జలదిగ్భందం నుంచి బయటకు!
ఒకప్పుడు జలదిగ్భందంలో ఉన్న సంగమేశ్వర క్షేత్రం..నేడు పూర్తిగా బయటపడి మైదాన ప్రాంతంగా మారింది. క్షేత్ర సమీపంలో సిద్ధేశ్వరం వద్ద రెండు కొండల నడుమ మాత్రమే 12 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో కృష్ణానదికి ఆవల, ఈవల ఉన్న గ్రామాల ప్రజలు పుట్టి, ఇంజన్బోటుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుం శ్రీశైలం నుంచి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా సాగర్కు వదిలితే సిద్ధేశ్వరం నుంచి సోమశిల, కొల్లాపూర్, జెడ్పోల్.. తదితరప్రాంతాలకు కాలినడకన వెళ్లవచ్చు. మళ్లీ భారీ వర్షాలు కురిసి వరద పోటు వస్తే మినహా ఇప్పట్లో సంగమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు కనించే అవకాశం లేదు.
- ఆత్మకూరు