుద్దేశించి ప్రసంగిస్తూ తుదిశ్వాస విడిచారు. కలామ్ మృతి వార్తతో యావత్ప్రపంచం కదిలిపోయి కన్నీరుపెట్టింది. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్ర ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. చిన్నారులు సైతం టీవీల ముందు కూర్చుని ఆయన అంత్యక్రియలను అశ్రునయనాలతో తిలకించారు. రామేశ్వరంలో అబ్దుల్కలామ్కు అంత్యక్రియలు జరిగినచోట స్మారక మండపం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కలామ్పేరుతో రాజకీయ పార్టీ : అబ్దుల్కలామ్ గతించి ఇంకా ఏడాది కూడా కాక మునేపే ఆయన పేరుతో పార్టీ ఆవిర్భావం కావడం సంచలన వార్తగా మారింది. కలామ్ సలహాదారుగా వ్యవహరించిన పొన్రాజ్ ‘అబ్దుల్ కలామ్ విషన్ ఇండియా పార్టీ’ అనే పేరున పార్టీని స్థాపించారు. సదరు పొన్రాజ్ ఆదివారం ఉదయం రామేశ్వరానికి వచ్చిన కలామ్ అంత్యక్రియలు నిర్వహించిన చోట నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న వేదికపైకి వెళ్లి పార్టీ బోర్డును ఆవిష్కరించారు. ఆ తరువాత కలామ్ సోదరుడు మహ్మమద్ ముత్తుమీర ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నించారు. అయితే ముత్తుమీరను కలిసే అవకాశం దక్కక పోవడంతో కొందరు బంధువులను మాత్రం కలిశారు. కలామ్ పేరుకు కళంకం ఏర్పడకుండా వ్యవహరించాలని పొన్రాజ్కు బంధువులు సూచించారని తెలిసింది. పార్టీ ఏర్పాటుపై ముత్తుమీర వ్యాఖ్యానిస్తూ, తన సోదరుడు పార్టీలకు అతీతమైన వ్యక్తి, అతని ఫొటోను పెట్టుకుని రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. కలామ్ మనుమడు షేక్ సలీమ్ మాట్లాడుతూ, తమ తాత పేరుతో పార్టీ నెలకొల్పడం ఆయన వ్యక్తిగత అభీష్టమని, ఇందులో కలామ్ బంధువులకు ఎవ్వరికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. కలామ్ ఎప్పుడు రాజకీయల పట్ల ఆసక్తి చూపేవారు కాదని అన్నారు. -
‘అబ్దుల్ కలాం పార్టీ’ ఆవిర్భావం
సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్కలాంకు సలహాదారు అయిన పొన్రాజ్ ఆదివారం ‘అబ్దుల్కలాం విజన్ ఇండియా పార్టీ(వీఐపీ)’ని స్థాపించారు. రామేశ్వరంలో యాన కలాం అంత్యక్రియలు జరిగిన చోట నివాళులర్పించారు. అక్కడే వేదికపై పార్టీ బోర్డును ఆవిష్కరించారు. పార్టీ ఏర్పాటుపై కలాం బంధువుల మద్దతు పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కలాం సోదరుడు ముత్తుమీర ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తన సోదరుడు పార్టీలకతీతమైన వ్యక్తి అని, అతని ఫొటోను పెట్టుకుని రాజకీయం చేయడం బాధాకరమని ముత్తుమీర అన్నారు. తమ తాత పేరుతో పార్టీ నెలకొల్పడం ఆయన వ్యక్తిగత అభీష్టమని, ఇందులో కలాం బంధువులకు సంబంధం లేదని కలాం మనవడు షేక్ సలీం స్పష్టం చేశారు. కలాం పేరుకు కళంకం రాకుండా పార్టీని నడపాలని కొందరు బంధువులు పొన్రాజ్కు సూచించినట్లు సమాచారం. -
అమెరికా వర్సిటీలో కలాం ఫెలోషిప్
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం అరుదైన గుర్తింపును ఇచ్చింది. ఆయన గతంలో తమ యూనివర్సిటీని సందర్శించడాన్ని గౌరవిస్తూ ఆయన పేరిట డాక్టోరియల్ గ్రాంట్స్ ను ఏర్పాటుచేసింది. 'ఏపీజే అబ్దుల్ కలాం ఫెలోషిప్' అని దానికి పేరు పెట్టింది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా(యూఎస్ఎఫ్)ను అబ్దుల్ కలాం 2012లో సందర్శించారు. ఆ సమయంలో ఆయన మొత్తం ఆ యూనిర్సిటీ బృందంపై తిరుగులేని ప్రభావం చూపించారు. ఆ సందర్భాన్ని గౌరవిస్తూ ఏకం రూ.1,03,71,660ల ఫెలోషిప్ ను ప్రారంభించింది. శాస్త్రసాంకేతిక రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఫెలోఫిప్ ను అందిస్తారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ అబ్దుల్ కలాం పేరిట ఒక ఫెలోషిప్ ను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. 2016-17 నుంచి ఈ ఫెలోషిప్ అందించనున్నారు. -
'కలాం పదవిని వదిలేయాలనుకున్నారు'
భువనేశ్వర్: బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని2005లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత నాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తన పదవిని వదులుకోవాలని భావించారని, ఆ రోజు ఆయన చాలా మదన పడ్డారని నాటి కలాం ప్రెస్ సెక్రటరీ ఎస్ఎం ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎన్ఐ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 'మై డేస్ విత్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవెర్' అనే టాపిక్పై ఆదివారం శిక్ష్యా ఓ అన్సందన్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని గుర్తు చేశారు. 2005లో బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని దానిని రాష్ట్రపతికి పంపించిందని, ఆ సమయంలో దానిని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతిగా కలాంకు ఉందని, అయితే, అలా పంపిన తర్వాత మరోసారి అదే తీర్మానం రాష్ట్రపతి వద్దకు వస్తే తిరిగి పంపించే అధికారం ఆయనకు లేనందున అయిష్టంగానే కలాం సంతకం చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆ సమయంలో కలాం రామేశ్వరం వెళ్లి తన సోదరుడిని కూడా కలిసి ఈ విషయం మాట్లాడారని, తన పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఎస్ఎం ఖాన్ చెప్పారు. -
విజ్ఞానాన్వేషణ నిరంతర ప్రక్రియ
♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్రెడ్డి వెల్లడి ♦ కాకినాడ జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ అందుకున్న శాస్త్రవేత్త సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూనివర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకొని బయటకు వెళ్లినంత మాత్రాన విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, విజ్ఞానాన్వేషణ నిరంతరాయంగా కొనసాగాలని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్రెడ్డి సూచించారు. కాకినాడ జేఎన్టీయూలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్ చేతులమీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తు అంతా సాంకేతిక రంగానిదేనని, అందుకనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలని చెప్పారు. స్నాతకోత్సవంలో 72 మందికి పీహెచ్డీ పట్టాలను, 56 మందికి బంగారు పతకాలను వీసీ కుమార్, సతీష్రెడ్డి అందజేశారు. మాజీ వీసీ ప్రొఫెసర్ అల్లం అప్పారావు, రిజిస్ట్రార్ ప్రసాదరాజు, ఓఎస్డీ సీహెచ్ సాయిబాబు పాల్గొన్నారు. యువతకు అవకాశాలు ఆకాశమంత:‘‘ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, ఎంచుకున్న రంగమేదైనా నిరంతరం విజ్ఞానాన్వేషణ కొనసాగిస్తే ఏ విద్యార్థి అయినా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నేనెంతో దగ్గర నుంచి చూసిన క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలామే అందుకు తార్కాణం. ఆయన కృషితో సాకారమైన డీఆర్డీఓలోని ప్రధాన ప్రయోగశాల రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)కు డెరైక్టర్గా వ్యవహరించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తా. ఒక్కో శతాబ్దంలో ఒక్కో దేశం పెద్దన్న పాత్ర పోషించింది. 21వ శతాబ్దం మాత్రం భారత్దేనని చెబుతారు’’ అని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ నుంచి శనివారం గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ప్రైవేట్’తో ఇబ్బందేమీ లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మన రక్షణ వ్యవస్థను మరింత శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పొందడం ప్రమాదమేమీ కాదు. ఇప్పటికే రక్షణ వ్యవస్థకు కావాల్సిన పరికరాల్లో 80 శాతం వరకూ ప్రైవేట్ సంస్థల నుంచే వస్తున్నాయి. అయితే వ్యూహాత్మక, కీలక విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లేకుండా ఆంక్షలు ఎలాగూ ఉన్నాయి. మన సత్తా చాటాం అంతరిక్ష ప్రయోగాల్లో టాప్-5 దేశాల్లో భారత్ ఒకటి. ఈ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి భిన్న వ్యూహాలతో అంతరిక్ష ప్రయోగాలను విస్తృతం చేసుకోవాలి. విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి బహుళ సంఖ్యలో పంపడం ద్వారా మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. రాష్ట్రంలో రక్షణ పరిశ్రమలు రక్షణ రంగానికి సంబంధించి అనంతపురం జిల్లా లేపాక్షి వద్ద ‘భెల్’ ఒక యూనిట్ను ప్రారంభిం చింది. కర్నూలు జిల్లాలో మరొకటి ప్రారంభిం చాల్సి ఉంది. మూడో యూనిట్ కోసం విజయవాడ-మచిలీపట్నం మార్గంలో 50 ఎకరాలను పరిశీలించారు. అటవీ శాఖ అనుమతులు వస్తే నాగాయలంకలో కూడా యూనిట్ ప్రారంభమవుతుంది. -
కలాం స్ఫూర్తితో...
బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనే అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘విద్యార్థులు దేశాభివృద్ధికి వివిధ పరిశోధనలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందాలనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి ’’ అన్నారు. వీధి బాలలను లేకుండా చేయాలన్న ఆలోచనతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో చర్చించనున్నామని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. -
కలాం బంగ్లా.. కయ్యాల మంత్రికి?
న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖా సహాయ మంత్రి మహేష్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజాజీ మార్గ్ లోని టైప్ VIII కేటగిరీకి చెందిన నెం.10 బంగ్లాకు ఆయన యజమాని కానున్నారు. ఇటీవలే మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజె అబ్దుల్ కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన మహేష్ శర్మ ఇపుడు అబ్దుల్ కలాం బంగ్లాను సొంతం చేసుకోనున్నారు. ఈ నెలాఖరుకు ఆయన ఆధీనంలోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ మండిపడుతోంది. అంతటి మహనీయుడు నివసించిన భవనాన్ని వివాదాస్పద మంత్రికి కేటాయించడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు తమిళనాడుకు సీనియర్ జర్నలిస్టు భగవాన్ సిగ్ దీనిపై ఇప్పటికే చేంజ్.ఆర్గ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. మిసైల్ మ్యాన్ నివసించిన బంగ్లాను ఒక విజ్ఞాన కేంద్రంగా కానీ, మ్యూజియంగా కానీ తీర్చిదిద్దాలని కోరారు ఆయన వినియోగించిన వేలాది పుస్తకాలు, డాక్యుమెంట్లు, వాడిన వీణ అక్కడ ఉంచాలని కోరారు. కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి మహేష్ శర్మ ఆయన భవనాన్ని కేటాయించి కలాంను అవమానించొద్దని కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైప్ viii భవనాలను కేబినెట్ స్థాయి ర్యాంక్ ఉన్న మంత్రులకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సామన్లను ప్యాక చేసి ఉంచిన ఈ బంగ్లాను ఈ అక్టోబర్ 31కి ఖాళీ చేయనున్నారని సమాచారం. కాగా ఇటీవల అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం తరువాత కలాం ముస్లిం అయినా కూడా జాతీయవాది , మానవతావాది అంటూ మంత్రి వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు, మత ఘర్షణల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు, ఇండియాలో అమ్మాయిలు అర్థరాత్రి రోడ్లపై ఎందుకు తిరుగుతారంటూ మాట్లాడి విమర్శల పాలయ్యారు. -
‘అగ్ని’ని ఆపేందుకు అమెరికా ఒత్తిడి
చివరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా’లో వెల్లడించిన కలాం న్యూఢిల్లీ: అది మే 22, 1989. భారత్ ‘అగ్ని’ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొన్నిగంటల్లో ప్రయోగం జరుగుతుందనగా.. ఆరోజు వేకువజామున 3 గంటలకు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఇండియన్ మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కేబినెట్ సెక్రటరీ టీఎన్ శేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ‘ప్రయోగం ఎంతవరకు వచ్చింది? దాన్ని ఆపాలని అమెరికా, నాటో కూటమినుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది’ అని కాల్ సారాంశం. కలాం మదిలో ప్రశ్నలు మెదిలాయి. అయినా.. అప్పడిక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకుని ‘ప్రయోగాన్ని ఆపే స్థితి దాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేం’ అని చెప్పారు. ఆరోజు తెల్లవారాక ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్నిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాలు త్వరలో విడుదలకానున్న కలాం చిరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా’ పుస్తకంలో ఉన్నాయి. -
'కలాం'కు నివాళులు
-
కలాం విగ్రహాన్ని అవిష్కరించిన కేసీఆర్
-
కలాం విజన్ సాధనే అసలు నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో అత్యంత కీలకపాత్ర పోషించే క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో భారత్ సాధించిన ప్రగతి మొత్తం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దార్శనికత ఫలితమేనని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతలో ఆసక్తి రేకెత్తించిన వ్యక్తి కలాం అని కొనియాడారు. అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ శివార్లలో డీఆర్డీవో మిసైల్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమానికి పారికర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) మిసైల్ కాంప్లెక్స్ పేరును ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్’గా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం శాస్త్రవేత్తలు, ఆర్సీఐ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ, డీఆర్డీవో పరిశోధనశాలలు డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఏఎస్ఎల్లతో కూడిన మిసైల్ కాంప్లెక్స్కు కలాం పేరు పెట్టడం ఆయనకు అర్పించిన అతి చిన్న నివాళి మాత్రమేనని అన్నారు. కలాం స్ఫూర్తితో ఐదేళ్లలో మిసైల్ టెక్నాలజీలో పూర్తిస్థాయిలో స్వావలంబన సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. డీఆర్డీవో సామర్థ్యం, లోటుపాట్లన్నింటినీ బేరీజు వేసిన తరువాత కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఆరెంజ్, కౌటిల్య పేర్లతో ఏర్పాటు చేసిన రెండు కీలకమైన వ్యవస్థలను పారికర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్సీఐ డెరైక్టర్, రక్షణ మం త్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కె.విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చొరబాట్లను అణచివేస్తాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు గణనీయంగా తగ్గాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆర్సీఐ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైమానిక దళంతోపాటు నావికా, పదాతిదళాల్లో మహిళా సైనికుల సేవలు మౌలిక సదుపాయాల లేమి ఉన్నచోట మినహా అన్ని విభాగాల్లోనూ వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు ఎయిర్షో మునుపటి మాదిరి అక్కడే కొనసాగుతుందని, మరోచోటికి మార్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. -
ఆత్మకథ రాసుకుంటే కలాంకు ప్రత్యేక పేజీలు
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. హైదరాబాద్లోని డీఆర్డీఎల్లో పదేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఐదు రకాల క్షిపణులను రూపొందించారని, ఈ సమయంలోనే భారత క్షిపణి పితామహుడిగా కీర్తికెక్కారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కలాం నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు. కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం కంచన్బాగ్ డీఆర్డీఎల్ ఎదుట కలాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలాం సేవలకు గుర్తింపుగా డీఆర్డీఎల్కు ‘ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రం’గా పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ఒకవేళ తాను ఆత్మకథ రాసుకుంటే అందులో కలాంకు ప్రత్యేకంగా కొన్ని పేజీలను కేటాయిస్తానని సీఎం చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ తర్వాత అంతటి కీర్తి గడించిన వ్యక్తి అబ్దుల్ కలామేనని అభిప్రాయపడ్డారు. ‘‘భారత దేశ ముద్దుబిడ్డ కలాం. ఆయన కృషి వల్ల నేడు హైదరాబాద్ కేంద్రంగా రాకెట్ల తయారీకి సంబంధించిన విడి భాగాలు తయారవుతున్నాయి. కలాం లాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని సీఎం అన్నారు. కలాం విగ్రహాన్ని రూపొందించిన శిల్పి పి.వై.రాజును సీఎం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎల్ డెరైక్టర్ డాక్టర్ జయరామన్, పలువురు శాస్త్రవేతలు, మేనేజ్మెంట్ సైన్స్ డెరైక్టర్ వైవీ రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కాకముందే ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్నంగా గుర్తింపు పొందారని, ఆయన ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండేవారని, కలాం జీవితం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రజా రాష్ట్రపతిగా నిలిచిన కలాం జ్ఞాపకార్థం ఆయన జన్మించిన రామేశ్వరంలో స్మారకం నిర్మిస్తామని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో డీఆర్డీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. డీఆర్డీవో భవన్లో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ‘ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలాం లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మోదీ ప్రారంభించారు. కలాం స్మారకార్థం రూపొందించిన పోస్టల్ స్టాంప్ను కూడా ప్రధాని ఆవిష్కరించారు. -
'భరత మాత ముద్దు బిడ్డ కలాం'
హైదరాబాద్: భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భరత మాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ లోని డీఆర్డీవోలో గురువాం కలాం విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..అబ్దుల్ కలాం దేశం గర్విచదగ్గ గొప్ప వ్యక్తి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి కలాం అని కేసీఆర్ తెలిపారు. ఆయన చూపిన మార్గంలో అందరం ముందుకు సాగుదామన్నారు. అబ్దుల్ కలాం గొప్పమానవతావాదని తెలిపారు. -
స్కూలుకు పుస్తకాలు అక్కర్లేదు!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో విద్యార్థులకు ఓ మంచి వరం ప్రకటించారు. విద్యార్థులెవరూ గురువారం ఒక్క రో్జు ఇళ్ల నుంచి పుస్తకాల సంచులు తేనక్కర్లేదని, స్కూళ్లలో కూడా క్లాసుకు సంబంధంలేని మామూలు పుస్తకాలు చదవాలని చెప్పారు. కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో ప్రతియేటా అక్టోబర్ 15వ తేదీని 'రీడర్స్ డే'గా జరుపుకొంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలో 'గిఫ్ట్ ఎ బుక్' కార్యక్రమాన్ని అమలుచేయాలని, పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వచన్ ప్రేరణా దిన్ సందర్భంగా మంత్రి తావ్డే ఓ జిల్లా పరిషత్ హైస్కూలును సందర్శించి, అక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీడింగ్ హబ్ను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాల బాక్సును బహూకరించారు. -
'అంతకంటే ముందే ఆయన 'జాతి రత్న'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ఇండియన్ మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంను గొప్పగా కీర్తించారు. కలాం రాష్ట్రపతి కాకముందే రాష్ట్రరత్న(జాతిరత్న) అని కొనియాడారు. గురువారం కలాం 84 వజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. డీఆర్ డీవో ప్రధాన కార్యాలయంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం అందరికి స్ఫూర్తి దాయకం అన్నారు. సానూకూల ధృక్పథం కలాం సొంతమని చెప్పారు. రాష్ట్రపతి కాకముందే ఆయన జాతిరత్నగా గుర్తింపు పొందారని అన్నారు. వీలయినంత త్వరలోనే రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. -
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ''నీ చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా.. నీ సమగ్రతను నిలబెట్టుకోవడం ఎప్పుడూ సాధ్యమే''నన్న కలాం మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం బుధవారం డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. "No matter what the environment around you is, it is always possible to maintain your brand of integrity"- Remembering the great Dr. Kalam. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2015 -
నేడు అబ్దుల్ కలాం 84వ జయంతి
-
కలల లోకంలో... తెలంగాణ ‘తమ్ముళ్లు’
‘కలలు కనండి... సాకారం చేసుకోండి ’.. అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటల్లో మొదటి రెండు పదాలను తెలంగాణ తమ్ముళ్లు బాగా వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ‘కాచుకోండి, వన్.. టూ.. త్రీ.. ఇంకెంత కాలం ఎనిమిదే ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది.. ముఖ్యమంత్రి మారిపోతారు...’ అని కలల్లో తేలిపోతున్నారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారని ఆరోపణలు ఉన్నాయి. ‘తమ్ముళ్లు’ ఇపుడు మళ్లీ అదే పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నారా... అని సందేహం వ్యక్తం చేస్తే అదేం కాదంటున్నారు. మరి ఇంతగా వీరు ఈ కాలజ్ఞానం ఎలా వినిపిస్తున్నారో తెలుసుకుంటే ఔరా ! అని అనక మానరు. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ స్వామిజీ చెప్పిన మాటలు అక్షర సత్యం అయ్యాయని వీరంతా భావిస్తున్నారు. ఇప్పుడదే స్వామిజీ.. ‘ మరో ఏడెనిమిది నెలల్లో తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది.. ముఖ్యమంత్రి మారిపోతారు ..’ అని సెలవిచ్చారట. దీంతో వీరి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయని అనుకుంటున్నారు. ‘ముఖ్యమంత్రి ఎవరవుతారో నేను లీక్ చేయను.. కానీ, మారడం ఖాయం ’ అంటూ ఆ పార్టీ నేతొకరు బహిరంగంగానే చెబుతూ నవ్వులు పూయిస్తున్నారు. తమ్ముళ్లా ... మజాకా ! -
'బీజేపీలోకి కలాం మనవడు'
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి ఒకరు బీజేపీలో చేరారు. కలాం అన్న మనవడు ఏపీజే షేక్ సలీం సోమవారం బీజేపీలో చేరారు. అబ్దుల్ కలాం చనిపోయేవరకు కలాంతో సలీం ఉన్నారు. ఢిల్లీలోని కలాం నివాసంలో అబ్దుల్ కలాంతోపాటు సలీం కొనసాగారు. -
'అబ్దుల్ కలాం కారణ జన్ముడు'
-
ఆయన మళ్లీ తెలుగువాడిగా పుట్టాలి!
హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజీ అబ్దుల్ కలాంకు తెలంగాణ శాసనసభ ఘన నివాళులు తెలిపింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి కలాం మృతిపట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కలాం సేవలను కొనియాడారు. తమిళనాడులోని రామేశ్వరంలో కడు పేదరికంలో జన్మించిన కలాం అత్యున్నత శిఖరాలకు ఎదిగారని, దేశానికి అపరిమితంగా సేవలందించారన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, హైదరాబాద్ లోని డీఆర్డీఎల్ కు కలాం పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ తీర్మానాన్ని విపక్ష పార్టీలన్నీ బలపరిచాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షనేత, సీఎల్పీ లీడర్ కె. జనారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేఎల్పీ నాయకుడు డాక్టర్ కె. లక్షణ్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంఐఎం తరఫున చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. అధికార టీఆర్ఎస్ తరఫున ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 'కలాంను రాష్ట్రపతిని చేయాలనే నిర్ణయం వెనుక తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కృషి ఉందన్నారు. 'అబ్దుల్ కలాంగారు మళ్లీ ఆంధ్రదేశంలోనే జన్మించాలని కోరుకుంటున్నా' అని ఎర్రబల్లి అనగానే సభలో చిన్నపాటి కలకలం చెలరేగింది. 'ఆంధ్రదేశమేంటి? తెలంగాణ కదా!' అని కొందరు సభ్యులు అరవడంతో సభలో నవ్వులు విరిశాయి. సీఎం, స్పీకర్ అందరూ నవ్వేశారు. ఆ తరువాత 'ఆ.. అదే.. తెలంగాణలోనే.. తెలుగు పౌరుడిగానే కలాం మళ్లీ జన్మించాలి' అని ముగించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. -
కలాం దేశానికి వన్నె తెచ్చారు : ఎర్రబెల్లి
-
అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటు
-
కలాం గొప్ప శాస్త్రవేత్త : జానారెడ్డి
-
కలాం రోడ్డుపై వివాదం!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఔరంగ జేబు రోడ్డుకు కొత్తగా మాజీ రాష్ట్రపతి, ఇటీవల పరమపదించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు పెట్టడం కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొందరు చరిత్రకారులు, స్కాలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం చరిత్రను వక్రీకరించనట్లు అవుతుందని, బహుశా అది కొంత టెన్షన్ వాతావరణాన్ని భవిష్యత్తులో సృష్టిస్తుందేమోనని చెప్పారు. గత నెల 28న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఔరంగ జేబు రోడ్డుకు ఇక నుంచి అబ్దుల్ కలాం రోడ్డుగా నామకరణం చేయాలనుకుంటున్నట్లు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
జోగేశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరు
సాక్షి, ముంబై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మృతికి చిహ్నంగా జోగేశ్వరిలోని రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరును నామకరణం చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు. ఇందుకుగాను సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ప్రారంభమవకపోవడంతో అబ్దుల్ కలాం పేరు మీదుగా బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెస్ట్రర్న్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఎస్వీ రోడ్ వరకు అనుసంధానం చేస్తూ ఈ జోగీశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జ్ను నిర్మించారు. మిస్సైల్ మన్గా పేరుగాంచిన దివంగత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పేరును ఈ బ్రిడ్జికి పెట్టినట్లయితే ఆయనకు ఒక గొప్ప నివాళి అర్పించిన వారమవుతామని స్థానికులు అభిప్రాయపడ్డారు. సంతకాల సేకరణను వివిధ విభాగాల అధికారులకు పంపించామని వారు వెల్లడించారు. బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారో...? గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి వరకు, మున్సిపల్ క మిషనర్ నుంచి కార్పొరేషన్ వార్డు అధికారుల వరకు సంతకాల సేకరణను పంపించామని స్థానికులు చెప్పారు. ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు రోడ్లకు, నగరాలు, ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లకు తిరిగి కొత్తగా నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నారని, అయితే ఇప్పటివరకు ప్రారంభించని ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం పేరును పెట్టాల్సిందిగా తామందరం కోరుకుంటున్నామని జోగేశ్వరి స్థానికులు పేర్కొంటున్నారు. జోగేశ్వరి ఈస్ట్-వెస్ట్ను కలిపే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి చాలా కాలం అయిందని, అయితే కొ న్ని రాజకీయ కారణాల వల్ల ఈ బ్రిడ్జిని ఇంకా ప్రారంభించడం లేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రైల్ ఓవర్ బ్రిడ్జిని ఎప్పు డు ప్రారంభిస్తారో అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. బ్రిడ్జిని ప్రారంభిస్తే సమయం ఆదా! బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఓషివారా, జోగేశ్వరి స్థానికులు రైల్వే ట్రాక్లను దాటడానికి అంధేరీ సబ్వేను లేదంటే గోరేగావ్ ద్వారా చుట్టూ తిరగి వెళ్లాల్సి వస్తోందని, రైల్వే ట్రాక్ దాటడానికి ఆటోలలో రూ. 50 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జిని ప్రారంభిస్తే చార్జీ తక్కువవడంతోపాటు సమయం వృథా అవదని చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని బ్రిడ్జిని త్వరగా ప్రారంభించి అబ్దుల్ కలాం పేరుతో నామకరణం చేయాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. -
సీఎం కంటే ముందున్న గూగుల్!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఆయన స్మృత్యర్థం ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చాలని భావించారు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు. అయితే, గూగుల్ సంస్థ మాత్రం ఆయన కంటే ఒక అడుగు ముందే ఉంది. ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా ముందుగానే తన గూగుల్ మ్యాప్స్లో మార్చేసింది. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే.. దాని పేరు అబ్దుల్ కలాం రోడ్డుగా ఉంది. ఈ విధంగా దివంగత మాజీ రాష్ట్రపతి కలాంకు గూగుల్ నివాళులు అర్పించింది. -
కలాంకు అసెంబ్లీ నివాళి
మాజీ రాష్ట్రపతి సేవల్ని కొనియాడిన సభ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఏపీ రాష్ట్ర శాసనసభ ఘన నివాళులర్పించింది. దేశానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడింది. యుగపురుషుడని, ఆదర్శప్రాయుడుగా ఎన్నదగిన మహనీయుడని కీర్తించింది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం స్పీకర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కలాం అనునిత్యం స్మరించదగిన వ్యక్తని అన్నారు. కలాం స్మారకార్థం ఒంగోలులోని ట్రిపుల్ ఐటీకి ఆయన పేరును పెడతామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ఆయన పేరిట ఇస్తామని, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. యుగానికొక్కరు...: వైఎస్ జగన్ అబ్దుల్ కలాం లాంటి వారు యుగానికొక్కరే ఉంటారని, ఆయన మృతి తీవ్రంగా కలచి వేసిందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కోట్లాది మందికి ఆయన ఆరాధ్యుడు, ఆత్మీయుడన్నారు. ఆయనకు తమ పార్టీ తరఫున, తన తరఫునా నివాళులు అర్పిస్తున్నామన్నారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం స్పీకర్ కోడెల తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటిస్తూ కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసనమండలిలోనూ....: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు శాసనమండలిలోనూ ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వం తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మండలిలో ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులతో పాటు పీజే చంద్రశేఖర్(సీపీఐ), సోమువీర్రాజు (బీజేపీ), బాలసుబ్రమణ్యం (పీడీఎఫ్)లు తీర్మానానికి మద్దతు పలికి కలాం సేవలను కొనియాడారు. పుష్కర మృతులకు మండలి సంతాపం తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ఆత్మహత్య చేసుకున్న వారికి సంతాప తీర్మానాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ప్రవేశపెట్టి ఆమోదించారు. -
యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం అని ఏపీ శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. కలాం మృతికి ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలాం మరణ వార్త దేశవ్యాప్తంగా తనతో పాటు...అందరినీ ఎంతగానో కలచివేసిన సంఘటన. కలాం లాంటి వ్యక్తులు యుగానికి ఒక్కరే పుడతారు. అలాంటి మహానుభావుడు అట్టడుగు స్థాయిలోని మత్య్యకార కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ గా పనిచేసి... మహోన్నత స్థాయి అయిన రాష్ట్రపతి పదవి వరకూ ఎదిగిన వ్యక్తి. రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఉపాధ్యాయుడిగా మారి తన జీవితాన్ని సామాన్యంగా బతికిన మహనీయుడు. రాజకీయాల్లో రోల్ మోడల్ ఎవరంటే అబ్దుల్ కలాం మొదటి వరుసలో ఉంటారు. 84 ఏళ్ల వయసులో కూడా భారతదేశం గురించి జ్ఞానాన్ని పంచుతూ చదువుల తల్లి ఒడిలో ఒదిగారు. మా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి కలాంకు నివాళులు అర్పిస్తున్నాం' అని తెలిపారు. -
యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్
-
అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ
హైదరాబాద్: దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలాంను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. -
పోలీస్ కమిషనర్ను కలిసిన నటుడు
తమిళసినిమా: ప్రముఖ హాస్య నటుడు వివేక్ బుధవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ జార్జ్ను కలిశారు. వివేక్ పూర్వ దేశాధ్యక్షుడు, వైజ్ఞానికవేత్త అబ్దుల్ కలామ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన స్ఫూర్తితో తమిళనాట కోటి మొక్కల్ని నాటాలనే బృహత్తర నిర్ణయాన్ని తీసుకుని, ఆ దిశగా ఇప్పటికే 27 లక్షల మొక్కల్ని నాటారు. కాగా అబ్దుల్ కలామ్ జయంతి అక్టోబర్ 15న విద్యార్థులతో కలిసి చెన్నై మెరీనా తీరంలో ర్యాలీ నిర్వహించి మొక్కల నాటే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. ఇందులో పాల్గోనేవారికి ఒక్కో మొక్కను అందించనున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి కోరడానికి నటుడు వివేక్ పోలీస్ అధికారిణి కలిశానని అనంతరం విలేకరులకు వివరించారు. -
FNCCలో ఓ భవనానికి అబ్దుల్ కలాం పేరు
-
పోస్టల్ స్టాంపుపై త్వరలో 'కలాం'
పాట్నా: దేశంలోని 25మంది మహనీయులను కేంద్ర ప్రభుత్వం గౌరవించనుంది. వారిపేరిట స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేయనుంది. వారిలో ఇటీవల పరమపదించిన భారత రత్న, ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కూడా ఉండనున్నారు. ఈ విషయాన్ని యూనియన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు బీహార్లో ప్రకటించారు. దేశానికి వారు అందించిన అత్యున్నత సేవలకు గుర్తింపుగా వారి పేరిట స్టాంపులు ముద్రించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన అశోకుడి పేరిట ఉన్న స్టాంపును విడుదల చేశారు. ఆయన ప్రకటించిన 25మందిలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సచ్చిదానంద సిన్హా, జై ప్రకాశ్ నారాయణ్, కార్పురి ఠాకూర్, కైలాస్ పతి మిశ్రా, మౌంటెయిన్ మ్యాన్ దశరథ్ మాంఝీ, రవీంధ్రనాథ్ ఠాగూర్, బాలగంగాధర్ తిలక్, శివాజీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, మదర్ థెరిసా, రామ్ మనోహర్ లోహియా, భిస్మిల్మా ఖాన్, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మీ, సీపీఐ నేత భూపేశ్ గుప్తాతోపాటు ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. -
స్ఫూర్తి పతాకం అబ్దుల్ కలామ్
సింపుల్ లివింగ్.. హై థింకింగ్... ఈ గాంధీజీ సూక్తిని పాటించి భారతీయులందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్! దేశ ప్రథమ పౌరుడి హోదాలో కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపి ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి అసాధారణ వ్యక్తికి సంబంధించిన కొన్ని విశేషాలు... ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... జీవకారుణ్యం కలామ్ డీఆర్డీఏలో పనిచేస్తున్నప్పుడు.. ఆ భవన భద్రత కోసం దాని ప్రహరీ మీద గాజుపెంకులు అతికించాలని కలామ్ టీమ్ నిర్ణయించిందట. ‘వద్దు వద్దు .. అలాంటి పనులేమీ చేయకండి... పాపం గోడమీద వాలి సేద తీరే పక్షులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం. ఆ ప్రహరీని అలాగే వదిలేయండి’ అంటూ అడ్డు చెప్పారు కలామ్. ఆయనలోని జీవకారుణ్యానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? ఎదిగిన కొద్దీ ఒదిగి... ప్రెసిడెంట్ కలామ్కి ఎంత గొప్ప వ్యక్తి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినా, ఎంత చిన్న వ్యక్తి దగ్గర్నుంచి అభినందన వచ్చినా.. స్వయంగా తానే వారికి జవాబు రాసి పంపేవారట. అభినందనలకు కృతజ్ఞతలూ తెలిపేవారట. అలా ఒకసారి నమాన్ నరైన్ అనే చిత్రకారుడు కలామ్ చిత్రపటాన్ని గీసి పంపితే ఆయనకు కలామ్ స్వంతదస్తూరీతో థ్యాంక్యూ కార్డ్ పంపారు. ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి కలామ్ని మించిన మనిషి కనపడ్తాడా? వినయం, విజ్ఞత, ఔదార్యం ఆయనకు పుట్టుకతోనే అబ్బిన గుణాలు. పురా (్క్ఖఖఅ... ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ టు రూరల్ ఏరియాస్) కలామ్ దేశ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు తను చేసిన ఉద్యోగం తాలూకు సేవింగ్స్ అన్నింటినీ పురా అనే ట్రస్టును స్థాపించి దానికి రాసిచ్చేశారు. పట్టణ సౌకర్యాలను గ్రామాల్లోనూ అందుబాటులోకి తేవడం పురా పని. కలామ్ సంపాదించిన ప్రతి పైసా ఆ ట్రస్ట్కే వెళ్లింది. చనిపోయే నాటికి కలామ్ దగ్గరున్న ఆస్తి.. 25 వందల పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు పాంట్లు, ఒక జత షూ మాత్రమే! సామాన్యుడికి కూడా ఇంతకన్నా ఎక్కువ ఆస్తే ఉంటుంది కదా. ఇంకొన్ని ఆసక్తికర విషయాలు కలామ్ చదివింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. కావాలనుకున్నది ఫైటర్ పైలట్. తర్వాత పనిచేసింది డీఆర్డీఓలో. అయింది.. దేశానికి అధ్యక్షుడిగా! నిరంతరం మునిగితేలింది బోధనలో! అబ్దుల్ కలామ్ ట్విట్టర్లో కేవలం 38 మంది ట్వీట్లనే రెగ్యులర్గా ఫాలో అయ్యేవారట. అందులో ఉన్న ఒకే ఒక క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. కలామ్ ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అందులో ‘తిరుక్కురల్’ అనే పుస్తకంలోని సూక్తులను తప్పకుండా ప్రస్తావించేవారు. కలామ్ ఈ తరాన్ని ఎంతగా ప్రభావితం చేశారంటే .. ఆయన గురించి ‘ఐయామ్ కలామ్’పేరుతో సినిమా వచ్చేంతగా! -
విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి
సమకాలీనం: అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపుణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయవంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సాహానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల పగ్గాలు ఒకటొకటిగా భారతీయ మేధోనా యకుల చేతుల్లోకి రావడం ఇప్పుడు అంతటా ఓ ముచ్చటయింది. ముఖ్యంగా మొన్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), నిన్న సుందర్ పిచయ్ (గూగుల్) సీఈవోలయ్యాక ఈ చర్చ పెరిగింది. డజన్ వరకు ప్రథమశ్రేణి వివిధ గ్లోబల్ సంస్థలకు భారతీయులు ఈ రోజున సీఈఓలుగా ఉన్నారు. ఇక కింద, వివిధ స్థాయిల్లోకి ఎదిగి-ఒదిగిన వారిది పెద్ద లెక్కే ఉంది. ఇదేలా సాధ్యమైంది...? అన్నపుడు, సాక్షి జర్నలిజం విద్యార్థులు తమకు తోచిన కారణాలు చెబుతూ వచ్చారు. కొందరు ఇది కష్టపడే తత్వం వల్ల అని, నిబద్ధత కారణంగా అని, అంకితభావమని, ఎదగాలనే తపన ఉండడమని, భిన్నంగా-వినూత్నంగా ఆలోచించడం వల్లేనని, మధ్య తర గతి నేపథ్యం కావడంతో అని... ఇలా డజన్కు పైగా వేర్వేరు కారణాలు చెప్పారు. ఎక్కడో ఓ మూల నుంచి సన్నని స్వరం 'తల్లిదండ్రుల వల్ల' అన్న మాట వినిపించింది. నిజమే! భారత సమాజంలో తమ పిల్లల ఎదు గుదలకు తల్లిదండ్రులు చేసే కృషి, జరిపే త్యాగాలు అసమానమైనవి. అందరూ తమ పిల్లల్ని వివిధ కంపెనీలకు సీఈవోల్ని చేయలేక పోవచ్చు. కానీ, తామున్న పరిస్థితి కన్నా మెరుగైన స్థితిలో పిల్లలుండాలనే తపన లేని తల్లిదండ్రులు మన దేశంలో ఉండరేమో! కేవలం ఆలోచనా పరమైన తపన మాత్రమే కాక అందుకోసం అత్యధికులు చిత్తశుద్ధితో కృషి చేస్తారు. ఆరుగాలం శ్రమిస్తారు. ఈ క్రమంలో... తమకున్నా, లేకున్నా పిల్లల్ని వృద్ధిలోకి తేవాలనే బలమైన భావన వారిని ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న సౌఖ్యాలు, ముచ్చట్లు, అవసరాలు.... అన్నీ వదులుకొని కూడా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకీ దేశంలో కొదవలేదు. 'అంతా పిల్లల కోసం కరిగేస్తే... మరి, రేపేంటి?' అన్న చిన్న సందేహం, ఆలోచనక్కూడా తావివ్వకుండా, సర్వస్వం వారి చదువుల కోసం, ఉన్నతి కోసం హారతి కర్పూరంలా కరిగించే తల్లిదండ్రులెందరో! ఇది అంతో ఇంతో ఉన్న వాళ్ల పరిస్థితి. ఇక ఏమీ లేని నిరుపేదలు, దిన కూలీలు, పెద్దగా రాబడిలేని అల్పాదాయ వర్గాల వారు కూడా తమ స్తోమతకు మించి డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు. ఖర్చు అనివార్యమైనపుడు కూడా వెనుకాడరు. కష్ట మైతే తమ అవసరాల విషయంలో రాజీపడతారు, లేకపోయినా సరేనని సరిపెట్టుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతటి తల్లిదండ్రుల త్యాగాలు ఉండవేమో అనిపిస్తుంది. ఒక వైపు విలువల సమాజం, మరో వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం భారత యువతరాన్ని ఎదుగుదల వైపు పరుగులు తీయిస్తోంది. ఇది ఇవాళ్టిది కాదు... పిల్లలే తమ సర్వస్వం అనే తల్లిదండ్రుల భావన ఇవాళ్టిది కాదు. భార తీయ జీవన విధానంలోనే ఉంది. మహాభారతంలో మంచి పేరున్న పాండురాజు, కుంతి మాత్రమే కాదు, స్వార్థపరులని కాసింత చెడ్డపేరున్న ధృతరాష్ట్ర-గాంధారీలు కూడా తమ పిల్లల ఉన్నతి కోసం తపించిన వారే! వీర శివాజీని మరాఠా యోధునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, గాంధీజీని జాతిపితగా మలచిన పుత్లీబాయి... ఇలా ఎందరెందరో! పితృవాక్య పాలన అని శ్రీరాముడు అడవులకెళితే తట్టుకోలేక చనిపోయిన తండ్రి దశరథుని పుత్రప్రేమ కంటే, జనవాక్యపాలన అని తనను రాముడే అడవు లకంపినా.... కుశ, లవుల్ని కని-పెంచి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన సీత పుత్ర వాత్సల్యమే గొప్పది. అది మన వారసత్వ సంపదయింది. పిల్లల చదువుల కోసం, ఇవాళ్టికీ వేలాది మంది తల్లులు స్వచ్ఛంద సాంసారిక వియోగాన్ని భరిస్తున్న సీతలు. ఉపాధి, జరుగుబాటు కోసం భర్తలెక్కడో ఊళ్లల్లో వ్యవసాయమో, పట్టణాల్లో వ్యాపారమో చేస్తుంటే... నగరాలు, మహా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తుంటారు తల్లులు. అహర్నిశలు వారి బాగోగుల ఆలోచనలే! అక్కడ తండ్రులదీ అదే బలవం తపు ఒంటరి బతుకు. కష్టపడుతూ పిల్లల చదువుల కోసం డబ్బులు పం పిస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో విద్యానగర్, అమీర్పేట, కూకట్ పల్లి కావచ్చు; గుంటూరు, విజయవాడలలో వేరేవేవో బస్తీలు కావచ్చు, ఇంకే ఇతర జిల్లా కేంద్రాలో, ముఖ్య పట్టణాలో కూడా కావచ్చు, విషయ మొకటే! అంటే, పిల్లల చదువుకోసమే... సొంత ఇంటిని-ఊరునీ వీడి, అష్టకష్టాలు పడీ, ఆస్తులు అమ్ముకునీ, తీర్చలేని ప్రయివేటు అప్పులు చేసీ, బ్యాంకుల్లో విద్యారుణాలు పొందీ పీకల్లోతుగా రుణగ్రస్తులవుతుం టారు. వాటిని తీర్చేక్రమంలో... సరళ జీవితాల్ని సంక్లిష్టం చేసుకునే కుటుంబాలెన్నో! భారత యువతకు సలామ్! అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్ప డింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపు ణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయ వంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సా హానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ఇంకేం! ప్రపంచం, ముఖ్యంగా ఐటీ ప్రపంచం మనవాళ్ల పాదాక్రాంతమైంది. అజీం ప్రేమ్జీ, నారాయణమూర్తి, శివనాడార్, రామలింగరాజు, నందన్ నీలేకనీ వంటి తొలితరం నేతలు వేసిన బీజాలు మంచి భూమికనేర్పాటు చేశాయి. ఈ దేశానికి చెందిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ముఖ్య విద్యా సంస్థల కృషి తల్లిదండ్రుల త్యాగాలకు తోడయి ఆడా మగ తేడా లేకుండా యువత సాఫ్ట్వేర్ గుర్రమెక్కింది. ఐటీ ప్రపంచ పథాన ఇప్పుడు దౌడు జోరందు కుంది. బ్రెయిన్ డ్రెయిన్ అని మొదట్లో కొందరు ఆందోళన చెందినా, అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది. పోటీ యుగంలో... వీలయినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సమస్త ప్రపంచాన్ని దున్నేయడం. వీలైతే వెనక్కివచ్చి స్వదేశాన్నీ శక్తిమంతం చేయడంలో చేదోడు వాదోడు గానిలవడం, ఇదే ఇప్పుడు జరగాల్సింది. తొలితరం విదేశాలకి వెళ్లి విజ యవంతమైన కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఇక్కడి పరిపాలన, రాజకీయ వాతావరణంలో కూడా మార్పు రావాలి. ప్రపంచానికి నేర్పిన విలు వల్ని మన వాళ్లే మరచిపోతున్నారు. మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 'విలువలతో కూడిన జీవన శైలి... భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక'ని కితా బిచ్చారు. ఆ విలువల జీవనశైలి, తల్లిదండ్రుల త్యాగాలు, సుదీర్ఘంగా సాగే కృతజ్ఞతా భావమే మన యువతరాన్ని విశ్వవేదికపై నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య సమా చార కమిషనర్గా పనిచేసి రిటైరయిన సి.డి.అర్హ డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు 'ఇండస్'అనే ఓ పెద్ద విద్యాపీఠం ఛైర్మన్గా సేవలందిస్తున్నారు. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నత చదువులతో విశ్వ నిపుణులుగా ఎదిగి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కింద, అర్హ తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా తనకొచ్చే నెల జీతం 75 రూపా యల్లో 55 రూపాయల నెలసరి ఫీజు కట్టి సెయింట్ జేవియర్ అనే గొప్ప పాఠశాలలో కొడుకును చదివించారు. మిగతా కుటుంబ పోషణకు నెలకు 20 రూపాయలే వెచ్చించారు. ఇలాంటి ఏ తల్లిదండ్రుల త్యాగాలూ వృథా పోకూడదు. తీసుకున్న చోట... తిరిగి ఇచ్చేయాలి! పిల్లలెంత ఎత్తు ఎదిగినా కన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంత డబ్బు వెచ్చించి ‘వృద్ధాశ్రమాల్లో వేశాం కదా! ఇంకేంటి’ అనేపాటి కృతజ్ఞత చాలదు. వారి త్యాగాల క్రమంలో మరుగున పడ్డ నెరవేరని కలల సాకారా నికి సహకరించాలి. మాతృదేశాన్నీ విస్మరించొద్దు. ఏపీజే అబ్దుల్కలాం తన స్వీయకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో తన తల్లి సంస్కారాన్ని స్మరిస్తూ రాసుకున్న కథలు ఒక్క కలాం కథలు మాత్రమే కావు. కుటుంబం పేదరి కం అనుభవిస్తుంటుంది. తల్లి రాత్రివేళ రొట్టెలు కాల్చి చదువుకునే పిల్ల లకు పెడుతుంది. తండ్రికి మాడిపోయిన రొట్టె దొరుకుతుంది. చిన్న పిల్లాడైన కలాం ఈ సన్నివేశాన్నంతా చూస్తుంటాడు. కుటుంబ సంబంధాల మధ్య, సభ్యుల మధ్య కోపతాపాలూ, సహజ భావావేశాలను ప్రేమ ఎలా అధిగమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. మాడిపోయిన రొట్టెను కంచంలో పెట్టుకున్న నాన్నను అడుగుతాడు. 'మాకందరికీ మం చి రొట్టెలు వేసి, చివర్లో నీకు మాడిపోయిన రొట్టెను పెట్టినందుకు నీకు అమ్మపై కోపంగా లేదా?'అని. అందుకా తండ్రి ప్రేమతో 'పొద్దుట్నుం చీ ఆమె పని చేస్తూనే ఉంది. పైగా మాడిపోయిందేదో నాకు పెట్టింది. కానీ ఆమె ఇంకా తినలేదు చూశావా?'అంటాడు. దాంతో మళ్లీ తల్లి దగ్గరకు వెళ్లి 'అమ్మా నువ్వు ఇంకా తినలేదు. మాకు మాత్రమే పెట్టావు. నువ్వూ తినమ్మా'అంటాడు కలాం. దానికా తల్లి చిర్నవ్వుతో. 'నాన్నా... నువ్వు 'చదువుకునే' పిల్లాడివి. నీకు చదువుకునేందుకు శక్తి కావాలి. నీకు చదువు కునేందుకు మేధస్సు పెరగాలి. అందుకే నీకీ రొట్టెలు. తిని బాగా చదు వుకో' అని స్పందిస్తుంది. అంతే... ఈ కష్టాలన్నీ ఎరిగిన కలాం బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడుతూ భావో ద్వేగంతో రాసుకున్న మాటలు అందరినీ కదిలిస్తాయి. 'ఆరోజున నాకు నువ్వు పెట్టిన రొట్టెలతో పెరిగిన మెదడు మేధస్సూ, తనువు తేజస్సూ ఇవ్వాళ్ల నాతోనే ఉన్నాయి. కానీ నాకోసం నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుంది. ఇవ్వాళ నీకు పాదాభివందనం చేద్దామంటే నువ్వు లేవు. అలాగే నేను కూడా లేని స్థితి ఒకటి వస్తుంది. నువ్వు ఈ లోకాన్ని వీడిపోయిన రోజున ఏ దివ్య శరీరాన్ని ధరించావో, నేనూ ఈ లోకాన్ని వీడిన రోజున అదే దివ్య శరీరాన్ని ధరిస్తా. నువ్వు చేరిన లోకాలకే నేనూ చేరుతా. నా రొట్టెల కృతజ్ఞత తీర్చేందుకు నువ్వే రూపంలో ఉన్నావో, అదే రూపంలో నేనూ నీ దగ్గరకు చేరి నీ పాదాలను... నువ్వు పెట్టిన రొట్టె తిన్న ఈ చేతులతో స్పర్శిస్తా' అని రాసుకున్నాడు. కలాం ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినందున్నే ఈ చరిత్రను మనం తెలుసుకోగలిగాం. కానీ ఇలాంటి దివ్యానుభవాలు చవిచూసే కుటుంబాలు మన సమాజంలో, మనకు తెలియకుండా.... ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ఉంటాయేమో! తీసుకున్న చోటే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఆర్. దిలీప్ రెడ్డి సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మెట్రో రైలుకు కలాం పేరు పెట్టాలి: వైఎస్సార్సీపీ
హైదరాబాద్: దేశంలో అయిదో పెద్ద నగరం హైదరాబాద్లో చేపట్టిన మెట్రో రైలుకు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఆ మేరకు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకంతో ఉన్న వినతి పత్రాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డి మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి అందజేశారు. దీనికి స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తాను ఈ విషయాన్ని పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ హైదరాబాద్కు తలమానికం కాబోతున్న మెట్రో రైలు నిర్మాణ పనులు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్నాయని తెలిపారు. -
అపురూప ‘కలాం’
-
అపురూప ‘కలాం’
విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిలువెత్తు ఫైబర్ విగ్రహం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. కలాం కాంస్య, ఫైబర్ విగ్రహాల తయారీకి రాష్ట్రం నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని రాజ్కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా కనపర్తి ఎంఐసీఈ స్కూల్ ఆవరణలో నెలకొల్పేందుకు ఆ స్కూల్ యాజమాన్యం ఆర్డర్ మేరకు రూపొందించిన నిలువెత్తు ఫైబర్ విగ్రహాన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా కలాం జయంతికి రెండు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆయన బస్ట్ సైజ్ విగ్రహాలు బహూకరించనున్నట్టు రాజ్కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తపేట, రాజమండ్రి కళాశాలలకు అందచేయనున్నట్టు తెలిపారు. - కొత్తపేట -
కలాం ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచమంతటా శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలని.. దయ, క్షమాగుణం ద్వారా ప్రపంచానికి నాగరికతను చాటడంలో భారతీయుల పాత్ర గొప్పదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, స్వామి నారాయణ్ సంస్థాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రముఖ్ స్వామీజీ మహరాజ్ నాతో చెప్పేవారు’’ అని దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తాను చివరిగా రాసిన ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. గత 14ఏళ్లుగా ప్రముఖ్ స్వామీ మహరాజ్తో తన ఆధ్యాత్మిక అనుబంధాల సంకల నాన్ని ఆయన ఈ పుస్తకంలో ప్రస్ఫుటించారు. అబ్దుల్ కలాం రాసిన చివరి పుస్తకం ‘ట్రాన్సండెన్స్’ను స్వామి నారాయణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రామోజీ ఫిల్మ్సిటీలో ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి రామోజీ సం స్థల చైర్మన్ రామోజీరావుతో పాటు ఈసీఐఎల్ చైర్మన్ డాక్టర్ పి.సుధాకర్, లీడ్ ఇండియా వ్యవస్థాపకుడు హరికిషన్, డీఆర్డీఎల్ డెరైక్టర్ జయరామన్, సహ రచయిత అరుణ్ తివారీ, స్వామి నారాయణ్ ట్రస్ట్ ప్రతినిధి భక్తి ప్రియ స్వామి తదితరులు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రముఖులు ప్రసంగిస్తూ.. కలాం భౌతికంగా లేకు న్నా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు. -
ఆయన దొరికితే అంతే...
ఫన్ డాక్టర్ కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు - వాజ్పాయి కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్ డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, ఇలా మాట్లాడుతూ ఓ అమితాబ్ని, అలా మాట్లాడ్తూ ఓ టెండుల్కర్ని - ‘‘మాకు చాలా క్లోజ్ అండి బాబూ’’ అని బిల్డప్ ఇస్తుంటారు. మరికొంతమంది పేర్లతో ఆగరు. ఫొటో ఆల్బమ్లు వెంటేసుకుని తిరుగుతుంటారు. పరిచయం మొదటి నిమిషంలోనే - వాళ్లు సెలెబ్రిటీస్తో దిగిన, దింపిన ఫొటోలన్నీ చూయించే స్తారు. సెల్ కెమెరాలు, సెల్ఫీలు వచ్చిన తర్వాత వీళ్ల పని ఇంకా సులువైంది. అంతకుముందంటే కెమెరా వేరేవాడికిచ్చి ‘‘బాబ్బాబూ, ఓ ఫొటో తీయవా పెద్దా యనతో’’ అని అడుక్కో వాల్సి వచ్చేది. మళ్లీ సదరు వ్యక్తి సాగర సంగమంలో ‘భంగిమ’ ఫొటోగ్రాఫర్లాంటివాడను కోండి.. ‘‘ఇవి నా కాళ్లు, అవి మహేష్ బాబు కాళ్లు’’ అని చెప్పుకోవాల్సి వచ్చేది. అసలు విషయానికి వద్దాం. అబ్దుల్ కలాంగారి గురించి. ఓ వ్యక్తి చనిపోయి - ఇంతమంది గుండెల్లో బ్రతికుండటం చాలారోజుల తర్వాత చూశాను. చాలా మంది, చాలా రకాలుగా పరమపదిస్తుం టారు. కానీ ఈయన చావేంటండీ బాబూ! ఎంత అద్భుతం, ఎంత అదృష్టం! తనకు ఇష్టమైన పని.. అదే, యువతని ప్రబోధ పరిచే ఉపన్యాసం ఇస్తూ అలానే నిష్ర్కమిం చడం... ఎంత పుణ్యం చేసుకుంటే ఆ వరం దొరుకుతుందో కదా! ఇంకో రకంగా ఆలోచించండి. ఈ మాజీ ప్రెసిడెంట్గారి అదృష్టం బాగోలేక - ఆ రోజు హార్ట్ అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనుకోండి. మా డాక్టర్లం దరం రెచ్చిపోయి స్టంట్లు చేసి, స్టంట్లు వేసి వెంటిలేటర్ మీద బాధించి, ‘ఎపుడు వదులుతార్రా - నా పని నేను చేసుకో వాలి’ అనుకుంటూ - చుట్టుపక్కలే తిరుగుతున్న ఎం.ధర్మరాజుతో పోట్లాడి ఆట్లాడి, ప్రెసిడెంట్గార్ని కనీసం ఓ సంవత్సరం పాటన్నా కోమాలోనో, హార్ట్ ఫెయిల్యూర్లోనో, స్ట్రోక్లోనో ఉంచే ఏర్పాటు చేసేవాళ్లం. అందుకనే నాకు చాలా భయం. చావంటే కాదు - చచ్చిపోయే ప్రదేశం గురించి! హాయిగా ఎక్కడో హాలీడేలో, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూనో టపా కట్టేస్తే - ఎంత ఆనందం. ‘‘కరెక్ట్గా చచ్చిపోయే టైమ్కి నిన్ను స్విట్జర్లాండ్కో, ప్యారిస్కో తీసుకెళ్లడం.. అక్కడి నుంచి నీ పార్ధివ దేహాన్ని ఇండియా తీసుకురావడం, చాలా ప్లానింగ్తోనూ, ఖర్చుతోనూ కూడిన పని మగడా. అలాంటి చచ్చు ఐడియాలు పెట్టుకోమాకు’’ అని మా ఆవిడ క్లాస్ పీకే అవకాశం ఉంది కాబట్టి ఈ కోరికని చంపేస్తున్నాను ప్రస్తుతానికి. సరే ఆ ఇష్టం తీరడం కష్టం అంటున్నారు కాబట్టి ఇంకో చిన్న ఇష్టా న్నైనా తీర్చుకుంటూ పోనివ్వండర్రా! ఏమిటంటారా! చాలా సులువైన ఇష్టం ఇది. జీవిత నేస్తాలతో సొల్లు చెప్పు కుంటూ బాల్చీ తన్నేయడం ఊహించు కోండి. ‘ఒరేయ్’... ‘వెధవా’... ‘నీకంత సీనులేదురా’ లాంటి మాటలు మాట్లాడు కోగల ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ‘ఒరేయ్’, ‘చచ్చావురా నా చేతుల్లో’ అని చతుర్లాడుకుంటూ కుంటూ - ఇంతే సంగతులు. ఎంత అదృష్టం! చెప్పానుగా నా భయం. పొరపాటున, నా చివరి రోజులు బాగోక - మా హాస్పిటల్లోనే దొరికిపోయాననుకోండి. చచ్చానే. ‘వీడు నా జీతం పెంచడా’ అని కోపంతో కొంతమంది, ‘వీడి టార్చర్ ఇన్నాళ్లూ భరించాం, ఇదే ఛాన్స్’ అని మరికొంతమంది... డాక్టర్లు, సర్జన్లు, సర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ మూకుమ్మడిగా నాకు గ్యాస్ట్రోస్కోప్, ఆర్థోస్కోప్, లరింగోస్కోప్ - చివరకు కొలనోస్కోప్ కూడా చేసేసి - నాకు చావడానికి స్కోప్ లేకుండా చేస్తారేమోనని చచ్చేంత భయం. ఈ చావు కబుర్లు, చావు కోరికలన్నీ ఎందుకు రాస్తున్నానంటే పుణ్యాత్ములకే ఇలాంటి వరం దొరుకుతుందట. కాబట్టి పుణ్యాలు చేయండి అని చెప్పడానికే. కాళోజీ అన్నట్లు ‘పుటక నీది - చావు నీది - బ్రతుకంతా దేశానిది’. ఇంకోరకంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మన చేతుల్లో లేదు. మధ్యనున్న బ్రతుకే - మనిష్టం. నల్గురిలో మంచి ఉంచుకుంటూ, పెంచుకుంటూ జీవించ డమే ముఖ్యం. నాకు కోట్స్ చాలా ఇష్టం. అవి గుండెల్లో స్ఫూర్తినింపుతాయి. ధైర్యాన్ని స్తాయి. ‘సాహసం చేయరా డింభకా’ అని ముందుకు తోస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, వివేకానందుడు లాంటి మహనీయులు ఇచ్చిన ప్రబోధ వాక్యాలు మనందరినీ వెన్నుతట్టి ముందుకు నడుపు తుంటాయి. కాంటెంపరరీ టైమ్స్లో అలాంటి మాణిక్యాలు అందించినవాళ్లు అరుదు - అబ్దుల్ కలాం మినహా. ఆయన రాసిన పుస్తకాల్లో అయితేనేమి - ఆయన ప్రసంగాల్లో అయితేనేమి - దొర్లిన కొన్ని మాటలు సదా గుర్తుకొచ్చి, కర్తవ్య బోధన చేసే ఆణిముత్యాలు. కలాం చెప్పారు... ‘‘నిద్రలో వచ్చి పోయే కలల గురించి కాదు నేను చెప్పేది, నువ్వు కనే కల నిన్ను నిద్రపో నివ్వకుండా చేయాలి. అలాంటి కలలు రావాలి నీకు.’’ అదేంటో నాకొచ్చే కలలన్నీ సన్నాసివి వస్తుంటాయి. పరీక్షకు లేట్గా వెళ్తే లోపలికి రానివ్వనట్లు, నా ఐస్క్రీమ్ ఎవడో లాక్కు న్నట్లు, కలాంగారి లెవెల్కి ఎప్పుడు ఎదుగుతానో!! - డా॥గురవారెడ్డి -
రామేశ్వరంలో కలాం విగ్రహం
చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం 20 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామేశ్వరం - రామనాథపురం జాతీయ రహదారిలో పంబన్ వంతెన సమీపంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు రామనాథపురం జిల్లా తూర్పు అరిమా సంఘం అధ్యక్షులు విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు రామేశ్వరం జిల్లా పేయ్కరుంబులో గత నెల 30న కలాం అంత్యక్రియలు జరగ్గా.. ఇప్పటికీ జనం రోజూ అధిక సంఖ్యలో ఖననం చేసిన ప్రదేశానికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. -
గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు!
బెంగళూరు: మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కనుంది. ఓ గ్లోబల్ శాటిలైట్కు అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నారు. భూమి పరిశీలన, విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపొందించే 'గ్లోబల్శాట్ ఫర్ డీఆర్ఆర్'కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. స్పేస్ టెక్నాలజీ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ సంస్ధ కెనడా-యూరప్-యూఎస్-ఆసియా (సీఏఎన్ఈయూఎస్) చైర్మన్ మిలింద్ పిమ్ప్రికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలైట్కు 'యూఎన్ కలాం గ్లోబల్శాట్'గా పేరు మార్చాలని ప్రతిపాదించినట్టు పిమ్ప్రికర్ చెప్పారు. జూలై 27న అబ్దుల్ కలాం షిల్లాంగ్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు పెట్టడానికి ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధికారికంగా ఆమోదించాల్సివుంది. సెప్టెంబర్లో న్యూయార్క్లో జరిగే ఈ కాన్ఫరెన్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 150కి పైగా దేశాధినేతలు హాజరవుతారు. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రపంచంలో విపత్తుల నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా 1999లో కెనడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా సీఏఎన్ఈయూఎస్ను ఏర్పాటు చేశారు. -
కారణజన్ముడు కలాం
ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పెద్ద యాపిల్ చెట్టుండేది. ఒక చిన్న పిల్లవాడు రోజూ వచ్చి ఆ చెట్టుతో ఆడేవాడు, చెట్టు ఎక్కి యాపిల్స్ కోసుకొని తిని, ఆడి ఆలసిపోయి ఆ చెట్టుకిందే నిద్రపోయేవాడు. కాలం గడిచిపోయింది. చిన్న కుర్రవాడు పెద్దవాడవుతున్నాడు. చెట్టు దగ్గరకు రావటం తగ్గుతోంది. ప్రతి రోజూ రావట్లేదు. చెట్టు బాధతో అడిగింది. నాతో ఆడుకోవూ అని. నేను పెద్దవాడినవుతున్నా కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలనుంది అన్నాడు. నా పండ్లను కోసుకెళ్లి అమ్మి బొమ్మలు కొనుక్కొమ్మంది చెట్టు. మళ్లీ చాలా రోజుల తర్వాత పెద్దవాడై కనిపించాడు. చెట్టు అడిగింది నాతో ఆడుకోవూ అని. నేను పెద్దవాడిని ఇల్లు కట్టాలి అన్నాడు. నా కొమ్మలు నరుక్కొని దాంతో ఇల్లు కట్టుకో అంది చెట్టు. చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఒక రోజు అతను చెట్టు దగ్గరకు వస్తే నాతో ఆడుకోవు అంది చెట్టు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఖర్చు పెరిగింది. నది దాటి పనికి వెళ్లాలి, పడవ కావాలి అన్నాడు. నా కాండం నరికి పడవ చేసుకో అంది చెట్టు. సంతోషంగా పడవలో వెళ్లోచ్చేవాడు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత చెట్టు ఉండే చోటుకు వచ్చాడు. అయ్యో నా దగ్గర యాపిల్స్ ఇచ్చే స్థితి లేదే అని బాధపడింది చెట్టు. నాకు నీ నీడలో సేద తీరాలనుంది అన్నాడు. నా దగ్గర ఎండిపోతున్న వేర్లు తప్ప ఇంకేమీ లేవు. వాటి మీదే కూర్చో నీకు సాంత్వన కూర్చటానికి ప్రయత్నిస్తాను అంది. జీవితంలో అలసిన అతడు ప్రశాంతంగా ఆ మొక్క మోడు మీదే నిద్రపోయాడు. మన తల్లిదండ్రులు ఆ యాపిల్ చెట్టు లాంటి వాళ్లు. మన అవసరాలన్ని తీర్చి మోడుబోయిన తర్వాత కూడా మనం ఆశ్రయిస్తే ఆప్యాయంగా ఆదరించి సేదతీరుస్తారు. మరి పిల్లలు తల్లిదండ్రులకేం చేస్తున్నారు.., స్వార్థించడం, సాధించడం, సాగనంపటం తప్ప. వారు చేసే సేవ మనం గ్రహించం. గ్రహించే సరికి ఆలస్యమవుతుంది. అందుకే తల్లిదండ్రులను ప్రేమతో చూడాలి. ఎన్నోసార్లు ఎంతోమందికి ఈ కథను చెప్పిన వ్యక్తి ఎవరో కాదు పడవ నడిపే నిరుపేద తండ్రిని - 102 ఏండ్ల పాటు జీవించిన తన మూలాన్ని జాగ్రత్తగా చూసుకొన్న సుపుత్రుడు అబ్దుల్ కలాం.రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తెల్లవారుజామున వార్తా పత్రికలు అమ్ముకొని పగలు స్కూలుకెళ్లి, సాయంత్రం అమ్మకు, నాన్నకు సాయపడుతూ విద్యాభ్యాసం చేసిన నిత్య విద్యార్థి. చిన్నతనంలో తల్లిదండ్రులకు ఇంటి పనిలోనో, పొలం పనిలోనో సాయపడుతూ సంపాదించే అనుభవం, నైపుణ్యం తదుపరి జీవితంలో చేయాల్సిన అన్ని పనుల్లోనూ ప్రావీణ్యతను సాధించటానికి తోడ్పడుతుందని స్వానుభవంతో చెప్పిన ఒక ఆచరణశీలి. రామనాథశాస్త్రితో కలిసి ముందు బెంచిలో కూర్చున్నందుకు ఒక అధ్యాపకుడు తిట్టి వెనక్కు పంపినా.. శివ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే సైన్సు టీచర్, వంట గదిలో భార్య నిరసించినా.. తనకు పెట్టిన భోజనాన్ని, పక్షులు ఎలా ఎగురుతాయన్న ప్రశ్నకు, బోర్డుపై పక్షి రెక్కలు, తోకల బొమ్మల ద్వారానే కాకుండా, సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి ప్రాక్టికల్గా పక్షులు ఎగిరే విధానం చూపిస్తూ చేసిన విద్యా బోధన మరవకుండా.. ఆ స్ఫూర్తితో, ఆ తీపి జ్ఞాపకాలతోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివానన్న ఆయన మాటలు జీవితంలో ఒకరు చేసిన మంచిని గుర్తుంచుకుంటూ ఎలా ముందుకు పోవాలో నేర్పిస్తుంది. బాల్యంలో మనం వినే మాటలు ఊహాచిత్రాలుగామారి మన చేష్టలకు కారణం కావటమే కాక అది జీవితాంతం మన ఊహాశక్తిని, ఆలోచనా సరళిని, ఆచరణ శక్తిని నియంత్రిస్తుందని, అందుకే బాల్యంలో మాతృభాషలో వీలైనన్ని ప్రోత్సాహక పదాల్ని వాడితే.. అవి జీవితాంతం పనికొచ్చే నాడీ రహదారులను మెదడులో నిక్షిప్తం చేస్తాయని తన స్వానుభవంతో పిల్లల పెంపకం గురించి-మాతృ భాషా వైశిష్ట్యం గురించి చెప్పకనే మనసు తట్టి చెప్పిన మహనీయుడాయన. తన అనుభావాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక రోజు నేను, నా అక్క ఒక చెట్టు మీదెక్కి ఆడుకుంటున్నాం. నాన్న పెనుగాలి రావటం చూసి కలాం కొమ్మను గట్టిగా వాటేసుకో అన్నారు. అత్తేమో అక్కతో కింద పడిపోతావ్ జాగ్రత్త అంది. పది నిమిషాల తర్వాత పెనుగాలి తగ్గిన తర్వాత నేను కొమ్మను అంటిపెట్టుకొనే ఉన్నా. అక్కమాత్రం కింద పడి ఏడుస్తూ ఉంది. నాన్న నాకిచ్చిన కమాండ్ను ఊహాచిత్రంగా మార్చుకొని కొమ్మను వాటేసుకుని సురక్షితంగానే ఉన్నా. అక్క తనకందిన కమాండ్ను ఊహాచిత్రంగా మారుస్తూ కిందపడిపోయింది. జాగ్రత్తపడే లోపే ఒక నెగెటీవ్ స్టేట్మెంట్ మెదడుపై చూపే చెడు ఫలితాన్ని నివారించటానికి 17 పాజిటీవ్ స్టేట్మెంట్స్ అవసరమౌతాయని.. అందుకే మాట్లాడే ప్రతి మాట పాజిటీవ్గానే ఉండాలన్న ఆయనకన్నా మంచి మానవ మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు? కష్టాలు మనల్ని కష్టపెట్టటానికి రావు. అవి మనలో నిబిడీకృతమైన నిగూఢ శక్తుల్ని వెలికి తీసేందుకు వస్తాయి. ఇవి పైలట్గా సెలెక్ట్ కాలేకపోయినపుడు ఆయన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహపు మాటలు. మనల్ని ఓడించటం కష్టమని కష్టానికి చెప్పాలన్న తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుంటూ.. ఇంకా కష్టపడి పనిచేస్తూ, చేతి రాత బాగోలేదని మూడు గంటలు (ప్రతిరోజూ) ఇంపోజిషన్ రాయించిన గురువును స్మరించుకుంటూ.. తన చేతిరాతను, తలరాతను తన చేత్తోనే దిద్దుకున్న శ్రామికుడాయన. ఒకసారి జ్వరం వచ్చి స్కూల్కెళ్లకపోతే అధ్యాపకుడు తన ఇంటికి వచ్చి పరామర్శించటం మరువలేని అనుభూతిగా గుర్తుంచుకొన్న అల్పసంతోషి. కలాం పఠనాసక్తిని, అణకువను గమనించి తన ఇంటికి పిలిచి తన వంట గదిలో తన భార్యకిష్టం లేకపోయినా అన్నం పెట్టిన అధ్యాపకుని మనసంతా నింపుకొని.. బ్రాహ్మణులు ఎలా భోజనం చేస్తారో, భోజనానంతరం ఎలా తిన్నచోటుని శుభ్రం చేస్తారో చిటికలో అధ్యాపకుని చూసి నేర్చుకొని.. మరుసటి రోజు గురుపత్ని వాత్సల్యంతో భోజనం పెట్టేలా ఆ సంస్కృతిలో ఒదిగిపోయిన ఓర్పరి. ఈ సంఘటనల నుంచి ఎన్ని విషయాలు నేర్వవచ్చు మనం, మన పిల్లలూ. అంతరాయాలు ఆపినకొద్దీ సంకల్పం దృఢం కావాలి. చేసే పనిలో తదేకంగా తపించటమే ధ్యానం. ఇలా పని చేసేవారికి వేరే ధ్యానమెందుకు అన్న తన గురువు సతీశ్ ధావన్ మాటలను జీవితాంతం దృఢసంకల్పంతో పాటించిన సాధకుడాయన. మొదటిసారి రాకెట్ ప్రయోగం విఫలమైతే ఆ బాధ్యతను తన నెత్తిన వేసుకొని మా శాస్త్రవేత్తలు శక్తివంచన లేకుండా చేశారు. వారిదేం తప్పులేదు. మరింత సాంకేతిక నైపుణ్యాన్ని వారికి ఇవ్వటానికి నేను కృషి చేయాలని విలేఖరుల సమావేశంలో మాట్లాడి వైఫల్యాన్ని తన మీద వేసుకున్న సతీశ్ ధావన్.. మరుసటి సంవత్సరం ప్రయోగం సఫలమైనప్పుడు కలాం టీంను అభినందించి.. ఓటమిని తనకు, విజయాన్ని కలాంకు ఆపాదించి.. కలాంను విలేఖరుల సమావేశం నిర్వహించమన్న సంఘటన నాయకత్వ పాఠాలను ఆయన మనసుకి హత్తుకునేలా నేర్పింది. ఆ గురువు నుంచి నేర్చుకున్న దాన్ని మరింత ఔన్నత్యంతో అమలుచేసి.. నాయకత్వం వహిస్తూనే సహచరుడిగా ఎలా లక్ష్యసాధనలో మమేకం కావాలో ఆచరించి చూపిన ఆదర్శ నాయకుడు. అలాగే అత్యుత్తమ విజయాలు సాధించిన క్షణాల్లో దేశమంతా ఆనందోత్సాహల్లో తేలి ఉంటే.. ‘తనను ఇంతవాడిని చేసిన గురువులు జీవించి ఉంటే ఎంత సంతోషపడేవారో కదా’ అని బాధపడ్డ సున్నిత మనస్కుడు. ఎక్కడ పనిచేసినా తనలోని శక్తినే కాక తన చుట్టూ ఉన్నవారి శక్తిని కూడా వెలికి తీయగల ద్రష్ట. ఉన్నతమైన లక్ష్యాలతో హృదయం ఉప్పొంగినపుడు దానికి గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. ఆ లక్ష్యం/కోరిక లోక కల్యాణార్థమైతే ప్రకృతిలో ఉన్న సాత్విక శక్తులన్నీ కేంద్రీకృతమై ఆ కోరికను సాకారం చేస్తాయి అని తను చేపట్టిన ప్రతి బాధ్యతలోనూ రుజువు చేసిన స్రష్ట. ఇంట్లో కష్టపడి పనిచేసి, ప్రభుత్వ కళాశాలలో చదువుకొని, స్వశక్తితో ఉన్నతమైన బాధ్యతలను అందుకొని.. సహచరులనుంచి, గురువులనుంచి టీంలీడర్గా ఉంటూకూడా ఎంత ఎక్కువ వీలైతే అంత నేర్చుకుని.. ఏ మాత్రం అహంకార ఛాయ లేకుండా.. సంస్థ లక్ష్యాల కోసం ఒదిగిపోయి తన టీంను విజయ పథంలో నిలుపుతూ వచ్చిన ఆయన మన టీం లీడర్లందరికీ ఆదర్శం కాదూ? వైఫల్యాన్ని నాయకుడిగా తాను స్వీకరించి విజయాన్ని టీంకు పంచటానికి ఎంత ఔన్నత్యం కావాలి. సత్యంచ సమతాచైవ దమశ్చైవ న సంశయః అమాత్సర్యం క్షమాచైవ హీస్తితి క్షానసూయతా త్యాగోధ్యాన మధార్యత్వం ధృతిశ్చ సతతం దయా అహింసాచైవ రాజేంద్ర సత్యకారా సమో దశ నిజాయితీ, సమభావం, ఆత్మనిగ్రహం, అనాడంబరం, క్షమ, అణకువ, సహనం, అసూయ లేకపోవటం, దాతృత్వం, ఔన్నత్యం, ఆత్మనిర్భరత, దయ, అపకారం చెయ్యకుండటం, ఈ పదమూడు గుణాలు కలిస్తేనే సత్యం పరిపూర్ణంగా పాటించినట్లు. ఇది కలాం గారికి పూర్తిగా వర్తిస్తుంది. ఒకసారి క్షిపణి తయారీ జట్టులో ఒక సభ్యుడు మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి త్వరగా వెళ్లాలనీ, పిల్లలను ఎగ్జిబిషన్కు తీసుకెళ్లాలని కోరాడు. కలాం అనుమతిచ్చారు. అయితే మర్నాడు ప్రాజెక్టు పనిలో తదేకంగా నిమగ్నమై తన పిల్లల విషయమే మర్చిపోయి సమస్య పరిష్కారానికి తపన పడుతున్న ఆ వ్యక్తి నిష్టను గమనించారు. ఆ సభ్యుడు సాయంత్రం ఇంటికి వెళ్తుండగా పిల్లల సంగతి గుర్తొచ్చి బాధపడ్డాడు. ఇంటికెళ్లేసరికి భార్య ఒక్కతే ఉంది. అదేమని అడిగితే మీ మేనేజరు ఎవరో కలాం వచ్చి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు అంది. నాయకుడిగా ఉంటూ సహచరుడిగా సమభావంతో పనిచేయటం ఆయన దగ్గరే నేర్వాలి. అందుకే ‘సర్వస్మిన్నపి పశ్యాత్మానమ్’ (అందరిలోనూ నిన్నే చూసుకో) అనే భజగోవిందంలోని సూక్తిని పదే పదే గుర్తుచేసే వారాయన. అలాగే ఒక రోజున ఆయన డీఆర్డీవో (డిఫెన్స రీసెర్చ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో తన టీంకు నాయకత్వం వహిస్తున్న రోజుల్లో భవనాన్ని సురక్షితంగా ఉంచటానికి ప్రహరీగోడ కట్టి, దానికి గాజు పెంకులు అంటిద్దామని సూచించారు నిపుణులు. గాజు పెంకులు పెడితే గోడమీద వాలిన పక్షులు గాయపడవూ! అని వారించారాయన. తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని ఆయన ఎంత ఉన్నతుడు. చిన్నపిల్లల దగ్గరైనా మనకు తెలియని విషయం ఉంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస ఆయనది. బరువైన లోహపు కాలిపర్స్ ధరించి నడవలేక ఈడ్చుకుంటూ వెళ్తున్న పోలియో బాధిత చిన్నారుల కోసం తేలికైన కాలిపర్స్ రూపొందించారు. తాను క్షిపణుల కోసం తయారు చేసిన లోహంతో 30 గ్రాముల్లో కాలిపర్స్ను రూపొందించి ఈడ్చే కాళ్లను నడిచేట్టు చేయగలిగారు. ప్రతీ శాస్త్రవేత్తకు ఉండాల్సిన మానవీయ దృక్పథం ఇది. సేవ (సర్వీస్) అనే పదానికి సంస్కృతంలో ‘ఆనందించటం’ అని కూడా అర్థం ఉంది. సేవ చేసినప్పుడు ఇతరులకు సాయం చెయ్యటమే కాక ఆనందించాలన్న తత్వం ఆయనది. ఒకసారి తనకు భారత అంతరిక్ష సంస్థలో మిత్రుడైన కస్తూరి రంగన్ను రాష్ట్రపతి భవన్లో భోజనానికి పిలిచారు. తమ ఇద్దరికీ ఇడ్లీ, దోశ తయారు చెయ్యమని చెప్పి.. డైనింగ్ హాల్లో రాష్ట్రపతికి ఉద్దేశించిన కుర్చీలో కస్తూరిరంగన్ను ‘అతిథి దేవోభవ’ అని కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. ఈ రోజు ఈ విందుకి నీవే ప్రెసిడెంటువి అని చిన్నపిల్లాడిలా సేవ చేశారు. తాను వెంట ఉండి అంతా కలయ తిరిగి చూపించారు. కట్టుకోవటానికి ఒక లుంగీ, ఒక వీణ ఉన్న అతి సాధారణ గదిని తన శయన మందిరంగా కలాం పరిచయం చేసే సరికి కస్తూరి రంగన్ కళ్లు చెమర్చాయి. కలాం రాష్ట్రపతి అయినా.. వ్యక్తిగా సాధారణ దక్షిణ భారత దిగువ మధ్యతరగతి పౌరుడి జీవితమే సాగిస్తున్నారని, ఆహారంలో, ఆహార్యంలో, అలవాట్లలో, అభిమానంలో, ఆప్యాయతలో, అభిరుచులలో తన పాత కలాంలో ఇసుమంత మార్పైనా లేదని లోలోన పొంగిపోయారు కస్తూరి రంగన్.భారతదేశం శాంతి కాముకదేశం. అలాంటప్పుడు ఆయుధాలు, క్షిపణులు ఇవన్నీ ఎందుకని కొందరు విమర్శించారు. తన బిడ్డల్లా రూపొందించిన క్షిపణుల విషయంలో, అణ్వస్త్రాల విషయంలో కలాం ఇలా స్పందించారు. ‘‘మనం బలం కలిగి ఉంటేనే బలవంతుల చేత గౌరవింపబడతాం. మనం బలహీనంగా ఉండి శాంతి వచనాలు వల్లిస్తే ఎవరూ లెక్కచేయరు’’. అంత గంభీరంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రపతిగా మొదటిసారి త్రివేండ్రం వెళ్లినపుడు తాను విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకు చెప్పులు కుట్టి ఇచ్చిన వ్యక్తిని, రోడ్డుపక్క చిన్న బండి మీద రాత్రి వేళల్లో ఏదో ఒక ఆహారం రుచిగా చేసి ఆప్యాయంగా పెట్టిన మొబైల్ క్యాంటీన్ యజమానినీ.. ఆదరంగా తన అతిథులుగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఉపన్యసించేటపుడు ఎంత నిష్కర్షగా స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పేవారో.. ఉపన్యాసం మధ్యలో కరెంటు పోతే సభికుల మధ్యకు వెళ్లి కొంచెం గట్టిగా మాట్లాడి ఉపన్యాసం కొనసాగించేవారు. ఒక ఉపన్యాసం అనంతరం ఒక బాలిక దేవుడు ప్రత్యక్షమైతే మీరే వరం కోరతారు అని అడిగితే.. దేశానికి పరిశ్రమించే తత్వాన్ని, దార్శనిక దృష్టిని అలవరచాలని కోరతానని చెప్పారు. భారతదేశ చరిత్ర చూస్తే మనపై ఎంతమంది దండయాత్రలు చేసినా.. మనం మాత్రం ఇతరుల స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ ఆ పని ఎప్పుడూ చేయలేదని అదే మన ఆత్మబలమనీ చెప్పేవారు. అయితే దేశం సుభిక్షంగా ఉండాలంటే.. వర్షాలు కురవటమే కాక ప్రతి పౌరుడి శరీరం నుంచి స్వేదం వర్షించాలనీ ప్రతిదానికీ దేశాన్నీ, ప్రభుత్వాన్ని విమర్శించటం తగదనీ, ఆత్మ నిర్భరత (సెల్ఫ్ రిలయెన్స)తోనే ఆత్మగౌరవం ఇనుమడిస్తుందనీ.. విదేశాలలో వ్యవస్థలను గౌరవిస్తూ రాణించే భారత పౌరులు ఇక్కడ వ్యవస్థలను ఎందుకు గౌరవించరని బాధపడేవారు. మన ఆత్మను డబ్బుకు తాకట్టు పెట్టకూడదనీ, నిరాశావాదం మంచిదికాదనీ హెచ్చరించేవారు. ఇజ్రాయెల్ దేశంలో బాంబు దాడిలో కొందరు మరణిస్తే.. అక్కడి పత్రికలు మరుసటి రోజు ప్రధాన శీర్షికగా ఎడారి భూమిని తన సాంకేతిక నైపుణ్యంతో సస్యశ్యామలం చేసిన రైతు కథను ఎంచుకొన్నాయనీ, బాంబు వార్త చివరి పేజీలకు వెళ్లిందనీ.. మన ప్రసార సాధనాలు కూడా తమ ప్రాధాన్యాలను గుర్తెరగాలనీ ఆశించారు. సూర్యుడిలా దేశం వెలగాలంటే దేశవాసులంతా సూర్యుడిలా తపించాలని తపన పడేవారు. ఆలోచనా యంత్రంలో నలిగే వ్యక్తుల్లో జీవరసం ఇంకిపోతుంది. అలా ఇంకనివ్వకుండా ఉండాలంటే.. రససృష్టి అన్నా తెలియాలి రసానందం అన్నా తెలియాలి. ఐన్స్టీన్ లాంటి మహానుభావులు వయొలిన్ వాయించుకుంటూ రసానందంపొంది సేదతీరితే.. కలాం వీణవాయిస్తూ ఆనందించేవారు. సంగీతం, గణితం, విజ్ఞానశాస్త్రంలో ఎన్నో సారూప్యతలున్నాయి. శాస్త్రీయ సంగీతాన్ని వినటం, సాధన చేయటం ఎన్నో వ్యక్తిగత విజ్ఞాన శాస్త్ర సందేహాలను సమాధానపరచిందని ఆయన చెప్పేవారు. శాస్త్రీయ సంగీతం స్వీయ ఉద్రేకాన్ని కరిగించి హృదయం నిండా దయనూ, మనసు నిండా నైతిక మూల్యాలనూ నింపే సామాజిక సాధనం అని ఆయన ప్రగాఢ విశ్వాసం. సంగీతంలో ఉండే లయ మన శారీరక మానసిక వ్యాపారాలకు లాలిత్వాన్ని ప్రసాదించి, దైవత్వాన్ని పెంచి మృగత్వాన్ని తగ్గిస్తుందని ఆయన నమ్మేవారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్న గొప్పదనం అది ప్రతి పాదించే శాశ్వత విలువలలో ఉందనీ.. హృదయజనితమైన కళాదృష్టి, మేధోజనితమైన వైజ్ఞానిక దృష్టిని పదును పెట్టటానికి ఉపయోగపడుతుందని ఆయన వక్కాణించేవారు. కర్ణాటక సంగీతంలో శ్రీరాగంలో త్యాగరాజస్వామి పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులును ఆగకుండా వీణపై వాయించటం తనకు అత్యంత ఇష్టమని పేర్కొనేవారు. కెరీర్ను కళలనూ సమన్వయం చేసుకోవటానికి ఇంతకంటే మరొకరు మార్గదర్శకులు కాగలరా? వేలసంవత్సరాల క్రితం రాసిన తిరుక్కురళ్, మన ఆరాధ్యగ్రంథం భగవద్గీత నుంచి ఆయన ఎంతో స్ఫూర్తి పొందేవారు. మన ఉథ్గ్రంధాలను చదివితేనే వ్యక్తిత్వంలో దృఢత్వం వస్తుందని ఆయన నమ్మకం. భగవద్గీతలో చెప్పిన.. ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిధ్యసిధ్యోర్నిర్వికారః కర్తాసాత్విక ఉచ్చతే. ఈ పని నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా.. ఫలంమీద ఆశ లేకుండా.. ఈ పనివల్ల ఈ ఫలం సిద్ధిస్తుందా లేదా అన్న విచారణ లేకుండా.. ఇది నా విధి/కర్తవ్యం అనే దృష్టితో ఆ పనిని ధైర్యం, ఉత్సాహంతో చేసేవాడు సాత్వికకర్త. తాను సాత్విక కర్తగా పని చేయాలనుకుంటానని కలాం చెప్పేవారు. మన ప్రాచీన గ్రంథాలు చదవటానికి ఇంతకంటే ఎటువంటి ఉదాహరణలు కావాలి?పైలట్గా సెలెక్ట్ కావాలనే తన కోరిక తీరకపోయినా, తనబిడ్డ కలెక్టర్ కావాలనే తన తండ్రి కోరిక తీరకపోయినా నిరుత్సాహపడక భారత అంతరిక్ష కార్యక్రమానికీ, క్షిపణుల నిర్మాణ కార్యక్రమానికీ అణువిజ్ఞాన కార్యక్రమానికీ పైలట్గామారి.. భారతరత్నంగా తనను తాను మలచుకున్న మణిపూస కలాం. ఒక్కసారి కూడా విదేశాలలో శిక్షణ పొందకుండా ఈ రంగాలలో భారత దేశం స్వావలంబన సాధించడానికీ , మేక్ ఇన్ ఇండియాకి నిలువెత్తు రూపం ఆ నిస్వార్థజీవి. దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి అనుగుణంగా ఆ విలువలను మనలో అంతర్లీనంగా ప్రవహింపచేసుకుని, దేశాభివృద్ధిని చేసుకుంటేనే మనం ఆనందించగలుగుతాం అన్న స్వచ్ఛమైన స్వదేశీస్వాప్నికుడు. మనదేశంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే బలమైన సంబంధ బాంధవ్యాలు మనదేశపు తరగని ఆస్తి అనేవారు కలాం. తన చదువుకోసం డబ్బు సమకూరనప్పుడు తన అక్క బంగారు గాజులను తాకట్టు పెట్టి.. ఆ డబ్బు తెచ్చిచ్చి కలాం చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదని, తనపై అచంచలమైన విశ్వాసాన్ని, ప్రేమను చూపిన అక్క జోహరాను ఆయన పదేపదే గుర్తుకు తెచ్చుకొని, ఆమె త్యాగం స్ఫూర్తితో రాత్రింబవళ్లు కష్టపడి చదివి స్కాలర్షిప్ డబ్బులతో చదువు పూర్తిచేసి, తన మొదటి సంపాదనతో ఆ గాజులను విడిపించి అక్కకు కృతజ్ఞత భావంతో సమర్పించిన ఆయన.. తోబుట్టువుల మధ్య ఉండాల్సిన అనురాగం, ఆప్యాయతలను చెప్పకనే చెప్పారు. అలాగే బాల్యంలో, విద్యాభ్యాసంలో తనకు ఎన్నో విషయాల్లో దిశానిర్దేశం చేసిన బావ జలాలుద్దీన్ మరణం తనను ఎంతో కుంగదీసిన పరిణామంగా చెప్పడం మానవ సంబంధాలపట్ల ఆయనకున్న అనుభూతుల గాఢతకు నిదర్శనం. ‘‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణే’’సఫలత్వం సామర్థ్యంలో ఉంటుంది గానీ పనిముట్టులో కాదు...అన్న వాక్కు ఆయన జీవితానికి అక్షరసత్యం. నా జీవితం అందరికీ మార్గదర్శకంగా ఉండాలని నేను భ్రమపడను. అయితే సుదూర తీరాలలో ఆదరణ, ఆశ్రయం లేక అలమటించే నిస్సహాయులు.. తమ జీవన సంకెళ్ల నుంచి తమను తాము ఉద్ధరించుకోవటానికి నా జీవితం ప్రేరేపిస్తే నా జన్మ సఫలమైనట్లే అనేవారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి.. శాస్త్రవేత్తగానా? రచయితగానా? రాష్ర్టపతిగానా అని అడిగితే.. ఒక అధ్యాపకుడిగా గుర్తుంచుకొమ్మన్నారు. అందుకేనేమో ఆయన జన్మదినమైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆయన జీవించిన చివరి రోజున గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్లేటప్పుడు తన ముందు వాహనంలో ఒక భద్రతగార్డు 3 గంటల నుంచి నిలబడటం చూసి తట్టుకోలేక అతడు అలసిపోతాడు కూర్చోమనండి అని నాలుగుసార్లు కబురుచేసిన ఆయన.. గమ్యానికి చేరిన తర్వాత భుజంతట్టి నావల్ల నీకీకష్టం గదా అంటే.. ఆ గార్డు మీలాంటి వ్యక్తి కోసం 6 గంటలైనా నిలబడతానన్నాడట. దేశ అత్యున్నత పదవిలో ఉండి చేపట్టిన ప్రతి పనిలోనూ అత్యున్నతంగా రాణించి అత్యుత్తమ విజయాలు సాధించిన ఆయనను.. ఒక చిన్న బాలిక మీరు జీవితంలో సాధించినదేమిటని అమాయకంగా ప్రశ్నిస్తే.. అదే అమాయకత్వంతో ఆ చిన్నారి జిజ్ఞాసను పెంచే విధంగా నేను సూర్యుడి చుట్టూ 83 సార్లు ప్రదక్షిణలు చేశాను (భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి ఒక సంవత్సరం పడుతుంది అంటే నా శరీరానికి 83 ఏళ్లు సాధించటమే నేను సాధించింది) అని అణకువతో సెలవిచ్చిన ఆ మహామనిషి, మానవతామూర్తి 84వ ప్రదక్షిణలో ఆగిపోవటం మనసున్న ప్రతివారినీ మనోవేదనకు గురిచేసేదే. వ్యక్తి ప్రేమకంటే వస్తు ప్రేమ సత్సాంగత్యానికంటే సుఖసామాగ్రి సాంగత్యం పెరుగుతున్న ఆధునిక సమాజంలో కనీసం టెలివిజన్ కూడా కొనుక్కోకుండా రేడియోలో వార్తలు వింటూ అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన అసాధారణ వ్యక్తి ఆయన. తరువులు అతిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమొసంగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకిది సహజగుణము ... (మిక్కిలి రసభరితమైన ఫలాలు కలిగిన చెట్లు నేలవైపు వంగి ఉంటాయి. ప్రాణాధారమైన వర్షాన్నిచ్చే మేఘుడు నేలవైపే చూస్తుంటాడు. తమ విజయాల చేత ఎదిగినకొద్దీ గొప్పవారు ఒదిగే ఉంటారు. సృష్టిలో ఉపకార స్వభావం కలవారికి ఇది సహజగుణం) అన్న భర్తృహరి సుభాషితానికి సజీవరూపం కలాం. శరీరం క్షణ విధ్వంసి కల్పాన్తస్థాయినో గుణాః శరీరం క్షణ భంగురమైనా గుణాలు కల్పాంతం వరకూ నిలిచి ఉంటాయనటానికి ఆయనే నిలువెత్తు ఉదాహరణ. తను జీవించిన చివరి రోజున ఆయన మనలను శాశ్వతంగా వదిలివెళ్తూ మాట్లాడబోయిన అంశం ‘‘క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త’’. తన జీవితమే ఒక పెద్ద ఆచరణీయ గ్రంథంగా మలచుకొన్న ఆయన తను జీవించిన విధానంతోనే అన్ని వృత్తుల, వయసుల, వర్గాల వారికీ పాఠాలు నేర్పి అనాయసంగా అమరులయ్యారు. తన జీతభత్యాలను మారుమూల గ్రామాలలో పట్టణ సౌకర్యాలను ఏర్పరచడానికి కృషి చేసే పీయూఆర్ఏ (ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) ట్రస్టుకు అప్పజెప్పి తనకు వారసత్వంగా లభించిన నిజాయతీ, క్రమశిక్షణ (తండ్రి నుంచి), మంచితనంపై విశ్వాసం (తల్లినుంచి) చేసే పనిపట్ల అంకితభావం, నాయకత్వ లక్షణాలు(గురువుల నుంచి) లాంటి అమూల్య ఆస్తులను మన తరానికి, వారసత్వ సంపదగా అందించి.. మరణించాక కూడా ప్రజల మధ్య జీవించగలగడం ఎలాగో చేసి చూపించారు. గాంధీజీ నోటినుంచి వెలువడిన మంత్రముగ్ధమైన మాటలు.. 1) Be the change you want to see in the world.2) My life is my message.ఈ మాటలకు సజీవ రూపంగా తననుతాను మలచుకొని, చిరస్మరనీయుడైన సాత్విక శిల్పి కలాం. అనాయసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తావసాయుజ్యం దేహిమే పరమేశ్వర (అనాయాసంగా ప్రాణాన్ని విడిచిపెట్టడం, జీవించి ఉన్నప్పుడు దీనస్థితి లేకుండా జీవించడం, తనువు చాలించిన తర్వాత పరమాత్మ సన్నిధిని పొందడం నాకు అనుగ్రహించు పరమేశ్వరా)నిత్యబ్రహ్మచారిగా ఉన్న ఆయన తన కార్యక్షేత్రం అనే బ్రహ్మంలో చరిస్తూ,విశ్వవీణకు తంత్రిగా మారి లోక కల్యాణం కోసం తపిస్తూ.. రుషి తుల్యుడైన విదురుడు భగవంతుడిని పైన ప్రార్థించినట్టుగా ‘జీవించగలిగే భూగ్రహ నిర్మాణానికి’ తన జీవితాన్ని చదివితే చాలని, కులమతాల గోడలు దాటి భారతీయుడిగా బతకడం ముఖ్యమని, శరీరం, మనసు, ఆత్మల నిండా భారతీయ తత్వం నింపుకొని చివరిసారిగా మాట్లాడబోతూ మన మధ్య నుంచి మహాప్రస్థానం చేశారు. ఎందరో మహానుభావులు అని తన మెట్లను మీటుతూ ఆయన పలికించిన ఆ వీణ ఆ మహానుభావుని తలచుకుంటూ ఎంత దుఃఖ సాగరంలో మునిగిందో!కర్మయోగి కలాంగారు కారణజన్ములే. (ఈ వ్యాసాన్ని రచయిత 2015, జూలై 28న రాశారు..) -
అబ్దుల్ కలామ్గా అమితాబ్?
క్షిపణి పితామహుడు, రాష్ట్రపతిగా భారత దేశ ప్రజానీకం గుండెల్లో చెరగని ముద్రవేసిన డాక్టర్ అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. టైటిల్ రోల్లో బాలీవుడ్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం. ‘అయామ్ కలామ్’ అనే లఘు చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నిలా మధాబ్ పాండే ఈ చిత్రాన్ని రూపొందించే సన్నా హాల్లో ఉన్నారు. ‘‘కలామ్ లాంటి మహనీయుడి జీవితం ఆధారంగా సినిమా తీయాలంటే ఎంతో అధ్యయనం చేయాలి. కలామ్ పాత్రకు అమితాబ్ బచ్చన్ తప్ప ఎవరూ సెట్ కారని నా నమ్మకం’’ అని పాండే చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకొస్తాయి. -
తప్పించుకు తిరిగిన ‘ధన్యుడు’
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత/మప్పటికి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక, తానొవ్వక,/ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!’ నలుగురు నడిచే దారిలోనే వెళుతూ, చనిపోయిన వారి ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తివేయడం మన దేశంలో, సంస్కృతిలో కనిపిస్తుంది. అంటే ఒక మనిషిని అంచనా వేయడంలో ఆయన ఆచరణను కొద్దిగా అయినా పరిగణన లోనికి తీసుకునే లక్షణం మనకు దాదాపు లేదనే చెప్పాలి. ఇటీవల పరమ పదించిన ప్రసిద్ధ శాస్త్రవేత్త, రోదసీ శాస్త్ర నిపుణుడు, క్షిపణి ప్రయోగ సాంకేతిక నైపుణ్యంలో ఉద్దండుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విషయంలో ఇలాగే జరగడం ఆ లక్షణం కొనసాగింపే. వెలుగూ... చీకటీ... ఎంతటి వ్యక్తి అయినప్పటికీ మానవీయ సంబంధాల గురించి ఆయన సామా జిక స్పృహ, దృక్పథం; అదే విధంగా మానవతా దృష్టికోణం; ధనస్వామ్య, పాలకవర్గాల నుంచి బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలు- అనుభవి స్తున్న అత్యాచారాల పట్ల ఆయన వైఖరి ఏమిటి అనే కోణాల నుంచి విధిగా అంచనా వేయాలి. అబ్దుల్ కలాం శాస్త్ర పరిశోధనల పట్ల, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంతో చేసిన దార్శనికతకు సంబంధించి మనకు ఎలాంటి పేచీ ఉండ వలసిన అవసరం లేదు. ఆయన కన్న కలలతో గానీ, ‘కలలు కనండి’ అంటూ దేశ యువతకు ఆయన ఇచ్చిన నినాదంతో గానీ ఎవరికీ విభేదాలు ఉండనవ సరం లేదు. ఆయన దగ్గరకు చేర్చుకుని చిన్నారుల పట్ల చూపిన ముద్దు మురి పాలు, ప్రదర్శించిన అనురాగ ఆప్యాయతలు ముచ్చట గొలిపేవే కూడా. దేశ రక్షణలో అంతర్భాగంగా ఆయన నాయకత్వంలో జరి గిన ప్రయోగాలతో విభేదించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని అంశాలలో కలాం వైఖరితో మనం దూరంగా ఉండక తప్పదు. శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవుడు తనలో మరింత ఆత్మీయత, మమేకత్వం పెంచుకోవాలి. మానవీయత పరిఢవిల్లాలి. కానీ ఆయన రాష్ట్రపతి పదవికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తరఫున ఎం దుకు, ఏ పరిస్థితులలో పోటీకి దిగవలసివచ్చింది? జాతీయస్థాయిలో మైనా రిటీ పట్లగానీ, వారు పాలకవర్గాల వల్ల అనుభవించిన వేధింపులు, ఎదు ర్కొన్న అత్యాచారాలు, వివక్ష వంటి అంశాల పట్ల కలాం జీవితకాలంలో ఏ రోజూ గొంతెత్తి ఖండించిన ఉదాహరణలు కనిపించవు. కలాం ప్రధానంగా ముస్లిం మైనారిటీ వర్గానికీ, పేదవర్గానికీ చెందిన వారు. అయినా గుజరాత్ లో మోడీ హయాంలో (2002) రెండు వేల మందిపై జరిగిన మైనారిటీల ఊచకోత పట్ల నోటిమాటగా అయినా నిరసన తెలియచేయలేదు. బాల బాలి కల, యువకుల మనసులను ‘రగిలించగలిగిన’వారు కలాం. కానీ తన మెజా రిటీ దళితవర్గానికి చెందిన అభాగ్యుల మీద ఊచకోత జరిగితే తన మనసు ఎందుకు స్పందనతో రగలలేకపోయిందన్నది ప్రశ్న. ఆయన అంత ర్జాతీయ స్థాయి కలిగిన శాస్త్రవేత్త. కానీ రాష్ట్రపతి హోదాలో బాబాలకూ, కుహనా స్వాములకూ భక్తుడెలా కాగలిగారు? కర్ణాటక సంగీతమంటే ఇష్టపడే హృద యమున్న కలాం, నాగపూర్ కేంద్రంగా ఉన్న ఒక మత సంస్థ కేంద్ర కార్యాల యానికి వెళ్లి దాని వ్యవస్థాపకులను పొగ డ్తలతో ఎలా ముంచెత్త గలిగారు? మైలాపూర్ (చెన్నై) తాళ వాద్య కచేరీలలో పాల్గొనే సంస్కృతీ పరునిగా కలాం పేర్గాంచారు. కానీ శాంతి సౌమనస్యాల కంటే దేశాన్ని ఆధునిక ఆయుధీకరణ జరిగినశక్తిగా, అణ్వస్త్ర దేశంగా రూపొందించాలన్న తలంపు ఉన్న వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ఎందుకు శాస్త్రసాంకేతిక అంశాల సలహా దారుగా పనిచేశారు? ఇవన్నీ కాకున్నా, వాజపేయి ప్రభుత్వం ఏ పరిణామాల ఫలితంగా కలాంను ప్రథమ పౌరుని పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించవలసి వచ్చింది? గుజరాత్ మైనారిటీల మీద జరిగిన హత్యాకాండ దరిమిలా పార్టీ ఎదుర్కొన్న తీవ్ర విమర్శల నుంచి బయటపడవేసే యత్నంలో భాగంగానే కలాంను బీజేపీ ‘తురుపు’గా వాడుకుంది! ప్రజా వ్యతిరేకత పట్టలేదు 1997లో వాజపేయి ప్రభుత్వం కలామ్కు ‘భారతరత్న’ పురస్కారం అందిం చింది. ఆ ఊపులో కలాం చేసిన పని- తమిళనాడులో కూడంకులమ్ అణు విద్యుత్ కర్మాగారానికి ప్రభుత్వ సలహాదారుగా పచ్చజెండా ఊపారు! ఇది యాదృచ్ఛికమనుకోవాలా? ఐచ్ఛికమనుకోవాలా? ప్రజాబాహుళ్యం నుంచి, స్థానిక శాస్త్రవేత్తలు, ప్రజలు నిరసనలు సాగిస్తున్నా కూడా కలాం అణు విద్యు త్ కేంద్రానికి ఆమోదం తెలిపారు. ఒడిశాలో ‘వేదాంత అల్యూ మినియం’ ప్రాజెక్టు విషయంలో కలాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికారు. ఇక్కడ కూడా ప్రజలు వ్యతిరేకత, అక్కడి డోంగ్రియా ఆదివాసీ ప్రజల జీవి తాలకు అది ప్రాణాంతకంగా తయారవుతుందని పరిశోధకులూ నిపుణులూ చేసిన హెచ్చరికలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవికి ఎంపిక కాకముందు ‘మరణశిక్ష రద్దు కావాలని’ కలాం మాట్లాడారు. ఈ మరణశిక్షలకు గురైన వ్యక్తుల జీవి తాల వెనక, ‘సామాజిక ఆర్థిక కోణాలు’ ఉండి ఉంటాయని వాస్తవికంగా మాట్లాడిన కలాం రాష్ట్రపతి పదవిలో స్థిరపడిన తరువాత భిన్న ధోరణిని కన పరిచారు. 2004లో ధనంజయ్ ఛటర్జీ (పశ్చిమబెంగాల్) అనే నిరుపేద కాప లాదారునికి మరణశిక్ష విధించారు. 1990 నాటి ఒక కేసులో (‘అత్యాచారం, హత్య’) ఈ శిక్ష పడింది. తరువాత కొలది రోజులకే భారత కేంద్ర గణాంక శాఖకు చెందిన ఇద్దరు పరిశోధక పండితులు దేవాసిస్ సేన్గుప్త, ప్రబాల్ చౌధురి జరిపిన సరికొత్త విశ్లేషణ వివరాలను ప్రజాస్వామ్యహక్కుల పరి రక్షణా జాతీయసంస్థ ‘పీపుల్స్ యూనియన్’ బహిరంగ పరచింది: హత్య అభియోగంపై అరెస్టయి, ఉరిశిక్ష పడిన ధనంజయ్ నిర్దోషి అనీ, శిక్ష కోసమే ‘వాస్తవాల’ పేరిట విచారణ కథలు అల్లారనీ అప్పుడు వెల్లడైంది. సాక్ష్యాధా రాలను సృష్టించడంలో పోలీసుల పాత్ర ఉందని పరిశోధకులు ఆరోపించారు. మనసు విప్పిన సందర్భం ఏదీ? కాశ్మీర్ పౌరుడు అఫ్జల్గురుకు ఉరిశిక్ష ‘సమాజ పౌరుల అంతరాత్మను / మన స్సాక్షిని’ (కలెక్టివ్ కాన్షన్స్ ఆఫ్ ది సొసైటీ) తృప్తిపరచడం కోసం అవసరమని ధర్మాధర్మ విచారణ చేయవలసిన న్యాయస్థానమే చెప్పడం మనమూ, మన చట్టాలూ ఎటు ప్రయాణిస్తున్నాయో తెలిసిపోతోంది! అంతేగాదు, చివరికి మొన్న ఉరితీసిన యాకుబ్ మెమన్ విషయంలో కూడా అన్ని వర్గాలకు చెం దిన వారు మతాతీతంగా స్పందించినా, కలాం రాష్ర్టపతిగా కొలువు చాలిం చుకున్నా గాని స్పందించలేకపోయారు! ఈ అంశంలో మాజీ రాష్ర్టపతుల సామాజిక స్పృహకు, ఆర్డినెన్స్ల విష యంలో వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో పాటించిన మానవీయ కోణాలకు, కలాం వహించిన వైఖరికి మధ్య తేడా స్పష్టమైపోయింది. చివరికి 1998లో రెండవసారి బీజేపీ హయాంలో జరిపిన అణుశక్తి పాటవ పరీక్ష (పోఖ్రాన్-2) కలాం ఆధ్వర్యంలోనే జరిగినా, దాని వాస్తవ ఫలితాన్ని గురిం చి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. బాబా అణు పరిశోధన కేంద్రం లగా యితూ పలువురు అణు శాస్త్రవేత్తలు ఈ రెండు ప్రయోగ ఫలితాన్ని చూసి పెదవి విరిచారు. అంతేగాదు, ఇందిరా గాంధీ హయాంలో మొదటి పాటవ పరీక్ష నూరు శాతం విజయవంతం కాగా రెండవ ప్రయోగ ఫలితం తర్వాత అణుశక్తి వినియోగానికి అభ్యంతరాలు పెడుతూ, ఆంక్షలు పెట్టేందుకు ఒప్పం దంపై సంతకాలు చేయించేందుకు అమెరికా పాలకులు భారత పాలకులపై ఒత్తిడి తీసుకురావడమూ తెలిసిందే! పెట్టుబడి వ్యవస్థ ఎజెండా అణుశక్తిని శాంతికాల ప్రయోజనాలకు వినియోగించడంలో ఇక భారత పాల కులు అమెరికా కనుసన్నల్లోనే మెలగవలసి వస్తుంటుంది! మన దేశీయ విదే శాంగ విధానాలు అమెరికా సన్నాయి నొక్కులకు లోబడే జరుగుతాయన్న వాస్తవాన్ని మరవరాదు! భారత పాలనా వ్యవస్థలో రాష్ట్రపతి ఆచరణలో ఒక రబ్బరు స్టాంపుగానే మిగిలిపోయినంత కాలం, పదవిని కోల్పోవడాన్ని తన ఆస్తినే కోల్పోయినట్టుగా ఆ ‘స్టాంపు’ భావించుకున్నంత కాలం ఉరిశిక్షలను గాని, రాజకీయ ఆర్థిక రంగాలలో పెట్టుబడిదారీ వ్యవస్థలో విపరిణామాలను గానీ నివారించగల శక్తి ఆ ‘స్టాంపు’నకు ఉండదు గాక ఉండదు. దళిత నాయ కులు కొందరిని కాంగ్రెస్, బీజేపీ పాలకవర్గాలు పావులుగా వాడుకుని అధి కార స్థానాలకు సంపన్న వర్గాలే ఎగబాకుతున్నాయి. ఈ ప్రత్యక్ష దాడి బొం బాయి నియోజకవర్గం నుంచి దళిత అభ్యర్థిగా డాక్టర్ అంబేడ్కర్ పోటీ చేసి నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరో దళితుడ్ని రంగంలోకి దిం చింది! ఈ ‘ఆట’కు నేటికీ విడుపులేదని గ్రహించాలి. రాజకీయ శాస్త్రం నుంచి ఆర్థికశాస్త్రాన్ని సామాజిక సమస్యల నుంచి సెక్యులరిజం నుంచి ప్రజానుకూ లమైన ఎజెండా నుంచి శాస్త్రీయ దృక్పథాన్నీ వేరు చేయటం పెట్టుబడి వ్యవస్థ అసలు ఎజెండా! (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఎపిజె అబ్ధుల్కలాం సంస్మరణ సభ
-
కృషితో ఎదిగిన వ్యక్తి కలాం
♦ ఆంధ్ర మహాసభ ట్రస్టీ చైర్మన్ పోతు రాజారాం వ్యాఖ్య ♦ ‘ఎన్నీల ముచ్చట్లు’లో మాజీ రాష్ట్రపతికి ఘననివాళి సాక్షి, ముంబై : పట్టుదల, కృషితో పేదరికం నుంచి ఒక్కో మెట్టూ ఎదుగుతూ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన మహోన్నత వ్యక్తి మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మేన్ అబ్దుల్ కలాం అని ఆంధ్ర మహాసభ ట్రస్టీ చైర్మన్ పోతు రాజారాం అన్నారు. ప్రతి పౌర్ణమికి ఆంధ్ర మహాసభ ఆవరణలో నిర్వహించే ‘ఎన్నీల ముచ్చట్లు’ కార్యక్రమంలో రాజారాం మాట్లాడుతూ, కలాం యువతలో నూతనోత్సాహం నింపారని, యువత ఆయన ఆదర్శాలను పాటిస్తే దేశం ఎంతో పురోగతి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివంగత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అబ్దుల్ కలాంపై ముంబై ప్రజాగాయకుడు నర్సారెడ్డి, నరేంద్ర, గొండ్యాల రమేశ్, నాగెళ్ల దేవానంద్ ఉద్వేగపూరితమైన పాటలు పాడి వినిపించారు. కరీంనగర్ నుంచి వచ్చిన శారద శర్మ, గురువు ప్రాధాన్యం గురించి పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మతోపాటు ఆంధ్ర మహాసభ పరిపాలనా శాఖ ఉపాధ్యక్షులు ద్యావరిశెట్టి గంగాధర్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షులు సంగెవేని రవీంద్ర వేదికను అలంకరించారు. తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో గుర్రం బాలరాజు, బి.సుబ్రహ్మణ్యం, కట్టరాజు ఊశన్న, కట్ట అశోక్, చిలుక వినాయక్, యెల్ది సుదర్శన్, గుర్రం శ్రీనివాస్, నడిమెట్ల యెల్లప్ప, జి శ్రీనివాస్, గాలి మురళీధర్, ఏవీ అనంతరాం, సంగెవేని రవీంద్ర, నాగేంద్ర శర్మ తదితరులు కవితలు చదివి వినిపించారు. రాధామోహన్, అన్నపూర్ణ, బడుగు విశ్వనాథ్, సుల్గే శ్రీనివాస్, కోడూరి శ్రీనివాస్ కలాం గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు మర్రి జనార్దన్, కోశాధికారి బడుగు విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులు గాలి మురళీధర్, గంజి గోవర్ధన్, వాసాల గంగాధర్ సాహిత్య విభాగ సంయుక్త కార్యదర్శి పిట్ల బాలకృష్ణ పాల్గొన్నారు. -
విజయవాడలో టిడిపి విస్తృతస్ధాయి సమావేశం
-
ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయం * ఒంగోలు ట్రిపుల్ఐటీకి అబ్దుల్ కలాం పేరు * రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, 500 గజాల స్థలం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఈ సంవత్సరం రూ. 5,500 కోట్లతో రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాలనీల్లో 1.50 లక్షల కొత్త ఇళ్లతో పాటు స్థలం ఉండి నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో 50 వేల ఇళ్లకు అనుమతివ్వాలని తీర్మానించింది. ఒక్కో ఇంటిని 279 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 2.75 లక్షలతో నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 1.75 లక్షల సబ్సిడీ, లక్ష బ్యాంకు రుణం, ఇతరులకు 1.25 లక్షల సబ్సిడీ, 1.50 లక్షల బ్యాంకు రుణం ఇప్పించాలని నిర్ణయించింది. శుక్రవారం ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ మంత్రివర్గం భేటీ అయింది. ఆ వివరాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడులతో కలసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు... * గతంలో రాజీవ్ స్వగృహ కింద 2,898 ఇళ్లు కట్టాలని నిర్ణయించగా 882 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను పూర్తి చేసే బాధ్యత స్విస్ చాలెంజ్ లేదా బహిరంగ టెండర్ల విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. * కేంద్ర గృహ నిర్మాణ విధానం ఖరారైన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగులు, పేదల ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం. * మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం నాగార్జున యూనివర్సిటీలో కాంస్య విగ్రహం ఏర్పాటు. రాష్ట్రంలో ఇచ్చే ప్రతిభ అవార్డులను కలాం పేరుతో ఇవ్వడానికి నిర్ణయం. కొత్తగా ఒంగోలులో ఏర్పాటుచేసే ట్రిపుల్ ఐటీకి కలాం పేరు. * నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి సంతాపం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు. ఆమె కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా, రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం. * నివర్సిటీలను ప్రక్షాళన చేసి అన్ని స్థాయిల్లో ర్యాగింగ్ నిరోధించడానికి చర్యలు. * 75 శాతం హాజరు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు నిలిపివేత. వారు పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరించేలా చర్యలు. యూనివర్సిటీల్లో రెండో కోర్సు చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిరాకరణ. వర్సిటీల్లో ల్యాండ్ బ్యాంక్ పరిరక్షణకు చర్యలు. అన్ని యూనివర్సిటీలకు సమర్థులైన వీసీలు. నాగార్జున వర్సిటీకి ప్రొఫెసర్ సింహాద్రి పేరు పరిశీలన. * హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గుండ్లకమ్మ, పట్టిసీమ, పోలవరం కుడికాలువ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత. * అనంతపురం జిల్లాల్లో ఉపాధి హామీ పథకం పని దినాలు 100 నుంచి 150కి పొడిగింపు. ఉల్లిపాయల ధర కేజీ రూ. 20కి మించకుండా చర్యలు. * అన్ని శాఖల్లో ఐటీని ఉపయోగించుకునేందుకు లక్ష ట్యాబ్ల కొనుగోలుకు నిర్ణయం. ఇప్పటికే 75,148 ట్యాబ్ల కొనుగోలు. * వచ్చే నెల పదో తేదీ నుంచి మీ భూమి, మీ ఇల్లు కార్యక్రమం ప్రారంభం. * మూడో విడత రుణమాఫీకి వచ్చిన 5.15 లక్షల ఫిర్యాదులు ఆగస్టు 15లోపు పరిష్కరించాలని, దానికోసం రూ. 835 కోట్లు విడుదలకు నిర్ణయం. -
ఇవేం రాజకీయాలు!
- ఇలాంటి ఫిరాయింపులు ఎన్నడూ చూడలేదు - టీఆర్ఎస్ ఉద్యమ ఊపులో గెలిచింది - నేనడిగితే కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారు.. పదవులు ముఖ్యం కాదు - ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిటౌన్: పార్టీ ఫిరాయింపులు ఇంతలా తానెప్పుడూ చూడలేదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులు, అబ్దుల్ కలాం బ్యాడ్జి టీఆర్ఎస్ పార్టీ రంగులో తయారు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం వనపర్తిలోని అంబేద్కర్ విగ్రహాం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్కు సంస్థాగత బలం లేదని, ఉద్యమ ఊపులో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తనకుండే పరిచయంతో అడిగితే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారని, కానీ రాజకీయ విలువలు ముఖ్యం.. పదవులు కాదని పేర్కొన్నారు. ఇసుక అక్రమ దందా, తప్పుడు పద్ధతుల్లో ఆదాయానికి ఆశపడే టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 63 సీట్లు సాధించిన టీఆర్ఎస్ 85 సీట్లకు ఎలా చేరిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వనపర్తిని విస్మరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 14 నెలల్లో ఏ అభివృద్ధిని చూపి మునిసిపల్ చైర్మన్ పార్టీ మారారో తెలపాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గౌడ్, కృష్ణ, శంకర్ప్రసాద్, ఉంగ్లం తిరుమల్, అశోక్, ఖయ్యూం, రాజేందర్రెడ్డి, జ్యోతి, ఇందిరమ్మ, పార్వతి, పి.రవి, వేణు, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు అసెంబ్లీలో లెవనెత్తుతా.. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లెవనె త్తుతానని ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలుంటేనే సీఎంకు పారిశుద్ధ్య కార్మికులు కనిపిస్తారా అని ప్రశ్నించారు. కార్మికులు వెనుకడుగు వేయకుండా పోరాడాలన్నారు. -
అబ్దుల్ కలాం పేరుతో అవార్డు..
* బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు బహుమతి * తమిళనాడు సీఎం జయలలిత ప్రకటన సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం ఆయన పేరుతో ఏటా ఆగస్టు 15న ఓ అవార్డును అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉన్నత ఫలితాలు సాధించినవారు, విద్యార్థుల ఉన్నతికి శ్రమిస్తున్నవారు, మానవతావాదిగా నిలిచినవారికి ఈ ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు’ను అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. అవార్డును ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భారతరత్న అబ్దుల్ కలాం జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని యువ చైతన్య దినంగా పాటించనున్నట్లు తెలిపారు. కాగా, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బొమ్మతో నాలుగు స్టాంపులను రూపొందించినట్లు తపాలా శాఖ చెన్నై డెరైక్టర్ తెలిపారు. ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్.. కలాం రచన ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్ సహా ఆయన రాసిన పలు కొత్త పుస్తకాలు త్వరలో ముద్రితం కానున్నాయి. ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్గా కలాం ప్రసంగాల సంకలనం ‘మై ఇండియా: ఐడియాస్ ఫర్ ద ఫ్యూచర్’ను పఫిన్ బుక్స్ ప్రచురించనుంది. -
నైతికాధికారానికి నిలువుటద్దం
అంతటి అత్యున్నత స్థాయి ప్రేమ, గౌరవ శిఖరాలను అందుకునేలా చేసినది కలాంలో ఏముంది? స్వాతంత్య్రానంతర కాలంలో ఏ కొందరికో పరిమితమైన నైతిక అధికారం ఆయనకు ఉండేది. ప్రధానంగా అది ఆయనలోని నమ్రత నుంచి సంక్రమించినది. ఇస్రో-డీఆర్డీఓ సాధించిన విజయాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన తనదిగా చెప్పుకోవడం విని ఎరుగం. ఇనుప తెరకు వెనుక ఉండే ఒక సంస్థలో జీవితమంతా గడిపిన వారెవరికైనా కొన్ని ఫిర్యాదులు ఉండే ఉండాలి. కానీ వాటిని ఆయన ఎన్నడూ వైఫల్యాలకు సాకులుగా చూపడానికి వాడుకోలేదు. దేశ ప్రజలు అత్యంత అమితంగా ప్రేమించే ప్రజా ప్రముఖులలో ఒకరి జీవితాన్ని ఇలా అంచనా వేయడం నిర్లక్ష్యపూరితమైనదే అవుతుంది. అయినా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఎలాంటి వారు కారని చెప్పు కోవాలో వాటిలో కొన్నిటిని ముందుగా చూద్దాం. సాటి శాస్త్రవేత్తలు సమీక్షిం చిన పరిశోధనా పత్రాలు పెద్దగా ఆయన పేరుతో వెలువడలేదు. కాబట్టి సంప్రదాయక అర్థంలో ఆయన అసలు సైంటిస్టే కారు. ఇక అణుబాంబుకు సంబంధించి, అది అణు ఇంధనశాఖ (డీఏఈ)కు చెందిన రెండు తరాల సైంటిస్టులు సమష్టిగా తయారు చేసినది. కాబట్టి ఆయన భారత అణు బాంబు సృష్టికర్తా కారు. పోనీ ఆయనేమైనా అనర్గళోపన్యాసకునిగా వరం పొందిన వారా? అంటే అదీ కాదు. ఆయన, తాను అంతకు ముందే చెప్పిన సామాన్య విషయాలనే పదేపదే చె బుతూ ఉండేవారు. ఢిల్లీలోని దేశ అధికార పీఠం లాంటి రైసినాహిల్లో ఆయనకు ముందు ఎంతో గొప్ప సాహితీవేత్తలు నివసించారు. కలాం ఏమంతపాటి రచయిత కారు. ఆయన పెళ్లే చేసుకో లేదు. కాబట్టి కుటుంబ జీవీ కారు, పిల్లలూ లేరు. పైగా పెంపకం వల్లనో లేదా శిక్షణ ద్వారానో తయారైన రాజకీయవేత్త లేదా ప్రజా ప్రముఖుడు కూడా కారు. ఆయన జీవితంలో చాలా భాగం ఆయుధాల డిజైన్లను రూపొం దించే రహస్య ప్రపంచంలోనే గడచింది. ఎంతగా సంస్కృత శ్లోకాలను వల్లించినా, రుద్రవీణను పలికించినా ఆయన భగవద్భక్తిగల సామాన్య ముస్లిం మాత్రమే. హిందూ మెజారిటీ మెచ్చిన ముస్లిం ఇప్పుడిక ఆయన చివరికి ఏ స్థాయికి చేరారో చూద్దాం. సీవీ రామన్, జగదీశ్ చంద్రబోస్ల వంటి మన అతి గొప్ప సైంటిస్టులలో ఒకరుగా, ఆయనకు మార్గదర్శుల తరానికి చెందిన హోమీబాబా, విక్రమ్ సారాభాయ్ల కంటే లేదా డీఏఈ, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లలోని వారి సాటివారి కంటే కూడా ఉన్నతునిగా కీర్తించే స్థానానికి చేరారు. మన దేశానికి అణు ప్రతినిరోధ సామర్థ్యాన్ని ప్రసాదించిన వ్యక్తిగా ఆయన మనందరి సమష్టి జ్ఞాపకంలో చిరస్మరణీయుల య్యారు. దేశంలోని భిన్న తరాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ప్రజలకు ఆయన అత్యంత జనరంజకమైన ఉపన్యాసకులయ్యారు. ఆయన ఎక్కడ మాట్లాడినా హాలు కిటకిటలాడి, ఇరువైపులా జనం నిలిచి ఉండాల్సిందే. ఆయన రాసిన పుస్తకాలు, ఉదాహరణకు ‘భారత్ 2020’ లాంటివి ప్రవచనాలవంటివే. అయినా అవే మన చరిత్రలో అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు. ఇంకా చాలా కాలంపాటూ కూడా అవి అలాగే అమ్ముడుపోతుంటాయి. చాచా నెహ్రూ తర్వాత మన పిల్లలు అమితంగా ప్రేమించిన నాయకుడా యనే. ఆయన ఎంతటి అసాధారణమైన స్థాయికి చేరారంటే... అత్యంత రాజకీయ ముద్రగల రాష్ట్రపతి ఆయనే అయ్యారు. అది కూడా అత్యంత వివేచనాయుతమైన, పక్షపాతరహితమైన రీతిలో. అన్ని మతాలు, జాతుల ప్రజలు ఆయనను ప్రేమించారు, విశ్వసించారు. అక్బర్ సామ్రాట్టు గురించి అత్యంత ఉదారవాద చరిత్రకారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే తప్ప... మొత్తంగా మన చరిత్రలోనే దేశంలోని హిందూ మెజారిటీ అతి ఎక్కువగా ప్రేమించిన ముస్లిం ఆయనే. ఇక చివరిగా, దశాబ్దాల తరబడి రాటుదేలి, విమర్శలను ఖాతరు చేయని నా బోటివాడు సైతం చెప్పడానికి జంకే విషయం... ఆయనకు అసలు సిసలు పీహెచ్డీ డాక్టరేట్ ఎన్నడూ లేదు. ఆయనకున్న డాక్టరేట్లన్నీ గౌరవార్థం ఇచ్చినవే. అయితే గౌరవసూచకమైన ఆ ‘‘డాక్టర్’’ ఆయనకు అద్భుతంగా నప్పింది. అణు-క్షిపణి వ్యవస్థలో ఆయనను అతి తీవ్రంగా విమర్శించేవారు సైతం ఈ విషయాన్ని బహిరంగంగా ఎత్తి చూపడానికి సాహసించలేదు. అరుదైన నైతిక అధికారం ఆయన సొత్తు అంతటి అత్యున్నత స్థాయి ప్రేమ, గౌరవ శిఖరాలను అందుకునేలా చేసినది కలాంలో ఏముంది? స్వాతంత్య్రానంతర కాలంలో ఏ కొందరు భారతీ యులలోనో కనిపించే నైతిక అధికారం ఆయనకుండేది. ప్రధానంగా అది ఆయనలోని నమ్రత నుంచి సంక్రమించినదేనని చెప్పుకోవాలి. ఇస్రో- డీఆర్డీఓలు సాధించిన విజయాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన తనదిగా చెప్పు కోవడంగానీ, మరి ఏ రకమైన గొప్పలు చెప్పుకోవడంగానీ లేదా ఎవరికి వ్యతిరేకంగానైనా మాట్లాడటం, దేని గురించైనా ఫిర్యాదు చేయడం ఎన్నడూ విని ఎరుగం. అధికార యంత్రాంగమనే ఇనుప తెరకు వెనుక ఒక సైంటిఫిక్- ఇంజనీరింగ్ సంస్థలో జీవితమంతా గడిపిన వారెవరికైనా ఏవో కొన్ని ఫిర్యాదులు ఉండే ఉంటాయి. కానీ ప్రజలను ఆకర్షించడానికో లేదా వైఫల్యాలకు సాకులుగా చూపడానికో వాటిని ఆయన ఎన్నడూ వాడుకోలేదు. 2001 ఏప్రిల్లో నేను ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ‘కలామ్స్ బనానా రిపబ్లిక్’ శీర్షికతో ‘జాతిహితం’ కాలమ్లో రెండు వ్యాసాలు రాశాను. (టజ్ఛిజుజ్చిటజఠఞ్ట్చ.జీ/2001/04/జ్చ్చుఝటఛ్చ్చ్చట్ఛఞఠఛజీఛి/) ఆ తర్వాత నేను ఆయనకు మొట్టమొదటిసారి ఎదురుపడ్డది... దక్షిణ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. ఆయనకు వ్యతిరేక దిశ నుంచి జాగింగ్ చేస్తూ వస్తున్న నేను నిజంగానే ఆయనకు ‘ఎదురుపడ్డాను.’ ఆయన అప్పట్లో ఆసియా క్రీడల గ్రామం పక్కనే ఉండే డీఆర్డీఓ గెస్ట్ హౌస్లో నివాసముండేవారు. సాయంకాలం నడకకు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు వస్తుండే వారు. భయంతో నేను ఆయనతో చూపు కలపకుండానే తప్పుకోవాలని యత్నిస్తుండగా ఆయన నన్ను గమనించారు. పెద్దగా నవుతూ ఆయన అక్కడే ఆగి, ఆ వ్యాసాన్ని తాను బాగా ఆస్వాదించానని, అందులోని అన్ని విషయాలతోనూ తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. ‘‘అధికార వర్గాలు కూడా అది చదివి ఉంటా యని ఆశిస్తాను. డీఆర్డీఓలో చాలా లోటుపాట్లున్నాయి, అది తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది’’ అని అన్నారు. ఆయన మొహంలో ఎక్కడైనా ఎకసెక్కం కనిపిస్తుందేమోనని వెదికాను. కానీ, కలాం ఎన్నడూ నర్మ గర్భితంగా మాట్లాడేవారే కారు. కాలక్రమేణా అది అందరికీ తెలిసింది. దేశం తర్వాతే ఏమైనా రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం ఎంపిక వాజ్పేయి, అద్వానీల అద్భుత రాజకీయ చాతుర్యం. బీజేపీ నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం వారిదే. అది సమ్మిళితమైనదనే భావన కలిగించాల్సిన అవసరం ఉన్నదనే స్పృహ వారికి ఉంది. అప్పటికే జాతీయ హీరోగా గుర్తింపు పొందిన ముస్లిం నామ ధేయులు ఒకరుంటే వారికది రాజకీయంగా గొప్ప పెన్నిధి అవుతుంది. అయితే రాష్ట్రపతి పదవీ బాధ్యతలతో కలాం ఎదిగిన తీరు వారిని సైతం ఆశ్చర్యచకితులను చేసి ఉండాలి. పాకిస్తాన్తో సైనికపరమైన ప్రతిష్టంభన (ఆపరేషన్ పరాక్రమ్ 2001-2002) నెలకొన్న ఏడాది కాలంలో ఏ చిన్న ఘటనైనా యుద్ధానికి ప్రేరణ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఆయన రాష్ట్రపతిగా ఉండటం మనకు నిబ్బరాన్నిచ్చింది. గుజరాత్ అల్లర్ల తదుపరి దేశానికి స్వస్థతను చేకూర్చగల స్పర్శ సరిగ్గా ఆయన రాష్ట్రపతి కావడమే అయింది. ఎంతో సావధానంగానూ, పరిణతితోనూ, ఏ మాత్రం పక్షపాతం ధ్వనించ కుండానూ ఆయన తన ప్రభావాన్ని చూపారు. అయినా తన ఆలోచన ఏమిటో స్పష్టంగా విశదమయ్యేట్టు చేశారు. ఆనాటి పరిస్థితుల్లో ఆయనదే అత్యంత సమర్థ మధ్యవర్తిత్వమైంది. పైగా అది ఎంతో నైపుణ్య వంతమైనదిగా, వివేచనాయుతమైనదిగా, ఆకట్టుకునేదిగా ఉండేది. కాబట్టే హిందువులు సైతం చివరకు ఆయనను మరింత ఎక్కువగా గౌరవించ సాగారు. అణు ఒప్పందం ఆయన చలవే కలాం వారసత్వం కేవలం ఇంతే కాదు. అంతకంటే బలీయమైనది. ‘ఇండియా టుడే’ గ్రూపు కోసం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. మన్మోహన్ ఆ సందర్భంగా కలామ్ ప్రభావం ఎంతటి ప్రబలమైనదో నొక్కి చెప్పారు. ఆయనే జోక్యం చేసుకోకపోతే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఉండేదే కాదని గుర్తు చేశారు. 2008 పార్ల మెంటు వర్షాకాల సమావేశాలు మొదలుకావడంతోనే ప్రకాశ్ కారత్ యూపీఏకు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నామని, బీజేపీతో కలసి అణు ఒప్పందం అంశంపై ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రకటించారు. లోక్సభలో సంఖ్యాబలం మన్మోహన్కు వ్యతిరేకంగా ఉంది. అయినా ఆయన ప్రభుత్వం మనగలగడమే కాదు, అత్యంత ప్రమాదభరితమైన ఆ రాజకీయ పోరాటంలో ములాయంసింగ్ యాదవ్ ఫిరాయింపు సాయంతో మన్మోహన్ గెలుపొందారు కూడా. నిజానికి ములాయం, ప్రత్యేకించి బలమైన తమ ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అమెరికాతో అణు ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అయితే, కాంగ్రెస్ ఆయనతో తెరచాటున ఇచ్చి పుచ్చుకునే బేరసారాలు సాగిస్తుండటంతో ఆయన మద్దతు సాధ్యమే అనిపిం చింది. కానీ ములాయంకు అందుకు ఏదో ఒక కుంటిసాకు కావాలి. కలాం ఆ ఒప్పందాన్ని దృఢంగా ఆమోదించడంతో ఆయనకు ఆ సాకు దొరికింది. ఆ క్షణం నుంచి ములాయం, అమర్సింగ్లు ఇద్దరూ ‘‘డాక్టర్ కలాం అది మంచిది అన్నారంటే, తప్పనిసరిగా అది మంచిదే అయి ఉండాలి’’ అని చిలుక పలుకలు వల్లిస్తూ వచ్చారు. ఆనాటి అవిశ్వాస తీర్మానంపై పార్ల మెంటులో జరిగిన చర్చను ఒక్కసారి మీరు తిరిగి చూస్తే... అసదుద్దీన్ ఒవైసీ తమ రాజకీయాలను తలకిందులు చేసి, ఎంత ఆవేశంగా అణు ఒప్పందాన్ని సమర్థించారో కనిపిస్తుంది. దేశభక్తుడైన కలామే ఆయనకు కూడా ముసుగ్గా నిలిచారు. ఈ విషయంలో ఆయన నెరపిన ప్రభావం ఇప్పటికీ తక్కువగా గుర్తుకు తెచ్చుకుంటున్న విషయం కావడం ఆశ్చర్యకరం. ఆయనపై రాసిన లెక్కలేనన్ని సంస్మరణలలో ఏదీ ఈ విషయాన్ని ప్రముఖంగా గుర్తించలేదు. కానీ, అణు రంగంలోని సైనిక, పౌర విభాగాలను వేరు చేసి, ఆ రెంటినీ రహస్య ఏకాంతవాసంలోంచి బయటకు తెచ్చే అణు ఒప్పందానికి కలాం మద్దతు తెలిపేంత వరకు... ‘‘సెక్యులర్’’ పార్టీలకు మాత్రమే కాదు, అణు శాస్త్ర వ్యవస్థలో సైతం దాని పట్ల తీవ్ర అనుమానాలుండేవి. కలాం తన మద్దతుతో వాటిని నివృత్తి చేశారు. ఒప్పందానికి ఆయన మద్దతు తెలపడానికి కారణం దేశ ప్రయోజనాలను ముందు నిలపడమే. సరిగ్గా అంతకు ఏడాది క్రితమే కాంగ్రెస్, రెండో దఫా రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టే ఆవకాశాన్ని నిరాకరించి ఆయనను అవమానించింది. ఏకగ్రీవంగానైతే ఆ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ కాంగ్రెస్ అందుకు తిరస్కరించింది. నిజానికి అది యూపీఏకు తగిన శాస్తి చేయడానికి, తనకు భారతరత్నను, రాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆదరించిన బీజేపీ రుణం తీర్చుకోడానికి సరైన సమయం. కానీ ఆయన దేశాన్ని ముందు నిలిపారు. కలాం ఇంకా ఏమేంకారో వాటిలో మరి కొన్నిటిని కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఆయన చిల్లమల్లర, అల్పబుద్ధిగల, స్వార్థపర, ప్రతీకారాత్మక, సూత్రరహిత, అహంకారి కారు. అందుకే వంద కోట్లకు పైబడిన ప్రజలు దశాబ్దాల తరబడి ఆయనను తమ అత్యంత ప్రియతమ నేతగా గుర్తుంచుకుంటారు. తాజాకలం: కలాం గురించి నాకు అత్యంత ఇష్టమైన కథ ఆయనతో నా అనుబంధపు తొలినాళ్లది. 1994లో ‘‘ఇస్రో గూఢచార కుంభకోణం’’తో దేశం దద్దరిల్లిపోయింది. ఇస్రోకు చెందిన ఇద్దరు సైంటిస్టులు పాకిస్తానీ గూఢచార సంస్థకు చెందిన ఇద్దరు మగువల వలపు గాలానికి (హనీ ట్రాప్) చిక్కి, పట్టు బడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. విస్తృతస్థాయిలో వాటిని నమ్మారు కూడా. మాల్దీవులకు చెందిన ఆ మహిళలకు వారు వ్యూహాత్మక రాకెట్ రహస్యాలను అందజేశారని ఆరోపించారు. ఆ కథనంపై నేను ‘ఇండియా టుడే’ కోసం పరిశోధన చేపట్టాను. మొత్తంగా ఆ కథనమంతా హాస్యాస్పదమైనది, కాల్ప నికమైనది అని అర్థమైంది. ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనం కేరళ పోలీ సులు, ఇంటెలిజెన్స్ బ్యూరోల వాదనలను తునాతునకలు చేసింది. ఆ శాస్త్ర వేత్తల్దిద్దరూ నిర్దోషులనే పూర్తి సమర్థనతో, సగౌరవంగా ఆ ఆరోపణల నుంచి విముక్తులయ్యారు. వారిపై కేసులను ఉపసంహరించుకున్నారు. ఇలా ‘హనీ ట్రాప్’ తప్పుడు కేసులో ఇరుక్కున్న శాస్త్రవేత్తలకు నగదు రూప నష్ట పరిహా రాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. అంతకుముందు... అప్పటికే కట్టుదిట్టంగా అల్లి, బహుళ ప్రాచుర్యం పొందిన ఆ కథనానికి వ్యతి రేకంగా మాట్లాడటమంటేనే ఎంతో ఒత్తిడికి గురికావాల్సి వచ్చేది. నాటి ఇంట ర్నెట్ పూర్వ కాలంలో సైతం అలా మాట్లాడినందుకు మేం ఎన్నో అవమా నాలకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక జనవరి 15, సైనిక దినోత్సవం రోజున, కలాం నన్ను మాట్లాడటానికి పిలిచారు. మెల్లగా నా ఛాతీని ఎడమవైపున తట్టి, నువ్వు చేసి నది గాయపడ్డ మా హృదయాలకు నవనీతం పూయడంలాంటిదని అన్నారు. దేని గురించి అంటున్నారని అడిగాను. మా ఇస్రో కథనం గురించని, ఆ సైం టిస్టులు అద్భుతమైన వ్యక్తులని, పూర్తి అమాయకులని తెలిపారు. ఆ తప్పు డు కేసు నా ఇస్రోను (అసలు ఆయన అక్కడే పనిచేశారు) నాశనం చేసి ఉం డేదే అన్నారు. ఆ కథనాన్ని మీరు ‘ఇండియా టుడే’ వెబ్సైట్లో చూడవచ్చు. twitter@shekargupta -
ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు
-
ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు
ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేయ తలపెట్టిన ట్రిపుల్ ఐటీకి దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం ఉదయం మొదలైన ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా.. 8 గంటల పాటు కొనసాగింది. అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి... రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం రిషితేశ్వరి కుటుంబానికి రాజమండ్రిలో 500 గజాల స్థలం రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల వ్యయం సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలి అమరావతి ప్రాంతంలో మంత్రులకు క్యాంపు కార్యాలయాలు శాఖలను త్వరగా అమరావతికి తరలించాలి రాజీవ్ స్వగృహలో 2,894 ఇళ్ల నిర్మాణం ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామీణప్రాంతాల్లో రూ. 5,500 కోట్లతో 2లక్షల ఇళ్లు ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం -
ఇక సెలవు
అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తి ప్రధాని మోదీ సహా పలువురు రాక ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (84) మరణవార్త జాతి యావత్తును కదిలించివేసింది. చిన్నా పెద్ద, పండిత పామర అనే తేడాలేకుండా కంటతడిపెట్టారు. గొప్ప మానవతావాది మమ్మువీడిపోయాడనే బరువెక్కిన గుండెలతో లక్షలాది మంది వీక్షిస్తుండగా ఆ మహామనిషి అంత్యక్రియలు రామేశ్వరంలో గురువారం పూర్తయ్యాయి. కలాంకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరై కలాంకు ఘన నివాళులర్పించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: మేఘాలయ రాష్ట రాజధాని షిల్లాంగ్లో ఈనెల 27వ తేదీన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా గుండెపోటు రావడంతో వేదికపైనే కుప్పకూలి తుదిశ్వాస విడిచిన సంగతి పాఠకులకు విదితమే. 28 వ తేదీన ఢిల్లీలో కలాం భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలు పూర్తిచేశారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్న అంశం చర్చకు రాగా కలాం స్వస్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆయన బంధువుల కోర్కెను కేంద్ర ప్రభుత్వం అమలుచేసింది. ఢిల్లీ నుంచి ఈనెల 29వ తేదీన రామేశ్వరానికి తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి 10 గంటల వరకు వేలాదిగా ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చుని మరీ కలాంకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ముందు కుటుంబ సభ్యుల నివాళి కోసం కలాం పార్థీవదేహాన్ని ఆయన అన్న 99 ఏళ్ల వృద్ధుడైన మహమ్మద్ ముత్తుమీర మరైక్కార్ ఇంటికి చేర్చారు. ఇంటి వద్ద సైతం వేలాది మంది కలాంను కడసారి చూసుకున్నారు. తెల్లవారుజాము 3.30 గంటలకు గానీ కలాం బంధువులు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం రాలేదు. గురువారం ఉదయం 9.35 గంటలకు ముగైద్దీన్ ఆండవర్ మసీదుకు కలాం భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. ఇస్లాం మత పెద్దలు సంప్రదాయరీతిలో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తరువాత మసీదు నుంచి సైనిక వాహనంలో ఊరేగింపుగా 10.30 గంటలకు పేక్కరుంబు గ్రామంలోని అంత్యక్రియల ప్రాంగణానికి చేర్చారు. ప్రధాని సహా పలువురు నివాళి: ప్రధాని నరేంద్రమోదీ ముందుగా కలాం భౌతికకాయం వద్ద పుష్పవలయాన్ని ఉంచి సుమారు 5 నిమిషాలు పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత తమిళనాడు గవర్నర్ కే రోశయ్య నివాళులర్పించి ప్రదక్షిణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ, అధికార అనధికార ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యకారణాల వల్ల హాజరుకాకపోవడంతో ఆమె తరపున ఆర్థికమంత్రి ఓ పన్నీర్సెల్వం నేతృత్వంలో ఏడుగురు మంత్రుల బృందం కలాం భౌతికకాయానికి నివాళులర్పించారు. టీఎన్సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖులు నివాళుల కార్యక్రమం ముగిసిన అనంతరం అంత్యక్రియల బాధ్యతను ఇస్లాం మతపెద్దలకు అప్పగించారు. మతపెద్దలు ప్రార్థనలు చేస్తూ 12 గంటల సమయానికి ఖననం పూర్తిచేశారు. ముత్తుమీరకు పరామర్శలు: అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు కలాం అన్న మహమ్మద్ ముత్తుమీరను పరామర్శించారు. ప్రధాని మోదీ కలాంకు నివాళులర్పించిన తరువాత, ఖననం ముగిసిన తరువాత రెండుసార్లు మహమ్మద్ ముత్తుమీర వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు ఆయన పక్కనే కూర్చుని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ, ఎండీఎంకే అధ్యక్షులు వైగో సైతం ముత్తుమీరను పరామర్శించారు. జనసంద్రంగా మారిన రామేశ్వరం: తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. రామేశ్వరం రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. వాహనాలను శివార్లలో నిలిపివేయడంతో జనం సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు. మసీదు నుండి అంత్యక్రియల ప్రాంగణానికి కలాం భౌతికకాయం ఊరేగింపు వస్తున్న తరుణంలో రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులుతీరారు. అనేక చోట్ల పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలు నిర్వహించిన పరిసరాల్లోని ఇళ్లతోపాటు వృక్షాలు సైతం జనంతో నిండిపోయాయి. భారత దేశ చరిత్రలో తొలిసారిగా అంత్యంత శాంతియుత వాతావరణంలో కలాం అంత్యక్రియలు జరిగాయని విశ్లేషకులు భావించారు. ఇదిలా ఉండగా, కలాం అంత్యక్రియల సందర్భంగా రాష్ట్రం యావత్తు చిన్నబోయింది. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. వ్యాపార,వాణిజ్య సంస్థలన్నింటినీ స్వచ్చందంగా మూసివేశారు. సినిమా హాళ్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. సినిమా షూటింగులు రద్దయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ జనం వాహనాలు లేక బోసిపోయాయి. కలాం అంత్యక్రియలను వీక్షించేందుకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అక్కడి కార్మికులు పెట్రోలు పట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా సందు సందునా కలాం ఫొటోలు పెట్టి నివాళులర్పించారు. రామేశ్వరానికి ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపారు. తమిళనాడు జాలర్లు మూడురోజుల పాటూ చేపల వేటకు వెళ్లకుండా నివాళి అర్పించారు. రాష్ట్రంలో అనేక చోట్ల కొవ్వొత్తులు వెలిగించి మౌన ప్రదర్శన నిర్వహించారు. చెన్నైకి చెందిన కలైఅరసన్ అనే ఆటో డ్రైవర్ ఉచిత సవారి నిర్వహించి కలాం పట్ల తనదైన శైలిలో శ్రద్దాంజలి ఘటించారు. రామేశ్వరం పాంబన్ వంతెన సమీపం సముద్రంలోని గుట్టపై అబ్దుల్ కలాం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వాట్సాప్లో ఆయన అభిమానులు పంపిన ఊహాచిత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. -
మెమెన్ ఉరిపై ఆగ్రహం
సాక్షి, చెన్నై : దేశంలో ఉరి శిక్ష అమలును రద్దు చేయాలని ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే తీవ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్కు ఉరి శిక్ష అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరించిందంటూ పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచి రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలు , తమిళాభిమాన సంఘాలు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు నిందితులకు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవంగా మారే వరకు ఆందోళనల్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంఘాలు, పార్టీలు దేశంలో ఆ శిక్ష అమలైన సమయాల్లో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఉరి శిక్షను అనేక దేశాలు రద్దు చేసి ఉంటే, భారత్లో మాత్రం ఆ శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ముంబై పేలుళ్ల నిందితుడు తీవ్ర వాది యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్కు గురువారం ఉరి శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ శిక్ష అమలు చేయాల్సిన అవశ్యం, ఒత్తిడి ఉండి ఉంటే, మరో వారం రోజుల తర్వాత అమలు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే మెమన్ ఉరి శిక్షను అమలు చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు మహారాష్ట్ర పాలకులు కలాంకు గౌరవాన్ని ఇచ్చారోనన్నది స్పష్టం అవుతున్నదని మండి పడుతున్నాయి. అత్యుత్సాహం : పీఎంకే అధినేత రాందాసు తన ట్విట్టర్లో ఉరి శిక్ష అమలుపై తీవ్రంగానే స్పందించారు. మెమన్కు ఉరి శిక్ష విధించడంతో మహారాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు తిలోదకాలు దిద్ది మెమన్ను ఉరి తీశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మెమన్ పిటిషన్పై మరో మారు పరిశీలన జరిపి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం మృతితో కన్నీటి మడుగులో దేశం మునిగిఉన్నదని, ఉరికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం తమ సందేశాల్ని ఇచ్చి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ఉరిశిక్షను అమలు పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హత్యే : న్యాయం ముసుగులో మెమన్ను ఉరి శిక్ష పేరుతో హత్య చేశారని వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత గౌరవాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటుగా, దేశం కోసం అవిశ్రాంతంగా చివరి క్షణాల వరకు శ్రమించిన అబ్దుల్ కలాం భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా పూర్తి కాక ముందే, ఆగమేఘాలపై మెమన్కు ఉరి శిక్షను అమలు చేయడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన ఏడు రోజుల్లో , కోర్టుల్లో పిటిషన్ తిరస్కరించ బడ్డ పక్షంలో పదహారు రోజుల్లో ఉరిశిక్షను అమలు చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. అయితే, ఆ నిబంధనలకు తిలోదకాలు దిద్ది, అత్యవసరంగా, ఆగమేఘాలపై న్యాయం ముసుగులో మెమన్ను ఉరి తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
సలాం... కలామ్జీ
శృంగవరపుకోట : భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు ఎస్.కోట వా సులు గురువారం ఘన నివాళులర్పిం చారు. స్థానిక జేఏసీ నేతృత్వంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ఎస్.కోటలో స్థానిక పుణ్యగిరి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట మండలాధ్యక్షుడు రెడ్డి వెంకన్న, జెడ్పీటీసీ ఎస్.రామలక్ష్మి, సర్పంచ్ అంబటి లక్ష్మి, ఎల్.కోట జెడ్పీటీసీ కె.ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ నెక్కల నాయుడుబాబు, జేఏసీ నాయకులు జె.మురళి. సుధాకర్, మోహన్రాజ్, అశోక్రాజు, రాష్ట్ర రేషన్డీలర్ల సంఘ అధ్యక్షులు బుగత వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్, స్నేహ స్వచ్చంద సంస్థల సభ్యు లు అంతా ముందుగా కలాం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అ ర్పించారు. అనంతరం విద్యార్థులు, స్థానికులు, అధికారులు వేలాదిగా వెంటరాగా కలాం చిత్రపటాన్ని దేవీ జంక్షన్కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అంతా కాసేపు మౌనం పాటిం చారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలాం మరణం ఎన్నటికీ తీరని లోటని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జెడ్పీ చైర్మన్ శోభాస్వాతిరాణి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు నెక్కల నాయుడుబాబు అన్నారు. కొత్తవలస సీఐ సంజీవరావు, ఎస్.కోట ఎస్ఐ సాగర్బాబులు ర్యాలీకి బందోబస్తు నిర్వహించారు. -
మహాప్రస్థానం
విశ్వ గురువుకు తుది వీడ్కోలు సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు ప్రధాని మోదీ సహా పలువురి రాక జనసంద్రమైన రామేశ్వరం సాక్షి ప్రతినిధి, రామేశ్వరం: ఆజీవన పర్యంతం అవిశ్రాంతంగా పనిచేసిన విశ్వగురువు శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయాడు. మిసైల్ మ్యాన్ తన శరీరాన్ని భూ ఒడిలో నిద్రపుచ్చి అంతరిక్షంలోకి దూసుకుపోయాడు. వేనవేలుగా తరలివచ్చిన అశేష ప్రజానీకం కన్నీటి అభిషేకం మధ్యన.. ‘భారత్మాతాకీ జై.. కలాంసర్’ అంటూ పెక్కుటిల్లిన నినాదాల నడుమ దేశ క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం సమస్త సైనిక అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. తన సొంత పట్టణం రామేశ్వరంలోని ెపేక్కరుంబు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 1.5 ఎకరాల భూమి మధ్యలో కలాం పార్థివ దేహాన్ని ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. జూలై 27న షిల్లాంగ్లో ఐఐఎం విద్యార్థుల ముందు ప్రసంగం చేస్తూ గుండెపోటుతో తనువు చాలించిన 83 సంవత్సరాల క్షిపణి మాంత్రికుడి ఉత్తరక్రియలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటలకు కలాం భౌతిక కాయాన్ని ముగైద్దీన్ ఆండవర్ మసీదుకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు పూర్తిచేశారు. మసీదులోని ఆలిన్(ప్రధాన పూజారి) ‘‘నమాజ్ ఏ జనజా’’ను పఠించారు. అక్కడి నుంచి సైనిక వాహనంలో ఊరేగింపుగా 10.30 గంటలకు పేక్కరుంబు గ్రామంలోని అంత్యక్రియల ప్రాంగణానికి చేర్చారు. మార్గమధ్యమంతా ప్రజలు పెద్ద ఎత్తున ‘భారత్మాతాకీ జై, కలాంసర్’ అంటూ నినదించారు. ప్రముఖుల నివాళి.. ప్రధాని నరేంద్రమోదీ ముందుగా కలాం భౌతికకాయం వద్ద పుష్పవలయాన్ని ఉంచి సుమారు 5 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత కలాం 99 ఏళ్ల అన్నయ్య మహమ్మద్ ముథు మీరన్ లెబ్బాయ్ మరైకర్ వద్దకు వెళ్లి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్, పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, కేరళ గవర్నర్ సదాశివం, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్చాందీ, త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు. అలాగే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, చంద్రబాబు ప్రత్యేక కార్యదర్శి సతీష్చందర్ శ్రద్ధాంజలి ఘటించినవారిలో ఉన్నారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యకారణాల వల్ల హాజరుకాకపోవడంతో ఆమె తరపున ఆర్థికమంత్రి పన్నీర్సెల్వం నేతృత్వంలో ఏడుగురు మంత్రుల బృందం కలాం భౌతికకాయానికి నివాళులర్పించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, టీఎన్సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో తదితరులు కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు. అధికార లాంఛనాలతో.. ప్రముఖుల నివాళుల కార్యక్రమం ముగియగానే సరిగ్గా 11 గంటలకు కలాం పార్థివదేహంపై కప్పిఉన్న త్రివర్ణజాతీయ పతాకాన్ని త్రివిధ దళాల సైనికులు తొలగించి అంత్యక్రియల బాధ్యతను ఇస్లాం మతపెద్దలకు అప్పగించారు. 21 గన్ శాల్యూట్తో మాజీ సర్వసైన్యాధ్యక్షుడికి చివరి సైనిక వందనాన్ని సమర్పించారు. ఆ తరువాత మతపెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో మౌల్వీ ఎస్.ఎం.అబ్దుల్ రహమాన్, మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కలాం భౌతిక కాయానికి ఖనన కార్యక్రమం పూర్తి చేశారు. ఖనన కార్యక్రమంలో మత పెద్దలతోపాటు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ కూడా పాలుపంచుకున్నారు. ఆ తరువాత పెద్ద ఎత్తున పూలను కలాం సమాధిపై చల్లారు. అనంతరం మౌల్వీ సాహెబ్ నేతృత్వంలో సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగినంత వరకు ప్రధాని సహా హాజరైన నేతలంతా నిలుచుని వీక్షించారు. బారులు తీరిన జనసందోహం.. మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలకు తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బస్సుల్లో, రైళ్లలోనే కాకుండా సముద్రమార్గంలో, బోట్లలో కూడా రావటం కలాంకు ఉన్న విశేషమైన ప్రజాదరణను ఇక్కడ ప్రతిఫలించింది. ‘కలాంసర్’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని జనవాహిని ఆయన అంతిమయాత్రలో పాల్గొంది. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతిమసంస్కారాలు జరిగే ప్రాంతానికి తాత్కాలిక రోడ్లను కూడా తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. రామకృష్ణమఠం, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజానీకానికి ఆహారం, నీరు అందించే ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం చుట్టూ సముద్ర తీరం వెంబడి పెద్ద ఎత్తున నౌకాదళాలను మోహరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా రాకపోవటంతో ఆమె ప్రతినిధిగా రాష్ట్ర ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం అంత్యక్రియల కార్యక్రమాలను పర్యవేక్షించారు. కలాంకు గౌరవ సూచకంగా తమిళనాడు ప్రభుత్వం గురువారం సెలవును ప్రకటించింది. రాష్ట్రమంతా దుకాణాలు, వివిధ సంస్థలు.. అన్నీ సెలవు పాటించాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కూడా కలాంకు ప్రజలు నివాళులు అర్పించారు. గురువారం కలాం అంత్యక్రియల నేపథ్యంలో సామాజిక వెబ్సైట్లయిన ఫేస్బుక్, ట్వీటర్ తదితర మాధ్యమాల్లో లక్షలాది అభిమానులు తమ నివాళులు అర్పించారు. ఉపగ్రహ వాహక పరిజ్ఞానం, క్షిపణి పరిజ్ఞానంతో పాటు, 1998 అణ్వస్త్ర పరీక్షల భాగస్వామిగా కలాం సేవలను కొనియాడారు. వివిధ సందర్భాల్లో కలాం చేసిన ప్రసంగాల్లోని కోట్స్ వేల సంఖ్యలో సామాజిక ఆన్లైన్ మాధ్యమాన్ని హోరెత్తించాయి. పేక్కరంబు గ్రౌండ్ లో కలాం సమాధిపై పూలు చల్లుతున్న ముస్లిం మత పెద్దలు గురువారం తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరైన ప్రజలు కలాం అంత్యక్రియలకు ఆయన అన్న మహమ్మద్ ముత్తును తీసుకువస్తున్న దృశ్యం. చిత్రంలో కేంద్రమంత్రి వెంకయ్య తదితరులు జై కలాం సార్ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులు -
అబ్దుల్ కలాం మళ్లీ పుట్టాలి
-అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ బళ్లారి అర్బన్ : మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, యువతకు స్ఫూర్తిదాత, అన్నింటికి మించి మానవతావాది ఏపీజే అబ్దుల్ కలాం శాశ్వతంగా దూరం కావడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిందని, అలాంటి కలాం మళ్లీ పుట్టాలని అనంతపురం జిల్లా పంచాయతీ చైర్మన్ పీ.చమన్ పేర్కొన్నారు. గురువారం ఆయన బళ్లారికి వచ్చిన సందర్భంగా నగర శివార్లలోని గుగ్గరహట్టి పాండురంగ దేవస్థానం సమీపంలోని మున్నాబాయి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం సంతాప సభకు హాజరై మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డకు తమిళనాడులోని రామేశ్వరంలో ఘనంగా నివాళులు అర్పించి అంత్యక్రియలు జరిగాయన్నారు. ఆయన ఆత్మశాంతి కోసం అందరూ ఐదు నిమిషాలు మౌనం పాటించారు. కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి సెల్యూట్ చేశారు. కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆయన సేవలను స్మరించుకున్నారని కొనియాడారు. అబ్దుల్ కలాం అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో కణేకల్లు ఎంపీపీ ఫకృద్దీన్, బళ్లారి నగర మేయర్ నాగమ్మ చంద్ర, ఉపమేయర్ మాలన్బీ, జేడీఎస్ నాయకుడు మున్నాబాయి, ముండ్రిగి నాగరాజు, కార్పొరేటర్లు కెరెకోడప్ప, సూరి, ఉమాదేవి, శివరాజు, రాముడు, శర్మాస్, రసూల్సాబ్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కలాం అంత్యక్రియలు
-
కలాం అంత్యక్రియలు పూర్తి
-
సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు
-
ఇక సెలవంటూ...
రామేశ్వరం : మహామనిషి మహాభినిష్క్రమణం. బంధువులు, అభిమానులు, అనుచరులు కడసారి వీడ్కోలు పలకగా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బంధువులు, అభిమానులు, అనుచరులు తరలి రాగా మిస్సైల్ మ్యాన్కు భారతావని వీడ్కోలు పలికింది. ముద్దుబిడ్డను మాతృభూమి శోకతప్త హృదయంతో సాగనంపింది. సొంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి కావాలన్న కలాం ఆకాంక్ష మేరకు ఆయన సొంత గడ్డపైనే అంత్యక్రియలు జరిగాయి. కలాం అంత్యక్రియలకు వీవీఐపీలతో పాటు రాజకీయ, శాస్త్ర-సాంకేతిక రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నీరు సెల్వం హాజరు కాగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కలాం అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్ మ్యాన్కు తుది నివాళులు అర్పించారు. కలాం భౌతికాకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. మరోవైపు రామేశ్వరం జనసంద్రమైంది. కలాంను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన అభిమాన గణంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అంతకు ముందు జరిగిన కలాం అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. రోడ్డుపై బారులు తీరిన జనం ...కలాం సలామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
కలాంకు గౌరవసూచకంగా పార్లమెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పంజాబ్ టెర్రరిస్టు దాడిని రెండు సభలు ఖండించాయి. గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పించాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కలాం అంత్యక్రియలు స్వగ్రామం రామేశ్వరంలో గురువారం పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఆయనకు ఘన నివాళులర్పించింది. అనంతరం ప్రజా రాష్ట్రపతికి గౌరవసూచకంగా శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పిలస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్నాహం రెండుగంటలకు వాయిదా వేశారు. కాగా మాజీ రాష్ట్రపతి కలాం హఠాన్మరణంతో పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం గురువారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
కలాంకి నివాళులర్పించిన మోదీ
-
సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కలాం భౌతికకాయానికి తుది నివాళులు అర్పించారు. త్రివిధ దళాలు కూడా కలాంకు వీడ్కోలు పలికాయి. అంతకు ముందు కలాం నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగింది. దారి పొడవునా వేలాదిమంది అభిమానులు, ప్రజలు కలాంకు నివాళులు అర్పించారు. మరోవైపు సామాన్య ప్రజలు కూడా అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతానికి తండోపతండాలుగా చేరుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, కేరళ ముఖ్యమంత్రి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్ రోశయ్య, విజయ్ కాంత్, సీఎం రమేష్ తదితరులు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కలాం అంత్యక్రియలకు హాజరైన మోదీ
రామేశ్వరం : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బయలుదేరిన ఆయన ప్రస్తుతం తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నారు. సొంతగడ్డపై ఈ రోజు ఉదయం కలాం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. కలాం అంతిమయాత్రకు మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆయనను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు రామేశ్వరానికి తరలివచ్చారు. -
ప్రారంభమైన కలాం అంతిమ యాత్ర
-
నేడు కలాంకు అంతిమయానం !
-
కలాం..మీకు సలాం..!
-
స్పూర్తినింపిన 'కలాం' ల్యాప్టాప్
విశాఖ ఫీచర్స్ : అబ్దుల్ కలాం.. యువతరానికి ఓ స్ఫూర్తి. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చి యువతరం ఆలోచనలను నిద్రలేపిన ఓ తపస్వి. ఆయన అకాల మరణం భారతావనికి తీరనిలోటు. ఆయన యువతరానికి ఎంత స్ఫూర్తినిస్తారో నగరంలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ఆ సంఘటనకు సంబంధించి వైజాగ్లో 2006లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో ఏసీపీగా పనిచేసిన ఆర్జీవీ బద్రినాథ్ మాటల్లోనే... 2003 నంవంబర్లో అబ్దుల్ కలాం తిరుపతి వచ్చిన సమయంలో మా అబ్బాయి రాజా రఘునాథ్ ఆయనకు ఓ పుస్తకాన్ని అందించాడు. అప్పటి నుంచి ఆయనతో ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉండగా మాకు విశాఖపట్నం బదిలీ అయ్యింది. నేవీ వారోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినపుడు కలాం మా అబ్బాయితోపాటు మా ఇద్దరు అమ్మాయిలను ప్రత్యేకంగా పిలిపించారు. ఆ సమయంలో ఆయన ముందు భారతీయులుగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాం అనే అంశంపై మా అబ్బాయి పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. కలాం మా పిల్లలను ప్రత్యేకంగా అభినందించి ల్యాప్టాప్ బహుమతిగా ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో ఈ రోజు మా అబ్బాయి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెప్పే సందేశాలు, స్ఫూర్తినిచ్చే ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆయనతో రెండు సార్లు మా పిల్లలకు ఏర్పడిన పరిచయం మా పిల్లల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. అదే సమయంలో చిన్నారుల్లో సామర్ధ్యాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశాం. ఆయన మార్గం అనుచరణీయం, ఆయన ఆశయ సాధనే మనం ఆయనకి ఇచ్చే ఘన నివాళి. -
నేడు కలామ్ అనంత యానం!
పృథ్వీయాప తేజోవాయురాకాశములారా..! ఇతడు మీ పుత్రుడు. తన శస్త్రాలకు మీ పేర్లే పెట్టుకున్న మీ ప్రియ భక్తుడు. తన పాంచ భౌతిక దేహమును మీకు సమర్పిస్తున్నాడు. గైకొని ధన్యులు కండు. అభ్ర మాలికలారా! అడ్డు తొలగండి... ఇతని ప్రయాణ పథము శుభ్రజ్యోత్స్న వలె కాంతులీనవలె. ఓ చందమామా! ఇతడు నీ మేనల్లుడు. నీకంటే చల్లనివాడు. అనంతయానానికి పయనమైనాడు. పున్నమి ఘడియలు ప్రవేశించకున్నా సరే, పూర్ణేందు రూపం దాల్చి దారి చూపు. దివిజాంగనలారా! దోసిట సౌగంధికా పుష్పాలతో నిలిచి ఉండండి. పూలవాన కురిపించదగిన పుణ్య చరితుడితడు. మీ చెంతకు వస్తున్నాడు. రామేశ్వరానికి చేరిన కలాం పార్థివ దేహం * ప్రత్యేక విమానంలో మదురైకి, అక్కడి నుంచి హెలికాప్టర్లో తరలింపు * ఢిల్లీ నుంచి వెంట వచ్చిన వెంకయ్య, పారికర్ * నేడు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు * పేక్కరుంబు గ్రామంలో ఉదయం 11 గంటలకు నిర్వహణ రామేశ్వరం/న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ అబ్దుల్ కలాం సొంతగడ్డ శోక జనసంద్రమైంది.. తమ ముద్దుబిడ్డను చివరిసారిగా చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజానీకం కన్నీటితో పోటెత్తింది. కలాం పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బుధవారం ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి తీసుకువచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి తమిళనాడులోని మదురైకి ప్రత్యేక వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య.. కలాం భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛముంచి నివాళి అర్పించారు. తర్వాత కలాం భౌతిక కాయాన్ని హెలికాప్టర్ ద్వారా రామేశ్వరానికి పది కిలోమీటర్ల దూరంలోని మండపం ప్రాంతానికి చేర్చారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు ఢిల్లీ నుంచి కలాం పార్థివ దేహం వెంట వచ్చారు. మరో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వారితో కలిశారు. అప్పటికే మండపం ప్రాంతానికి తమిళనాడు సీఎం జయ సూచన మేరకు పలువురు మంత్రులు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, నటుడు విజయ్కాంత్, కలాం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ దిగగానే పెద్దసంఖ్యలో అభిమానులు అటువైపు తోసుకురాగా.. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అనంతరం కలాం పార్థివ దేహాన్ని ఒక సైనిక వాహనంపై ఉంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తరలించారు. ఈ సందర్భంగా పది కిలోమీటర్ల మార్గం పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇరువైపులా నిలబడి నివాళి అర్పించి, కలాం రామేశ్వరానికి అందించిన సేవలను కొనియాడారు. కలాం పార్థివ దేహాన్ని రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి.. అనంతరం ఇక్కడి పళ్లివాసల్ వీధిలోని ఆయన పూర్వీకుల ఇంటికి తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు ప్రముఖులు.. గురువారం రామేశ్వరంలో జరుగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున కలాం అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని సీఎం జయలలిత బుధవారం ప్రకటించారు. కలాం అంటే తనకు ఎంతో గౌరవమని, తన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు మంత్రులను పంపుతున్నట్లు చెప్పారు. కలాం అంత్యక్రియలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్చాందీ తదితర సీఎంలు హాజరు కానున్నారు. దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది: మోదీ దేశం ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని ప్రధాని మోదీ బుధవారం తన బ్లాగ్లో పేర్కొన్నారు. ‘ప్రజలు ఎంతగానో ప్రేమించే, ఆరాధించే వ్యక్తి ఆయన. ప్రపంచం నుంచి ఆయన కొంతే తీసుకున్నారు. తాను మాత్రం అంతా ఇచ్చారు. పరిస్థితులకు ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు. భారత రక్షణ రంగానికి ఆయనే హీరో. అణు, అంతరిక్ష రంగాల్లో విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు..’ అని తెలిపారు. కాగా కలాం విజ్ఞానం దేశానికి ఎంతో మేలు చేసిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచ నేతల నివాళి వాషింగ్టన్: కలాం మృతికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు ఘనంగా నివాళి అర్పించారు. కలాం లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని కొనియాడారు. కలాం కిందిస్థాయి నుంచి దేశ నాయకుడిగా ఎదిగారని, అమెరికన్ల తరఫున ఆయనకు నివాళి అర్పిస్తున్నానని ఒబామా చెప్పారు. ఆయన భారత్, అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని పెంచారని కొనియాడారు. కలాం భారత్, రష్యాల అనుబంధానికి కృషి చేశారని పుతిన్.. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కలాం మృతికి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సింగపూర్ అధ్యక్ష ప్రధానులు టోనీ టాన్ కెంగ్ యామ్, లీ సీన్ లూంగ్లు కూడా నివాళి అర్పించారు. వివిధ దేశాధినేతలు కలాం సేవలను కొనియాడారు. అధికార లాంఛనాలతో.. చెన్నై, సాక్షి ప్రతినిధి: కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాంసంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కలాం స్మారక మండపం: కలాం జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా రామేశ్వరంలో భారీ స్మారక మం డపం నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేక్కరుంబు గ్రామంలో కలాం పార్థివదేహాన్ని ఖననం చేస్తున్న స్థలానికి సమీపంలో ఉన్న 1.32 ఎకరాల ప్రభుత్వ భూమిలో మండపం నిర్మిస్తారు. -
రామేశ్వరం చేరుకున్న కలాం పార్థీవ దేహం!
-
చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళి అర్పించాలన్న ప్రయత్నం.. ఓ ఉన్నతాధికారికి చీవాట్లు పెట్టించింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్.. అబ్దుల్ కలాంకు కాస్త పెద్దగా నివాళులు అర్పిద్దాం అనుకున్నారు. తాను మరణిస్తే సెలవు ప్రకటించవద్దని కలాం చెప్పిన విషయాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాలని, అందుకోసం ఆదివారం కూడా పనిచేయాలని ఆయన ఫేస్బుక్లో పోస్టింగ్ చేశారు. దాంతో, చీఫ్ సెక్రటరీ థామ్సన్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం మండిపడింది. ఇలా చెప్పడం సరికాదని, అందువల్ల ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగును వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. -
రామేశ్వరం చేరిన కలాం పార్థివదేహం
రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని ఆయన సొంతూరు తమిళనాడులోని రామేశ్వరానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో కలాం భౌతికకాయాన్ని తరలించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాన్ని మధురైకి తరలించి.. అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్లారు. కలాం భౌతికకాయం వెంట కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు వచ్చారు. ఇదే గడ్డపై ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన భారతరత్న కలాం .. చివరి సారిగా సొంతూరు రామేశ్వరానికి నిర్జీవంగా చేరుకున్నారు. కలాం పార్థివదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. కలాం భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు జనం బారులు తీరారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. రేపు ఉదయం కలాంకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కలాం అంత్యక్రియల్లో పాల్గొంటారు. -
'ఫేస్బుక్లో ఆ పోస్టింగ్ను వెనక్కి తీసుకోవాలి'
కేరళ: కేరళలోని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ(సీఎస్) తన ఫేస్బుక్ లో అబ్దుల్ కలాంపై చేసిన పోస్టింగ్ను కేరళ ప్రభుత్వం బుధవారం తీవ్రంగా ఖండించింది. అబ్దుల్ కలాం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కలాం మృతికి నివాళిగా వచ్చే ఆదివారం కేరళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయాలంటూ ఫేస్బుక్లో చీఫ్ సెక్రటరీ థామ్సన్ పోస్టింగ్ చేయడంపై సీఎం కార్యాలయం మండిపడింది. ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని సీఎం కార్యాలయం అధికారకంగా నిర్ణయించలేదని పేర్కొంది. ఫేస్బుక్లో ఆ పోస్టింగ్ ను వెనక్కి తీసుకోవాలని థామ్సన్ కు ప్రభుత్వం సూచించింది. -
కలాం చివరి చూపు కోసం..
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టినగడ్డ రామేశ్వరం ఆయన పార్థివదేహం దర్శనం కోసం ఎదురు చూస్తోంది. తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర జనం బారులు తీరారు. కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం తీసుకురానున్నారు. కలాం ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రామేశ్వరం సమీపంలోని మధురైకు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రామేశ్వరం తరలిస్తారు. రామేశ్వరంలో ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన కలాంకు నివాళులు అర్పించేందుకు బాధాతప్త హృదయాలతో నిరీక్షిస్తున్నారు. షిల్లాంగ్లో ఐఐఎంలో ప్రసంగిస్తూ కలాం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. -
కలాం అంత్యక్రియలకు జయ దూరం
-
కలాం అంత్యక్రియలకు జయ దూరం
చెన్నై: అనారోగ్యం కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. బుధవారం జయలలిత ఈ విషయాన్ని వెల్లడించారు. 'అబ్దుల్ కలాం అంటే నాకు ఎనలేని గౌరవం. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాలని ఉన్నా.. ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రయాణించడానికి సాధ్యం కావడం లేదు' అని జయలలిత చెప్పారు. కలాం మృతికి సంతాప సూచకంగా గురువారం తమిళనాడులో సెలవు ప్రకటించారు. కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన అంత్యక్రియలకు స్థలం కేటాయించినట్టు జయలలిత చెప్పారు. గురువారం ఉదయం రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నై నుంచి రామేశ్వరం 600 కిలో మీటర్ల దూరంలో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. తమిళనాడు తరపున మంత్రులు పన్నీర్ సెల్వం, విశ్వనాథన్, వైద్యలింగం తదితరులు వెళ్లనున్నారు. -
కలాం హయాంలోనే అసాధారణ పురోగతి
వాషింగ్టన్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అకస్మిక మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం ప్రకటించారు. భారత్ అమెరికా దేశాల మధ్య అంతరిక్ష సహకారం కోసం కలాం చేసిన కృషిని ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాలు దృఢపరిచే క్రమంలో ఆయన మద్దతుగా నిలిచిన వైనాన్ని ఒబామా విశదీకరించారు. ఓ శాస్త్రవేత్తగా, ఓ స్టేట్స్మెన్గానే కాకుండా భారత్లో అత్యంత అరుదైన నాయకుల్లో ఒకరిగా అబ్దుల్ కలాం దేశ విదేశాలలో గౌరవం సంపాదించారన్నారు. భారత్కు 11వ రాష్ట్రపతిగా కలాం బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత - అమెరికా దేశాల మధ్య అసాధారణ పురోగతి సాధ్యమైందని ఒబామా స్పష్టం చేశారు. ప్రజల రాష్ట్రపతి అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం అబ్దుల్ కలాం అని అభివర్ణించారు. కలాం వినయ విధేయతలతోపాటు ప్రజసేవకు అంకితమైన తీరు భారతీయ ప్రజలకే కాదు ప్రపంచానికే స్ఫూర్తి అని ఒబామా పేర్కొన్నారు.