మెట్రో రైలుకు కలాం పేరు పెట్టాలి: వైఎస్సార్సీపీ | Ysrcp demands to put name of Abdul kalam for Metro rail | Sakshi

మెట్రో రైలుకు కలాం పేరు పెట్టాలి: వైఎస్సార్సీపీ

Published Tue, Aug 11 2015 6:03 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

దేశంలో అయిదో పెద్ద నగరం హైదరాబాద్‌లో చేపట్టిన మెట్రో రైలుకు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది.

హైదరాబాద్: దేశంలో అయిదో  పెద్ద నగరం హైదరాబాద్‌లో చేపట్టిన మెట్రో రైలుకు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఆ మేరకు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకంతో ఉన్న వినతి పత్రాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డి మెట్రో భవన్‌లో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డికి అందజేశారు. 

దీనికి స్పందించిన ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తాను ఈ విషయాన్ని పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ హైదరాబాద్‌కు తలమానికం కాబోతున్న మెట్రో రైలు నిర్మాణ పనులు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement