అప్లైడ్‌ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్‌ ప్రదానం | Phd awarded in geo chemistry | Sakshi
Sakshi News home page

అప్లైడ్‌ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్‌ ప్రదానం

Published Sat, Sep 3 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

అప్లైడ్‌ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్‌ ప్రదానం

అప్లైడ్‌ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్‌ ప్రదానం

శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్‌ గ్రామానికి చెందిన అక్కెనపల్లి సుధాకర్‌ హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్లైడ్‌ జియోకెమెస్ట్రీ విభాగంలో డాక్టరేట్‌ను పొందారు. ప్రొఫెసర్‌ ప్రవీణ్‌రాజ్‌సక్సేనా పర్యవేక్షణలో ‘ క్వాంటిటేటివ్‌ అండ్‌ క్వాలిటేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ గ్రౌండ్‌ వాటర్‌ ఎలాంగ్‌ గ్రానైట్‌–బసాల్ట్‌ కాంట్యాక్ట్‌(అగ్నిశిలల్లో భూగర్భ జలాల అన్వేషణ– భూగర్భ జలాల నాణ్యత) అరౌండ్‌ నారాయణఖేడ్, మెదక్‌ డిస్ట్రిక్ట్‌ ’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ అధికారులు సుధాకర్‌కు డాక్టరేట్‌(పీహెచ్‌డీ) పట్టాను అందజేశారు. ఈ మేరకు సుధాకర్‌ శనివారం ఇక్కడ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను గ్రామస్తులు, పలువురు బందువులు అభినందించారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో అక్కెనపల్లి యల్లయ్య–సోమమ్మ దంపతుల ఆరుగురి కుమారుల సంతానంలో చివరి సంతానం సుధాకర్‌. పాఠశాల విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసించాడు. ఇంటర్మీడియట్‌ను నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలోని ఎన్‌జి కళాశాలలో, పీజీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాడు. వివాహితుడైన సుధాకర్‌ ఒక పక్క పరిశోధన కొనసాగిస్తునే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో జియాలజిస్టుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement