సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన పోలీసులు గాలింపు జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్ సెర్చ్ల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని.. సురక్షిత సమాజం కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
సూర్యాపేటలో కార్డెన్ సెర్చ్
Published Thu, May 25 2017 10:22 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
Advertisement
Advertisement