suryapet
-
పెద్దగట్టు జాతర : కేసారం చేరిన దేవరపెట్టె..నేడు జాతర ముగింపు (ఫొటోలు)
-
సూర్యాపేట : పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత (ఫొటోలు)
-
వైభవంగా ప్రారంభమైన లింగమంతుల జాతర
-
దురాజ్పల్లి : వైభవంగా లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : భారీ పోలీసు బందోబస్తు మధ్య పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టె (ఫొటోలు)
-
Suryapet: ఉండ్రుగొండలో అఘోరీ ప్రత్యక్షం
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో అఘోరీ హల్చల్ చేసింది. శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి నుంచి వేములవాడకు వెళ్తూ మార్గమధ్యంలో ఉండ్రుగొండ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆర్చి వద్ద భోజనం చేసేందుకు ఆగింది. పలువురు ఆమెను ఫొటోలు తీస్తుండటంతో తనను ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వారిపై దాడికి ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను కొట్టారు. ఆమె తన కారులో ఉన్న తల్వార్ తీసి గొడవ చేసింది. గ్రామస్తులు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెకు నచ్చజెప్పి గ్రామం నుంచి తీసుకువచ్చారు. రాత్రి ఖాసీంపేట గ్రామ శివారులో తన కారులోనే నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి వెళ్లడంతో ఓ యువకుడు ఆమెను సెల్ఫీ అడగడంతో అతడిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్వర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు. -
చంపేస్తామని బెదిరింపులు.. మాకు రక్షణ కావాలి
-
సూర్యాపేటలో విషాద ఘటన
మిర్యాలగూడ అర్బన్: తను చదువుకున్న చదువుకు.. చేసే కొలువుకు సంబందం లేని ఉద్యోగం.. వచ్చిన ఉద్యోగం చేసేందుకు ఇష్టం లేని యువకుడు సాగర్ కాల్వలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన నూనె రాములు, నిర్మల రెండవ కుమారుడు ప్రవీణ్కుమార్ (30) బీటెక్ పూర్తి చేసి గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో మెరిట్ సాధించాడు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికై గత డిసెంబర్ 28న మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రవీణ్ ఉద్యోగంలో చేరిన సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ పధకాల క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కావడంతో క్షేత్ర స్తాయిలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్బాల్లో తన తల్లిదండ్రులతో చెప్పుకున్నాడు. అయితే తెలంగాణ జెన్కో నిర్వహించిన పరీక్షలో విద్యుత్ ఏఈ పోస్టు ఇంటర్వూకు 1:2 లో ఎంపికైన అతడు కొద్ది తేడాతో ఏఈ ఉద్యోగం చేజారింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అంతే కాకుండా వచ్చే నెలలో గ్రూప్స్ రిజల్ట్స్ కూడా ఉండటంతో తాను కచ్చితంగా గ్రూప్స్ సాధిస్తాననే నమ్మకం ఉందని.. ఈ ఉద్యోగం వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రూప్స్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగైనా ఓపిక పట్టుకుని ఉండమని తల్లిదండ్రులు అతడిని సముదాయించారు. ఉన్నత చదువులు తనకు చదవుకు తగ్గ కొలువు దక్కలేదని గత కొద్ది రోజులుగా తన తోటి సిబ్బంది వద్ద వాపోయేవాడని కూడా కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం డ్యూటికి వచ్చిన ప్రవీణ్కుమార్ రాత్రి ఇంటికి ఫోన్చేసి తల్లితో తన భాదను చెప్పగా.. ఎప్పటిలాగే వారు సర్దిచెప్పారు. అయితే, బుధవారం ప్రవీణ్కుమార్కు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో వేములపల్లి సమీపంలోని సాగర్ కాల్వ వద్ద చివరి సారిగా సెల్ఫోన్ సిగ్నల్స్ చూపించాయి. ప్రవీణ్కుమార్ స్కూటీ సాగర్ కాల్వ వద్ద నిలిపి ఉంచడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం దొండవారిగూడం వద్ద సాగర్కాల్వలో ప్రవీణ్కుమార్ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
నానమ్మ ప్లాన్ చేసింది!.. చంపింది వాడే.. సాక్షితో భార్గవి..
-
సూర్యాపేట పరువు హత్య.. అసలు ఏం జరిగింది.. ఎలా చేశారు?
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. జనవరి 26న కృష్ణ హత్య జరిగింది. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.26న బైరు మహేష్ మూడు నెలలుగా కృష్ణతో స్నేహం చేశాడు. కృష్టను ఫోన్ చేసి బయటకు పిలిపించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేశారు. కృష్ణను హత్య చేశామని నవీన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి పాత సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆ తర్వాత నల్లగొండకు వెళ్లి సాయిచరణ్కు చూపించారు. అందరూ కలిసి నల్లగొండ, కనగల్తో పాటు పలు చోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారుచివరగా పిల్లలమర్రి చెరువు కట్టపై కృష్ణ మృతదేహాన్ని పడేశారు. గతంలో మూడుసార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేసి విఫలం అయ్యారు. ఓ కత్తి కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. నిందితులు నవీన్ పై నాలుగు కేసులు ఉన్నాయి. మహేష్పై తొమ్మిది కేసులు ఉన్నాయి. వంశీపై మూడు, సైదులు, బుచ్చమ్మపై రెండు కేసులు, సాయి చరణ్ పై ఒక కేసు ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో విచారణ చేస్తున్నాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు. -
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముగ్గురు యువకుల హల్ చల్
-
సూర్యాపేటలో పరువు హత్య!
సూర్యాపేట టౌన్: సూర్యాపేటకు చెందిన యువకుడిని గుర్తుతెలియ ని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కులాంతర ప్రేమ వివాహమే హత్యకు కారణం కావొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్నేహితుడి ఫోన్తో బయటకు వెళ్లి.. శవంగా మారి..సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (30) అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తూండే కృష్ణ.. అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టులో నకిరేకల్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణ సూర్యాపేటలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు.సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బైరు మహేశ్ అనే మిత్రుడి నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేశ్కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లుగా గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దుండగులు, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్, హత్య కేసు నమోదు కులాంతర వివాహం(inter caste marriage) చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్లు భార్గవి ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భార్గవి తండ్రి సైదులు, సోదరులు వంశీ, నవీన్, కృష్ణ స్నేహితుడు బైరు మహేశ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నలుగురు పరారీలో ఉండగా రెండు బృందాలు గాలింపు చేపట్టాయి. కృష్ణపై గతంలో రెండు హత్యాయత్నం కేసులు ఉండగా, బైరు మహేశ్పై రౌడీషీటర్ కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత కక్షలా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవి చెప్పారు. న్యాయం చేయాలని ధర్నా కృష్ణ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో మాలమహానాడు, దళిత సంఘాల నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సూర్యాపేటలో దారుణం.. బండరాళ్లతో దాడి
-
మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కి ప్రమాదం
-
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ప్రైవేట్ బస్సులో గంజాయి చాక్లెట్ల కలకలం
-
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్ మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్ చేసి మెసేజ్ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నాకు పొలిటికల్ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం. -
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ప్రతీ ఎకరాకు పది వేల సాయం: సీఎం రేవంత్
CM Revanth Khammam Tour Updates..👉వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.ఖమ్మం జిల్లాకు వెళ్తూ సూర్యాపేట జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష.మోతే మండలం రాఘవపురం వద్ద రైతులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షసమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, మందుల సామెల్, పద్మావతి, వేం నరేందర్ రెడ్డిసీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందిపంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదికను అధికారులు ఇచ్చారు.ప్రభుత్వం నిరంతరంగా మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.ఖమ్మం, నల్లగొండ పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానువర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారంపశువులు చనిపోతే 50 వేల సాయంపంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయంఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లుసూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా ఐదు కోట్లుపాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారంవరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలుఅమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ పోస్టులు పెడుతున్నాడుఒకాయన ఫాంహౌస్లో ఉన్నాడువరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళతారు కానీ వరద బాధితులను పరామర్శించరు.మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించుకుంటున్నాం.జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాంరాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.రాజకీయాలకు ఇది సమయం కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..నాకు ఊహ తెలిసింత వరకు ఇంతలా మున్నేరు వాగు ఉధృతిని చూడలేదు.వరద ఒక ప్రళయంగా విరుచుకుపడింది.జనం చిగురు టాకులా వణికిపోయారు.అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం.ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.ఇది ప్రకృతి వైపరీత్యం.ప్రతిపక్ష పార్టీలు వరదలను కూడా రాజకీయం చేస్తున్నాయి.సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తుంది.ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.జనం ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం..బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది.జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి సీఎం ఖమ్మం రావడాన్ని ఖమ్మం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.తాత్కాలిక ఉపశమనం కోసం వరద బాధితులకు 10వేలు ఇస్తున్నాం.నష్టం తీవ్రత ఎంత అన్నది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్ కామెంట్స్..రెండు రోజులుగా భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అయిందిదురదృష్టవశాత్తు కోదాడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారుకొన్ని ఇండ్లకు నష్టం జరిగాయిజిల్లా యంత్రాంగం అద్భుతంగా స్పందించిందిజిల్లా అధికారులకు అభినందనలుచనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.వ్యవసాయ పొలాల్లో నీరు వచ్చి నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..అనుకోని వర్షాలతో ప్రజా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.మరో మూడు రోజులు వర్షాలు నేపధ్యంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లను మరమ్మతులు చేపిస్తాం. దెబ్బ తిన్న నేషనల్ హైవే వారం తరువాత పునరిద్దరిస్తాం.నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి.అధికారులు లీవ్లు పెట్టకుండా 24గంటలు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో వారి ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి.సీఎం గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీల్లో వార్తలను చూసి తాను కూడా ఖమ్మం రావాలనుకున్నాను.అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగింది.మున్నేరు ఉధృతిని చూస్తే ఊహించని ప్రళయమే అన్నట్లు అనిపించింది.వరదల నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.ప్రతిపక్ష పార్టీల విమర్శలను మీడియా వాళ్ళు పట్టించుకోవద్దు. 👉తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. 👉ఇక, సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్.. భారీ వర్ష సూచన ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.👉అనంతరం, సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలోనే బస చేయనున్నారు. ఇక, రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లూ సూర్యాపేట, పలు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. -
సీతాగనరంలో తాగుబోతు తీరుతో 108 సిబ్బందికి ఇబ్బందులు
-
విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
గురుకుల బీసీ హాస్టల్లో చిన్నారి మృతి..
-
సింగపూర్లో సూర్యాపేట జిల్లా యువకుడి మృతి
కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన యువకుడు సింగపూర్లో బీచ్కు వెళ్లి నీటి అలలకు కొట్టుకు పోయి మృతిచెందాడు. కోదాడ పట్టణంలోని ఎర్నేని టవర్లో నివాసం ఉంటున్న చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) హైదరాబాద్లో ఆరేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి సింగపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పవన్ తన స్నేహితులో కలిసి శుక్రవారం సింగపూర్లోని సెన్సోటియా బీచ్కు వెళ్లాడు. నీటిలోకి దిగిన పవన్ అక్కడ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలి పారు. శ్రీనివాసరావు పట్టణంలో ఆయిల్ మిల్లు నడుపుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా.. పవన్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు లండన్ లో ఉద్యోగం చేస్తుండగా మూడో కుమారుడు స్థానికంగా ఉంటూ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. పవన్ కొద్ది రోజుల్లోనే సింగపూర్ నుంచి అమెరికాకు వెళ్లాల్సి ఉందని బంధువులు తెలిపారు. -
కరువు పనిని ఖతర్నాక్ చేసిన IRS ఆఫీసర్
-
Suryapet: ఉపాధి హామీ కూలీగా ఐఆర్ఎస్ అధికారి.. ఎందుకో తెలుసా?
సాక్షి, సూర్యాపేట: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఐఆర్ఎస్ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కూలీగా మారిన అధికారి పేరు సందీప్ బాగా.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సోమవారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటుగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. వాటిపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆయన కూలీలతో కలిసి భోజనం చేయడంతో పాటుగా బతుకమ్మ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలకు తన జీతం నుంచి రూ.200 చొప్పున అందజేశారు. ఇక, ఉన్నాతాధికారి అయిన సందీప్ వారితో కలిసి ఉండటం, భోజనం చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
దొడ్డురకం వడ్లకూ బోనస్ ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం, దొడ్డురకం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు గేటు ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రేవంత్రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఇటీవల కేబినేట్ సమావేశంలో మాత్రం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే ఇవ్వా లని నిర్ణయించడం సరైంది కాదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తుతూ కొందరు రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు నిధులను కూడా సకాలంలో అందించాలని, సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మొండివైఖరిని విడనాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు భిక్షం, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు హెచ్చరించారు. -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపు పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిపోతున్న వరిపంటలపై ఇటీవల కేసీఆర్కు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
టెన్త్ విద్యార్థిని ఇరుగు అస్మిత ఆత్మహత్య
-
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
తుంగతుర్తిలో ఈవీఎంల తరలింపుపై హైటెన్షన్
-
సూర్యాపేటకు డ్రై పోర్ట్..!?
-
కాంగ్రెస్కు కొత్త టెన్షన్.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. దీంతో, నామినేషన్లు వేసిన వారిపై ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ నేతలు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నారు. దీంతో, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి రెబల్స్ను బుజ్జగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పెద్దలు.. సూర్యాపేటలో రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని కలిశారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ పెద్దలు వెళ్లారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో తాను వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. ఇదే సమయంలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రమేష్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలను చూడగానే రమేష్ రెడ్డి మరోసారి బోరున విలపించారు. వారితో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి కూడా తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. తగ్గేదేలే.. ఇక, కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులను రమేష్ రెడ్డి పట్టించుకోలేదు. రమేష్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రమేష్ ఇంటికి వెళ్లిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మల్లు రవి ఉన్నారు. మరోవైపు.. పటేల్ మద్దతుదారులు రోహిత్ చౌదరీ, మల్లు రవిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బెఠాయించి నిరసనలు తెలిపారు. తెలంగాణలో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాంధీ భవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. రెబల్ అభ్యర్థులు వీరే.. ఈసారి కాంగ్రెస్ రెబెల్స్గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్కుమార్రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు. -
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి
-
కాంగ్రెస్ను ఓడించేందుకే ఆయనకు టికెట్.. రమేష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ హైకమాండ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకే టికెట్ వస్తుందని ఆశించిన నేతలు.. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో ఫైరవుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో తాజాగా పటేల్ రమేష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. నాకే టికెట్ ఇస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నాను. చివరకి నాకు అన్యాయం చేశారు. సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి కేటాయించడం కుట్రలో భాగమే. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే ఇదంతా చేశారు. బీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. కార్యకర్తలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని సూర్యాపేటలో బ్రతికించేలా నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్వార్ ప్రారంభమైంది. ఇది కూడా చదవండి: హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే.. -
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్
-
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం
-
సూర్యాపేట జనగర్జన సభ: సోనియా, కేసీఆర్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. తాజాగా సూర్యాపేటలో బీజేపీ జన గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట బీజేపీ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్.. కేటీఆర్ను సీఎం చేయాలని అనుకుంటున్నారు. సోనియా గాంధీ రాహుల్ను ప్రధాని చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేదలు, దళితుల, బీసీల వ్యతిరేక పార్టీలు. కుటంబ పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయలేవు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పటికన్నా దళితుడిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. మూడెకరాల భూమి ఏమైంది? దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది కేసీఆర్. ఇప్పుడైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?. బీసీ సంక్షేమం కోసం ఏటా పది వేలకోట్లు కేటాయిస్తామని అన్నారు ఏమయ్యాయి ఆ నిధులు. ఈ రెండు పార్టీలు కుటుంబ సభ్యుల కోసమే పనిచేసే పార్టీలు. తెలంగాణలో పసుపు రైతులు కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేశాం. సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేశాం. తెలంగాణ అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు. అయోధ్యకు మీరంతా రండి.. ఐదు వందల యాభై ఏళ్ల పోరాటం అయోధ్య రామాలయ నిర్మాణం. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా?. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయబోతున్నారు. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్యకు రావాలి. ప్రధాని మోదీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఎకరాకు ఆరు వేలు ఇస్తున్నాం. మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముప్పై లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతీ ఒక్కరికీ ఐదు కిలోల బియ్యాన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు. ఇది కూడా చదవండి: రేవంత్, ఉత్తమ్ కుమార్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ -
బీఆర్ఎస్ బరాబర్ వారసత్వ పార్టీనే: కేటీఆర్
సాక్షి, సూర్యాపేట జిల్లా : బీఆర్ఎస్ పార్టీ బరాబర్ వారసత్వ పార్టీనే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తమది వారసత్వ పార్టీ అని, కుటుంబ పాలన అని విమర్శిస్తున్న వాళ్లకి తనదైన శైలిలో బదులిచ్చారు కేటీఆర్. సూర్యాపేట సభలో ప్రసంగించిన కేటీఆర్. ‘ బరాబర్ మాది కుటుంబ పాలనే. ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. ఎందరో నాయకుల త్యాగఫలమే వారసత్వ పార్టీ. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. సూర్యాపేటలో జగదీష్రెడ్డిని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రమంతా విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నాయంటే మంత్రి జగదీష్రెడ్డి ఆలోచన విధానానికి నిదర్శనం. అవతలి వారు ఎన్ని ఎత్తులు వేసిన జగదీష్రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు. కంటి ముందు సంక్షేమం ఇంటి ముందు అభివృద్ధి కనబడుతుంది. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు. జగదీష్ రెడ్డి ఓడిపోతాడాని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నాడు. ప్రజల్లో తేల్చుకుందాం రా. కాంగ్రెస్ పార్టీ వారంటీ లేని సచ్చిన పీనుగ లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.ఓటుకు నోటుకు దొరికిన దొంగ, రేవంత్ సీట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామా.?, కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నాడు.మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నాడు’ అని కేటీఆర్విమర్శించారు. చదవండి: ‘రేపు ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు’ -
సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో శుక్రవారంరాత్రి మళ్లీ స్వల్ప భూకంపం వచ్చింది. పలు గ్రామాలతోపాటు పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పలువురు తెలిపారు. దాదాపు 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను కొద్దిమంది మాత్రమే గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నెల 19న ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రంగా వచ్చిన భూకంపం 2.3 మ్యాగ్నట్యూడ్గా నమోదైంది. కాగా, 2020, 2022 సంవత్సరాల్లో కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం వచ్చిన భూకంపం 3.0 మ్యాగ్నట్యూడ్గా నమోదైంది. ఇప్పడు మళ్లీ భూకంపం రావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
పింఛన్ పెంచుకుందాం: సీఎం కేసీఆర్
వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపుతారు కాంగ్రెస్ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు అడుగుతోంది. మొన్నటిదాకా 50ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసింది? నాడు రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇస్తామనీ సరిగా ఇవ్వలేదు. రూ.500 పెన్షన్ ఇవ్వలేదు. అలాంటి కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని అంటున్నారు. వారు అధికారంలో ఉన్న కర్ణాటకలో పెంచకుండా ఇక్కడ పెంచుతామని మాయ మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు. అరచేతిలో వైకుంఠం చూపుతారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మనం పెన్షన్ మొత్తాన్ని పెంచుకుందాం. ఎంతనేది త్వరలోనే ప్రకటిస్తా. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి నల్లగొండ/ సూర్యాపేట: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గతంలో కంటే ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరెవరో వస్తారని.. వారి మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఆగమవుతామని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. త్వరలోనే ఆసరా పింఛన్లు పెంచుకుందామని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలోని మోతె మండలం వరకు ఎలా వచ్చాయో మీకు తెలుసు. ఒకప్పుడు కరెంటు రాకపోతే, మోటార్లు కాలిపోతే రైతులు ఇబ్బందులు పడేవారు. వాటిని చూసి ఉద్యమ సమయంలో నేను కంటతడి పెట్టాను. ఇప్పుడు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటడు, మరొకడు 3 గంటలు కరెంటు చాలంటడు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో కరెంటు సరిగా ఇవ్వక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మనం మళ్లీ అలా గోసపడదామా? లేదంటే 24 గంటల కరెంటు కావాలా? ఆలోచించాలి. ధరణి వద్దంటే దళారుల దందానే.. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణితోనే ఇప్పుడు రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. ధాన్యం అమ్ముకున్నా ఖాతాలోనే సొమ్ము పడుతోంది. కాంగెస్ వస్తే రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు ఉండవు. గతంలో పాస్బుక్ల విషయంలో ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ, మంత్రి ఇలా ఎవరు పడితే వారు పెత్తనం చేసేవారు. వీఆర్వోలు ఇష్టానుసారంగా పేర్లు మార్చేశారు. అందుకే ఆ వ్యవస్థను రద్దుచేశాం. దాని స్థానంలో ధరణిని తీసుకువచ్చాం. అధికారులకు ఉన్న పవర్ను ధరణితో రైతుల బొటనవేలికే ఇచ్చాం. రికార్డులను ఎవరూ మార్చలేరు. కాంగ్రెస్ ధరణిని తీసేస్తామంటోంది. మళ్లీ దళారుల దందా రావాలా? వాళ్లు నల్లగొండను పట్టించుకోలేదు కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదు. సూర్యాపేట ప్రజలకు మురుగునీటినే తాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని ని«ధులు ఇచ్చాం. మంత్రి జగదీశ్రెడ్డి కొట్లాడి మరీ నల్లగొండ జిల్లాకు విద్యుత్ ప్లాంట్ సాధించారు. రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న దానిని త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. బీసీలందరికీ ఆర్థిక సాయం బీసీలందరికి ఆర్థిక సాయం అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ అనుమానం పెట్టుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న వారంతా ఇప్పుడు గ్రామాలకు వచ్చి, పనులు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి. సూర్యాపేటకు సీఎం వరాలు సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున.. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తాం. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం జీవో జారీ చేస్తాం. అతిథి గృహం మంజూరు చేస్తాం. రూ.37 వేల కోట్లు రుణామాఫీ చేశాం కరోనాతో రుణమాఫీ విషయంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడిప్పుడే రైతులు ఒకరి వద్ద చేయి చాచకుండా బతుకున్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఖమ్మంలో సీతారామ వంటి ప్రాజెక్టులతో దిగుబడి 4 కోట్ల టన్నులకు పెరుగుతుంది. దేశంలోనే నంబర్వన్గా నిలిచాం తెలంగాణ ఏర్పాటయ్యాక అద్భుత పనితీరుతో మానవాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్లో నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట కొత్త కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నామని.. కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ, సెక్రటేరియేట్లు కూడా ఈ స్థాయిలో లేవని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేటలో సీఎం కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్కారును నడిపడమంటే.. సంసారం నడిపించినట్టే.