Published
Wed, Jul 27 2016 10:29 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
సీపీవోకు సత్కారం
ఏలూరు (మెట్రో): జిల్లా సీపీవో కె.సత్యనారాయణ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ప్రాధాన్యతా రంగాలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించారు. సత్యనారాయణ సీపీవోగా సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. కలెక్టర్ చేతులమీదుగా సన్మానం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని సీపీవో సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అధికారులు దుర్గేష్, విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ పాషా, మార్క్ఫెడ్ అధికారి నాగమల్లిక పాల్గొన్నారు.