మెట్రో రైల్ భవన్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా
హైదరాబాద్: మెట్రో రైల్ భవన్ వద్ద బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పూర్తైన మెట్రో మార్గంలో రాకపోకలు సాగించాలని కోరారు. ప్రభుత్వ తీరును బట్టి చూస్తే 2019 ఎన్నికల ముందుగా మెట్రోను ప్రారంభించే విధంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివకుమార్, బొడ్డు సాయినాథ్ రెడ్డి, వెల్లాల రాంమోహన్, మతిన్, జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