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగింది. ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తావిస్తూ. ‘‘సర్కారు నడిపించాలంటే.. సంసారం నడిపించినట్టే..’’ అని కేసీఆర్ పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. తర్వాత ‘‘60 ఏళ్ల నుంచి రూ.200 పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్ వాళ్లు ఇవాళ రూ.4వేలు ఇస్తరట.. అంటే నేను రూ.5వేలు ఇవ్వాలా? ఇదేమన్నా వేలం పాటనా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగంలో సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎంను కోరారు. తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘జగదీశ్రెడ్డి ఇంత హుషారని అనుకోలేదు. మనకు అన్ని ఇచ్చారు, సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు. అన్నీ అయిపోయాయి. సభకు వచ్చిపోతే చాలు. ఏమీ అడగనని అక్కడ చెప్పిండు. ఇప్పుడు అవికావాలి, ఇవి కావాలి అని అందరి ముందూ అడుగుతున్నారు..’’ అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను నమ్మొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట.. జిల్లా కావడం ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. అభివృద్ధిలో ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు. ‘‘తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుంది. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభారతి నిర్మిస్తాం. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టికి రూ.50 కోట్లు మంజూరు చేస్తాం. ఆర్అండ్బి గెస్ట్హౌస్ కూడా నిర్మిస్తాం. సూర్యాపేటపేట జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్, బీజేపీలకు 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈ 50 ఏళ్లలో ఆ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయి. రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందా?’’ అని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ తప్పకుండా పెంచుతాం.. తర్వలోనే ప్రకటిస్తాం. ఇచ్చిన ఏ మాటా తప్పలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా సాగునీళ్లు ఉన్నాయి. రైతులకు 3 గంటలే కరెంటు చాలని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో కరెంటు కష్టాలు ఇప్పటికే మొదలయ్యాయి. ధరణి వ్యవస్థ తెచ్చాం.. వీఆర్వోలను తొలగించాం. వీఆర్వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భూముల రిజిస్ట్రేషన్లో అక్రమాలు తొలగిపోయాయి. ధరణితో రిజిస్ట్రేషన్ కష్టాలు తీరిపోయాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ధరణి వ్యవస్థను తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదు. పైరవీకారులకు మళ్లీ అధికారం రాకూడదు. కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను ప్రజలు నమ్మొద్దు. మోసపోతే ఘోష పడతాం. ఎవరు ఎన్ని కథలు చెప్పిన విజయం బీఆర్ఎస్దే’’ అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్పల్లి వైపు మళ్లిస్తారు. -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
సూర్యాపేటలో ఆ సెంటిమెంట్! బీఆర్ఎస్కు హ్యాట్రిక్ సాధ్యమేనా?
ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు : ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులాల పరంగా ఓటర్లు: ► నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ► సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ► ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది. పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. -
ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: గన్నవరం(ఏపీ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్కి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్లో హైటెన్షన్ సర్వీస్లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
నిద్రలోనే తెల్లారిన బతుకులు.. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం
సాక్షి, సూర్యాపేట: నిద్రలోనే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిన ఇంటి గోడ కూలడంతో వృద్ధ దంపతులతో పాటు కుమారుడు దుర్మరణం చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. శీల రాములు(90), రామక్క (83) దంపతులు తమ చిన్న కుమారుడు, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీను(38)తో కలిసి చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను భార్య.. పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. కాగా బుధవారం రాత్రి రోజూ మాదిరిగానే శిథిలావస్థకు చేరిన ఆ రేకుల ఇంట్లోనే ఓ గదిలో ముగ్గురు కలిసి ఒకే చోట నిద్రించారు. వర్షాలకు ఇంటి గోడలు బాగా తడవడంతో రాత్రి సమయంలో మధ్య గోడ కూలి వారి మీద పడటంతో ముగ్గురూ నిద్రలోనే విగతజీవులుగా మారారు. గురువారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసేందుకు ఆ ఇంటికి రాగా ఎప్పుడూ బయట కూర్చునే వృద్ధదంపతులు కనిపించకపోవడం, ఇంటి గడియ లోనికి వేసి ఉన్నా ఎవరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులతో కలిసి గోడల మట్టిని తొలగించగా మృతదేహాలు కన్పించాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 75వేలు మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా అందజేశారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చదవండి: భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస -
కూలిన కుటుంబం.. సూర్యాపేటలో విషాదం
సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది. అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి. గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్ల హల్చల్!
నల్గొండ: నేరేడుచర్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 19వ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెంలో ఓ బెల్ట్షాపు నిర్వాహకుడికి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. అడ్డు చెప్పబోయిన మరో వ్యక్తిపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మద్యం తాగిన కానిస్టేబుళ్లు డబ్బుల విషయంలో ఘర్షణకు దిగారని, మద్యం తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వీరు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. -
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
సూర్యాపేట నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర
-
కాలేజీ యజమాని కాంతారావు హత్యకు భాగస్వాముల కుట్ర
-
గోదావరికి జనాహారతి ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
-
ఒక్క రోజు పోలీస్ ఈ పాప
-
యేసుక్రీస్తు సిలువ ఘట్టం ప్రదర్శన..!
-
TSRTC: రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్ జామ్
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్హెచ్-65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
సిసోడియా అరెస్ట్.. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట: జగదీశ్
సూర్యాపేట: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయి బీజేపీ నేతల ఆరోపణల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో తెలంగాణ అభివృద్ధిని బేరీజు వేసుకుని కేంద్రమంత్రులు మాట్లాడాలన్నారు. కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల కుయుక్తులు తెలంగాణ సమాజం ముందు సాగవని మంత్రి అన్నారు. -
ప్రమాదవశాత్తు రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
చివ్వెంల (సూర్యాపేట): సాంకేతిక లోపంతో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామ శివారులో ఆది వారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయ వాడ డిపోకు చెందిన వెన్నెల బస్సు 30 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివా రులోని సాయికృష్ణ హోటల్ వద్దకు రాగానే బస్సు లైట్లు ఫెయిల్ కావడంతో ప్రయాణికు లను వేరే బస్సుల్లో వారిని విజయవాడకు తరలించారు. విజయవాడకు చెందిన మరో అమరావతి బస్సును వెన్నెల బస్సు వద్దకు తీసుకువచ్చారు. మరమ్మతుకు గురైన బస్సు బ్యాటరీకి చార్జింగ్ ఎక్కించే క్రమంలో బ్యాటరీ వైర్లలో నుంచి మంటలు చెలరేగాయి. ఆర్టీసీ డ్రైవర్లు అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకునే లోపు అమరావతి బస్సు పూర్తిగా కాలిపోగా, వెన్నెల బస్సు పాక్షికంగా కాలిపోయింది. -
వరిపంటకు చీడపీడల బెడద
నడిగూడెం : ప్రస్తుత రబీ సీజన్లో వరి పంట పెరిగే దశలోనూ, పలు ప్రాంతాల్లో చిరు పొట్ల దశల్లో ఉంది. అయితే వరి పంటకు చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఈ దశలో ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడొద్దని, మోతాదుగా వాడాలని సూర్యాపేట మండల వ్యవసాయాధికారి ఎండీ జానిమియా పేర్కొంటున్నారు. వరిసాగులో పాటించే సస్యరక్షణ చర్యలపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. కాండం తొలుచు పురుగు ఈ పురుగు నారుమడి, పిలకదశ, అంకురం నుంచి చిరు పొట్టదశ వరకు ఆశిస్తుంది. పిలక దశలో మొవ్వు చనిపోతుంది. అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. కంకి పాలు పోసుకోక తాలుపోతుంది. ఈ పురుగులు ఆలస్యంగా నాట్లు పెట్టిన లేదా ముదురు నాట్లు పెట్టిన పొలాల్లో ఆశిస్తాయి. నివారణ చర్యలు నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలను తుంచి వేసుకోవాలి. ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి ప్రతివారం బుట్టలో పడే మగరెక్కల పురుగులను గమనించాలి. నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. దీనికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిల్ప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సుడిదోమ(దోమపోటు) ఈ పురుగు నారుమడి లేదా పిలకల దశలో అరుదుగా, పొట్టదశ, ఈనిక దశల్లో ఎక్కువగా ఆశిస్తుంది. నీటి పైభాగంలో మొక్కల మొదళ్ల దగ్గర దోమలు కనబడతాయి. పిల్ల, పెద్ద పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పైరు సుడులుగా ఎండిపోతుంది. ఉధృతి ఎక్కువగా ఉంటే పొలం ఎండిపోయి పడిపోవడం, తాలు గింజలు లేదా నూర్చినప్పుడు నూకపోవడం జరుగుతుంది. నివారణ చర్యలు దోమను తట్టుకొనే రకాలను సాగు చేసుకోవాలి. నత్రజని అధిక మోతాదు తగ్గించుకోవాలి. కాలిబాటలు తీయాలి. ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా ఎథోఫెన్ప్రాక్స్ 2.0 మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.. పాముపొడ తెగులు దుబ్బు చేసు దశ నుంచి కాండం, మట్ట, ఆకులపై మచ్చలు పెద్దవై పాము పొడ మచ్చలుగా ఏర్పడతాయి. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోతుంది. తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే తాలుగింజలు ఏర్పడతాయి. నివారణ చర్యలు విత్తన శుద్ధి చేయాలి. సిఫారసు మేరకు నత్రజని ఉపయోగించాలి. గట్లపై, చేనులో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. హెక్సాకొనాజోల్ 2. మి.లీ. లేదా ప్రాపికొనాజోల్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లికోడు లేదా గొట్టపు రోగం ఇది నారుమడి, పిలక దశల్లో ఆశిస్తుంది. అంకురం ఉల్లి కాడవలె పొడగాటి గొట్టంలా మారి బయటకు వస్తుంది. కంకి వేయదు. దుబ్బుల్లో కొన్ని పిలకలు ఉల్లికాడవలె పొడగాటి గొట్టాలుగా మారతాయి. నివారణ చర్యలు దీనిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు కార్బోప్యూరాన్ 3జీ గుళికలను 10కిలోలు లేదా ఫోరెట్ 10జి గుళికలను 5 కిలోలు ఎకరానికి నారు నాటిన 10నుంచి 15 రోజులకు వేసుకోవాలి. ♦ అధికంగా పురుగు మందులు వాడితే పంటకు నష్టం ♦ సస్యరక్షణ చర్యలు పాటించాలంటున్న వ్యవసాయాధికారి ఎండీ జానిమియా తొలిదశలో ఆకులపైన నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇవి విస్తరించి మచ్చలు, చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండి ఆకులు కాలిపోయినట్లుగా వ్యాపిస్తుంది. సిఫారసు మేరకు కాకుండా నత్రజని ఎరువుల అధిక మోతాదుల్లో వాడడం, గాలిలో తేమ అధికంగా ఉండడం, మబ్బుతో కూడిన వాతావరణం, సన్నని వర్షపు జల్లులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. నివారణ చర్యలు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పైరుపై తెగులు లక్షణాలు కనిపిస్తే పొలంలో నీటిని తీసివేయాలి. బాగా ఆరనివ్వాలి. దీని వల్ల శిలీంద్రం తాలూకు సిద్ధ బీజాలు నశిస్తాయి. ట్రైసైక్లేజోల్ 1.5గ్రాములు లేదా కాసుగామైసీన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
‘మనబడి’ పనుల్లో వేగం పెంచాలి
దురాజ్పల్లి (సూర్యాపేట): మన ఊరు – మనబడి పథకం కింద జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మనఊరు–మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదట విడతగా 329 పాఠశాలలు ఎంపికాగా అందులో 324 పాఠశాలలకు అనుమతులు వచ్చాయని, రూరల్ ఏరియాలో 279 అర్బన్ ఏరియాలో 50 పాఠశాలల్లో పనులు జరుతున్నాయని తెలిపారు. 46 పైలెట్ స్కూళ్లలో ఇప్పటికే 3 ప్రారంభించుకున్నామని మిగిలిన 43 పాఠశాలల పనులను మార్చి నెల 31 నాటికి పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇకపై పాఠశాల పనుల పరిశీలనకై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 102 గ్రామ పంచాయతీ భవనాల పనులు వెంటనే చేపట్టాలన్నారు. అనంతరం మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, డీఆర్డీఓ కిరణ్ కుమార్, డీఈ రమేష్, పీఆర్ ఇంజనీర్లు, ఏఈలు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి అనంతరం మండల విద్యాధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ..విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం అందజేయాలని సూచించారు. ఈసందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీఈఓతోపాటు ఏడీ శైలజ, ఎంఈఓలు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తామనికలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ జీఓలు 58, 59, 76 అమలు, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, డీఎఫ్ఓ సతీష్, ఆర్డీఓలు కోదాడ కిషోర్ కుమార్, హుజూర్నగర్ వెంకారెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రామారావు నాయక్, శ్రీధర్గౌడ్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
శునకం.. స్వైరవిహారం
సూర్యాపేట: పల్లెలు, పట్టణాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. పగలు, రాత్రి వేళల్లో సైతం చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై పైశాచికంగా దాడి చేసి గాయపరుస్త్తున్నాయి. జిల్లాలోసూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లో సైతం సుమారు 2లక్షలకుపైగా కుక్కులు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఆ వైపుగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనలు జరిగితేనే.. ఎక్కడైనా కుక్కల దాడిలో జంతువులుకాని, మనుషులు కాని మరణించిన సమయంలోనే వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలని అధికారులకు గుర్తుకు వస్తుంది. మామూలు సమయంలో వీధుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టి తీసుకెళ్లి మాత్రం ఆపరేషన్లు చేయాలన్న ఆలోచన మాత్రం రావడం లేదు. దీంతో రోజురోజుకూ కుక్కల సంఖ్య పెరిగిపోతూ వాటి దాడులతో జనం హడలిపోతున్నారు. ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క కాటుకు సంబంధించి యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రుల్లోని టీకాలను వేయించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేసి టీకాలు వేయించుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ♦ వెంట పడి మరీ దాడులు చేసున్న వైనం ♦ తాజాగా సూర్యాపేటలో 15 మందిని గాయపర్చిన గ్రామసింహాలు ♦ ఘటనలు జరిగిందాకా స్పందించని అధికార యంత్రాంగం కోదాడ పట్టణంలో సరిగ్గా రెండు నెలల క్రితం కుక్కలు దాడి చేసి నలుగురిని గాయపరిచాయి. అలాగే సూర్యాపేట పట్టణంలోనూ రెండు నెలల క్రితం నెహ్రూ నగర్లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నపిల్లలు గాయపడ్డారు. తాజాగా శుక్రవారం సూర్యాపేటలోని 23వ వార్డులోని వివిధ ప్రాంతాల్లో శునకాల దాడిలో సుమారు 15 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇలా జిల్లాలో నెలకొన్న కుక్కల బెడదతో పల్లెలే కాదు.. పట్టణాల వాసులు కూడా బెంబేలు చెందుతున్నారు. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒకచోట జనంపై కుక్కల దాడి జరుగుతూనే ఉంది. రాత్రి సమయంలో ప్రజలు తమ పనులు ముగించుకని ఇంటికి వస్తున్న సమయంలో వీధుల్లో తిరుగుతున్న కుక్కలు వెంట పడి మరీ దాడి చేస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్లేవారినే కాకుండా వాహనాలు, బైక్ల మీద రాకపోకలు సాగించే వారి వెంటబడి దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వాహనదారులైతే భయపడుతూ వాహనాలను నడపడంతో అదుపుతప్పి కిందపడి గాయాల పాలైన ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవతోపాటు స్వామి అమ్మవార్లకు అష్టోత్తర సహస్త్ర నామార్చన, కుంకుమార్చనలు చేపట్టారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. ఆ తర్వాత మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ఽచైర్మన్ చెన్నూరు విజయ్కుమార్, ఈఓ నవీన్, అర్చకులు లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
యూరియాను అధిక మోతాదులో వాడొద్దు
ఆత్మకూర్(ఎస్): రైతులు వరి పొలాలకు అధిక మోతాధులో యూరియాను వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మికల్లు, ఆత్మకూర్, ఏపూరు గ్రామాల్లోని పీఏసీఎస్ కేంద్రాల్లో యూరియా అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ యూరియాను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వరికి చీడపీడలు సోకుతాయన్నారు. అంతేకాకుండా భూసారం దెబ్బతింటుందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఆయన వెంట ఏఓ దివ్య, పీఏసీఎస్ల సిబ్బంది ఉన్నారు. ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి మద్దిరాల : రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండల పరిదిలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై ఏర్పాటు చేసిన ఆవహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ వికాస్ పాటిల్, ఏఈఓ రాకేష్, సర్పంచ్ దామెర్ల వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ బద్దం సంజీవరెడ్డి, పతంజలి కంపెనీ సూపర్వైజర్ భద్రాచలం, ఉప సర్పంచ్ వెంకన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనాల పరిశీలన తిరుమలగిరి : మామిడాల గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వనాల్లో చెట్లను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్ చారి, ఎంపీఓ మారయ్య తదితరులు పాల్గొన్నారు. యువత జాబ్మేళాలను సద్వినియోగం చేసుకోవాలి దురాజ్పల్లి (సూర్యాపేట): జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందించి మాట్లాడారు. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారని, మూడు ప్రైవేట్ కంపెనీలలో 44 ఉద్యోగాల ఖాళీలకు ప్రకటన ఇవ్వగా 118 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో అర్హత కలిగిన 20 మందిని ఎంపిక చేసి వారికి నియామకపత్రాలను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కంపెనీల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శిగా నాగన్నగౌడ్ హుజూర్నగర్ : ఐఎన్టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా హుజూర్నగర్కు చెందిన యరగాని నాగన్నగౌడ్ రెండోసారి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 33వ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో నాగన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనను అభినందించారు. కాగా శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఐఎన్టీయూసీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల సంక్షేమం కోసం కృషిచేస్తానని చెప్పారు. నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న సంజీవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తనను కార్యదర్శిగా రెండోసారి ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చర్చి పక్కన ఉన్న 221 గజాల స్థల విషయంలో గ్రామానికి చెందిన మాద సుధాకు అదే గ్రామానికి చెందిన శీలం నాగయ్య, శీలం శ్రీను, శీలం వెంకటేశ్వర్లు, శీలం పవన్ల మధ్యన ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఆ స్థలంలో బావి ఉండడంతో దానిని పూడ్చివేసి ఇంటి నిర్మాణం కోసం సుధా గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకుంది. కాగా గ్రామానికి చెందిన శ్రీను, నాగయ్య, వెంకటేశ్వర్లు, పవన్లు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో శుక్రవారం స్థల విషయంలో సుధా, ఆమె సోదరుడు దార పుల్లయ్య, ఆయన కుమారుడు ప్రసన్న కుమార్, కూతుర్లు నవ్య, రాజేశ్వరీలకు నాగయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, పవన్లతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్ఐ విష్ణుమూర్తిని వివరణ కోరగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత గరిడేపల్లి : తప్పిపోయిన బాలుడిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి గరిడేపల్లి మండలంలోని కితవారిగూడెంలో గుర్తుతెలియని బాలుడిని గ్రామ ప్రజలు గుర్తించి చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారు. బాలుడిని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి విచారించగా అతడి పేరు వనమా రాజీవ్గా, తల్లిదండ్రులు పద్మావతి, సురేష్ అని చెప్పాడు. ఈమేరకు బాలుడిని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సాయి త్రిలోక్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉన్న బాబు తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. -
కుక్కల దాడిలో 15మందికి గాయాలు
సూర్యాపేట: పట్టణంలోని పలు వార్డుల్లో శునకాలు శుక్రవారం 15మందిపై దాడిచేసి గాయపరిచాయి. పట్టణంలోని రాజీవ్నగర్, కొత్తగూడెం బజార్, నెహ్రూనగర్లో 15మందిని శునకాలు గాయపరిచాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి టీకాలు వేశారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో కుక్కల బెడద తీవ్రమైందని, వాటిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి సూర్యాపేట ఆస్పత్రికి రోజుకు కనీసం 30 నుంచి 40 కుక్క కాటు కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆత్మకూర్లో 6 గొర్రెలు మృతి ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : వీధి కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతిచెందిన సంఘటన ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్యాల మల్లయ్య, నగిరె కృష్ణయ్యలు గొర్రెలను మేత కోసం గ్రామ శివారులోకి వేర్వేరుగా తోలుకుని వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గుంపులుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా మందపై దాడిచేసి దాదాపు ఆరు గొర్రెలను చంపివేశాయి. -
హంసవాహన సేవలో యాదాద్రీశుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారు వటపత్రశాయి అలంకార సేవలో.. సాయంత్రం హంస వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వేకువజామునే.. ప్రధానాలయంలో వేకువజామునే నిత్యారాధనలు, నిత్యపూజల అనంతరం ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అనంతరం ఉదయం 9.23 గంటలకు శ్రీస్వామి వారిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకీపై అధిష్టించి ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో శ్రీస్వామిని ప్రత్యేక బల్లపై అధిష్టించి విశేషంగా ఆరాధించారు. డోలు సన్నాయి మేళాలతో శ్రీస్వామికి మంగళకరమైన వాయిద్యాలతో కీర్తించారు. అలంకార సేవలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్తివారీ, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంఽశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం వేళ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి వారిని హంస వాహన అలంకార సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు నుంచి ముందుకు సాగింది. పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో శ్రీస్వామి సేవను అధిష్టించి ఆచార్యులు వేదమంత్రాలను పఠించారు. కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వంశీకృష్ణ, హరీష్ నేతృత్వంలో ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. కొండపైన బస్టాండ్ వద్ద, కొండ కింద కల్యాణ కట్ట సమీపంలో భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం సభ్యులు కూచిపూడి ప్రదర్శన, అన్నమాచార్య ప్రాజెక్టు టీటీడీ బృందం వారిచే అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించారు. ♦ యాదాద్రి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలు ♦ ఉదయం వటపత్రశాయిగా.. ♦ సాయంత్రం హంసవాహన సేవలో భక్తులకు దర్శనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శనివారం ఉదయం శ్రీస్వామి వారిని శ్రీకృష్ణాలంకరణ (మురళీ కృష్ణుడు) సేవ నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం పొన్నవాహన సేవ ఊరేగింపు జరిపిస్తారు. -
తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యం
కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఎస్పీ ఉత్తరప్రదేశ్ ఎంపీ రాంజీగౌతమ్ అన్నారు. శుక్రవారం కోదాడలో జరిగిన ఆ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ రెండు ఒకటేనన్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రెండు ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే తానే పార్లమెంట్లో పోరాడానని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు చెప్పి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న బ్యాక్లాగ్ పోసులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మందా ప్రభాకర్, బాలస్వామి, దయానందరావు, పిల్లుట్ల శ్రీనివాస్, బొడ్డు కిరణ్, మల్లేశ్యాదవ్, కాంపాటి శ్రావణ్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
సూర్యాపేట క్రైం: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి 65, 365 (బీబీ), 365(ఏ)పై సీఐలు, ఎస్ఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎంఆర్, జాతీయ రహదారుల సంస్థ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, రవి, నాగభూషణం, సీఐలు సోమనారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, ఆంజనేయులు, పీఎన్డీ.ప్రసాద్, ఎస్ఐలు సాయిరాం, విష్ణుమూర్తి, లోకేష్, డీసీఆర్వీ రోడ్ సేఫ్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు జిల్లాకు నార్కోటిక్ డాగ్ అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలను గుర్తించి పట్టుకోవడానికి జిల్లాకు నార్కోటిక్ డాగ్(రోలెక్స్)ను కేటాయించారు. ఈరోలెక్స్ పనితీరుపై శుక్రవారం డాగ్ హ్యండిలర్తో నిర్వహించిన రిహార్సల్ను ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా టన్నులకొద్దీ గంజాయిని సీజ్ చేశామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు శ్రీనివాస రావు, శ్రీనివాస్, గోవిందరావు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కారం
దురాజ్పల్లి (సూర్యాపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు. దేశంలోని 10 శాతం మంది చేతుల్లో 100శాతం సంపద దాగి ఉందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, రవి నాయక్, వెంకటేశ్వరరావు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. -
సూర్యపేటలో తెలుగు టైటాన్స్ ప్లేయర్ల సందడి
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్ యూత్ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్ కెప్టెన్ సిద్ధార్ద్ దేశ్రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్సింగ్ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.