wednesday
-
Ash Wednesday 2025 పవిత్ర ప్రార్థనలు
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంలో ఆచరించే తపస్సు కాలాన్ని ‘లెంట్ కాలం’అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించడం అని అర్థం. ఇది బుధవారంతో ప్రారంభమవుతుంది. అందు చేత ‘భస్మ బుధవారం’ లేదా ‘బూడిద బుధ వారం’ అంటారు. లెంట్ మొత్తం నలభై రోజులు. లాటిన్ భాషలో ‘క్వాడ్రగెసిమ’ అనే మాటకు నలభై అనిఅర్థం. బైబిల్లో నలభై దినాల ఉపవాసానికి ఉదాహరణగా, మోషేనలభై దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవసించి, ప్రార్థించాడు. నోవా జలప్రళయం 40 దినాలు జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు పయనించారు. ఏసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవసించి ప్రార్థించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఒంటిపూట సాత్వికాహారం తీసుకుని నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఆచరిస్తారు.బుధవారం రోజు కొన్ని ఆలయాల్లో విశ్వాసులు తాటాకులతోగాని, కొబ్బరి ఆకులతోగాని, ఖర్జూరపు ఆకులతో చేసిన సిలువ ప్రతిమలు తెచ్చి ఉంచుతారు. వాటిని మరుసటి సంవత్సరం వరకు ఉంచి బుధవారం భస్మం చేస్తారు. ఆ బూడిదతో నుదుటపై సిలువు గుర్తు వేసుకుని లేదా తలపై చల్లుకుని బూడిద బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు జరిగే క్వాడ్రగెసిమ కాలం ధ్యానాలు ఆచరిస్తారు. లెంట్కాలం అంతా దేవాలయాల్లో నలభై అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు గాని, కుటుంబాల్లో జరుపుకునే ఇతర ఉత్సవాలు గాని చేయరు. భస్మ బుధవారం నుంచిశుభ శుక్రవారం వరకూ వచ్చే నలభై దినాలు ‘శ్రమల కాలం’గా పరిగణించి, ప్రక్షాళన కోసం పవిత్రపరచుకునే సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని ‘లాజరస్ సాటర్ డే’ అంటారు. దీన్నే ‘నిశ్శబ్ద శనివారం’ అని కూడా పిలుస్తారు. ఏసు మరణించిన శుక్రవారం సమాధిలో ఉన్నా, శనివారం అనంతరం పునర్జీవితుడై తిరిగి లేచిన ఆదివారం ‘ఈస్టర్ ఆది వారం’గా జరిగే ప్రార్థనలతో లెంట్కాలం పూర్తవుతుంది. ఈ క్వాడ్రగెసిమ కాలం అంతా పాప ప్రక్షాళనతో పాటు వ్యక్తిగత నియమనిష్ఠలను పాటించి, ప్రపంచ శాంతి, సమసమాజ సుహృద్భావ జీవనం కలగాలని ప్రార్థనలు చేస్తారు. – ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు (నేడు భస్మ బుధవారం) -
మహారాష్ట్ర పోలింగ్ బుధవారమే ఎందుకు?
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నగారా మోగించింది.నామినేషన్లు, పోలింగ్, ఫలితాల తేదీల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ తేదీ,పోలింగ్ జరిగే వారం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్కుమార్ చెప్పారు.నవంబర్ 20 (బుధవారం) మహారాష్ట్రలో ఉన్న మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తాం. పోలింగ్ కోసం బుధవారాన్ని మేం కావాలనే ఎంచుకున్నాం. వారం మధ్యలో పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనే బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నాం.వీకెండ్లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’అని రాజీవ్కుమార్ చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
భీమవరం : చదరంగం ద్వారా మేధోసంపత్తిని పెంపొందించుకునే అవకాశం ఉందని, ఈ క్రీడ పట పిల్లలను ప్రోత్సహించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తల్లిదండ్రులకు సూచించారు. భీమవరం వెస్ట్బెర్రీ స్కూల్లో నాలుగు రోజలపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాలబాలికల చదరంగం పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోటీల నిర్వహణకు అనసూయ చెస్ అకాడమీ, జిల్లా చెస్ అసోసియేషన్, వెస్ట్బెర్రీ స్కూల్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. తోట సీతారామలక్ష్మి రాష్ట్ర చెస్ అసోసియేషన్అధ్యక్షుడు వైడీ రామారావు పావులను కదిపి క్రీడను ప్రారంభించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్, ఆర్గనైజర్ మాదాసు కిశోర్, అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు గమిని రవి పవన్కుమార్, స్కూల్ డైరెక్టర్ ఎన్.మహేష్, స్కూల్ ప్రిన్సిపాల్ గుజ్జుల సునీత, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ కె.శ్రీలతాదేవి, గమిని రమ్య, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
తాడేపల్లిగూడెం : ఆకాశంలో ఉదయం నుంచీ కారుమబ్బులు.. బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన వాన, హోరుగాలులకు ప్రజలు పులకించిపోయారు. ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకంటూ ఆనందం వ్యక్తం చేశారు. చల్లగాలుల తాకిడిని ఆస్వాదించారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. రోహిణి కార్తె చివరి దశలో కురిసిన భారీవర్షానికి భూమి చల్లబడింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. భీమవరంలో సాయంత్రం ప్రారంభమైన వాన రెండు గంటల పాటు ఏకధాటిన కురిసింది. జంగారెడ్డిగూడెంలో పది నిమిషాలపాటు చిరుగాలితో కూడిన జల్లులు పడ్డాయి. తాడేపల్లిగూడెంలో రెండు గంటల పాటు వాన పడుతూనే ఉంది. కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గంలోని పలుచోట్ల, ఏలూరు నగరంలో వర్షం పడింది. ఉక్కపోతకు ఉపశమనం కలుగ చేసింది. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివి జన్ల వారీగా ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు అనే వివరాలు సేకరించారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు తోడు మరో 13 వాహనాలను సమకూర్చిందని వాటిని ఎవరు మోనిటర్ చేస్తున్నారని, వాహనాలు వచ్చిన తర్వాత ప్రమాదాలను ఎంత మేరకు తగ్గించారని అడిగి తెలుసుకున్నారు. ఆయా వివరాలను డీఐజీ, ఎస్పీ గణాంకాలతో వివరించారు. -
మద్దిలో ముగిసిన హనుమద్ జయంతి
జంగారెడ్డిగూడెం రూరల్ : హనుమద్ నామ స్మరణతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆల యం మార్మోగింది. ఈ క్షేత్రంలో జరుగుతున్న హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమత్ దీక్షధారులు బుధవారం స్వామి సన్నిధిలో తమ ఇరుముళ్లను సమర్పించారు. మహా పూర్ణాహుతి హోమ గుండంలో తమ ఇరుముళ్లలోని నెయ్యిని సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకుల బృందం, వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, ఆలయ కార్వనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలను తిలకించారు. బుధవారంతో క్షేత్రంలో హనుమద్ జయంతి ఉత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి. హంసవాహనంపై అంజన్న బుధవారం రాత్రి మద్ది ఆంజనేయస్వామి, సువర్చలాదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. హంస వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గుర్వాయిగూడెం పుర వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం నేత్ర పర్వంగా సాగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల : సమ్మోహిత రూపంతో భక్తులకు అభయహస్తమిస్తూ చినవెంకన్న ఉభయదేవేరులతో రథవాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవిలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైభవోపేతంగా రథరంగ డోలోత్సవం శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రథవాహనం ద్వారా భక్తులు స్వామికి సేవచేసుకునే అవకాశం లభించింది. బుధవారం రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాటభజనలతో శ్రీవారి రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సమర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈఓ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మురళీకృష్ణుడిగా మురళీకృష్ణుడి అలంకారంలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు పిల్లనగ్రోవి ధరించి, గోవులను సంరక్షించే మురళీకృష్ణుడిగా భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 10 గంటలకు భక్తి రంజని ఉదయం 10.30 గంటలకు అపబృదోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజారోహణ రాత్రి 8 గంటల నుంచి బుర్రకథ ప్రదర్శన రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం -
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్ జీవో సంఘ ఉపాధ్యక్షుడు రమేష్, ఆర్యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్ యూఎస్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్కుమార్, సర్వశిక్షాభియాన్ సీఎంవో రూజ్వెల్ట్ పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం
ద్వారకా తిరుమల :శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన గర్రే రాఘవగుప్తా ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన భవనంలో ఈ విరాళాన్ని జమచేశారు. దాతకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ను అందజేసి, అభినందించారు. -
భీమవరంలో వాలీబాల్ శిక్షణ శిబిరం
భీమవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, సరికొత్త ఆలోచనలకు దోహదపడతాయని భీమవరం డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సమ్మర్ రెసిడెన్షియల్ వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్, వసు«ధ ఫౌండేష న్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వసుధా ఫౌండేష న్ కార్యదర్శి మంతెన వెంకటరామరాజు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా కార్యదర్శి జి.నారాయణరాజు, వసుధాఫౌండేష న్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, శివరామరాజు, ఎంసీహెచ్ ఆర్కే రాజు, సుదర్శన వర్మ, శ్రీనివాసరాజు, జీవీ పవ న్ కుమార్రాజు పాల్గొన్నారు. -
87 సిలిండర్లు స్వాధీనం
తణుకు టౌన్: తణుకులో డివిజనల్ సివిల్ సప్లయీస్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 87 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు డీటీ డి.అశోక్వర్మ తెలిపారు. బుధవారం కొవ్వూరు డివిజనల్ ఏఎస్ఓ ఆనందబాబు ఆధ్వర్యంలో తణుకులోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బడ్డీ వ్యాపారులు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేశామన్నారు. 87 గృహావసరాల సిలిండర్లను గుర్తించి 50 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వీటిలో 38 ఇండేన్ గ్యాస్, 49 హెచ్పీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. వీఆర్ఓలు ఉన్నారు. -
డీఈడీ కళాశాలలో ఫుడ్ మేళా
దెందులూరు: ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమేనని దెందులూరు విజయ్ నగేష్ డీఈడీ కళాశాల కాలి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు అధ్యక్షతన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. డీఈడీ విద్యార్థులు ఐదు గ్రూపులుగా ఏర్పడి ఐదు విభాగాల్లో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఆడిటోరియం హాల్లో ప్రదర్శించారు. పిండి పదార్థాలు, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు కలిగి ఉన్న వివిధ రకాలు ఆహార పదార్థాలను తయారు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సుగ్గిశెట్టి సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
కేసుల్లో సొత్తు రికవరీ పెంచాలి
ఏలూరు అర్బన్: జిల్లాలో ప్రస్తుతం తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్న నేపథ్యంలో నేరాలను నియంత్రించడంతో పాటు అపహరణకు గురైన సొత్తు రికవరీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని క్రైం డీఎస్పీ టి.సత్యనారాయణ సూచించారు. స్థానిక కోటదిబ్బ ప్రాంతంలోని సీసీఎస్ పోలీస్స్టేషన్లో బుధవారం ఆయన ఏలూరు డివిజన్లోని ఏలూరు టౌన్, ఏలూరు టూటౌన్, ఏలూరు రూరల్, భీమడోలు, గణపవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. చాలా నేరాల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో ఉండటం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పారు. పోగొట్టుకున్న సొత్తును పూర్తిస్థాయిలో అందిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో జరపాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. మహిళా డీఎస్పీ రవికృష్ణకుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇటీవల ఆడవారిపై వేధింపులు పెరిగాయన్నారు. అయితే బాధితులు చాలా కేసుల్లో వివిధ కారణాలతో స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చినప్పుడు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇటీవల మహిళలపై వరకట్న, లైంగిక వేధింపులతో పాటు చిన్నారులపై అత్యాచారయత్నాలు పెరగడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేసేలా చొరవ చూపాలని సూచించారు. సీఐలు ఎన్.రాజశేఖర్, ఉడతా బంగార్రాజు, అడపా నాగమురళి, ఎన్.దుర్గాప్రసాద్, సి. Ðð ంకటేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఈ ఆఫీస్లో జిల్లా ప్రథమం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈ ఆఫీస్ విధానంలో పశ్చిమగోదావరి జిల్లా సేవలు ప్రథమ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర ఖజానా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్రస్థాయి ఖజానా శాఖ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ ఆఫీస్, ఈ కార్యాలయం, ఈ ఫైలింగ్ వంటి అంశాల్లో పశ్చిమ ముందంజలో ఉందన్నారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని చెప్పారు. బయోమెట్రిక్ హాజరు వేసి సదరు ఉద్యోగి కార్యాలయంలో లేకుంటే చర్యలు తప్పవని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మూడేళ్లు దాటిన ప్రతి ఉద్యోగి బదిలీ కావాలని, అప్పుడే ప్రజలకు సరైన సేవలు అందుతాయన్నారు. దీని వల్ల ఉద్యోగులకు అంకితభావం పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఉద్యోగి సామాన్యుడిగా భావించుకుని విధులు నిర్వహించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేయాలి ఉద్యోగుల కుటుంబ పోషణకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజలకు సేవ చేయాలనే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి విధులు నిర్వర్తించాలన్నారు. ఖజానా శాఖ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సహకరించాలన్నారు. గతేడాది 40 శాతం బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, ఈ ఏడాది మరింతగా పెరగాలని ఆయన కోరారు. ఖజానా శాఖ డైరెక్టర్ కె.కనవల్లి మాట్లాడుతూ ఉద్యోగులందరూ నిబద్ధతతో విధులు నిర్వహించి ఖజానా శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యదర్శి రవిచంద్ర అంకితభావంతో ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఖజానా శాఖ అధికారి లలిత, డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ఏజెంట్లను నిర్బంధించిన పెరల్స్ బాధితులు
యర్నగూడెం (దేవరపల్లి) : డిపాజిట్లు కాలపరిమితి దాటినా చెల్లించడం లేదని యర్నగూడెంలో పెరల్స్ బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టి సుమారు రెండు గంటల పాటు నిర్బంధించారు. డిపాజిట్లు చెల్లించే వరకు కదలనీయమని పట్టుపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. యర్నగూడెంకు చెందిన సుమారు 150 మంది కూలీ, నాలీ చేసుకుని పొట్టపోసుకుంటున్న కార్మికులు పెరల్స్ సంస్థలో సుమారు రూ. 2 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిట్ కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీతో సహా డిపాజిట్లు చెల్లించాలని సంబంధిత ఏజెంట్లను కోరారు. అదిగో వస్తాయి. ఇదిగో వస్తాయంటూ ఏజెంట్లు కాలయాప చేస్తూ వస్తున్నారు. ఏజెంట్లపై నమ్మకం లేకపోవడంతో కొందరు డిపాజిట్ దారులు రాజమండ్రిలోని సంస్థ కార్యాలయాలని పలుమార్లు తిరిగారు. అక్కడ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో అయోమయంలో పడ్డారు. అప్పటి నుంచి ఏజెంట్లు కూడా జాడలేక పోవడంతో మోసపోయామని గ్రహించిన డిపాజిట్ దారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతున్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్భంధించి తమ డిపాజిట్లు చెల్లించాలని పట్టుపట్టారు. అయితే సంస్థ కొన్ని ఇబ్బందుల్లో ఉందని, త్వరలో డిపాజిట్లు చెల్లిస్తుందని ఏజెంట్లు నచ్చజెప్పారు. బాధితులు ముంగర మహంకాళి, గణుసుల పాపమ్మ, ముంగర వీరాస్వామి, టి. సాంబమూర్తి, గణుసుతల చంటియ్య మట్లాడుతూ గ్రామంలో సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నామని తెలిపారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్లు చేశామని చెప్పారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని డిపాజిట్లు చేశామని, ఈ విధంగా మోసం జరుగుతుందని ఊహించలేదని బాధితులు వాపోయారు. కాగా గ్రామస్తులు జోక్యం చేసుకుని బాధితుల నుంచి ఏజెంట్లను విడిపించారు. -
ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరి నదిలో చేపల సంచారానికి ఇబ్బందులు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రాజెక్టు ఇంజినీరింగ్, మత్స్యశాఖ అధికారులు బుధవారం సాంకేతికంగా పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ అతిథి గృహంలో సమావేశం నిర్వహించి, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ బాషా మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు కాలువల నుంచి నదిలోకి మైగ్రేషన్ ఉంటుందన్నారు. ఏ నెలల్లో ఏఏ రకాల చేపలు అందుబాటులో ఉంటాయి? సంచరిస్తాయి? అనేది ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. చేపల సంచారానికి వీలుగా స్పిల్వేలో ఎక్కడ డిజైన్ చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. స్పిల్వే ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్నారు. స్పిల్వే 1, 2 బ్లాక్ల మధ్య చేపల సంచారానికి వీలుగా ఏర్పాట్లు చేయటంపై ఇంజినీరింగ్ అధికారులు చర్చించారన్నారు. ప్రధానంగా బొచ్చె, శీలావతి, మోసు, గండుమేను, ఇసుకదొందులు, జెల్ల, పులస, వాలుగు, కొర్ర మేను, రొయ్యలు, బొమ్మిడాయి జాతులు ఉంటాయన్నారు. సైజును బట్టి అవి ప్రయాణం చేస్తాయన్నారు. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వి.సురేష్, డాక్టర్ మాన్సన్, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీలు పి.రామ్మోహన్, డి.గోపిరెడ్డి, పోలవరం అథారిటీ సీఈ ఎ.పరమేశ్వరన్, ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్.రమేష్బాబు సమావేశంలో పాల్గొన్నారు. -
త్వరలో 453 ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో రూ.76.73 కోట్ల వ్యయంతో 453 ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను నాబార్డు నిధులతో నిర్మిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. రూ.575 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన 223 అభివృద్ధి పనుల ప్రగతి తీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యసేవలు విస్తృతం చేసి ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు పటిష్టమైన భవన నిర్మాణ పనులు చేపడతామన్నారు. నాబార్డు ఆర్థిక సహాయం రూ.100 కోట్ల వ్యయంతో 948 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఎన్జీ రంగా యూనివర్సిటీలకు కేటాయించిన నిధుల పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం రామప్రభు, ఆర్అంఽడ్బీ ఎస్ఈ నిర్మల, పంచాయతీరాజ్ ఎస్ఈ ఈ.మాణిక్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి పాల్గొన్నారు. మల్బరీ తోటలకు ప్రోత్సాహం ఏలూరు సిటీ : జిల్లాలో మల్బరీతోటలను ప్రోత్సహించి తక్కువ ఖర్చుతో లాభాల పంట సాధించేలా రైతులను చైతన్యపరచడానికి మల్బరీపై ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో మల్బరీతోటల పెంపుపై ఆన్లైన్లో రైతులకు సేవలందించేందుకు అనువుగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను కలెక్టర్ పరిశీలించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2 వేల ఎకరాల్లో మల్బరీతోటలు పెంచాలని ఒక ప్రణాళికను చేపట్టామని ఇందుకోసం 4 వేల మంది రైతుల పేర్లను 15 రోజుల్లో ఈ యాప్ ద్వారా నమోదు చేయాలని చెప్పారు. -
మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
నరసాపురం: మొగల్తూరు ఆనందా రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఘటనలో మృతిచెందిన కార్మికులకు నష్టపరిహారంగా ఫ్యాక్టరీ ప్రకటించిన రూ.15 లక్షల నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు బుధవారం నరసాపురం మండలం సీతారామపురంలో మంత్రి పితాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై ఐఏఎస్ అధికారితో కూడిన బృందంతో విచారణ జరిపిస్తామని, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్, మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీల విషయంలో తాను మాట మార్చలేదన్నారు. జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్లో వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ట్రీట్ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని, ఆరు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఘోరాన్ని రోడ్డు ప్రమాదంతో పోల్చిన మంత్రి మొగల్తూరు ఘటన మంత్రి పితాని రోడ్డు ప్రమాదంతో పోల్చారు. ఫ్యాక్టరీల యాజమాన్యం నిబంధనలు పాటించాలని, కార్మికుల రక్షణపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే ఆనందా ఫ్యాక్టరీలో ప్రమాదం అనుకోకుండా జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా ఎలా జరుగుతాయో, ఇదీ అలాగే జరిగిందని వ్యాఖ్యానించడంతో పలువురు నోరెళ్లబెట్టారు. ఊరేగింపుగా సీతారామపురం నరసాపురం ఇరిగేషన్ అతిథి గృహం నుంచి సీతారామపురం వరకూ మంత్రి పితానిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనందా ఫ్యాక్టరీ ఘటన మృతుల బంధువులను అధికారులు సీతారామపురం రప్పించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి పరామర్శిస్తారని, అక్కడే నష్టపరిహారం కూడా ఇస్తారని అంతా భావించారు. ఫ్యాక్టరీని కూడా మంత్రి పరిశీలిస్తారని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సీతారామపురంలో కార్యక్రమం ఏర్పాటుచేసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఐదుగురి మృతుల్లో నల్లం ఏడుకొండలు బంధువులు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారానికి సంబంధించి రూ.20 లక్షలు అందించామని, మిగిలిన రూ.5 లక్షలు త్వరలో అందజేస్తామని మంత్రి పితాని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, నరసాపురం సబ్కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, మున్సిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, చినమిల్లి సత్యనారాయణ, అండ్రాజు చల్లారావు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ పాల్గొన్నారు. -
విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
రాజంపేట టౌన్ : విద్యార్థులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి సీ.చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ‘అంబేడ్కర్ జీవితం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చెన్నయ్య ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగానే భారతదేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని చెన్నయ్య తెలిపారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎన్.శివరామయ్య, ధర్మరాజు నాయక్, ఎం.రాజయ్య, జీ.పెంచలయ్య, డి.చెంగల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల స్టెప్పులు అదిరే..
ఏలూరు సిటీ : స్ధానిక ఆర్ఆర్పేటలోని శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ 13వ వార్షి కోత్సవం బుధవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో స్ఫూర్తి అవార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమని, విద్యా సంస్థల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల డైరెక్టర్ కె.మదనమోహనరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్య శారద, విద్యావేత్త బొమ్మి అచ్యుతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ సేవలతో దళితుల అభ్యున్నతి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశంలో అణగారిన, దళిత వర్గాల అభివృద్ధికి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ ఎనలేని సేవలు చేశారని, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. జగ్జీవన్రామ్ 110వ జయంతిని బుధవారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి ఆళ్ల నాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉప ప్రధానిగా జగ్జీవన్రామ్ చేసిన సేవలు తదనంతర కాలంలో వచ్చిన నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అణగారిన వర్గాలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, విధానాలు ఉండాలని భావించి అంబేడ్కర్ రాజ్యాంగంలో వీటిని పొందుపరిస్తే అమలు చేయడంలో జగ్జీవన్రామ్ కీలక ప్రాత పోషించారన్నారు. అంబ్కేర్, జగ్జీవన్రామ్ పోరాటాలే స్ఫూర్తిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని నియంతృత్వ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. జాతీయ నాయకుల ఆశయాలను నెరవేర్చడానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయన మార్గదర్శకులు సీనియర్ నాయకుడు పటగర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ దేశంలోనే వెనుకబడిన బిహార్ నుంచి దళితుల అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన జగ్జీవన్రామ్ ఎందరో దళిత నాయకులకు మార్గనిర్దేశంగా నిలిచారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నగర కన్వీనర్ మున్నుల జాన్ గురునాథ్ అధ్యక్షత వహించగా పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాద్, జిల్లా నాయకుడు మామిళ్లపల్లి జయ ప్రకాష్, కార్పొరేటర్లు కర్రి శ్రీను, బండారు కిరణ్, నాయకులు వేగి లక్ష్మి ప్రసాద్, పైడి భీమేశ్వరరావు, దుర్గారావు, మహ్మద్ ఖైసర్, పల్లెం ప్రసాద్, శిరిపల్లి ప్రసాద్,మట్టా రాజు, బోడా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బాబూ జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ లలిత, ఎం.వెంకటేశ్వరరావు, కె.శ్రీను, ఎల్ జయశ్రీ,. టి.రమ్య, సీహెచ్ రాఘవ పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా బలుసులమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ
తాడేపల్లిగూడెం : తాడేపల్లి గూడెం పట్టణ ఇలవేలుపు బలుసులమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 9.06 గంటలకు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం మంత్రోచ్చారణల మధ్యసాగింది. స్వర్ణయంత్ర, విగ్రహ, శిఖర స్థాపనలు, కళాన్యాసం, దృష్టి గోవు, కుంభ నివేదన, కూష్మాండచ్ఛేదన తదితర పూజలు జరిగాయి. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయం వద్ద వేచి ఉన్నారు. అమ్మవారి పుట్టింటి చీరను పాశం వారి ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఆలయంలో బలుసులమ్మ విగ్రహం ఎదుట ప్రతిష్ట మూర్తిని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికి ముందు శ్రీచక్రాన్ని ఉంచారు. అనంతరం కర్రిగోవుతో దృష్టిగోవు కార్యక్రమం నిర్వహించారు. గోపురంపై శిఖర ప్రతిష్ట చేసి భక్తులు తీసుకువచ్చిన బూరెలను పై నుంచి పోశారు. ఇదే సమయంలో పూర్ణాహుతి జరిగింది. అగ్ని ఉద్వాసన, అవభృదం, బలిహరణ, కంకణ విమోచన కార్యక్రమాలు జరిగాయి. పారవశ్యంలో భక్తులు కోర్కెలు తీర్చే కల్పవల్లి, గ్రామ దేవత, పట్టణ ఇలవేలుపు అయిన బలుసులమ్మ వారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కేరళ సాంప్రదాయ రీతిలో ఆలయాన్ని అలంకరించారు. శివస్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. యీవని సత్యనారాయణ అవధాని, యీవని వెంకట రామాచంద్రరావు, బాదంపూడి ఫణిశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ, వేద ఆగమన పండితులు పర్యవేక్షణలో పూజలు జరిగాయి. దేవాదాయశాఖ జ్యోతిషులు పూజ్యం విశ్వనాథ్, కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి బాబు, శ్రీరంగం సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, వలవల సూరిబాబు, నంద్యాల కృష్ణమూర్తి, వడ్డి రఘురామనాయుడు, పాలడుగు అయ్యన్న, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతకు ప్రత్యేక వాహనాలు
ఏలూరు అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 13 హైవే పెట్రోలింగ్ వాహనాలను అందించిందని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని నివారించే లక్ష్యంతో ప్రభుత్వం బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)లు గుర్తించగా జిల్లాలో 39 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని చెప్పారు. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లాలో ఎన్హెచ్–16కు సమీపంలోని 13 పోలీస్స్టేషన్లకు 13 వాహనాలు అందించారన్నారు. వాహనాల్లో వైర్లెస్, జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటాయని, పెట్రోలింగ్ కోసం వాహనానికి ఏఎస్సై, హెచ్సీ, కానిస్టేబుల్ను కేటాయిస్తామని చెప్పారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్ లు అందుబాటులో లేకుంటే బాధితులను పెట్రోలింగ్ వాహనాల్లో తరలిస్తారన్నారు. వాహనాలను ఏఆర్ డీఎస్పీ పర్యవేక్షిస్తారన్నారు. కోడిపందేలపై దాడులు పెదవేగి రూరల్: పెదవేగి మండలంలోని కోడిపందేల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయన్నపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని రెండు పందెంకోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొండలరావుపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఏడుగురి నుంచి రూ.3,300 నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
పొగాకు బ్యారన్ దగ్ధం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గొల్లగూడెంలో బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బ్యారన్ దగ్ధమైంది. బ్యారన్తో పాటు పొగాకు అగ్నికి ఆహుతైంది. వివరాలిలా ఉన్నాయి.. కౌలు రైతు బుట్టా చంద్రం అనే రైతుకు చెందిన బ్యారన్ క్యూరింగ్ దశలో ఉండగా, రేషన్కర్ర విరిగి పొగ గొట్టంపై పడటంతో ప్రమాదం జరిగింది. దీంతో బ్యారన్లో కూరింగ్ చేస్తున్న పొగాకు కొంత మేర కాలిబూడిదైంది. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్షన్నర నష్టం వాటిల్లినట్టు సర్పంచ్ గొడ్డటి రాణి తెలిపారు. tobbaco byaren burned -
ఉగాది ఉత్సవాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: ప్రజల ఇలవేల్పు, వరాలిచ్చే దేవత బలుసులమ్మ ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రజక ఆసాదులతో గరగల సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం గోదావరి ఏలూరు కాలువ వద్ద ఉన్న పెద్ద శివాలయం వద్ద నుంచి గరగలను బలుసులమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయం వద్ద డాక్టర్ శశి కుమార్, డాక్టర్ శైలజ దంపతులతో కలశస్థాపన చేయించారు. అనంతరం గోపూజ జరిగింది. భీమవరం మావుళ్లమ్మ దేవాలయ పండితుడు ఘనాపాటి పరిమెళ్ల వాస్తవ్యులు బాదంపూడి ఫణిశర్మ, బలుసులమ్మ ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్శర్మ, గోపీనా«థ్ శర్మ ల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఉగాది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది ఉత్సవాల తర్వాత నూతన ఆలయంలో అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగనుండటం శుభసూచకంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శ్రీరంగం అంజి, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, టీడీపీ నాయకులు వలవల సూరిబాబు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ , కల్యాణం రామచంద్రరావు, పాలడుగుల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు: పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం 4,280 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,340 క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,660 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 28 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. వంతుల వారీ విధానం కారణంగా అత్తిలి కాలువకు నీటి విడుదల తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ కాలువ పరిధిలో ఆయకట్టుకు నీరందకపోవడంతో చేలు నెరలు తీస్తున్నాయి. -
విద్యార్థినులకు కళలపై శిక్షణ
ఏలూరు (సెంట్రల్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు త్వరలో కూచిపూడి, భరతనాట్యం వంటి 68 కళల్లో శిక్షణ ఇస్తామని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని ఏపీ ఫౌండేషన్ కోర్సు సలహాదారు ఆర్.రవీంద్ర అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం ద్వారా 2020 నాటికి మొదటి 10 ర్యాంకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కామన్ సిలబస్ను ప్రవేశపెట్టనుందని, దీని ద్వారా ఏ జిల్లాలో విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనే అంచనాకు వచ్చి వారికి మెరుగైన విద్యనందిస్తామని చెప్పారు. 16 కేంద్రాల్లో ఫౌండేషన్ కోర్సు రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో అడ్వా న్స్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించామని రవీంద్ర చెప్పారు. హైస్కూల్స్లో మౌలిక సదుపాయాల నిమిత్తం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, ఉపాధ్యాయులు కావాల్సిన సదుపాయాల నిమిత్తం తమకు నివేదిక ఇస్తే 48 గంటలలోపు మంజూరు చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ ఏడు హైస్కూళ్లలో విద్యార్థుల చేరిక పెరిగిందని, 10వ తరగతి ఫలితాల్లో 93 శాతం వచ్చిందన్నారు. అన్ని పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
తీరానికి కూర్మ కళేబరం
మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది. దీని ప్రభావం జలచరాలపై పడింది. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిసిన తెట్టును తొలగించినా సముద్ర జలచరాలకు పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం నరసాపురం మండలం పీఎం లంక తీరానికి మృత డాల్ఫిన్ కొట్టుకురాగా, బుధవారం మొగల్తూరు మండలం కేపీ పాలెం తీరానికి మృత తాబేలు కొట్టుకువచ్చింది. -
ప్రత్యేకహోదాపై యూత్ ప్రచారం
పెనుగొండ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని సర్కారు కొన్ని కుయుక్తులు పన్నినా యూత్ మాత్రం పోరుబాట వీడ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పెనుగొండలో పెనుగొండ యూత్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక హోదా స్టిక్కర్లను బుధవారం వాహనాలకు అతికించారు. ప్రత్యేక హోదా వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగించాలంటూ ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఒకరకంగాను, ఎన్నికల అనంతరం ఒక రకంగాను వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఐకమత్యంగా పోరాడితేనే ప్రత్యేక హోదా సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో పెనుగొండ యూత్ సభ్యులు కడలి పురుషోత్తం, కానూరి అర్జునరావు, గుర్రాల శ్రీనివాసరావు, ఎస్ఎంఆర్ రఫీ, సుందర కనకరాజు, ఘంటసాల శివ పాల్గొన్నారు. -
హెల్మెట్ ప్రాణానికి రక్ష
ఏలూరు అర్బన్ : హెల్మెట్ ద్విచక్రవాహనదారుల ప్రాణానికి రక్ష అని ఎస్పీ భాస్కర్భూషణ్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ భధ్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అమీనాపేట రిజర్వ్ పోలీసు క్వార్టర్స్ సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. ఇటీవల కాలంలో యువకులు అదుపులేని వేగంతో వాహనాలు నడుపుతున్నారని, ఇది తగదని సూచించారు. అనంతరం పోలీసులు హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వలిశల రత్న, డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, పి.భాస్కరరావు, ఎన్.చంద్రశేఖరరావు, ఓఎస్డీ బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
భీమవరం అర్బన్ : మండలంలోని వెంపలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. రానున్న కాలంలో జాతీయస్థాయి క్రీడలను నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను అలరించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వీఆర్ దాస్, నిర్వాహకులు కలిదిండి కాశీరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదిండి చిన బంగార్రాజు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
ఉంగుటూరు : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి జాతీయస్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈవో డి. మధుసూదనరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహణ అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకుడు ఆదిరెడ్డి సత్యనారాయణను డీఈవో అభినందించారు. తొలుత అతిథులు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతర్జాతీయ పోటీల న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్కుమార్, టెక్నికల్ చైర్మ న్ ఆర్ఎస్ సింగ్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, డీవైఈవో విలియం, స్టేట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి పి.రవీంద్ర, ఎంఈవో చిడిపి వెంకటరత్నం పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నందలూరు: నందలూరు మండలంలోని సోమశిల వెనుక జలాలవద్ద పాత తిమ్మరాజుపల్లె గ్రామం మొండిగోడల వద్ద దాచి ఉన్న ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి టాస్క్ఫోర్స్ వారి సమాచారంతో రాజంపేట డీఎస్పీ రాజేంద్ర ఆదేశాలమేరకు బుధవారం తెల్లవారుజామున పాత తిమ్మరాజుపల్లెలోదాడులు నిర్వహించగా నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు తమపై రాళ్లు రువ్వుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వారిలో పొత్తపి గ్రామానికి చెందిన ఈగా పెంచల్రెడ్డి, చుక్కాయపల్లె గ్రామానికి చెందిన చుక్కా వెంకటరమణ, కోనేటి శ్రీనివాసులును అదుపులోకి తీసుకోగా పొత్తపికి చెందిన వెంకటరమణారెడ్డి పారిపోయాడన్నారు. అరెస్టుచేసిన వారిని నందలూరు కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. ఈ దాడులలో కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి, సుధాకర్రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పిన ప్రమాదం..మోటార్ సైకిల్ తునాతునాకులు
నారాయణపురం(ఉంగుటూరు) : జాతీయరహదారి నారాయణపురం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మోటార్ సైకిల్ తునాతునకలైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుకు చెందినబొడ్డు వెంకట అప్పరెడ్డి మోటార్ సైకిల్పై పెట్రోల్ బంకుకు వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అప్పిరెడ్డి తప్పించుకోగా మోటార్ సైకిల్ తునాతునకలైంది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్
ఏలూరు రూరల్ : ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఫ్లో పుట్బాల్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. తణుకు, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం అలరించింది. ఈ మ్యాచ్లో ఏలూరు జట్టు 2–1 తేడాతో తణుకు జట్టుపై విజయం సాధించింది. దీంతో ఏలూరు జట్టుకు రెండో విజయం దక్కగా తణుకు జట్టు నాలుగోసారి ఓటమిపాలైంది. ఇరుజట్లు ఆటగాళ్లు ఆట మొత్తం దూకుడుగా ఆడడంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వందలాది పాఠశాల పిల్లలు, అభిమానులు ఆసక్తిగా తిలకించారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ క్రీడాకారుడు లొఫొకు దక్కింది. గురువారం గణపవరంలో తాడేపల్లిగూడెం, భీమవరం జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని జిల్లా పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు చెప్పారు. -
నేడు, రేపు ఏఈల ఆన్లైన్ పరీక్ష
కడప అర్బన్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఆన్లైన్ పరీక్ష (మెన్స్) ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నట్లు స్పెషల్డిప్యూటీ కలెక్టర్ ఈశ్వరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు, 30న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కడప, సీకే దిన్నె, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారని వివరించారు. ఇందుకుగాను ఉప తహసీల్దార్లు, సీకే దిన్నె, కడప, వేంపల్లె, ప్రొద్దుటూరు, రాజంపేట వారిని లైజన్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా హాజరై రిజిష్టర్ కావాల్సి ఉందన్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని తెలిపారు.. హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకు రావాలని సూచించారు. -
డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ
కొవ్వూరు రూరల్: జిల్లాలో 9 పురపాలక సంఘాల్లోని డ్వాక్రా మహిళలకు చిరు వ్యాపారాలు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ ఇస్తామని మెప్మా పీడీ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది డ్వాక్రా రుణాలకు సంబంధించి రూ.90 కోట్ల పెట్టుబడి నిధిని వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. బుధవారం స్థానిక లిటరరీ క్లబ్ ఆవరణలో పురపాలక సంఘ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 494 స్వయం సహాయ సంఘాలకు రెండో విడత పెట్టుబడి నిధి సొమ్ము రూ.కోటి 47 లక్షల 45 వేల చెక్కును ఎమ్మెల్యే కేఎస్ జవహర్ చేతులమీదుగా అందజేశారు. చంద్రన్న బీమాలో నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్, ఆర్డీవో బి. శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తదితరులు మాట్లాడారు. -
బ్యాంకు అధికారులపై రైతుల ఆగ్రహం
ధర్మాజీగూడెం (లింగపాలెం) : మండలంలోని ధర్మాజీగూడెం ఎస్బీఐ వద్ద నగదుకోసం రైతులు, బ్యాంక్ అధికారుల మధ్య బుధవారం ఘర్షణ చోటుచేసుకుంది. సొమ్ములు తీసుకునేందుకు ఉదయం పెద్ద సంఖ్యలో వినియోగదారులు బ్యాంకుకు చేరుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు అధికారులు ఒక్కొక్కరికీ నాలుగు వేల చొప్పున నగదు అందజేశారు. ఈ క్రమంలో జనం బారులు తీరిన ఉన్నా అధికారులు బ్యాంకు గేటును మూయించారు. దీంతో బయట ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజరతో మాట్లాడి గేటు తీయించారు. దీంతో ఒక్కసారిగా లోనికి వెళ్లిన రైతులు మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. ఖాతాదారులను విస్మరించి సొమ్ములను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో బ్యాంకు అధికారులు, రైతులు మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. బ్యాంకులో అవకతవకలు జరగడం లేదని అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించుకోవాలని మేనేజర్ అన్నారు. సొమ్ములు కావాలని రైతులు పట్టుబట్టడంతో ఒక్కొక్కరికీ రూ.2 వేలు చొప్పున అందజేశారు. దీంతో గొడవ సర్దుమణిగింది. -
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఏడు రోజులకు గాను నగదు రూపంలో రూ.37,29,587, కానుకుల రూపంలో 83 గ్రాముల బంగారం, 971 గ్రాముల వెండి లభించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా అధికంగా లభించిందని చెప్పారు. పాతనోట్ల తిరస్కరణ హుండీల ఆదాయంలో ప్రభుత్వం రద్దు చేసిన 476 రూ.1,000, 535 రూ.500 నోట్లు వచ్చాయి. వీటి మొత్తం రూ.7,43,500 ఉంది. అయితే స్థానిక ఆంధ్రాబ్యాంకు అధికారులు మాత్రం ఈ నోట్లను జమచేసేందుకు అంగీకరించలేదు. ఈనెల 30న ఒకేసారి ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని బ్యాంకు అధికారులు సూచించారని, దీంతో హుండీ ఆదాయాన్ని రూ.29,86,083గా చూపినట్లు ఈవో చెప్పారు. -
నేడు జాబ్మేళా
వైవీయూ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం జాబ్మేళా జరగనుంది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డా. ఎన్.సుబ్బనరసయ్య, జేకేసీ కోఆర్డినేటర్ డా. ఎం. రమేష్ తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ (ఐఎల్ఎం) ఆధ్వర్యంలో జూనియర్ ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2016లో పాసైన విద్యార్థులతో పాటు ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9490701588 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రేషన్న్ షాపులపై విజిలెన్స్ దాడులు
ఆకివీడు : రేషన్ షాపులపై బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక రైల్వేస్టేనన్న్స్ షన్ రోడ్డులోని 22,23 నంబర్ల షాపుల్లో రికార్డులు, సరుకు నిల్వలను పరిశీలించారు. 22వ నంబర్ షాపులో 64 కేజీల బియ్యం తక్కువగా ఉందని, పంచదార 15 కేజీలు, కిరోసిన్ 301 లీటర్లు రికార్డుల్లో చూపించిన దానికన్నా అదనంగా ఉందని విజిలెన్స్ తహసీల్దార్ శైలజ వెల్లడించారు. షాపునంబర్ 23లో 55 కేజీల బియ్యం, 391 లీటర్ల కిరోసిన్ అదనంగా ఉన్నాయని వివరించారు. ఈ రెండు షాపుల డీలర్లు రాజామణి, వి.వి.ఎస్.శంకర్ వర్మలపై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో పుడ్ ఇన్స్ స్పెక్టర్ సీతారామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, వీఆర్వో రత్నరాజు పాల్గొన్నారు. -
ఐటీ కొరడా
ఏలూరు (మెట్రో) : ఏలూరులో బంగారం దుకా ణంపై ఐటీ అధికారులు దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత నగరానికి చెందిన బంగారం వ్యాపారి రూ.22 కోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయ డంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు వన్టౌన్ పరిధిలో శీరం వెంకన్నకు చెందిన నగల దుకాణంపై బుధవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దుకాణ యజమాని ఇటీవల కాలంలో రూ.22 కోట్లను బ్యాంకుల్లో జమ చేయడం, బిల్లులు లేకుండా రూ.కోటి యాభై లక్షల విలువైన బంగారాన్ని కలిగి ఉండటాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అతని దుకాణంలో అర్ధరాత్రి వరకూ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకన్నకు గతంలో భీమవరంలో భార్య పేరుతో ఒక దుకాణం ఉండేది. ఐటీ ఇబ్బందుల వల్ల భీమవరంలోని దుకాణాన్ని మూసేసిన వెంకన్న వ్యాపారాన్ని ఏలూరుకు మార్చాడు. భీమవరంలోని వారితో ఉన్న పరిచయాలతో ఆయన ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నాడు. పరిచయాలను కొనసాగిం చేందుకు తన కుమారుడిని భీమవరంలోనే ఉంచాడు. పెద్దనోట్ల రద్దు తర్వాత గత పదిరోజుల వ్యవధిలో అతను రూ.22 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడంతో ఆ ఖాతాను స్తంభింప చేసి వల్లభ జ్యూయలర్స్పై దాడి చేశారు. దాడుల్లో ఐటీ విజయవాడ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా డెప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోమవరప్పాడుతోపాటు ఏలూరు నగరంలోనూ లెక్కలు చూపని నగదును పోలీసులు, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. -
96 శాతం పంటకోత ప్రయోగాలు పూర్తి
వసంతవాడ (పెదపాడు): ప్రధానమంత్రి ఫసలీ బీమా ఫదకంలో భాగంగా జిల్లాలో 2,626 పంటకోత ప్రయోగాలకు గాను 2,521 ప్రయోగాలు నిర్వహించినట్టు ముఖ్య ప్రణాళిక అధికారి, జాయింట్ డైరెక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. బుధవారం పెదపాడు మండలంలోని వసంతవాడ గ్రామంలో పంటకోత ప్రయోగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటకోత ప్రయోగాలను పారదర్శకంగా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు అందిస్తున్నామన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, పంట కోత ప్రయోగాల ఆధారంగానే రైతులు బీమా చెల్లిస్తారని చెప్పారు. జిల్లా ఉపసంచాలకుడు టి.సురేష్కుమార్, మండల సహాయ గణాంక అధికారి కె.గాంధీ వీఆర్వో సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. -
ముగిసిన అథ్లెటిక్ పోటీలు
వట్లూరు (పెదపాడు) : సర్ ïసీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. కళాశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యక్షుడు వీవీ బాల కృష్ణారావు, కార్యదర్శి ఎంవీకే దుర్గారావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ యూఎం ఎస్.రామప్రసాద్, యాజమాన్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ∙మహిళల పోటీలు 100మీ విభాగంలో కె.విజయలక్షి్మ(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో ఎం. మౌనిక విజయనగరం, 5 కిమీ నడక విభాగంలో డి.శేషారత్నం(ఏలూరు), 100 మీ హార్డిల్స్లో ∙కె.సుశీల (విజయనగరం), 400 మీ రిలే విభాగంలో సీహెచ్ వెంకటలక్ష్మి, కె.రమాదేవి, కె.విజయలక్ష్మి, సీహెచ్ వాణి(విశాఖపట్నం), షాట్పుట్ విభాగంలో సీహెచ్ ఉమ (విజయనగరం), ∙జావెలిన్ త్రోలో బి.సంధ్యారాణి(విశాఖపట్నం), హై జంప్ విభాగంలో ఒ.భవానీ(విశాఖపట్నం), ∙హెఫ్తాలాన్ విభాగంలో ఎం.లావణ్య (బొబ్బిలి) విజేతలుగా నిలిచారు. ∙పురుషుల 100 మీ విభాగంలో ఎల్.జనార్దనరావు(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో టి.అప్పారావు (విశాఖపట్నం), 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఎస్ రాజు (విశాఖపట్నం), 400 మీ.హార్డిల్స్లో టి.వెంకటరావు (బొబ్బిలి), 100 మీ రిలే విభాగంలో ఎల్ జనార్దనరావు పీడీవై తేజ, ఎన్.గౌతమ్రెడ్డి, ఆర్కుమార్ నాయక్(విశాఖపట్నం), 400 రిలే విభాగంలో కె.కృష్ణమూర్తి, ఎల్.సాయికుమార్, బి.మురళీరాధ, ఎస్.వంశీకృష్ణ(విశాఖపట్నం), జావెలిన్త్రో విభాగంలో పి.రామకృష్ణ(కొత్తవలస), హమ్మర్ త్రో విభాగంలో ఎల్.కిరణ్కుమార్, హై జంప్ ఎన్.సింహాచలం (కొత్తవలస), డెకత్లాన్ పోటీలలో ఎ.అప్పన్న(విశాఖపట్నం) విజేతలుగా నిలిచారు. ఓవరాల్ చాంపియన్గా ఎస్వీవీపీవీఎంసీ డిగ్రీ కళాశాల విశాఖపట్నం నిలిచింది. ఇదే కళాశాలకు చెందిన ఎల్.జనార్దనరావు పాస్టెస్టు మన్ అవార్డు పొందాడు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తణుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ చర్యలు చేపట్టాలో సర్వే చేస్తున్నట్టు, ఆ నివేదిక ఆధారంగా ఆయా కూడళ్లలో రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.సత్యనారాయణమూర్తి తెలిపారు. తణుకు మండలం దువ్వ వెంకయ్య వయ్యేరు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు పదహారో నంబరు జాతీయ రహదారిౖపై ప్రధాన కూడళ్లలో జరుగుతున్న ప్రమాదాలపై బుధవారం ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఆయా కూడళ్లలో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలు ఏమిటనే కోణంలో సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంవీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్ది ఆదాయం రూ.23.33 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్చార్జి తనిఖీదారు ఆర్.బాలాజీ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 30 రోజులకు గాను రూ.23,33,731 ఆదాయం వచ్చిందని, దీనిలో నోట్లు రూ.21,34,916, నాణాలు రూ.1,98,815, 3 విదేశీ కరెన్సీ నోట్లు, ఒక అమెరిక¯ŒS డాలర్ లభించాయని చెప్పారు. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయానికి ఈసారి రూ.11,96,165 అధికంగా ఉందన్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. సోమేశ్వరస్వామి ఆదాయం రూ.1.45 లక్షలు భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారికి కార్తీమాసం నెల రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన సొమ్ము లెక్కించగా రూ.1,4,5, 470 లభించినట్టు ఈవో నల్లూరి సతీష్కుమార్ తెలిపారు. -
భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లతో 1.24 లక్షల బోరుబావులు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర భూగర్భజల శాఖ డైరెక్టర్ కె.వేణుగోపాల్ చెప్పారు. పట్టణంలోని భూగర్భజల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో భూగర్భజలాల వాడకం బాగా పెరిగిందని సమృద్ధిగా ఉండే జిల్లాలో కూడా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం ప్రమాదకర పరిణామమని ఆయన చెప్పారు. గత మే నెలలో 19.08 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు వర్షాలు, పోలవరం కుడి కాలువ తదితర అంశాల వల్ల ప్రస్తుతం 17.01 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. ఆరునెలలతో పోలిస్తే 2 మీటర్లు భూగర్భజలాలు పెరిగినా గత నెలతో పోలిస్తే 0.53 మీటరు నీరు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 1.24 లక్షల బోరు బావులు నిర్మిస్తే అదనంగా 10 లక్షల ఎకరాలకు సేద్యపు నీరు అందుబాటులోకి తీసుకురాగాలని చెప్పారు. జిల్లాలో వినూత్న కార్యక్రమం కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముందు చూపువల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గోదావరి జలాలను భూగర్భంలోకి మళ్లించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వేణుగోపాల్ చెప్పారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలోని జగన్నాథపురంలో రైతుల సహకారంతో భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయోగాత్మకమైన కృషి ఫలిచిందనన్నారు. త్వరలోనే 15 బోర్లు ద్వారా గోదావరి జలాలను భూగర్భంలో భద్రపరుస్తామన్నారు. జగన్నాథపురం గ్రామంలో చిలకలపూడి నరేంద్ర అనే రైతు భూమిలో కోడూరు చెరువు ద్వారా పట్టిసీమ నీటిని మళ్లిచి ఆదర్శ రైతు పర్వతనేని బాబ్జి ఇంజక్షన్ బావికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ బావిని తాము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. భూగర్భ జలశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా ఉపసంచాలకుడు రంగారావు పాల్గొన్నారు. -
ఉల్లి మార్కెట్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల గోదాములు, విక్రయ కేంద్రాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఉల్లి విక్రయాలు, కాటా, నిల్వల గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, పాత నోట్లు కూడా తీసుకుంటున్నట్టు వ్యాపారులు జేసీకి చెప్పారు. అనంతరం జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉల్లి కొరత ఉంటే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని, వ్యాపారులు సహకరించాలని కోరారు. జిల్లాలో ఉల్లిపాయలు, నిత్యావసర సరుకులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వ్యాపారులు తీసుకురావద్దని సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ డి.శివశంకర్రెడ్డి, తహíసీల్దార్ పాశం నాగమణి, సీఎస్డీటీ రమణ ఉన్నారు. -
ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలి
నరసాపురం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ డిమాండ్ చేశారు. తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అంబేడ్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల్లో బలరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 గ్రామాల ప్రజలు నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 1972లో జలకాలుష్య నిర్మూలనపై చట్టం చేసినా, నేటి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీక్షా శిబిరాన్ని సర్వోదయ రైతు సంఘం నాయకుడు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన పోరాడాలని కోరారు. దీక్షల్లో ఎం.త్రిమూర్తులు, యడ్ల చిట్టిబాబు, పొగాకు నారాయణరావు, కాకిలేటి ప్రసాద్, తెలగంశెట్టి సత్యనారాయణ కూర్చున్నారు. సీపీఎం పాదయాత్ర వాయిదా ఏలూరు(సెంట్రల్): గొంతేరు, యనమదుర్రు, గోస్తనీ, కొల్లేరు జీవనదులు, భూగర్భ జలాల కాలుష్యంపై నిర్వహించనున్న ప్రజాభేరి పాదయాత్ర వాయిదా వేసినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసినట్టు చెప్పారు. తిరిగి పాదయాత్ర ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
ప్రైవేట్ వైద్యుల ‘సత్యాగ్రహం’
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపుమేరకు బుధవారం జిల్లాలో నర్సింగ్ హోంలు, క్లినిక్లను మూసివేసి వైద్యులు సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామచంద్రరావుపేటలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏలూరు డాక్టర్ల బృం దం ఎంపీ మాగంటి బాబుకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆచరణయోగ్యం కాని చట్టాలను అమలు చేస్తోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయడం తగదని వైద్యులు అన్నారు. నకిలీ డాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇటువంటి స్థితిలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు మూ సి సత్యాగ్రహం చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఐఎంఏ ఏలూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కానాల మద్దేశ్వరరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు, కోశాధికారి డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ మానం పద్మనాభం, డాక్టర్ దిరిశాల వరప్రసాద్ పాల్గొన్నారు. రోగుల ఇబ్బందులు నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, నర్సింగ్ హోంలు బంద్ పాటించడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో దాదాపు 150 మంది వైద్యు లు తమకు చెందిన సుమారు 60 ఆసుపత్రులను మూసివేసి ఆందోళనలో పాల్గొనడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రులకు వచ్చిన అత్యవసర రోగులు జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులకు పరుగులు తీయా ల్సి వచ్చింది. నగరంలోని వైద్యులు మ ధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేసి సా యంత్రానికి గాని వైద్యసేవలు ప్రారంభించకపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లకు నర్సులు, కాంపౌండర్లు సేవలు అందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఉసూరుమన్నారు. -
సోమారామంలో రుద్రహోమం
భీమవరం ప్రకాశం చౌక్: పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో బుధవారం రుద్రహోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు తాగు,సాగు నీరందించే పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తికావాలని హోమం జరిపించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ఈవో సతీష్కుమార్, అర్చకులు సోంబాబు, మావుళ్లమ్మ ఆలయ చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు. లక్షపత్రిపూజ ఆలయంలో లక్షపత్రి పూజను ఘనంగా నిర్వహించారు. పండితులు గంటల సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో లక్షపత్రి పూజ, కల్యాణం జరిపించారు. స్వామి దర్శనానికి వచ్చిన వెంకటేశ్వర బధిరుల పాఠశాల విద్యార్థులకు అన్నప్రసాదాన్ని అందించారు. -
నేటి నుంచి జేవీవీ సైన్స్ సంబరాలు
ఉండి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్టు వేదిక జిల్లా నాయకుడు గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉండిలో జేవీవీ సైన్సు సంబరాల పోస్టర్ను డీవైఈవో మద్దూరి సూర్యనారయణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా డీవైఈవో మాట్లాడుతూ సైన్సుపై విద్యార్థులకు మక్కువ కలిగించడంలో జేవీవీ కృషి అభినందనీయమని అన్నారు. 26 సంవత్సరాలుగా సైన్సుపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జెడ్పీ హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వేదిక శాఖ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సునీల్కుమార్, నిమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు. -
ముగిసిన సప్తాహ మహోత్సవాలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులచే ఆలయ అర్చకులు, వేద పండితులు సప్తాహ మహోత్సవ ముగింపుల పూజలు, మహా శాంతి హోమం పూజలు జరిపించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. 2 వేల మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన మండలి సభ్యులను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు పాల్గొన్నారు. -
సాధికార సర్వేకు సహకరించండి
నిడమర్రు : సాధికార సర్వే నూరుశాతం పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని మండల ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ వై. ఆనంద్ కుమారి చెప్పారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్మార్ట్ పల్స్ సర్వేపై ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆనంద్కుమారి మాట్లాడుతూ ఈనెల 13 వరుకూ ఈ స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఎం.సుందర్రాజు, ఎంపీడీవో డి.దామోదరావు, డీటీ ఎస్ఎం ఫాజిల్, ఎంపీపీ నిమ్మల మాణిక్యాలరావు, జెడ్పీటీసీ సభ్యులు వి.దివాకరరావు, వైస్ ఎంపీపీ టి.నక్షత్రం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతం బలిగొంది
మేడపాడు (యలమంచిలి): మేడపాడు పంచాయతీ పరిధిలోని బోడిగరువు వద్ద రొయ్యల చెరువు ఇంజన్కు ఉన్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో చెరువు సాగు చేసే ఆక్వా రైతు వంగా మహంకాళి ఉరఫ్ బాబులు (45) అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం మహంకాళి స్వగ్రామం పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. కొన్నేళ్లుగా నరసాపురంలో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం మేడపాడులో ఐదెకరాలు చెరువులు లీజుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం చెరువు వద్దకు వచ్చిన మహంకాళి ఇంజన్లో సమస్య తలెత్తడంతో చెరువు వద్ద పనిచేసే కూలీతో ఇంజన్లో నీరు పోయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంజన్కు వెళ్లిన విద్యుత్ తీగలపై చేయి వేశాడు. తీగకు జాయింట్ ఊడటంతో విద్యుదాఘాతానికి గురై చెరువులో పడిపోయాడు. వెంటనే చెరువుపై ఉండే కూలీలు అతడిని బయటకు తీసుకువచ్చి 108కు సమాచారం అందించారు. వా హనం వచ్చే సరికే మహంకాళి మరణించాడు. మృతునికి భార్య అంజలీదేవి, కుమార్తె యామిని ఉన్నారు. వీఆర్వో పెనుగొండ సూర్యనారాయణ, ఎస్సై పాలవలస అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరికి 29,074 క్యూసెక్కుల ఇ¯ŒSఫ్లో వస్తుంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,774 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. -
పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ
జంగారెడ్డిగూడెం : పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాల్లో భాగంగా నిర్వహించే అభిషేక కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఇనగంటి శ్రీనివాసరావు వెండి బిందెను సమర్పించారు. సుమారు 900 గ్రాముల బరువు ఉండే ఈ వెండి బిందెను భార్య భూలక్ష్మిదేవితో కలిసి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శ్రీనివాసరావు దంపతులను ఆశీర్వదించి, స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయణ, తోట రామకృష్ణ, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా క్రికెట్ బాలుర జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : జిల్లా అండర్–19 క్రికెట్ బాలుర జట్టును బుధవారం ఉంగుటూరు మండల నారాయణపురం బాపిరాజు క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గ్రేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఐజాక్ పీడీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు ఇదే.. టి.అఖిల్ (భీమవరం, నారాయణ జూనియర్ కాలేజ్), బళ్ల ఉమా కాశీ విశ్వేశ్వరావు(నల్లజర్ల శశి జూనియర్ కాలేజ్), కేజేఆర్కే రాజు(భీమవరం ఆదిత్య జూనియర్ కాలేజ్), ఎ.దినేష్(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ మణి కంఠ(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), కె.రమేష్ (కేఆర్ పురం ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒSకే చైతన్య(ఆకివీడు విద్యా వికాస్ జూనియర్ కాలేజ్), కె.చిరంజీవి (భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ వంశీ(నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఏఎల్వీఎస్ఎ¯ŒSఎస్ రామరాజు(భీమవరం డీఎన్నార్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒS.రవి కిరణ్(భీమవరం శ్రీ చైతన్య), యు.మోహ¯ŒSసాగర్(భీమవరం ఎస్వీ జూనియర్ కాలేజ్), ఎస్.కార్తీక్ ( దుంపగడప ప్రభుత్వ జూనియర్ కాలేజ్), కె.లక్ష్మణ కుమార్( తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఎం.శ్రీనివాస్(అత్తిలి ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఆర్.మహేష్ బాబు(ఆచంట ప్రభుత్వ జూనియర్ కాలేజ్). వీరుకాక స్టాండ్బైగా పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. -
సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని లైసెన్స్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనికోసంS నవంబరు 5లోగా కలెక్టరేట్లోని జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సర్వేయర్ల అవసరం ఎంతో ఉన్నదని, లైసెన్స్ ఉన్న సర్వేయర్లకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఐటీఐ, సివిల్ డ్రాఫ్ట్్సమెన్, డిప్లమో సివిల్, నాలుగు నెలల సర్వే శిక్షణ పొందిన వారు, ఇంటర్ ఓకేషినల్ కోర్సు చేసిన అభ్యర్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారైతే రూ.1500, ఇతర కులాల వారు అయితే రూ.3 వేలు చొప్పున వైస్ ప్రిన్సిపల్, సర్వే ట్రైనింగ్ అకాడమీ, ఏపీ హైదరాబాద్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పాస్పోర్టు సైజ్ ఫొటోతో ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్లు జతపరిచి కలెక్టరేట్లోని ఏడీ సర్వే కార్యాలయంలో అందజేయాలని జేసీ సూచించారు. -
తణుకులో పట్టపగలే చోరీ
తణుకు : స్థానిక బ్యాంకు కాలనీలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో బీరువాలో దాచుకున్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీనివాస టవర్స్లో నివాసం ఉంటున్న రవీంద్రతేజ బాదంపూడి రైల్వే సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. ఆయన భార్య యర్రాయిచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. బుధవారం ఉదయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం వీరి కుమార్తె స్కూలు నుంచి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. పడకగదిలో బీరువా తెరిచి ఉంది. అందులో సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
భట్లమగుటూరు (పెనుమంట్ర) : పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మార్టేరు నుంచి పెనుమంట్ర వైపు వెళ్తున్న ఆటోలో ఆచంటకు చెందిన పలువురు మహిళలు వెళ్తున్నారు. భట్లమగుటూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మినీలారీ ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న ఆచంటకు చెందిన కె.సీత, ఎం.చిట్టి సుందరమ్మ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిట్టిసుందరమ్మæ మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మరో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో దెబ్బతింది. మినీలారీ డ్రైవర్ కునికిపాట్లు పడడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్ఐ జి.జె.ప్రసాద్ తెలిపారు. -
క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం 36వ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలురు, బాలికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. జిల్లాస్థాయి ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 312 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత వివిధ జిల్లాల క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ ఉత్సాహంగా సాగింది. తొలిరోజు విజేతల వివరాలను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.సాంబ శివరావు, ఎంఈవో గారపాటి ప్రకాశరావు, కోశాధికారి ప్రసాదరెడ్డి తెలిపారు. బాలికల విభాగంలో విజేతలు వీరే.. పశ్చిమగోదావరి–నెల్లూరు, ప్రకాశం–తూర్పుగోదావరి మ«ద్యృ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. శ్రీకాకుళంపై అనంతపురం, కృష్ణాజిల్లా జట్టుపై విజయనగరం, చిత్తూరుపై విశాఖపట్నృ విజయం సాధించాయి. బాలుర విభాగం : తూర్పుగోదావరిపై చిత్తూరు, అనంతపురంపై పశ్చిమ గోదావరి, గుంటూరుౖపై విశాఖపట్నం, కర్నూలుపై ప్రకాశం, కృష్ణాపై విజయనగరం విజయం సాధించాయి. -
నేడు సబ్ జూనియర్స్ చెస్ పోటీలు
భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నేతృత్వంలో భీమవరం విశ్వకవి పబ్లిక్ స్కూల్లో బుధవారం జిల్లా సబ్జూనియర్స్ చెస్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, పోటీల్లో పాల్గొనే వారు 2001 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు వచ్చేనెల 4 నుంచి కడపలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తోట భోగయ్య చెప్పారు. -
అమ్మవార్లకు వెండి ఆభరణాలు
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లులో వేంచేసిన అమ్మవార్లకు భక్తులు వెండి ఆభరణాలను బహూకరించారు. పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామికి వెండి కుందు, సరస్వతీ అమ్మవారికి వెంyì కవచాన్ని విజయదశమి సందర్భంగా భక్తులు బహూకరించారు. ఆలయంలో కార్తికమాస పూజలు నిర్వహించే భక్తులు 8.500 కేజీలతో అఖండ వెండి దీపారాదన కుందును, న్యాయవాదులు కొప్పర్తి వెంకట సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి దంపతులు 1.250 కేజీలతో సరస్వతీ అమ్మవారికి వెండి కవచం అందజేశారు. స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎ.ఎన్.వేణుగోపాల గౌడ్, శ్రీకాకుళం జిల్లా అడిషినల్ సెషన్స్ జడ్జి మజ్జి బబిత విజయదశమి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పాలకొల్లు గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మవారికి భక్తులు వెండి కిరీటం బహూకరించారు. జ్యోతిర్మయి ఆనంద భారతి, వారి శిష్య బృందం భక్తుల సహకారంతో 2.750 కేజీలతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధనాని సూర్యప్రకాష్, యడ్ల శివాజీ, కర్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
క్షీరపురిలో మహాకుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గజల్స్ శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేకం నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఈ మహత్కార్యానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గోగుల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నుదురుపాటి శ్రీనివాస శర్మ, సేవ్ టెంపుల్స్ జిల్లా అధ్యక్షుడు మేడికొండ శ్రీను, చల్లా ఆదినారాయణ, చల్లా గోపాలకృష్ణ, బొక్కా రమాకాంత్, రావూరి చాచా, సోమంచి శ్రీనివాసశాస్త్రి, తాళ్లూరి సుబ్బారావు, బోణం చినబాబు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
పశ్చిమ డెల్టాకు ఆరువేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీనిలో ఏలూరు కాలువకుS 1,120, ఉండి కాలువకు 1,423, నరసాపురం కాలువకు 1,983, జీ అండ్ వీ కాలువకు 763, అత్తిలి కాలువకుS 484 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మళ్లీ పెరిగిన గోదావరి వరద ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండడంతో గోదావరికి మళ్లీ వరదపోటు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం బు«ధవారం గరిష్టంగా 9.60 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటలకు 4,69,948 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 5,00,339 క్యూసెక్కులకు పెరిగింది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 11,700 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకు వదులుతుండగా, 4,88,639 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్ల్లోని 103 గేట్లను 1.20 మీటర్లు, మద్దూరు ఆర్మ్లోని 23 గేట్లను మీటరున్న ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్లోని 39 గేట్లను మీటరు ఎత్తులేపి వ రద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 33.70 అడుగులున్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతూ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 31.60 అడుగులకు తగ్గింది. దీంతో దిగువన ఉన్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వదర ఉధృతి కనిపిస్తుంది. -
తెలంగాణకు తరలిస్తున్న ఇసుక స్వాధీనం
వేలేరుపాడు : వేలేరుపాడు మండలం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని వసంతవాడ ప్రాంతంలోని పెదవాగు నుంచి సేకరించిన ఇసుకను రోడ్డుపైకి చేర్చి.. నాలుగు లారీల్లోకి జేసీబీతో లోడ్ చేయిస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు లారీలు, అశ్వారావుపేట మండలానికి చెందిన ఒక జేసీబీని సీజ్ చేసి, వేలేరుపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అక్రమ రవాణాకు కారకులైన సూరారెడ్డి, యాళ్ళ శంకరంతోపాటు ఐదుగురు డ్రైవర్లపై 379, 447 సెక్షన్లతోపాటు, మైన్స్అండ్ మినరల్స్‡యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది గంగ, నాగేశ్వరావు, ఏపీఎస్పీ సిబ్బంది శంకర్,పాల్ పాల్గొన్నారు. -
కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
వట్లూరు (పెదపాడు) : రాష్ట్రస్ధాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి మరడాని అచ్యుతరావు తెలిపారు. వట్లూరులో వారం రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడాకారుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈ నెల 6,7,8 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా స్త్రీ, పురుష కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని అచ్యుతరావు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులు, సామాగ్రి అందించారు. స్థానిక నాయకులు కొమ్మన లక్ష్మణ మోహన్, బసవయ్య, పీఈటీలు పీఎన్ మల్లేశ్వరరావు, ఎం.చిన రంగారావు, కొమ్మంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
కాత్య్సాయనీ.. శుభకరీ..
దేవీ నవరాత్రుల్లో భాగంగా జిల్లాలోని అమ్మవార్లు శుభాలను ఒసగు కాత్యాయని, మహాగౌరి తదితర అలంకరణల్లో బుధవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. కొన్నిచోట్ల అమ్మవార్లను రూ.లక్షలతో ధనలక్ష్మీగా అలంకరణ చేశారు. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుని తరించారు. -
‘రామచంద్ర’లో ఇన్నోవేషన్ క్లస్టర్ ల్యాబ్ ప్రారంభం
ఏలూరు సిటీ: బహుళజాతి సంస్థ ఆల్టిమెట్రిక్ స్థానిక రామచంద్ర ఇంజనీరిం గ్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఇన్నోవేషన్ క్లస్టర్ ల్యాబ్ను బుధవారం సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎం.గిరిధర్, ఆల్టిమెట్రిక్ సొల్యూషన్స్ ల్యాబ్ హెడ్ ఎస్.రఘువీర్ ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్ రం గంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. విద్యార్థు ల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ల్యాబ్ ఏర్పాటుచే సినట్టు కళాశాల సెక్రటరీ కె.వేణుగోపాల్ చెప్పా రు. సంస్థ ప్రతినిధులు ఆర్.కీర్తి పాం డురంగారావు, ఇ.ప్రసన్నకుమార్, కళాశాల చైర్మన్ గంటా శ్రీరామచంద్రరా వు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సంజయ్ పాల్గొన్నారు. -
వ్యవసాయంలో ఫస్ట్.. పరిశ్రమల్లో లాస్ట్
ఏలూరు (మెట్రో) : వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకున్న మన జిల్లా పారిశ్రామిక రంగంలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలబడింది. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిని సీఎం సమీక్షించారు. వ్యవసాయ పరంగా ఉండి, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. పారిశ్రామికంగా చూస్తే మాత్రం మన జిల్లా అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గం 172వ స్థానంలోను, పోలవరం నియోజకవర్గం 171వ స్థానంలోను ఉన్నట్టు సీఎం ప్రకటించారు. తీర ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికీ మత్స్యరంగంలో మన జిల్లా 32 శాతం వృద్ధి రేటు సాధించింది. తీరప్రాంతం 187 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న శ్రీకాకుళం జిల్లా వెనుకబడింది. మత్స్య రంగానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా అధికారులకు సీఎం సూచించారు. కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ గురువారం కీలక అంశాలపై ప్రసంగించనున్నారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాల అభి వృద్ధిని ఆయన వివరిస్తారు. -
స్మార్ట్ సర్వే పూర్తిగాక మంజునాథన్ నివేదిక ఆలస్యం
భీమవరం టౌన్: ప్రజాసాధికర సర్వే పూర్తికాకపోవడంతో మంజునాథన్ కమీషన్ నివేదిక ఆలస్యమైందని కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చే ప్రక్రియకు ప్రజాసాధికార సర్వే రిపోర్టు మంజునాథన్ కమీషన్కు అవసరమని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలమలశెట్టి రామానుజయ మాట్లాడారు. కాపులను బిసి జాబితాలో చే ర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు. బిసిలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. తమిళనాడు, కర్నాటక, కేరళ మాదిరిగా ఇక్కడ బిసిలకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3.70 లక్షల మంది కాపు కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే 50 వేల మందికి రూ.858 కోట్లు రుణాలుగా ఇచ్చామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు మరో 70 వేల మందికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం 400 మందిని పంపామన్నారు. సివిల్ సర్వీసెస్కు సంబంధించి 500 మందిని చదివిస్తున్నామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ చదుదువుతున్న కాపు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాల పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులను చదివిస్తున్నామని నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ స్కీమ్ కింద రుణ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ గ్రూపు కింద 3 నుంచి 5 మంది కలిసి పరిశ్రమలు స్థాపించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అర్భన్ ఏరియాలో 5 వేల మంది, రూరల్లో 10 వేల మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఆ సమయంలో నెలకు రూ.2వేలు భృతి చెల్లిస్తామన్నారు. శిక్షణ అనంతరం కాపు కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఉపాధి సామాగ్రిని అందచేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పరుగుల చాంపియన్ భీమవరం జట్టు
భీమవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల, యూనివర్శిటీ జట్టు క్రాస్ కంట్రీ(పురుషులు, మహిళలు) పరుగు పందెం ఎంపిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్(పురుషుల విభాగం)ను భీమవరం డీఎన్నార్ కళాశాల జట్టు గెలుచుకుంది. మహిళల విభాగంలో కాకినాడలోని ఏఎస్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల విజేతగా నిలిచింది. బుధవారం స్థానిక విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని డిగ్రీ కళాశాలలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అక్టోబర్లో మంగళూరులో నిర్వహించే సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరపున పాల్గొంటారని క్రీడా సంచాలకుడు కె.సత్యనారాయణ తెలిపారు. ఈ పోటీల్లో పురుషులకు 12.5 కిలోమీటర్లు, మహిళలకు 6 కిలోమీటర్లు పరుగు పందెం నిర్వహించగా 90 మంది పురుషులు 20 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్వీ శ్రీనివాస్, ఎంసీఏ ప్రిన్సిపాల్ ఐఆర్కే రాజు, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులకు అక్టోబర్లో బీవీ రాజు కళాశాలలో శిక్షణ శిబిరం నిర్వహించి సౌత్జోన్ టోర్నమెంట్కు తీసుకెళతామని కళాశాల పీడీ జీవీ పవన్కుమార్ రాజు తెలిపారు. సౌత్జోన్ పోటీలకు ఎంపికైంది వీరే.. పురుషుల జట్టు: ఎన్.జగన్మోహనరావు, బి.రాజేష్, ఎన్.వెంకటేష్ (డీఎన్నార్ కళాశాల, భీమవరం), యు.రమేష్ (ఎస్కేవీటీడీ, రాజమహేంద్రవరం), ఎన్.నవీన్కుమార్ (సీఆర్రెడ్డి, ఏలూరు), పి.అంజిబాబు (ఎస్వీడీ, భీమడోలు), వై.గోవిందరాజు(ఎస్ఎస్ఆర్డీ కళాశాల, జంగారెడ్డిగూడెం) మహిళల జట్టు : కె.దేవి (ఎస్ఆర్కే, రాజమహేంద్రవరం), బి.వెంకటలక్ష్మి (ఎస్వీడీ భీమడోలు), సీహెచ్ కవిత(బీహెచ్ఎస్ఆర్యూఎల్ఎం అండ్ పీజీఆర్ కాలేజ్ దేవరపల్లి), ఎ.వెంకటలక్ష్మి (ఎస్కేవీటీడీ రాజ మహేంద్రవరం), ఎం.వనజకుమారి(ఎస్డీజీడీసీ, కాకినాడ) -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
తిరుపతిలో నేడు కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్
– ప్రత్యేక హోదా, బాబుహామీల అమలుపై ఓటింగ్ – మధ్యాహ్నం నుంచి పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం – హాజరవుతున్న రఘువీరా, కేవీపీ, సీ రామచంద్రయ్య సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్కు శ్రీకారం చుడుతోంది. పీసీసీ చీఫ్ ఎన్, రఘువీరారెడ్డి బుధవారం ఉదయం తిరుపతిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి మున్సిపల్ కార్యాలయం వరకూ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ప్రజా బ్యాలెట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం దగ్గర జరిగే బహిరంగ సభలో పార్టీ సీనియర్లు కేవీపీ రామచంద్రరావు, సీ రామచంద్రయ్య, సాకే శైలజానాథ్, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించడమే కాకుండా, ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రజలకిచ్చిన 600 హామీలను ఎలా విస్మరించిందో వివరించనున్నారు. జిల్లా పార్టీ నేతలు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 3 గంటలకు పీసీసీ కార్యవర్గ సమావేశం కాగా మధ్యాహ్నం 3 గంటలకు భీమాస్ హోటల్లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇక్కడే పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులతోనూ ప్రజాబ్యాలెట్ నిర్వహణపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. -
టిప్పర్ను ఢీకొన్న కారు : ఇద్దరికి గాయాలు
దిగమర్రు (పాలకొల్లు అర్బన్) : చించినాడ–దిగమర్రు జాతీయ రహదారిలో దిగమర్రు బస్టాండ్ మలుపు వద్ద బుధవారం చించినాడ వైపు వెళ్తున్న టిప్పర్ను పాలకొల్లు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ కారులో విదేశీయులు ప్రయాణిస్తున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని అంతర్వేది వెళ్లి తిరిగి పాలకొల్లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న విదేశీయుడు చాకచక్యంతో వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న విదేశీయుని కాలు విరగడంతో ఆయనను వేరే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టిప్పర్ ముందుభాగం కూడా దెబ్బతింది. టిప్పర్ డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని పాలకొల్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
హేండ్బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్ : వచ్చేనెల 1, 2 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొనే జిల్లా హేండ్బాల్ జూనియర్ జట్టును జిల్లా హేండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్ఎం లెనిన్, టి.కొండలరావు బుధవారం ప్రకటించారు. మంగళవారం ఏలూరు ఇండోర్స్టేడియంలో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. జిల్లా జట్టు ఇదే.. ఎం.సుకుమార్, ఎ.చందు, ఎస్కే కాశీం(కేపీడీటీ, ఏలూరు), ఇ.ప్రవీణ్, బి.సాయికుమార్, డి.చంటి, కె.పండు, టి.గణేష్(ఎస్పీడీటీ, ఏలూరు), బి.వెంకటేశ్వరరావు (సింగన్నగూడెం), పి.ముకుల్ జీ(టీపీగూడెం), కె.శ్రీను, ఎం.శివకష్ణ(భీమడోలు), ఎ.శ్రీ హర్ష(బుట్టాయిగూడెం), కె.ఆకాష్(కోపల్లి), డి.ప్రశాంత్( ఏలూరు పోలీస్ స్కూల్), జి.జయరాజు (ఆకివీడు), స్టాండ్బైగా కె.సునీల్కుమార్, పి.సాల్మన్రాజు, బి.వెంకటేష్, ఎం.వెంకటేష్ ఎంపికయ్యారు. -
భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం
భీమవరం :చేపల రాము సమర్పణలో వినయ్ ఆర్ట్స్ క్రియేషన్స్ విదీష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున ్న ‘ద్రుష్ట’ సినిమా షూటింగ్ బుధవారం భీమవరంలో ప్రారంభమైంది. అరుంధతీ శ్రీను దర్శకత్వంలో కె.లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో రుషి, స్నేహ పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్టు దర్శకుడు చెప్పారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల పాటు షూటింగ్ జరపనున్నట్టు తెలిపారు. -
బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం
భీమవరం : జేఎన్టీయూకే యూనివర్శిటీ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు స్థానిక డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీ డాక్టర్ జి.శ్యామ్కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీలకు జట్లను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెలలో తమిళనాడు మధురై కామరాజు యూనివర్శిటీలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యుడు వై.నానిప్రసాద్, సీహెచ్ ^è ంద్రశేఖర్, సెలక్షన్ కమిటీ సెక్రటరీ పి.నర్సింహరాజు, బి.నర్సింహరాజు, పి.కిరణ్కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఓంశాంతి శాంతి శాంతిః
ఏలూరు సిటీ : ‘సత్యం, అహింస’ ఆయుధాలుగా శాంతిమార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్ముడు నడిచిన నేల ఇది. మువ్వన్నెల జాతీయ పతకంలోనూ శాంతికి ప్రతీకగా శ్వేతవర్ణాన్ని చేర్చిన ఘనత మన భారతదేశానిది. ప్రపంచశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ అనే ఆధునిక సాంస్కృతిక కళా ప్రదర్శన చేశారు. బుధవారం స్థానిక ఫైర్స్టేషన్ సెంటరులో సుమారు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతమాతకు, మహాత్మాగాంధీకి వందన సమర్పణ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శాంతి స్థాపనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నారాయణ విద్యా సంస్థల డీజీఎం ఎంవీఎస్ బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో శాంతి స్థాపనకు కృషి చేసి అసువులు బాసిన పోలీసు ఉన్నతాధికారుల చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ప్రజలంతా శాంతి, ఐక్యతతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాళ్లు డి.సునీల్కుమార్, కె.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓంశాంతి శాంతి శాంతిః
ఏలూరు సిటీ : ‘సత్యం, అహింస’ ఆయుధాలుగా శాంతిమార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్ముడు నడిచిన నేల ఇది. మువ్వన్నెల జాతీయ పతకంలోనూ శాంతికి ప్రతీకగా శ్వేతవర్ణాన్ని చేర్చిన ఘనత మన భారతదేశానిది. ప్రపంచశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ అనే ఆధునిక సాంస్కృతిక కళా ప్రదర్శన చేశారు. బుధవారం స్థానిక ఫైర్స్టేషన్ సెంటరులో సుమారు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతమాతకు, మహాత్మాగాంధీకి వందన సమర్పణ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శాంతి స్థాపనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నారాయణ విద్యా సంస్థల డీజీఎం ఎంవీఎస్ బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో శాంతి స్థాపనకు కృషి చేసి అసువులు బాసిన పోలీసు ఉన్నతాధికారుల చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ప్రజలంతా శాంతి, ఐక్యతతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాళ్లు డి.సునీల్కుమార్, కె.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్మికుడి ఆత్మహత్యాప్రయత్నం
– చైర్మన్ వైఖరితో మనస్తాపం – ట్యాంకు ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపు – రెండు గంటల సేపు ఉత్కంఠ మదనపల్లె: మున్సిపల్ చైర్మన్ వైఖరితో విసిగెత్తిన కార్మికుడు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన బుధవారం జరిగింది. విధులలో నుంచి తొలగించారనే మనస్తాపంతో కార్యాలయ ఆవరణలోని ఓవర్హెడ్ నీటిట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. సుమారు రెండుగంటల పాటు అధికారులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేశాడు. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ముబారక్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్ల నుంచి ఆటోడ్రై వర్గా విధులు నిర్వహిస్తున్నాడు. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రతిరోజూ కంపోస్టుయార్డుకు తరలించడం అతని విధి. ఈ క్రమంలో మూడురోజుల క్రితం కంపోస్టుయార్డులో సిబ్బంది మధ్య జరిగిన వాదులాటలో ముబారక్ ప్రవర్తనపై చైర్మన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ముబారక్ను విధులలో నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో మనస్తాపానికి గురైన ముబారక్ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. తన ఉద్యోగం తనకు ఇస్తేనే దిగుతానంటూ, చైర్మన్, కమిషనర్లు వచ్చి మాట ఇస్తేనే దిగుతానని భీష్మించుకుని కూర్చున్నాడు. చైర్మన్ వైఖరితో ఇప్పటికే ఓ కార్మికుడు తనువు చాలించాడని, కనీసం నా చావుతోనైనా ఆయనలో మార్పు రావాలని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ నిరంజన్కుమార్, ఎసై ్స సుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుడిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్ ముక్తియార్ ఖాన్, బాబునాయుడు, సుమంత్కల్యాణ్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. షమీం అస్లాం ఏకంగా ట్యాంకుపైకి ఎక్కి ముబారక్తో చర్చలు జరిపారు. చైర్మన్ వస్తేగానీ తన నిర్ణయం మార్చుకోనని చెప్పడంతో ఆమె చొరవ చూపి చైర్మన్, కమిషనర్లను పిలిపించారు. ఉద్యోగం నుంచి తొలగించలేదని, నీ విధులు నీవు చేసుకోవచ్చంటూ చైర్మన్, కమిషనర్లు హామీ ఇవ్వడంతో ముబారక్ కిందకు దిగేందుకు అంగీకరించాడు. రెండు గంటల పాటు ఎత్తులో నిలబడటంతో నీరసించిన ముబారక్ను సీఐ నిరంజన్కుమార్ చొరవ తీసుకుని స్వయంగా పైకి ఎక్కి కిందకు తీసుకువచ్చారు. -
నేడు రోప్స్కిప్పింగ్ ఎంపికలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని చెమ్ముమియాపేట జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్, రోప్స్కిప్పింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణేష్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో ఈ ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
వీరవాసరం : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై వీరవాసరం గొంతేరు డ్రెయిన్పై ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును డీకొట్టింది. డ్రైవర్ దినేష్ అనారోగ్యంతో ఉన్నాడని, అలాగే బస్సును నడుపుకుంటూ వచ్చాడని, వీరవాసరం సమీపంలోకి వచ్చే సరికి కళ్లు తిరిగి స్టీరింగ్ మీద పడిపోవడంతో బస్సు రహదారి పక్కగా ఉన్న షెడ్డును ఢీకొని ఎదురుగా ఉన్న చెట్టునుఢీకొట్టి ఆగిపోయిందని ప్రయాణికులు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 64 మంది ప్రయాణిస్తుండగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే బ్రాందీ షాపు ఎదుట ఉదయంపూట కావడంతో జనాలు ఎవరూ లేరు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతాన్ని ఆర్టీసీ భీమవరం డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ పరిశీలించారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
వీరవాసరం : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై వీరవాసరం గొంతేరు డ్రెయిన్పై ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును డీకొట్టింది. డ్రైవర్ దినేష్ అనారోగ్యంతో ఉన్నాడని, అలాగే బస్సును నడుపుకుంటూ వచ్చాడని, వీరవాసరం సమీపంలోకి వచ్చే సరికి కళ్లు తిరిగి స్టీరింగ్ మీద పడిపోవడంతో బస్సు రహదారి పక్కగా ఉన్న షెడ్డును ఢీకొని ఎదురుగా ఉన్న చెట్టునుఢీకొట్టి ఆగిపోయిందని ప్రయాణికులు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 64 మంది ప్రయాణిస్తుండగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే బ్రాందీ షాపు ఎదుట ఉదయంపూట కావడంతో జనాలు ఎవరూ లేరు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతాన్ని ఆర్టీసీ భీమవరం డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ పరిశీలించారు. -
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
పెదపాడు: పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో కె.కోటేశ్వరి బుధవారం ఆకస్మికంగా తనికీ చేశారు. జ్వరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో లార్వా ఎక్కడ ఉందో సర్వే చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీలో మరో వైద్యుడిని నియమిస్తామని చెప్పారు. అనంతరం ఆమె వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధినిరోధక టీకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. పంచాయతీ విస్తరణాధికారి కె.మహాలక్ష్మి, తహసీల్దార్ జీజేఎస్ కుమార్, ఎంపీపీ మోరు శ్రావణితో సమీక్షించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎస్తేరమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమోహన్, డాక్టర్ వి.రాంబాబు ఆమెతో ఉన్నారు. -
ఖైదీ నెం.150 అభిమానులకు పండుగ
కొవ్వూరు రూరల్/ చాగల్లు : చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెం.150వ సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఆయన చాగల్లు విచ్చేశారు. చాగల్లుతో పాటు ఐ.పంగిడి గ్రామంలోని గణపతి పందిళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీ పేరుతో చిరంజీవికి సూపర్ హిట్ చిత్రాలు లభించాయని, ప్రస్తుత సినిమా కూడా సూపర్, డూపర్ హిట్ అవుతుందని ఘంటా పథంగా చెప్పారు. అభిమానులు పండుగ చేసుకునేలా పూర్తి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆయనతో చేసిన ఇంటర్వూ్య ఇలా బోలెడు విషయాలు తెలిపారు. ప్ర : చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండబోతోంది? జ : అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. సందేశంతో పాటు కామెడీ, డ్యాన్స్, ఫైట్లు ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ప్ర:సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఏమిటి? జ: ముఖ్యంగా తారాగణం. హీరోయిన్గా కాజల్, సీనియర్ నటులు బ్రహ్మానందం, రఘుబాబు వంటి వారు ఆకర్షణగా నిలుస్తారు. ప్ర: చిత్రీకరణలో ప్రత్యేక జాగ్రత్తలు ఏమి తీసుకుంటున్నారు? జ: చిరంజీవి ఓల్డేజ్ హోంలో పనిచేస్తారు. ఈ సీన్లు రియల్గా ఉండాలన్న ఉద్దేశంతో నిజమైన ఓల్డ్ ఏజ్ హోం నుంచి నటనపై ఆసక్తి ఉన్న వద్ధులను సినిమా కోసం తీసుకువచ్చాం. అంత జాగ్రత్తగా చిత్రీరణ చేస్తున్నాం. ప్ర: సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయ్యింది? జ: అరవై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఇంకా పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. రెండు పాటలు మాత్రం ఇతర దేశాల్లో చిత్రీకరిస్తాం. వచ్చే ఏడాది భోగి నాడు సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్ర: ఈ సినిమాలో చిరంజీవి చాలా యంగ్గా కన్పిస్తున్నారు. దానికి కారణం? జ: చిరంజీవి సినిమాను ఎంతగా ప్రేమిస్తారో మన అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి సీనులోను ఆయనలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఫైట్స్, డ్యాన్సుల్లో వారం రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తే ఆయన మూడు రోజుల్లోనే చేసేస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ సినిమాలో ఫైట్లు డూప్ లేకుండా చిత్రీకరించాం. పాత చిరంజీవిని అభిమానులు మళ్లీ చూస్తారు. ప్ర: మీ సినిమాకు ఖైదీ నెం.150 పేరు పెట్టడానికి కారణం? జ: ఈ సినిమాలో ఖైదీ నెం.150 అనే డైలాగ్ ఉంది. దీంతో ఎవరో నెట్లో ఇదే సినిమా పేరుగా పెట్టారు. దర్శకుడు దాసరి నారాయణ లాంటి పెద్దలు ఈ పేరైతేనే బాగుంటుంది అని చెప్పడంతో దానిని ఖరారు చేశాం. ప్ర: షూటింగు బిజీలో ఉండగా ఇక్కడకు రావడం? జ: షూటింగుకు ఒక రోజు స్వల్ప విరామం వచ్చింది. చిరంజీవి కేరళ వెళ్లడంతో కొంత ఖాలీ దొరికింది. ప్రతి వినాయక చవితికి మా సొంత ఊరు చాగల్లు రావడం అలవాటు. దీంతో రెక్కలు కట్టుకుని వాలిపోయా. ఇక్కడకు వచ్చిన తరువాత నా స్నేహితులు, బంధువులు, ఇక్కడి పెద్దలన కలిసిన తరువాత వెళ్లాలనిపించడం లేదు. అయినా తప్పదుగా... వీలు చూసుకుని చవితి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మళ్లీ వస్తా. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
గోపాలపురం : పామాయిల్ లారీ ట్యాంకర్ బోల్తాపడి డ్రై వర్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున స్థానిక పొగాకు బోర్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ నుంచి హైదరాబాద్ పామాయిల్ లోడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ గొల్లగూడెం దాటి పొగాకు బోర్డు సమీపం వద్ద మలుపులో అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో బోల్తా పడింది. దీంతో లారీ డ్రై వర్ కె. రమేష్ కాలు, తలకు గాయాలు కావడంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారుతున్న ఆయిల్ను వేరే ట్యాంకులోకి ఎక్కించడానికి యత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేడు గురువులకు సత్కారం
ఏలూరు సిటీ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న జిల్లాలోని 56 మంది ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా సత్కరించనున్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు చేతులమీదుగా అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు : నంబూరి రాంబాబు, ఎస్జీటీ, బూరాయిగూడెం(ఏలూరు మండలం), ఎం.సుధాకర్, ఎస్జీటీ, పూళ్ల(భీమడోలు మండలం), టీఎల్.నరసింహమూర్తి, ఎస్ఏ, అర్థవరం(గణపవరం మండలం), సీహెచ్ విజయలక్ష్మి, హెచ్ఎం, భీమలాపురం(ఆచంట మండలం), ఎస్.సాల్మన్రాజు ఎల్ఎఫ్ఎల్(రిటైర్డ్), కలవచర్ల(నిడదవోలు). వీరు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సీఎం, విద్యామంత్రి గంటా చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. జిల్లా ఉత్తమ గురువులు వీరే : ప్రధానోపాధ్యాయులు– పి.రాము( జెడ్పీహెచ్ఎస్, పెన్నాడ), ఆర్.కేజీయమ్మ(జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), బీఎస్ కాళహస్తీశ్వరుడు(జెడ్పీహెచ్ఎస్, పైడిపర్రు), కేఎన్వీ గణేష్ (జీహెచ్ఎస్, గోపన్నపాలెం), కేఎల్ఎన్ సింగ్(జెడ్పీహెచ్ఎస్, వీరమ్మకుంట), టి.సత్యనారాయణ మూర్తి (జెడ్పీహెచ్ఎస్, చినమిరం), రోస్లీన్ (జెడ్పీహెచ్ఎస్, కొవ్వలి), టి.గుణరామ్ (జెడ్పీహెచ్ఎస్, వైవీ లంక), జి.శిఖామణి (జెడ్పీహెచ్ఎస్, జీ.పంగిడిగూడెం), పీఎస్ఆర్ చౌదరి (రిటైర్డ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కొమ్ముగూడెం), స్కూల్ అసిస్టెంట్స్ : వీవీ సుబ్బారావు (జెడ్పీహెచ్ఎస్, తాడిపర్రు), పి.సాయిబాబు (జెడ్పీహెచ్ఎస్, భీమడోలు), పీవీఎస్ రవి ప్రసాద్ (జెడ్పీహెచ్ఎస్, వడలూరు), సీహెచ్ శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్, కొడమంచిలి), ఐ.శ్రీనివాసరావు (జీహెచ్ఎస్, ఏలూరు), కేఎస్వీఎస్ రాజ్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, విజయరాయ్), సీహెచ్ శేషావతారం (ఎంపీయూపీ, కావలిపురం), పీఎస్ నాగేశ్వరరావు (జెడ్పీహెచ్ఎస్, రావిపాడు ), జి.విజయకుమార్ (జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), కె.విల్సన్రాజు (జెడ్పీహెచ్ఎస్, అడవికొలను), జి.సత్యనారాయణ (జెడ్పీహెచ్ఎస్, కొప్పాక), పీవీ నాగమౌళి (ఎంపీయూపీ, పుట్లగట్లగూడెం), జేఎస్కే బాలాజీ(జెడ్పీహెచ్ఎస్, విజయరాయి), బి.నరసమ్మ (జీహెచ్ఎస్,పోలవరం), ఎంవీ సుబ్బరాజు(ఎంపీయూపీ, స్కిన్నెరపురం), ఎస్వీఎస్ సోమయాజులు(సుబ్బమ్మదేవీ స్కూల్, ఏలూరు), వీఎం రాధాకృష్ణ(పీఎస్ఎంజీఎస్, నరసాపురం), రాధాకృష్ణ (జెడ్పీహెచ్ఎస్, బ్రాహ్మణగూడెం), టి.రామకృష్ణ(జెడ్పీహెచ్ఎస్, వెస్ట్ విప్పర్రు), లీలాకుమార్ (జెడ్పీహెచ్ఎస్, జి.పంగిడిగూడెం), పి.భోగేశ్వరి (సిద్ధార్థ హైస్కూల్, వట్లూరు), జి.శ్యామల (సెయింట్ థెరిస్సా హైస్కూల్), ఎం.సుబ్బారావు(జెడ్పీహెచ్ఎస్, బుట్టాయిగూడెం), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం : కాజా శేషుబాబు (జెడ్పీహెచ్ఎస్, జంగారెడ్డిగూడెం), కె.ఆదినారాయణ మూర్తి(ఎంపీపీఎస్, కొత్త పట్టిసీమ), జీవీ సూరపరాజు (ఎంపీపీఎస్, ఎస్.పేట), కె.వాజునందన్(ఎంపీపీఎస్, ఈస్ట్ఎడవల్లి), డి.పద్మావతి(ఎంపీపీఎస్, వేములపల్లి). ఎస్జీటీ : జీవీఎస్ బాలేశ్వరి(ఎంపీపీఎస్, కైకరం), ఎన్.సురేష్బాబు(ఎంపీపీఎస్, ఎలమంచిలి), జి.రాజారత్నం (ఎంపీపీఎస్, తాళ్లపూడి), పీవీఆర్ మోహనరావు (ఎంపీపీఎస్, గుండుగొలను), ఎస్.వెంకటప్పయ్య (ఎంపీపీఎస్, లింగపాలెం), ఎన్.తిరుపతి (ఎంపీపీఎస్, ఆచంట), టీఎస్ రత్నకుమారి (ఎంపీపీఎస్, లక్ష్మీపురం), బి.శ్రీనివాసరావు (ఎంపీపీఎస్,దువ్వ), కె.రమేష్(ఎంపీపీఎస్,బల్లిపాడు), వోఎన్ఎస్ ప్రసాద్ (ఎంపీపీఎస్,రౌతుగూడెం), ఎంవీ కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్,వెలగదుర్రు), కె.లలిత కుమారి (ఎంపీపీఎస్,నిడమర్రు), ఎన్.ఆనంద్ (ఎంపీపీఎస్,కొమ్ముగూడెం), సీహెచ్ నరసింహరావు (ఎంపీపీఎస్,గణపవరం), బాలాజీ (ఎంపీపీఎస్,వకలగరువు), కె.మంగతాయారు (ఎంపీపీఎస్,ఉండి), ఎన్.అన్నపూర్ణమ్మ(ఆర్సీఎం, తెడ్లం), ఎస్.భాస్కర్(జీహెచ్ఎస్, కొవ్వూరు). -
నేడు గురువులకు సత్కారం
ఏలూరు సిటీ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న జిల్లాలోని 56 మంది ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా సత్కరించనున్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు చేతులమీదుగా అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు : నంబూరి రాంబాబు, ఎస్జీటీ, బూరాయిగూడెం(ఏలూరు మండలం), ఎం.సుధాకర్, ఎస్జీటీ, పూళ్ల(భీమడోలు మండలం), టీఎల్.నరసింహమూర్తి, ఎస్ఏ, అర్థవరం(గణపవరం మండలం), సీహెచ్ విజయలక్ష్మి, హెచ్ఎం, భీమలాపురం(ఆచంట మండలం), ఎస్.సాల్మన్రాజు ఎల్ఎఫ్ఎల్(రిటైర్డ్), కలవచర్ల(నిడదవోలు). వీరు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సీఎం, విద్యామంత్రి గంటా చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. జిల్లా ఉత్తమ గురువులు వీరే : ప్రధానోపాధ్యాయులు– పి.రాము( జెడ్పీహెచ్ఎస్, పెన్నాడ), ఆర్.కేజీయమ్మ(జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), బీఎస్ కాళహస్తీశ్వరుడు(జెడ్పీహెచ్ఎస్, పైడిపర్రు), కేఎన్వీ గణేష్ (జీహెచ్ఎస్, గోపన్నపాలెం), కేఎల్ఎన్ సింగ్(జెడ్పీహెచ్ఎస్, వీరమ్మకుంట), టి.సత్యనారాయణ మూర్తి (జెడ్పీహెచ్ఎస్, చినమిరం), రోస్లీన్ (జెడ్పీహెచ్ఎస్, కొవ్వలి), టి.గుణరామ్ (జెడ్పీహెచ్ఎస్, వైవీ లంక), జి.శిఖామణి (జెడ్పీహెచ్ఎస్, జీ.పంగిడిగూడెం), పీఎస్ఆర్ చౌదరి (రిటైర్డ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కొమ్ముగూడెం), స్కూల్ అసిస్టెంట్స్ : వీవీ సుబ్బారావు (జెడ్పీహెచ్ఎస్, తాడిపర్రు), పి.సాయిబాబు (జెడ్పీహెచ్ఎస్, భీమడోలు), పీవీఎస్ రవి ప్రసాద్ (జెడ్పీహెచ్ఎస్, వడలూరు), సీహెచ్ శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్, కొడమంచిలి), ఐ.శ్రీనివాసరావు (జీహెచ్ఎస్, ఏలూరు), కేఎస్వీఎస్ రాజ్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, విజయరాయ్), సీహెచ్ శేషావతారం (ఎంపీయూపీ, కావలిపురం), పీఎస్ నాగేశ్వరరావు (జెడ్పీహెచ్ఎస్, రావిపాడు ), జి.విజయకుమార్ (జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), కె.విల్సన్రాజు (జెడ్పీహెచ్ఎస్, అడవికొలను), జి.సత్యనారాయణ (జెడ్పీహెచ్ఎస్, కొప్పాక), పీవీ నాగమౌళి (ఎంపీయూపీ, పుట్లగట్లగూడెం), జేఎస్కే బాలాజీ(జెడ్పీహెచ్ఎస్, విజయరాయి), బి.నరసమ్మ (జీహెచ్ఎస్,పోలవరం), ఎంవీ సుబ్బరాజు(ఎంపీయూపీ, స్కిన్నెరపురం), ఎస్వీఎస్ సోమయాజులు(సుబ్బమ్మదేవీ స్కూల్, ఏలూరు), వీఎం రాధాకృష్ణ(పీఎస్ఎంజీఎస్, నరసాపురం), రాధాకృష్ణ (జెడ్పీహెచ్ఎస్, బ్రాహ్మణగూడెం), టి.రామకృష్ణ(జెడ్పీహెచ్ఎస్, వెస్ట్ విప్పర్రు), లీలాకుమార్ (జెడ్పీహెచ్ఎస్, జి.పంగిడిగూడెం), పి.భోగేశ్వరి (సిద్ధార్థ హైస్కూల్, వట్లూరు), జి.శ్యామల (సెయింట్ థెరిస్సా హైస్కూల్), ఎం.సుబ్బారావు(జెడ్పీహెచ్ఎస్, బుట్టాయిగూడెం), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం : కాజా శేషుబాబు (జెడ్పీహెచ్ఎస్, జంగారెడ్డిగూడెం), కె.ఆదినారాయణ మూర్తి(ఎంపీపీఎస్, కొత్త పట్టిసీమ), జీవీ సూరపరాజు (ఎంపీపీఎస్, ఎస్.పేట), కె.వాజునందన్(ఎంపీపీఎస్, ఈస్ట్ఎడవల్లి), డి.పద్మావతి(ఎంపీపీఎస్, వేములపల్లి). ఎస్జీటీ : జీవీఎస్ బాలేశ్వరి(ఎంపీపీఎస్, కైకరం), ఎన్.సురేష్బాబు(ఎంపీపీఎస్, ఎలమంచిలి), జి.రాజారత్నం (ఎంపీపీఎస్, తాళ్లపూడి), పీవీఆర్ మోహనరావు (ఎంపీపీఎస్, గుండుగొలను), ఎస్.వెంకటప్పయ్య (ఎంపీపీఎస్, లింగపాలెం), ఎన్.తిరుపతి (ఎంపీపీఎస్, ఆచంట), టీఎస్ రత్నకుమారి (ఎంపీపీఎస్, లక్ష్మీపురం), బి.శ్రీనివాసరావు (ఎంపీపీఎస్,దువ్వ), కె.రమేష్(ఎంపీపీఎస్,బల్లిపాడు), వోఎన్ఎస్ ప్రసాద్ (ఎంపీపీఎస్,రౌతుగూడెం), ఎంవీ కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్,వెలగదుర్రు), కె.లలిత కుమారి (ఎంపీపీఎస్,నిడమర్రు), ఎన్.ఆనంద్ (ఎంపీపీఎస్,కొమ్ముగూడెం), సీహెచ్ నరసింహరావు (ఎంపీపీఎస్,గణపవరం), బాలాజీ (ఎంపీపీఎస్,వకలగరువు), కె.మంగతాయారు (ఎంపీపీఎస్,ఉండి), ఎన్.అన్నపూర్ణమ్మ(ఆర్సీఎం, తెడ్లం), ఎస్.భాస్కర్(జీహెచ్ఎస్, కొవ్వూరు). -
ఏలూరు కాలువలో పడి వ్యక్తి మృతి
నారాయణపురం(ఉంగుటూరు) : నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో బుధవారం ఓ మృతదేహాన్ని చేబ్రోలు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం వల్లూరిపల్లి గ్రామానికి చెందిన మర్లపూడి చెంచయ్య(46) మంగళవారం బాదంపూడి హైవే పక్కన ఉన్న చర్చికి వచ్చారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏలూరు కాలువ గట్టు వద్దకు వెళ్లగా.. జారిపడి గల్లంతయ్యాడు. ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం నారాయణపురం వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది మర్లపూడి చెంచయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై చావా సురేష్ వివరించారు. -
పరిశ్రమల స్థాపనకు చర్యలు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నా పారిశ్రామికపరంగా వెనుకబడి ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘పశ్చిమలో పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు–సీఐఐ మార్గదర్శకత్వం’ అంశంపై పారిశ్రామిక ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో పశ్చిమ పారిశ్రామికపరంగా వెనుకపడి ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య సంపద విషయంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలో మరే ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లేకపోవడం బాధాకరమన్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో భూములపై లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. బ్యాంకుల అధిక వడ్డీలు పరిశ్రమల స్థాపనకు మోకాలొడ్డుతున్నాయన్నారు. అయినా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలను సరళీకతం చేస్తామని కలెక్టర్ చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటేనే మనుగడ.. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమల జీవిత ప్రమాణం 56 ఏళ్లు ఉండగా ప్రస్తుతం 15 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. రానురాను ఈ స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లిన రోజే పరిశ్రమలకు మనుగడ ఉంటుందన్నారు. పరిశ్రమల పాత్ర కీలకం.. జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకుడు వి.ఆదిశేషు మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, ఉపాధిలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలో 2.60 కోట్ల యూనిట్ల ద్వారా 6.90 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వీటిలో 45 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఉన్నాయన్నారు. 2015–20కు గాను ప్రభుత్వం పాలసీని ప్రకటించిందని, వీటిని వినియోగించుకుని పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను స్థాపనకు ముందుకు రావాలని కోరారు. శశి ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్, సీఐఐ విజయవాడ జోన్ అధికారి జి.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజనుడి దారుణ హత్య
కుక్కునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం తొంటిపాక పంచాయతీ రామాపురం గుత్తికోయల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడు చత్తీస్గఢ్కు చెందిన సుకుమా జిల్లా బూరుగుపాడు గ్రామానికి చెందిన యేమ్ల రమేష్ (24)గా గుర్తించారు. హతుడు గతంలో ఎస్పీవో(పోలీస్ ఇన్ఫార్మర్)గా పనిచేశాడు. నక్సల్స్ కార్యకలాపాలు తెలుసుకునేందుకు పోలీసులు గతంలో కొంతమంది గిరిజన యువకులను ఎంపిక చేసుకుని ఎస్పీవోలుగా నియమించుకున్నారు. నాలుగు రోజుల క్రితం రమేష్ బంధువులు మండలంలోని రామాపురం గ్రామానికి రావడంతో వారిని తీసుకువెళ్లేందుకు మంగళవారం వచ్చాడు. బుధవారం ఉదయం బంధువులను తన వెంట తీసుకు వెళ్తుండగా మాటు వేసిన దుండగులు నలుగురు రమేష్పై దాడిచేసి హతమార్చారు. నలుగురిలో ఇద్దరు రమేష్ వెంటపడి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అతిదారుణంగా కత్తితో నరికి చంపారు. మరో ఇద్దరు రమేష్ బంధువైన రాము వెంట పడగా.. అతను అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అయితే రాము జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా, రమేష్ మృతదేహాన్ని మాత్రం పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ పార్థసారథి తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ హత్యకు పాల్పడింది నక్సల్సా లేక నక్సల్స్ సానుభూతిపరులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో 11.9 మి.మీ సగటు వర్షపాతం
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 11.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యిందని జిల్లా ఇన్చార్జి ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లో మొత్తంగా 571.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏలూరు మండలంలో 69.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తాడేపల్లిగూడెం మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలకోడేరు మండలంలో 56.2, పోలవరం 49.2, వీరవాసరం 37.4, పెదపాడు 35.2, లింగపాలెం 30.6, మొగల్తూరు 30.2, పాలకొల్లు 30, భీమవరం 29.4, వేలేరుపాడు 27, అత్తిల 22, టీ.నర్సాపురం 19.4, పెనుమంట్ర 18.8, దెందులూరు 18.2, చింతలపూడి, ఇరగవరం 12.4, నరసాపురం 9.4, ఉండి 9.2, బుట్టాయగూడెం 7, కుకునూరు 6.2, నిడమర్రు 4.8, కాళ్ల 4.6, పెనుగొండ 3.8, కామవరపుకోట 3.6, ఆచంట 3.4, పెదవేగి 3.2, తణుకు, ఆకివీడు 2.6, తాళ్లపూడి 2.4, పోడూరు 2, జీలుగుమిల్లి, ఉండ్రాజవరం 1.8, జంగారెడ్డిగూడెం, యలమంచిలి, ద్వారకాతిరుమల 1.2, గోపాలపురం 1, నిడదవోలు మండలాల్లో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్ ధర పెంపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత కల్యాణం టికెట్ ధరను పెంచినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకూ రూ.1,000 ఉన్న టికెట్ రుసుంను రూ.1,500కు పెంచామని, కొత్త ధర గురువారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిత్య కల్యాణం జరిపించుకునే దంపతులకు పంచె, కండువ, రవికతో పాటు ఐదు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు, ఒక శర్కర పొంగలి ప్యాకెట్ ఇస్తున్నారు. ధర పెంచిన నేపథ్యంలో వీటితో పాటు అదనంగా చీర కూడా అందిస్తామని ఈవో తెలిపారు. -
ఉపాధ్యాయులకు సత్వరమే రుణాలివ్వాలి
ఏలూరు (ఆర్ఆర్ పేట): ఆర్థికావసరాల నిమిత్తం ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్న మొత్తానికి సంబంధించి ఉపాధ్యాయులకు రుణాలు మం జూరు చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు కో రారు. జిల్లా పరిషత్ పీఎఫ్ రుణాల మం జూరులో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బుధవారం నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. సకాలంలో రు ణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన జేఏసీ చైర్మన్ ఎల్వీ సాగర్ మాట్లాడుతూ రుణాలు మం జూరులో వివక్షత చూపుతున్న సూపరింటెండెంట్ను విధుల నుంచి తొలగించి పీఎఫ్ రుణాల మంజూరులో ప్రక్షాళన తీసుకురావాలని డి మాండ్ చేశారు. సంబంధిత సూపరింటెండెంట్ను బాధ్యతల నుంచి తొలగించినట్టు, రుణా లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చామని మధ్యాహ్నం జరిగిన చర ్చల్లో జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామకృ ష్ణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.రామకృష్ణ, పి.జయకర్, పీవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక
కొయ్యేటిపాడు (పెనుమంట్ర) : ఆచంట నియోజకవర్గవ్యాప్తంగా మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సాఆర్ కాంగ్రెస్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ అన్నారు. పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో బుధవారం జరిగిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నేతల దానయ్య, పమ్మి శ్రీనివాసు, కుసుమే స్వామి, లూథర్, జి.నరసింహరావు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్, జిల్లా నాయకులు దాట్ల త్రిమూర్తిరాజు, పెనుమంట్ర, పెనుగొండ, మండలాల పార్టీ కన్వీనర్లు కర్రి వేణుబాబు, దంపనబోయిన బాబూరావు, కర్రి సత్యనారాయణరెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు వెలగల వెంకట రమణ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దొంగ దుర్గాప్రసాద్, ఉన్నమట్ల మునిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రా రవికుమార్, అల్లం బులిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : కానిస్టేబుల్, జైల్ వార్డెన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ ఎంఎ.షరీఫ్, టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇగ్బాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఉద్యోగాల్లో 4 శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఉందని వారికి వయోపరిమితి కూడా 5 సంవత్సరాల సడలింపు ఇచ్చినట్టు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్ అధికారి కార్యాలయంలో మైనార్టీ అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుని ఉచిత శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు . -
కన్యకా పరమేశ్వరి ఆదాయం 3.64 లక్షలు
పెనుగొండ : స్థానిక శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం రూ.3,64,923 లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం దేవాదాయ ఇన్స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్ పర్యవేక్షణలో లెక్కించినట్టు చెప్పారు. 87 రోజులకు గాను పై ఆదాయం లభించినట్టు తెలిపారు. ఆలయ ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ నూలి చిన గణేష్, కార్యనిర్వహణాధికారి కుడుపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రీ ఆర్మీ సెలక్షన్స్కు 250 మంది ఎంపిక
తణుకు టౌన్: తణుకులోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రీ ఆర్మీ ట్రైనింగ్ సెలక్షన్కు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నిరుద్యోగ యువత బుధవారం ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్కు జిల్లాలోని వివిధ పట్టణాల నుంచి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 480 మంది పాల్గొన్న ఈ సెలక్షన్స్లో 250 మందిని ఎంపిక చేసినట్టు సెట్వెల్ అధికారులు తెలిపారు. ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని అనంతరం వారి ఎత్తు, బరువు, చాతి కొలతలు తీసుకున్నారు. ఈ కొలతల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ పొందేందుకు అర్హత పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా సెట్ వెల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఆర్మీ సెలక్షన్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెట్వెల్ సిబ్బందితో పాటు కళాశాల పీడీ టి.కళ్యాణి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు కె.నెల్సన్, రమేష్కృష్ణన్ పాల్గొన్నారు. -
విద్యాగణపతికి విశేష అలంకరణ
భీమవరం : భీమవరం గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలో స్వామిని బుధవారం పంచామృతాలతో అభిషేకించి విశేష పూజలు చేశారు. ఆకెళ్ల విజయసారధి దంపతులు అభిషేకం నిర్వహిం చారు. అర్చకుడు ఘంటశాల సో మేశ్వరశర్మ సహకారంతో స్వామిని ఆనబకాయలు, పొట్లకాయలతో అలంకరించారు. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు చెరుకుపల్లి సంతోష్, కార్యదర్శి బ్రహ్మజోశ్యుల సుబ్బయ్య, వేలూరి కిరణ్, మధుర అయ్యప్ప ఉన్నారు. -
యువకుని మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్ : ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన మారిశెట్టి గోవిందరావు (28) మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదేశాల మేరకు అధికారులు ఏలూరు కాలువలో ముమ్మరంగా గాలించారు. పడాల మార్కెట్ యార్డు సమీపంలో గురువారం గోవిందరావు మృతదేహాన్ని అగ్నిమాపకశాఖ సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మృతదేహానికి పంచనామా నిర్వహించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి మిగిల్చిన విషాదం స్నేహితులతో కలిసి తెలియని వ్యక్తి కర్మకాండలకు వెళ్లి విధి వంచించడంతో గోవిందరావు బలైపోయాడు. అందరికీ తలలో నాలుకలా ఉండే గోవిందరావు ఇక లేడనే విషయం కుటుంబ సభ్యులు, స్నేహితులకు మింగుడు పడటం లేదు. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన బిడ్డ ఇలా ఎర్ర నీటికి బలైపోతాడని అనుకోలేదని.. రేపో.. మాపో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో ఇలా చేసేవేంటి భగవంతుడా అంటూ తండ్రి సత్యనారాయణ బోరున విలపించారు. 12 రోజుల వ్యవధిలో ఇదే కాలువలో ఇద్దరు దుర్మరణం చెందడం పట్టణ ప్రజల్ని నిర్వేదానికి గురిచేస్తోంది. -
గోవిందా.. గోవిందా..!
సంప్రదాయ దుస్తుల్లో కెనడా భక్తుల ఆలయ సందర్శన – శ్రీవారి దర్శనంతో తన్మయత్వం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు కెనెడా భక్తులు దర్శించుకున్నారు. కెనడాకు చెందిన ఆరుగురు వైద్యుల బృందం బర్డ్ ఆస్పత్రిలోని వైద్యసిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బుధవారం వారు ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. అందరూ ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. కట్టూబొట్టూ వేషధారణతో ఆదర్శంగా నిలిచారు. శ్రీవారిని దర్శించుకుని పరవశించారు. వీరి బృందానికి నేతృత్వం వహిస్తున్న డేమియన్ మాట్లాడుతూ, ఆలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ కట్టూబొట్టూ వేషధారణ చాలా బాగుందని, ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం బాగుందని కితాబిచ్చారు. తర్వాత ఆలయం వద్దే ఇతర భక్తులతో కరచాలనం, సెల్ఫీలు దిగుతూ, గోవింద నామస్మరణలతో సందడి చేశారు. -
ఘనంగా ఉగాది పురస్కారాల ప్రదానం
అడవికొలను (నిడమర్రు) : పాపోలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమం మండలంలోని అడవికొలను నం–2 పాఠశాలలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ, టీవీ నటుడు వేటుకూరి నరసింహరాజుకు జీవన సాఫల్య అవార్డు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దూసంనపూడి సోమసుందర్కు సేవారత్న అవార్డును, ఆకాశవాణి వ్యాఖ్యాత ఏబీ ఆనంద్కు వాచకరత్న అవార్డును, డాక్టర్ కోనాడ ఆశోక్ సూర్యకు కళారత్న అవార్డును అందజేశారు. గురుదేవోభవ అవార్డులను ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ టీటీఎఫ్ రూజ్వెల్ట్, ఏలూరు మునిసిపల్ హైస్కూల్ హెచ్ఎం చించినాడ హరిబాబు, హెచ్ఎంలు జల్లా శ్రీరామచంద్రమూర్తి, కంచర్ల వెంకట రంగయ్య, పెదపాటి సోమశేఖర్, సనపల రాంబాబు, ఎంవీఎస్ఆర్కే ప్రసాద్కు, నిడమర్రు ఎంఈవో పాశం పాండు రంగారావుకు ప్రత్యేక పురస్కారంను అందించారు. తొలుత కార్యక్రమంలో డీఈవో మధుసూదనరావు మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు పాపోలు అప్పారావు, వీరాస్వామి సోదరులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు అని అన్నారు. పాపోలు సోదరులు పేద విద్యార్థులకు అందిస్తోన్న సేవలను దూసనపూడి సోమసుందరం కొనియాడారు. నిడమర్రు మండలాన్ని దత్తత తీసుకుని విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. జానపద హీరో నరసింహరాజు కూడా పాపోలు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉంగుటూరు, కొవ్వూరు శాసన సభ్యులు గన్ని వీరాంజనేయులు, కేఎస్ జవహర్, తాడేపల్లిగుడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనువాసు, ఫౌండేషన్ కార్యదర్శి చించినాడ సత్యకుమార్, ఏఎంవో సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని బాలుడికి గాయాలు
గోపాలపురం : లారీ ఢీకొని మూడేళ్ల బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. లారీడ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. స్థానిక దుర్గమ్మ గుడి సమీపంలో ఉంటున్న షేక్ అహ్మద్ తనయుడు మూడేళ్ల సాజిత్ బుదవారం ఇంటి వద్ద ఆడుకుంటూ తల్లిదండ్రులకు తెలియకుండా రోడ్డుమీదకు వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ లారీకి అతను అడ్డువచ్చాడు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని చాకచక్యంగా పక్కకుతిప్పాడు. ఈ ఘటనలో బాలుని కాలికి తీవ్రగాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం అతడిని రాజమండ్రి తరలించారు. లారీ డ్రైవర్ అప్రమత్తత వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెప్పారు. -
శ్రీవారి దేవస్థానానికి రూ.1.27 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు బుధవారం రూ.1.27 లక్షల విరాళం అందజేశారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన కల్లి నారాయణ అప్పారావు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,008, ఆలయ విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.27,000 మొత్తం రూ.1,27,008ను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు చైర్మన్ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్లు అందజేశారు. -
జిల్లాలో 183 ప్రత్యేక పాఠశాలలు
ఆకివీడు : జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల కోసం 183 ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ పర్యవేక్షణాధికారి ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆకివీడులో విలేకరులతో మాట్లాడుతూ ఆకివీడులో ప్రత్యేక స్కూల్ను జిల్లాలోనే ప్రప్రథమంగా ప్రారంభించామన్నారు. స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ గ్రాంట్ రూ.5 కోట్ల మేర విడుదల చేశామని చెప్పారు. మెయింటినెన్స్ గ్రాంట్గా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ మొత్తం రూ.2 కోట్ల 84 లక్షల 50 వేలు కేటాయించామన్నారు. స్కూల్ గ్రాంట్గా రూ. 2 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఎంఆర్సీ గ్రాంట్గా రూ. 25.50 లక్షలు, 263 స్కూల్ కాంప్లెక్స్ల ఏర్పాటుకు రూ.71 లక్షలు కేటాయించామన్నారు. ఈనెలాఖరు నుంచి స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటుచేయాలని ఆదేశించామని చెప్పారు. ఎంపీపీ మోడల్ స్కూల్స్ నిర్వాహణకు వర్కు షాపు నిర్వహించినట్టు చెప్పారు. స్వచ్ఛ విద్యాలయం పురస్కారం కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విద్యాలయాలను అందంగా తీర్చిదిద్దాలని సర్వేశ్వరరావు సూచించారు. జిల్లాలో అన్ని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయాల అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంఈవో ఏఏవీబీ సత్యానంద్ పాల్గొన్నారు. -
46 మంది వైద్యులకు పోస్టింగులు
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులకు బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టరేట్లో జరిగిన కౌన్సిలింగ్లో 46 మంది వైద్యులకు కలెక్టర్ కె.భాస్కర్ వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. జిల్లాలో 59 వైద్యుల ఖాళీలకు 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 56 మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా 46 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. వీరిలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయనున్నారు. 13 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఐటీడీఏ పీవో షాన్మోహన్, డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీగా ముదావత్ ఎం.నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు డైరెక్టర్లు బి.శేషుకుమార్, టి.వి.ఎస్.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్ప్రసాద్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఇతర ఉద్యోగులతో పాటు విద్యుత్ ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు కొత్త సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో నాయక్ మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తామని తెలిపారు. -
స్నేహితులతో కలిసి బాగారెడ్డి స్టేడియం సందర్శన
జహీరాబాద్:ప్రముఖ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు బుధవారం జహీరాబాద్లో సందడి చేశారు. సాయంత్రం ఆయన స్థానిక బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తూ జహీరాబాద్లో తన మిత్రుడు, మాజీ కౌన్సిలర్ కె.సునీల్కుమార్ ఇంటివద్ద కొద్దిసేపు ఆగారు. అనంతరం స్టేడియానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పలువురు యువకులు అతనితో మాట్లాడేందుకు ఆసక్తికనబరిచారు. మొదట్లో ఆయన జహీరాబాద్లోని బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ఆ తరువాతే భారత జట్టులో స్థానం పొందాడు. గతంలో అర్షద్ అయూబ్, వెంకటపతి రాజులు సైతం జహీరాబాద్ స్టేడియాన్ని సందర్శించిన తరువాతే జాతీయ జట్టులో స్థానం లభించిందని చెబుతారు. ఇదే సెంటిమెంటును నమ్మే అంబటి రాయుడు తాజాగా మరోమారు ఈ స్టేడియానికి వచ్చారు. మళ్లీ జట్టులో స్థానం పొందాలనే ఉద్దేశంతో ఈ మైదానానికి వచ్చినట్టు అతని మిత్రులు తెలిపారు. జాడీ మల్కాపూర్లోని జలపాతాన్ని కూడా పలుమార్లు సందర్శించారని, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి వచ్చారని వారు పేర్కొన్నారు. -
పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణ తగదు
భీమవరం: పట్టణ ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీవో 43ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం బి.బెనర్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ పట్టణాల్లోని మురికి వాడల్లో నివాసముంటున్న పేదలకు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా సేవలందిస్తున్నారని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. ఇలా జరిగితే పేదలకు వైద్యాన్ని దూరం చేసినట్టు అవుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు, హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు ఎం.వైకుంఠరావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఎండీ రిజ్వాన్, ఝాన్సీ, రజిని, లత పాల్గొన్నారు. -
పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణ తగదు
భీమవరం: పట్టణ ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీవో 43ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం బి.బెనర్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ పట్టణాల్లోని మురికి వాడల్లో నివాసముంటున్న పేదలకు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా సేవలందిస్తున్నారని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. ఇలా జరిగితే పేదలకు వైద్యాన్ని దూరం చేసినట్టు అవుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు, హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు ఎం.వైకుంఠరావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఎండీ రిజ్వాన్, ఝాన్సీ, రజిని, లత పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
లింగపాలెం: విద్యార్థుల విద్యాప్రామాణాలు సంతప్తిగా లేకపోవడంతో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం, కాటమరెడ్డిపల్లిలో ఎంపీపీ పాఠశాలలను, ధర్మాజీగూడెంలో బాలికోన్నత, జెడ్పీ జనరల్ హైస్కూళ్లను బుధవారం డీఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికలు, రికార్డులు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలు, పాఠశాల ఆవరణలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు అసంతప్తిగా ఉండటంతో పలువురు ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విద్యార్థులు పుస్తకం చూసికూడా చదివే పరిస్థితుల్లో లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించాలి అనంతరం డీఈవో మధుసూదనరావు విలేకరులతో మాట్లాడుతూ ధర్మాజీగూడెం, కాటమరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై నరసింహ, ఏసుపాదంతో పాటు ఉపాధ్యాయులు బేనజీర్, రమేష్, ధర్మాజీగూడెం బాలికోన్నత హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ సీహెచ్ ఆదిలక్ష్మి, సైన్స్ టీచర్ వీయుఎన్ మహలక్ష్మి, జెడ్పీ జనరల్ హైస్కూల్లో బడిగంటలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయకపోవడంతో హెచ్ఎం ఆశాలతను, లెక్కలు టీచర్ నాగరాజుకు షోకాజ్ నోటీసులు అందించామని చెప్పారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాటమరెడ్డిపల్లి ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు ఆనంద్కుమార్ను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఎంఈవో బి.వెంకటేశ్వరరావు, సీఆర్పీ గుడిపూడి కుమార్ మంగళం ఆయన వెంట ఉన్నారు. -
జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు
నల్లజర్ల: ఆరేళ్లలోపు పిల్లలు, ఇంటర్ వరకు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కోటేశ్వరి తెలిపారు. నల్లజర్ల పీహెచ్సీని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు 32 సంచార వైద్య బృందాలను నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రీయ బాల ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు బృందాలు సర్వే చేస్తాయన్నారు. మొత్తం 30 రకాల వ్యాధులపై ప్రాథమిక స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి సర్వేలో పొందుపరుస్తారన్నారు. సర్వేలో గుర్తించిన అంశాలే భవిష్యత్తులో విద్యార్థుల ఆరోగ్య చికిత్సలకు కీలకమవుతాయని చెప్పారు. పుట్టుకతో వచ్చే లోపాల విభాగంలో 9, రోగనిరోధక శక్తి విభాగంలో 5,బాల్యంలో వచ్చే వ్యాధుల విభాగంలో 6, వైకల్యంతో కూడిన అభివృద్ధి ఆలస్యాల విభాగంలో 10 వ్యాధులకు చోటు కల్పించామన్నారు. సర్వేలో గుర్తించిన వ్యాధుల ప్రకారం ముందుగా పీహెచ్సీలో అనంతరం ఏరియా ఆస్పత్రి, డీఈఐసీ కేంద్రాల్లో చికిత్స అందిస్తామన్నారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19 అర్బన్ హెల్త్ సెంటర్లను ఈయూపీహెచ్సీలుగా ప్రభుత్వమే నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్షాల నేపథ్యంలో వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. -
108లో కవలలకు జన్మనిచ్చిన మహిళ
బి.కొత్తకోట: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108లో బి.కొత్తకోట ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆవాహనంలోనే కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం లె ల్లవారుజామున జరిగింది. వివరాలు..పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన చల్లా సుజాత(24)కు పీటీఎంకు చెందిన సురేష్బాబుతో వివాహమైంది. సుజాత నిండుగర్భిణి కావడంతో పుట్టినిల్లు కందుకూరుకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజాము 3గంటల సమయంలో సుజాతకు నొప్పులు తీవ్రం కావడంతో స్థానికంగా ఉన్న పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108కు సమాచారం అందజేశారు. దీంతో ఆ వాహన ఈఎంటీ లోకేష్, పైలట్ ఎం.రాజులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి బి.కొత్తకోటకు తరలిస్తుండగా 4.20 గంటలకు మద్దయ్యగారిపల్లె సమీపంలోకి రాగానే సుజాత 108లోనే మగ కవలలకు జన్మనిచ్చింది. అనంతరం కవలలు, బాలింత సుజాతను బి.కొత్తకోట పీహెచ్సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి కవలలు ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. -
టీకాలు వేయడం తప్పనిసరి
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ నీరద గుంటూరు మెడికల్: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రతి బుధవారం టీకాలు వేయాలని, టీకాల కోసం వచ్చే వారిని ఏఎన్ఎంల కోసం వేచి ఉంచకుండా ఆస్పత్రిలో స్టాఫ్నర్సులు తక్షణమే టీకాలు వేయించి పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ నీరద అన్నారు. గుంటూరు వైద్యకళాశాలలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంపై శనివారం జిల్లా స్థాయి వర్క్షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ నీరద మాట్లాడుతూ జిల్లాలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం పగడ్బందీగా అమలు జరిగేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం టీకాలు వేయబడునని అందరికి కనిపించేలా ఆరోగ్య కేంద్రాల్లో బోర్డులు రాయించాలని ఆదేశించారు. బుధవారం, శనివారం టీకాలు వేసేందుకు ఏఎన్ఎంలు వెళ్లే సమయంలో టీకాలను ఎలా నిల్వచేస్తున్నారు, ఏయే టీకాలు తీసుకెళ్తున్నారనే విషయాలను తప్పనిసరిగా వైద్యాధికారులు తనిఖీ చేయాలన్నారు. మంగళవారం, శుక్రవారం టీకాల కార్యక్రమం సర్వే చేయాలని, గుంటూరు జిల్లాలో సర్వే సక్రమంగా ఎందుకు జరగటం లేదని వైద్యాధికారులను ప్రశ్నించారు. ఆగస్టు ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరు... జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటోతేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు అమలులోకి వస్తుందని, బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే జీతాలను విడుదల చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ఓపీకి వస్తున్న రోగుల్లో 15శాతానికి మించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయవద్దని, అంతకు మించి రాస్తే ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం తల్లి, బిడ్డను తప్పనిసరిగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్ళాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎన్ని డెలివరీలు ఆస్పత్రిలో జరిగాయో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఏ టీకాలు ఏయే సమయాల్లో వేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
జిల్లాలో సగటు వర్షపాతం 7.6 మి.మీ
ఏలూరు (మెట్రో): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 364.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సగటు 7.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బుట్టాయగూడెం మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాళ్లలో 26.6, దెందులూరులో 23.2, ఉంగుటూరులో 22.8, పోలవరంలో 21.2, పెదపాడులో 18.6, నిడమర్రులో 18.2, ఏలూరులో 17.2, ఆకివీడులో 16.8, కొయ్యలగూడెంలో 14.4, నల్లజర్లలో 14.2, పెంటపాడులో 10.4, జంగారెడ్డిగూడెం, తణుకులో 9.8, నిడదవోలులో 9.2, జీలుగుమిల్లి 8.8, టి.నర్సాపురం, గణపవరంలో 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పాలకొల్లులో 6.8, ద్వారకాతిరుమలలో 6.4, ఉండ్రాజవరం, ఉండిలో 6.2, భీమడోలులో 5.2, చాగల్లులో 4.2, తాడేపల్లిగూడెంలో 3.6, పెదవేగి, పోడూరు, పెనుమంట్రలో 3.4, తాళ్లపూడిలో 3.2, ఆచంటలో 2.2, గోపాలపురం, పెనుగొండలో 1.8, పెరవలిలో 1.6, కామవరపుకోటలో 1.4, చింతలపూడి, యలమంచిలి, భీమవరం మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై మాసంలో 3.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ 7.4 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. -
నిలకడగా గోదారి వరద
కొవ్వూరు : గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్ఫ్లో బుధవారం 2,97,160 క్యూసెక్కులుగా నమోదైంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 8,600 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 2,88,560 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఆరుగంటలకు నీటిమట్టం 9.80 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నాలుగు ఆర్మ్లకు ఉన్న 175 గేట్లను 0.60 మీటర్లు పైకిఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకు నాలుగువేల క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు బుధవారం సాయంత్రం నుంచి నాలుగు వేల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 693 క్యూసెక్కులు, జీఅండ్వీకి 272, నరసాపురం కాలువకుS 1,534, ఉండి కాలువకు 890, అత్తిలి కాలువకు 528 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. -
సీపీవోకు సత్కారం
ఏలూరు (మెట్రో): జిల్లా సీపీవో కె.సత్యనారాయణ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ప్రాధాన్యతా రంగాలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించారు. సత్యనారాయణ సీపీవోగా సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. కలెక్టర్ చేతులమీదుగా సన్మానం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని సీపీవో సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అధికారులు దుర్గేష్, విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ పాషా, మార్క్ఫెడ్ అధికారి నాగమల్లిక పాల్గొన్నారు. -
పల్స్ సర్వేపై భయం వద్దు
ఏలూరు (మెట్రో): జిల్లాలో చేపట్టిన ప్రజాసాధికారి సర్వేపై ఎటువంటి భయం వద్దని, ప్రజా శ్రేయస్సు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మొక్కల పెంపకం, మినీ రైతుబజార్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో బుధవారం ఆమె సమీక్షించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో సర్వేకు మంచి స్పందన వస్తోందని, సాంకేతిక సమస్యల వల్ల సర్వేలో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామని చెప్పారు. ఈ ఏడాది రూ.418 కోట్లతో 18,400 ఇళ్లను సంక్రాంతిలోపు నిర్మించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో 50 మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.నాగేశ్వరరావు, రేంజర్ ధనరాజ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు. -
ఇంబ్రహీంపూర్ భేష్
గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ ఉన్నతాధికారి మొక్కలు, ఇంకుడు గుంతల పరిశీలన సిద్దిపేట రూరల్:అటవీ సంరక్షణ రాష్ట్ర ముఖ్య అధికారి పి.కేజా బుధవారం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా ఇటీవల గ్రామంలో నాటిన 2లక్షల మొక్కలను పరిశీలించారు. వాటిని సంరక్షిస్తున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పి.కేజా మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటిన తీరు, ఇంకుడు గుంతల తీరును ప్రశంసించారు. ఆయన వెంట విజిలెన్స్ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి డోబ్రియల్, డీఎఫ్ఓలు శ్రీధర్రావు, రాములు, అటవీక్షేత్రాధికారులు వెంకట్ రామారావు, శ్యామ్సుందర్రావు, ఉప అటవీ క్షేత్రాధికారి కుత్బుద్దీన్, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్రెడ్డి, రాజు, బాలకృష్ణ, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కుపాదం
ఏలూరు (సెంట్రల్) : జిల్లాలోహాస్టళ్ల ఎత్తివేతను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించి.. పోలీస్ స్టేషకు తరలించారు. ..జిల్లాలో సంక్షేమ వసతి గృహాల మూతివేతకు నిరసనగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి త్రీటౌన్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఈనెల 25న చలో విజయవాడకు పిలుపు ఇస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రవికుమార్, కారుమంచి క్రాంతిబాబు,వి.మహేష్, పిల్లి తులసీ, కాగిత అనిల్, జి.నాగబాబుతో సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశా రు. అనంతరం సొంత పూచీకత్తులపై వి డుదల చేశారు. -
తెలుగువాకిట 700 థియేటర్లలో ‘కబాలి’
భీమవరం : సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 700 థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు భీమవరం పట్టణానికి చెందిన షణ్ముఖ ఫిలింస్ అధినేత కొత్తపల్లి ప్రవీణ్కుమార్ వర్మ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ హక్కులను పొందిన ప్రవీణ్కుమార్ వర్మ బుధవారం భీమవరంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారం పొందుతున్న కబాలి సినిమాను ఏడువేల థియేటర్స్లో విడుదల చేయనున్నారన్నారు. తన మిత్రునితో కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్తో షణ్ముఖ ఫిలింస్ హక్కులు పొందినట్టు చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సింహా, లెజెండ్, సర్దార్ గబ్బర్సింగ్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సోగ్గాడే చిన్ని నాయనా వంటి 40 సూపర్ హిట్ చిత్రాలను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం కబాలి సినిమాపై రజనీ అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయని, తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలైతో పాటు అనేక భాషల్లో చిత్రం రిలీజ్ అవుతుందని ప్రవీణ్కుమార్ వర్మ చెప్పారు. -
పశ్చిమ డెల్టాకి నీటి విడుదల కుదింపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి బుధవారం సాయంత్రం నుంచి నీటి విడుదలను కుందించారు. జిల్లాలో వరినాట్లుకి నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో మూడు రోజుల నుంచి 7 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేసిన అధికారులు బుధవారం సాయంత్రం పశ్చిమ డెల్టాకి వెయ్యి క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. పెరవలిలో మంగళవారం సాగునీటి అందడం లేదని ఎమ్మెల్యేలు, నీటì æసంఘాల అధ్యక్షుడు సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి విడుదలని మరింత కుదించి సరఫరా చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఏలూరు కాలువకు 1,147 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,914, నరసాపురం కాలువకు 2,056, గోస్తనీ (జీఅండ్ వీ) కాలువకు 898, అత్తిలి కాలువకు 663 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. సముద్రంలోకి 1.26 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 10.30 అడుగులున్న నీటి మట్టం సాయంత్రం 6 గంటలకు 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకు ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్లకు ఉన్న 109 గేట్లను 0.20 మీటర్లు, ర్యాలీ, మద్దూరు ఆర్మ్లలో ఉన్న 66 గేట్లను 0.30 మీటర్లు ఎత్తులేపి 1,26,688 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 12,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. -
ప్రతి రైతుకు రుణాలు అందించండి
ఏలూరు (మెట్రో): జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగి అవసరమైన ప్రతి రైతుకూ రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, పశుసంవర్ధక, ఏపి డైయిరీ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగిన రైతులకు రుణాలు ఇవ్బందలో బ్యాంకు అధికారులు ఆసక్తి కనబరచడం లేదనీ, తమకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు ఆరోపణలు చేస్తున్నారనీ ఈ నేపథ్యంలో రైతులకు సకాలంలో రుణాలందించి ఆదుకోవాలని చెప్పారు. ఖరీఫ్ మొదలు కావడంతో రైతులు వారి పంటలకు పెట్టుబడులు పెట్టే సమయం ఇదేననీ, వారికి రుణాలిచ్చి వడ్డీ వ్యాపారుల నుండి కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బిందు సేద్యం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనీ, క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను కలిసి వారికి అవగాహన కల్పించాలని కలెకరు భాస్కర్ చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖల రైతుల వివరాలను నమోదు చేసే సమయంలో అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రాధాన్యతా రంగాల అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నమాజ్ వేళలు, బుధవారం 09, మార్చి 2016
ఫజర్ : 5.17 జొహర్ : 12.27 అస్ : 4.45 మగ్రిబ్ : 6.25 ఇషా : 7.37 -
ప్రెసిషన్ కాంషాఫ్ట్స్ ఐపీవో నేటి నుంచి..
ప్రైస్ బాండ్ రూ.180-రూ.186 న్యూఢిల్లీ: ప్రెసిషన్ కాంషాఫ్ట్స్ బుధవారం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా మొత్తంగా దాదాపు రూ.410 కోట్ల నిధులను సమీకరించనున్నది. ఈ ఐపీవో జనవరి 29న ముగియనున్నది. ఐపీవో ప్రైస్ బాండ్ రూ.180-రూ.186గా నిర్ణయించారు. కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10 ముఖవిలువ గల దాదాపు 91,50,000 ఈక్విటీ షేర్లను జారీ చే యనున్నది. అలాగే రూ.240 కోట్ల విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేయనున్నది. కంపెనీ రూ.186 ధర వద్ద 66.16 లక్షల ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు (ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ ట్రస్టీ కంపెనీ, బిర్లా సన్లైఫ్ ట్రస్టీ కంపెనీ, కెనరా రొబెకొ మ్యూచువల్ ఫండ్) కేటాయించడం ద్వారా రూ.123 కోట్లను సమీకరించింది. -
బాబోయ్ బుధవారమే!
*ఆ ఒక్కరోజే బెంగళూరులో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు *మధ్యాహ్నం 12 నుంచి 3గంటల మధ్యలో బెంగళూరు: బుధవారం అంటే బెంగళూ రు వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుం టున్నారు. ఆ ఒక్కరోజే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఏడాదిలో మొత్తం 5004 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో ఒక్క బుధవారమే 803 ప్రమాదాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది (2013)తో పోలిస్తే ఈ సంఖ్య 31 ఎక్కువగా ఉండడం గమనా ర్హం. అటుపై రెండోస్థానంలో శనివారం ఉం టోంది. ఆ రోజు 773 రోడ్డు ప్రమాదాలు జరి గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరు పరిధిలో జరిగిన రోడ్డు ప్ర మాదాలను అనుసరించి నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమాద మృతులు, క్షతగాత్రుల విషయం లో మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో 599 పురుషు లు, 130 మహిళలు ఉండగా క్షతగాత్రుల్లో ఆ సంఖ్య 3,165,933గా ఉంది. వయస్సును ప్రతిపాదికన తీసుకుంటే మృతుల్లో 31 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉండగా క్షతగాత్రుల విషయంలో 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. * మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఆ సమయంలో మొత్తం 898 ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 897 ప్రమాదాలు జరిగాయి. * రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాల్లో లైట్ మోటార్ వెహికల్స్ (1,424), ద్విచక్రవాహనాలు (1,420) వరుసగా మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. * రోడ్డు ప్రమాదాల మృతుల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదాలు (332), అటుపై పాదచారులు (331) ఉన్నారు. * మొత్తంగా 2004 ఏడాదిలో 5,004 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 729 మంది చనిపోయారు. * 2005లో బెంగళూరులో 24,67,270 వాహనాలు ఉండగా 2014 నవంబర్కు ఆ సంఖ్య 53,92,847కు పెరిగింది. రూ.65 కోట్ల అపరాధ రుసుం వసూలు ‘2014 ఏడాదిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి సంబంధించి మొత్తం 74,36,336 కేసులు నమోదు చేశాం. వీరి నుంచి రూ.65,92,21,449ను అపరాధ రుసుం వసూలు చేశాం. నగర ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న కఠిన నిబంధనలతో పాటు ప్రజల ఆలోచన విధానంలో వస్తున్న మార్పుల వల్ల 2013 ఏడాది కంటే 2014 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది.’ - దయానంద, అదనపు కమిషనర్ (ట్రాఫిక్), బెంగళూరు -
తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉభయ సభలు మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర సర్వేపై సభలో చర్చ జరిగింది. రాష్ట్ర తొలి బడ్జెట్ పై సుధీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార టీఆర్ఎస్ సభ్యుల మధ్య మరోసారి వాడివేడి చర్చ జరిగింది. -
నేడు రాష్ట్రానికి రాహుల్
సాక్షి, ముంబై/భివండీ, న్యూస్లైన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక రాజకీయ పరిణామాలపై నాయకులతో చర్చించనున్నారు. తర్వాత ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్ మాత్రం ఢిల్లీ నుంచి అధికారికంగా ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే ఔరంగాబాద్, ధుళే జిల్లాల అనంతరం ముంబైలో రాహుల్ పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పార్టీ నాయకుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆయన నేరుగా ఔరంగాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి శిర్పూర్ వెళతారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఔరంగాబాద్కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ధుళేకు చేరుకుంటారు. అక్కడ సభ కార్యక్రమం పూర్తిచేసుకుని ముంబైకి వస్తారు. గురువారం ఉదయం సహ్యాద్రి అతిథి గృహంలో విలేకరులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత శివారు ప్రాంతమైన వర్సోవా బీచ్లో కోళి (మత్స్యకారులు) సమాజం ప్రజలతో భేటీ అవుతారు. తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో భివండీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్లీ ఢిల్లీకి తిరుగి వెళతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగసభకు భద్రత ఏర్పాట్లు భివండీలోని సోనాలే గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరగనున్న రాహుల్ బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాహుల్ భద్రతపై ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి బల్వంత్ సింగ్ బృందం దృష్టి సారించింది. కాగా, ఠాణే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ బస్వరాజ్ పాటిల్, కార్యదర్శి ప్రదీప్ రాఖా, నాయకులు దయానంద్ చోర్గే, పట్టణ జిల్లా అధ్యక్షుడు సాహెబ్ గుడ్డుఖాన్, ఠాణే జిల్లా పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ పూర్ణేకర్, అగ్రిసేనా ప్రముఖుడు రాజారాం సాల్వీ, కార్యకర్తలు సభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సభకు రాయ్గడ్, నాసిక్, ఠాణే తదితర ప్రాంతాల నుంచి వచ్చే రెండు వేల బస్సులకు పార్కింగ్ సౌకర్యం, దాదాపు 1.5 లక్షల మంది కార్యకర్తలకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సభకు సీఎం చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే, మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, థోరాత్, రాణే హాజరుకానున్నారు. -
సర్వం సిద్ధం
సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప సమరానికి సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను కల్పించారు. ఎన్నికల సరళి పరిశీలనకు 21 మంది ప్రత్యేక పర్యవేక్షకులు రంగంలోకి దిగారు. అన్ని పోలింగ్ బూత్లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలకు రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వాలని ఓటర్లకు సీఎం జయలలిత పిలుపునిచ్చారు. తాను ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించలేదని ఈసీకి వివరణ ఇచ్చారు. ఏర్కాడు ఉప ఎన్నికలు అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఉపసమరాన్ని లోక్సభ ఎన్నికలకు రెఫరెండంగా మలుచుకునేందుకు ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేతోపాటుగా మొత్తం 11 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంలను, విధులకు హాజరయ్యే అధికారులను, సిబ్బందినీ భద్రత నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అభ్యర్థి నచ్చకుంటే ఉపయోగించే నోటా బటన్ను రాష్ట్రంలో ప్రపథమంగా ఈ ఎన్నికకు పరిచయం చేస్తున్నారు. తొలిసారిగా ఆ బటన్ను నొక్కే అవకాశం ఏర్కాడులోని కొందరు ఓటర్లకు దక్కబోతున్నది. ప్రత్యేక పర్యవేక్షకులు బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ప్రత్యేక పర్యవేక్షకులు 21 మందిని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. 290 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా ఆయా కేంద్రాల్లో రికార్డు అయ్యే దృశ్యాల్ని చెన్నై నుంచి ఈసీ ప్రవీణ్కుమార్ వీక్షించనున్నారు. 29 సమస్యాత్మక కేంద్రాల్లో ఐదు అంచెల భద్రతను, మిగిలిన కేంద్రాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు. పారా మిలిటరీ బలగాలు 2500 మందితో పాటు, స్థానిక పోలీసులను భద్రతకు నియమించారు. ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపుకార్డులను లేదా, ముందుగా జారీ చేసిన బూత్ స్లిప్పులు కలిగి ఉండే వాళ్లను మాత్రమే పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏర్కాడు ఓటర్లకు పిలుపు నిస్తూ సీఎం జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలకు రెపరెండంగా నిలిచే రీతిలో తమ తీర్పును ఓటర్లు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. కోడ్ ఉల్లంఘించ లేదు: ఏర్కాడు ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత కోడ్ ఉల్లంఘించి ప్రత్యేక పథకాల్ని, హామీల్ని ప్రకటించినట్టు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేరాయి. దీంతో ఆమెకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. దీనికి మంగళవారం సీఎం జయలలిత వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి ప్రత్యేక పథకాల్ని, ప్రకటనల్ని చేయలేదని స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘించే విధంగా తన ప్రసంగం సాగలేదని వివరించారు. తాను తమిళంలోనే ప్రసంగించానని, నియోజకవర్గంలోని సమస్యలు తన దృష్టికి వచ్చి ఉన్నాయని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. అయితే, పలాన పనులు అని ప్రత్యేకంగా సూచించలేదని, రోడ్లు వేయిస్తానని, నీటి పథకాలు ప్రవేశ పెడతానని తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. -
డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం
-
సుదీర్ఘ వానప్రస్థానం!
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 72 సంవత్సరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాలమే సుధీర్ఘమైనదని వాతావరణ విభాగం చెబుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూలై మొదటివారంలో నగరాన్ని పలకరించే చిరుజల్లులు ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు రాకతో జూన్ 16నే పలకరించాయి. ఇలా అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు నగరంతోపాటు జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్) పరిధిలో ఎక్కడో ఓ చోట చెదురుమదురుగానైనా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నగరాన్ని అతలాకుతలం చేసేంత కాకపోయినా ప్రతి రోజూ నగరవాసిని పలకరిస్తున్న వాన ప్రస్థానం ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెల ప్రారంభమైనప్పటికీ చలి జాడ లేదు. ఇంకా తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు నగరంలో ఎక్కడో ఒకచోట పడుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా ఇంకా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం చెబుతోంది. 1956లో అత్యధికంగా 111 రోజులపాటు వర్షాకాలం కొనసాగింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. అయితే ఈ ఏడాది మాత్రం ఆ రికార్డు చెరిగిపోయే అవకాశముందంటున్నారు. ప్రతి సంవత్సరం 85 రోజులకు మించి వర్షాకాలం ఉండడం లేదు. 1956లో తప్ప గత 70 సంవత్సరాల్లో 80 రోజుల్లోపే వర్షాకాలం వెళ్లిపోయిందని, అయితే ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వానప్రస్థానం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నా రు. ఇక కురిసిన వర్షపాతం విషయానికి వస్తే ఈ సంవత్సరం 35 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం నుంచే వాతావరణం కాస్త అసౌకర్యంగా మారింది. ఎండ తీవ్రత, గాలిలో నీటి ఆవిరి శాతం పెరగడం వల్ల ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు. అయితే సాయంత్రానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఊపిరిపీల్చుకున్నారు.