46 మంది వైద్యులకు పోస్టింగులు | postings to 46 doctors | Sakshi
Sakshi News home page

46 మంది వైద్యులకు పోస్టింగులు

Published Wed, Aug 10 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

postings to 46 doctors

ఏలూరు (మెట్రో): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులకు బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టరేట్‌లో జరిగిన కౌన్సిలింగ్‌లో 46 మంది వైద్యులకు కలెక్టర్‌ కె.భాస్కర్‌ వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. జిల్లాలో  59 వైద్యుల ఖాళీలకు 166 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 56 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా 46 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయనున్నారు. 13 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement